సనాతన ధర్మం @sanatanadharma1 Channel on Telegram

సనాతన ధర్మం

@sanatanadharma1


#ప్రతిరోజురామాయణము । దత్త చరిత్ర
దైవ సంబంధ విషయములు మాత్రమే ఈ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది.

సనాతన ధర్మం (Telugu)

సనాతన ధర్మం టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రతీ రోజు రామాయణం చదువుతూ, దత్త చరిత్ర మరియు దైవిక సంబంధాల గురించి మాత్రం చర్చ చేయడం మరియు మాట్లాడడంకే. ఈ ఛానల్ రామాయణంతో బాధ పడుతున్న సాధకులకు దైవ చరిత్రలో ఆసక్తి ఉంది. ఇవి కధలను చదువుతూ మరియు వింత చరిత్రలను నేర్చుకుంది. మీకు ఈ విషయాలు ఆసక్తి ఉంటే, సనాతన ధర్మం ఛానల్ మీకోసం సరిగా ఉంటుంది!

సనాతన ధర్మం

22 Feb, 06:57


హనుమంతుని తడిపేసాడు. హనుమంతుని చూచి ఇలా అన్నాడు.
“మహాత్మా! నీవు మనుష్యుడవా! లేక మానుష రూపంలో
ఉన్న దేవతా మూర్తివా! నాకు ఇంతటి ప్రియమైన వార్త చెప్పిన నీకు
ఏమి ఇవ్వగలను. వెంటనే లక్షగోవులను, నూరు గ్రామాలను
బహుమానంగా ఇస్తున్నాను. పదహారు మంది కన్యలను ఇచ్చి నీకు
వివాహం చేస్తాను. అంతకు రెట్టింపు సంఖ్యలో అందమైన స్త్రీలను నీకు దాసీలుగా పంపుతాను." అని అన్నాడు. రాముడు వస్తున్నాడు అనే సంతోషంలో భరతుడు మునిగిపోయాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూట ఇరవై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

22 Feb, 06:57


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
నూట ఇరువది ఐదవ సర్గ. (125)

