శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
తొంభైనాలుగవ సర్గ.(94)
ఆ రోజు మరణించి నంతగా రాక్షసులు ఏ రోజూ మరణించలేదు. చావగా మిగిలిన రాక్షసులు లంకా నగరమునకు పోయి చచ్చిన వారి బంధువులకు వారి మరణవార్త చెప్పారు. మరణించిన సైనికుల భార్యలు, తల్లులు, తండ్రులు, కుమారులు, బంధువులు, మిత్రులు అందరూ ఎంతగానో విలపించారు. వారంతా ఈ యుద్ధమునకు కారణములను ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు.
ఆ ముసలి శూర్పణఖ, ఆ కురూపి శూర్పణఖ, ఒక మూల
కూర్చోకుండా తగుదునమ్మా అని రాముని వద్దకు ఎందుకు వెళ్లాలి?
రాముని ఎందుకు మోహించాలి? మంచి వాడైన రాముని మీద
దానికి ఎందుకు మోహం పుట్టిందో? దానికి పుట్టిన దుర్బుద్ధి వలన
కదా ఖరదూషణులు, 14,000 వేలమంది రాక్షసులు జనస్థానములో
మరణించినది. దానిచావు అది చచ్చింది. అంతటితో ఊరుకోకుండా
రావణుని వద్దకు వచ్చి లేని పోని మాటలు చెప్పడం ఎందుకు?
రావణుడు పోయి సీతను అపహరించి తీసుకు రావడం ఎందుకు?
రావణుడు తన చావు తాను కొని తెచ్చుకోవడమే కాకుండా, లంకా
నగరంలో ఉన్న రాక్షసులు చావుకు కూడా కారణం అయ్యాడు.
రామణుడికి సీత దక్కలేదు కానీ, రాముడితో వైరం మాత్రం దక్కింది.
సీతను పట్టుకున్న విరాధుడి చావు చూచి కూడా రావణుడు
సీతను తాకడం ఏమిటి? ఈ నిదర్శనం చాలదా రామునితో వైరం
ఎంత వినాశకరమైనదో! జనస్థానములో రాముడి చేతిలో, 14,000రాక్షసులు, ఖరుడు, దూషణుడు, త్రిశిరస్సు, వారి సేనానాయకులు చచ్చారు కదా! ఈ నిదర్శనము చాలదా!
ఇంకా రావణుడు బుద్ధిలేకుండా సీతను అపహరించడం ఏమిటి? రాముడు సామాన్యుడా! అరణ్యములో కబంధుని చంపాడు.
ఇక్కడ ఇంద్రజిత్తును చంపాడు. ఈ నిదర్శనము చాలదా రామునితో
వైరం ఎంత ప్రమాదకరమో! అదీకాకుండా ఇంద్రుని కొడుకు, మహా బలవంతుడు అయిన వాలిని రాముడు అవలీలగా చంపాడు. ఈ నిదర్శనము చాలదా! సుగ్రీవునితో మైత్రి చేసి, వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేసాడు. ఈ నిదర్శనం చాలదా!
సీతను రామునికి ఇచ్చి వేసి, లంకను కాపాడమని విభీషణుడు ఎన్నోసార్లు చెప్పాడు. కాని మూర్ఖుడైన రావణుడు వినలేదు. విభీషణుడు చెప్పిన మాటలను విని ఉంటే లంక ఈ నాడు
శ్మశానంగా మారేది కాదు. కనీసము కుంభకర్ణుని చావుతో నైనా
ఇంద్రజిత్తు చావుతో నైనా రావణునికి జ్ఞానోదయం కలగలేదు. మరలా
ఈ రోజు కూడా యుద్ధం చేసి రాక్షసులకు అపార ప్రాణనష్టం
కలుగచేసాడు." అని రాక్షస స్త్రీలు రావణుని మూర్ఖత్వం గురించి
పరిపరి విధాలుగా అనుకుంటున్నారు. నాకొడుకుపోయాడని ఒకామె, నా భర్త పోయాడని ఒకామె, నాసోదరులు మరణించారని ఒకామె ఏడుస్తున్నారు. మరి కొంత మంది రాక్షసులు, విష్ణువో, ఇంద్రుడో,రుద్రుడో రాముని రూపంలో వచ్చి రాక్షసులను చంపుతున్నాడు అని అనుకుంటున్నారు. “ఎవరు చంపినా నష్టం మనకే కదా కలిగింది. భర్తలను, కుమారులను, సోదరులను, బంధువులను,మిత్రులను పోగొట్టుకొని అనాధలము అయ్యాయు" అని ఆక్రోశిస్తున్నారు. “రావణుడు తనకు బ్రహ్మ ఇచ్చిన వరములు ఉన్నాయి అని విర్రవీగుతున్నాడు కానీ, రాముని పరాక్రమం గురించి, రాముని వలన తనకు పట్టిన భయం గురించి, తెలుసుకోలేకపోతున్నాడు." అని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. “రాముడి ఎదుట పడిన వాడు, వాడు రాక్షసుడైనా, అసురుడైనా, దానవుడైనా, పిశాచి అయినా, బతికి బయటపడటం కష్టం." అని అనుకుంటున్నారు. “కనీసం యుద్ధానికి వెళ్లేటప్పుడు కనిపించిన అపశకునములను, దుశ్శకునములను చూచి అయినా రాముడు యుద్ధమును విరమించి ఉంటే బాగుండేది" అని శకున శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. “రావణుడు ఎంత గర్విష్టి, తెలివితక్కువాడు కాకపోతే, దేవ, దానవ, గంధర్వ, యక్షుల నుండి మరణం సంభవించకుండా వరం కోరినవాడు, మానవులను ఎందుకు వదిలేసాడు. అదే ఇప్పుడు రావణుని కొంపముంచింది.” అని వాపోతున్నారు. “అది కాదు. నాకు తెలియక అడుగుతాను! బ్రహ్మవలన వరాలు పొందినంత మాత్రాన, దేవతలను, సత్పురుషులను బాధించాలని, చంపాలని, వారి యజ్ఞములు భగ్నం చెయ్యాలని లేదుకదా! అందుకే దేవతలు ఈశ్వరుని గురించి తపస్సు చేసారు. వారికి ఈశ్వరుడు వరాలు ఇచ్చాడు. “రాక్షసులను నాశనంచెయ్యడానికి కారణం అయిన స్త్రీ పుడుతుంది. ఆమె రాక్షసుల
వినాశనానికి కారణం అవుతుంది." అని ఈశ్వరుడు చెప్పాడట! ఇప్పుడు అదే నిజం అయింది కదా!" అని అనుకుంటున్నారు.
(ఈ సందర్భంలో ఆ స్త్రీ సీత అని కొంతమంది రాసారు. కాని
శూర్పణఖ అనికూడా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికంతటికీ కారణం శూర్పణఖ. ఆమె రాముని మోహించకుండా, వెంటపడకుండా ఉంటే, ఎవరి పాటికి వాళ్లు ఉండేవాళ్లు, జనస్థానంలో ఉన్న రాక్షసుల గురించి రామునికి తెలిసేది కాదు. ఏది ఏమైనా ఒక స్త్రీ కారణంగా రాక్షస వంశం నాశనం అయింది అనేది నిర్వివాదాంశము).
“ఇంతకూ ఈ రావణుని చెడ్డ ప్రవర్తన, పరస్త్రీవ్యామోహమే లంకకు చేటుతెచ్చింది. ఈ సమయంలో లంకను, లంకలో ఉన్న రాక్షస
జాతినీ రక్షించే వాడు ఎవడున్నాడు? మన పరిస్థితి కార్చిచ్చు