రాముడు అయోధ్య దరిదాపులకు చేరుకున్నాడు. ఇప్పుడు
ఏం చెయ్యాలి. భరతునికి ఈ వార్త ఎలా తెలపాలి అని ఆలోచించాడు. హనుమంతుని పిలిచాడు. అతనితో ఇలా అన్నాడు.
“హనుమా! నీవు ఇక్కడి నుండి శృంగిబేరపురము వెళ్లు. అక్కడ నా మిత్రుడు గుహుడు అనే నిషాదులకు రాజు ఉన్నాడు. అతని
క్షేమములు అడుగు. అతనికి నా రాక గురించి చెప్పు. నేను క్షేమంగా
ఉన్నానని గుహునికి తెలియజెయ్యి. అతడు నీకు అయోధ్యకు వెళ్లే
మార్గము గురించి, భరతుడు ఉన్న ప్రదేశము గురించి చెప్పగలడు.
తరువాత అక్కడి నుండి అయోధ్యకు వెళ్లు. అయోధ్యలో ఉన్న వారి
క్షేమములను అడుగు. అక్కడి నుండి నీవు భరతుని వద్దకు వెళ్లు.
భరతునికి నా క్షేమము గురించి సీతా లక్ష్మణుల క్షేమము గురించి
చెప్పు. నేను నా తండ్రి మాట ప్రకారము 14 ఏళ్లు అరణ్య వాసమును పూర్తిచేసుకొని అయోధ్య చేరుకున్నాను అని చెప్పు. రావణుడు సీతను అపహరించడం, నేను సుగ్రీవునితో స్నేహం చెయ్యడం, వాలిని వధించడం, నీవు సముద్రమును దాటి సీతను చూడటం, నేను వానర సైన్యముతో వారధి దాటి లంకను చేరుకోవడం, రావణుని సంహరించడం, దేవతలు వరాలివ్వడం, నేను నా తండ్రి గారిని కలుసుకోవడం, అన్నీ వివరంగా చెప్పు. నేను విభీషణునితోనూ, సుగ్రీవునితోనూ, కలిసి అయోధ్యకు వచ్చినట్టు చెప్పు. రాముడు శత్రుసంహారము చేసి విజయుడై తన మిత్రులతో సహా అయోధ్యకు వచ్చాడని చెప్పు. నీవు ఈ మాటలు చెబుతూ ఉంటే భరతుని
ముఖకళవళికలు గమనించు. నా గురించి భరతుడు మనసులో
ఏమనుకుంటున్నాడో అతని చూపులు బట్టి, ముఖములో మారే
రంగులను బట్టి, భరతుని మాటలను బట్టి, తెలుసుకో. ఎందుకంటే
రాజ్యము ఎవరికి అక్కరలేదు? ఏనుగులు, గుర్రములు,
వంశపారంపర్యంగా వచ్చే రాజ్యము, రాజభోగములు ఎవరికి ఇష్టం
ఉండదు చెప్పు. రాజ్యాధికారము ఎంతటి వారినైనా ప్రలోభ పెడుతుంది. మనసు మారేట్టు చేస్తుంది. నా ప్రతినిధిగా భరతుడు రాజ్యం చేసినా, 14 ఏళ్లపాటు భరతుడు అయోధ్యను పాలించాడు. అన్నిభోగాలు అనుభవించాడు. ఇంక మీదట కూడా తానే రాజ్యము పాలించవలెను అని అనుకోవచ్చు. భరతునికి ఆ కోరికే ఉంటే, భరతునే అయోధ్యను పాలించమని చెప్పు. కాబట్టి భరతుని మనసులోని ఆలోచనలను తెలుసుకొని రా! అప్పుడు నేను అయోధ్యకు రావాలా లేక మరలా అయోధ్యను వదిలి వెళ్లాలా
అనే విషయం నిర్ణయించు కుంటాను. కాబట్టి త్వరగా ఈ విషయం
తెలుసుకొని రా!” అని అన్నాడు రాముడు. ఆ ప్రకారంగా రాముని వద్దనుండి ఆజ్ఞలను పొందిన హనుమంతుడు, మనుష్య రూపంలో బయలు దేరాడు. ముందు గంగాతీరంలో ఉన్న శృంగిభేర పుర రాజు గుహుని వద్దకు వెళ్లాడు.రాముని క్షేమములు తెలిపి, రాముడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడని తెలిసాడు. పంచమినాడు ఆశ్రమములో ఉండి, మరునాడు బయలుదేరి వస్తున్నాడు అని కూడా చెప్పాడు. తరువాత
హనుమంతుడు అక్కడి నుండి బయలు దేరి, భరతుడు నివసిస్తున్న
నందిగ్రామమునకు చేరుకున్నాడు. నందిగ్రామము అయోధ్యా నగరానికి క్రోసెడు దూరంలో ఉంది. అక్కడ భరతుడు మునివృత్తిలో ఉన్నాడు. నార చీరలు ధరించాడు. రాముని అరణ్యవాస క్లేశమును తాను కూడా అనుభవిస్తున్నాడా అన్నట్టు బాగా కృశించిపోయాడు. జడలుకట్టిన వెంట్రుకలతో, కేవలం ఫలములను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటూ,తాపస ధర్మమును స్వీకరించి, రామ పాదుకలను సింహాసనము మీద ఉంచి, రామునికి మారుగా అయోధ్య రాజ్యమును పాలించుచున్న భరతుని చూచాడు హనుమంతుడు. రాజుతో పాటే సేవకులు అన్నట్టు, భరతుని మంత్రులు, సేనాధి పతులు, రాజోద్యోగులు కూడా కాషాయములు ధరించి ఉన్నారు. వారితో పాటే అయోధ్యా పౌరులుకూడా భోగములకు దూరంగాఉంటూ నారచీరలు ధరించి ఉండటం చూచాడు హనుమంతుడు. భరతుని సమీపించిన హనుమంతుడు భరతునికి నమస్కరించి ఇలా పలికాడు. “మహారాజా! దండకారణ్యములో నార చీరలు ధరించి వనవాసము చేయుచున్న ఏ రాముని గురించి నీవు కూడా నారచీరలు ధరించి మునివృత్తి నవలంబించావో ఆ రాముడు వనవాస కాలమును పూర్తిచేసుకొని భరద్వాజుని ఆశ్రమములో ఉన్నాడు. రేపు ఇక్కడకు రాగలడు. రాముడు నీ క్షేమమును విచారించమని నన్నుపంపాడు.
భరతా! నీ శోకమును, మునివృత్తిని విడచిపెట్టు. రాముడు
రేపే ఇక్కడకు వస్తున్నాడు. 14 ఏళ్ల తరువాత రాముని నీవు
కలుసుకోబోతున్నావు. రాముడు రాక్షస సంహారం చేసి, తన మిత్రులతో సహా వస్తున్నాడు. సీతాదేవి, లక్ష్మణులతో సహా వస్తున్నాడు." అనిపలికాడు హనుమంతుడు. ఒక్కసారిగా అంతటిసంతోషకరమైన వార్త విన్న భరతుడు పట్టుతప్పి నేల మీద పడిపోయాడు. ఆనంద భాష్పాలు భరతుని కళ్లనుండి జాలువారుతున్నాయి. ఆనందంతో భరతుని ముఖం వెలిగిపోతూఉంది. హర్షాతిరేకంతో మూర్ఛపోయాడు. క్షణకాలంలో
మూర్ఛనుండి తేరుకున్నాడు. ఆనందంతో హనుమంతుని గట్టిగా
కౌగలించుకున్నాడు. తన కళ్ల నుండి కారుతున్న ఆనందభాష్పాలతో

సనాతన ధర్మం

22 Feb, 03:09


మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ ।
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥

తటిల్లతా సమరుచిః, షట్చక్రోపరి సంస్థితా ।
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥


యోగ సాధన లో అత్యంత ముఖ్యమైన ఎవరో మహానుభావులు గొప్ప యోగ పురుషులు మాత్రమే సాధించగలిగిన మానవ శరీరంలో ఉంటే ఆరు చక్రాలు, అలాగే వీటి గురించి చాలా గ్రంధాలలో చెప్పబడింది, లలితా సహస్రం లో కూడా వీటి గురించి ఉంది, అటువంటి ఆరు చక్రాలు మానవ దేహం లో ఎక్కడ ఎలా ఉంటాయో ఎవరో వీడియో రూపొందించారు అందరూ చూడండి

https://chat.whatsapp.com/BEZwcf3JOec9Va4UKof1ov

సనాతన ధర్మం

21 Feb, 16:28


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
ఙ్ఞానవైరాగ్య సిద్ద్యర్థం బిక్షాం దేహిచ పార్వతి |
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
భాందవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం||

ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యై నమో నమః 🙏🙏

సనాతన ధర్మం

21 Feb, 15:36


*శివాయ నమః*
*మహా శివరాత్రి* పర్వదినం పురస్కరించుని ప్రతీ సంవత్సరం మా గృహములో సహస్ర లింగార్చన చేస్తున్నాము, ఇంత వరకు ఆ పరమేశ్వరుని అనుగ్రహము తో ఇది *ఆరవ సంవత్సరం* ఈ సంవత్సరం కూడా(26-02-2025) వ తారీకు శివరాత్రి నాడు ఉదయం నుండి పుట్టమట్టి తో 1100 పైగా లింగములు చేసి వాటికి అర్చన చేసి ప్రదోష కాలం సమయం లో *ఒక్కొక్క రుద్రమునకు ఒక్కొక్క విశేష ద్రవ్యముతో ఏకాదశ రుద్రాభిషేకం* చేస్తున్నాము, ఈ కార్యక్రమం మీ గోత్రము పేర్లు మీద చేయించుకోవాలి అనుకుంటే సంప్రదించండి, అలాగే ఎవరైనా స్వామి వారికి జరిగే అభిషేకం చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం కోసం తప్పకుండా రావచ్చు,

వివరములకు

తంగిరాల చంద్రశేఖర అవధాని
కపిలేశ్వరపురం :- 7989784772

*చంద్రశేఖర పాహిమాం*

సనాతన ధర్మం

21 Feb, 11:55


కామః క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారేణ తస్మాత్ జాగృత జాగృతా ||

ఇలాంటి మరిన్ని శ్లోకములు, రామాయణ మహా కావ్యములు కోసం సనాతన ధర్మం గ్రూపు లో జాయిన్ అవ్వండి,

https://chat.whatsapp.com/BEZwcf3JOec9Va4UKof1ov

*చంద్రశేఖర పాహిమాం*

సనాతన ధర్మం

21 Feb, 11:32


#ముకుందమాల #33వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

21 Feb, 02:50


ఈరోజు ( 21-02-2025)విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దర్శనమ్

సనాతన ధర్మం

21 Feb, 02:05


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
ఇరువది నాలుగవ సర్గ.(124)

రాముడు వెంటనే అయోధ్యలో దిగలేదు. విమానమును
భరద్వాజుని ఆశ్రమ పరిసరములలో దింపించాడు. పదునాలుగు
సంవత్సరముల తరువాత, పంచమీ తిధి యందు రాముడు భరద్వాజ ఆశ్రమములో అడుగుపెట్టాడు. భరద్వాజమునికి నమస్కరించాడు. ఆయన ఆశీర్వాదములను అందుకున్నాడు. "మునీంద్రా! తమరు క్షేమమే కదా! అయోధ్యలో అందరూ క్షేమమే కదా! భరతుడు, శత్రుఘ్నుడు, మా తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి క్షేమంగా ఉన్నారా! భరతుడు పరిపాలన చక్కగా సాగిస్తున్నాడా!” అని
అడిగాడు. రాముడు అడిగిన ప్రశ్నలకు భరద్వాజుడు ఈ విధంగా
సమాధానం చెప్పాడు. “రామా! భరతుడు నీకోసరమే కళ్లలో వత్తులు
వేసుకొని ఎదురుచూస్తున్నాడు. పాదుకలను సింహాసనము మీద పెట్టి
నీ బదులు రాజ్యపాలన సాగిస్తున్నాడు. అంతఃపురములో అందరూ
క్షేమంగా ఉన్నారు. రామా! నీ తండ్రి మాట ప్రకారము నీవు సీత,
లక్ష్మణులతో సహా అరణ్యములకు వెళుతుంటే నాకు చాలా జాలి
కలిగింది. కాని ఇప్పుడు నీవు రాక్షస సంహారము చేసి విజయుడవై
వచ్చిన తరువాత అపరిమితమైన ఆనందం కలిగింది. నీవు జనస్థానములో ఉండగా రాక్షసులను చంపడం, నీ భార్య సీతను రాక్షసుడు అపహరించడం తెలిసి చాలా బాధపడ్డాను. మారీచుడు మాయాలేడి రూపంలో నిన్ను దూరంగా తీసుకొని వెళితే, నీ భార్య సీతను, రాక్షసరాజు అపహరించడం, లంకకు తీసుకొని వెళ్లడం, నీవు
కబంధుని చూడటం, సుగ్రీవునితో స్నేహం చేయడం, వాలిని వధించడం, సీత కోసరం వానరులు వెళ్లడం, హనుమంతుడు
సీతను చూడటం, లంకను కాల్చడం, నీవు లంకకు పోయి రావణుని
సంహరించడం, ఇవన్నీ నేను నా తపోబలముతో తెలుసుకున్నాను.
అయోధ్యనుండి వచ్చే నా శిష్యులు నాకు అయోధ్యలో వార్తలు
ఎప్పటికప్పుడు తెలియబరుస్తుంటారు. నీవు ఈ రోజు ఇక్కడే ఉండి రేపు అయోధ్యకు వెళ్లు. ఈ సమయంలో ఏదైనా వరము కోరుకో! అని
అన్నాడు భరద్వాజుడు. “ఓ మహామునీ! మీరుచెప్పినట్టు ఈ రోజు ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుండి అయోధ్య వరకూ ఉండే రహదారుల వెంట ఉన్న వృక్షములు అన్నిఋతువులలోనూ ఫలపుష్పములతో, తేనెపట్టులతో కళకళలాడుతూ ఉండే వరమును ప్రసాదించండి.” అని అడిగాడు. భరద్వాజుడు రాముని కోరికను మన్నించాడు. భరద్వాజుని అనుగ్రహంతో, అయోధ్య నుండి భరద్వాజ ఆశ్రమమునకు మధ్య ఉన్న మూడుయోజనముల దూరములో కల
వృక్షములు అన్నీ ఫలములతో పుష్పములతో, కళకళలాడాయి.. తేనెలు కురుస్తున్నాయి. రాముడు తనతో వచ్చిన వానరులను దృష్టిలో పెట్టుకొని ఆ వరం అడిగాడు. వెంటనే వానరములు అన్నీ ఆ వృక్షములకు కాసిన కాయలను పండ్లను, తేనె పట్టులను తృప్తిగా ఆరగించారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూట ఇరువది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

20 Feb, 17:03


ఈ రోజు శ్రీ గురుడు,గాణుగాపురం లో🌺🙏🌷🌸
Today pallaki utchava murthi darsan at Ganugapur.20.2.2025
आज की उत्चव मूर्ति ,गाणगापुर में।

సనాతన ధర్మం

20 Feb, 10:41


#ముకుందమాల #32వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

19 Feb, 13:20


మహా శివరాత్రి నాడు జరిగే సహస్ర లింగార్చన కార్యక్రమంలో మీ గోత్రము పేర్ల తో కూడా జారిపించుకోవాలి అనుకుంటే
+91 7989784772 నాకు whats app లో మెసేజ్ చేయగలరు

సనాతన ధర్మం

19 Feb, 13:20


Photo from తంగిరాల చంద్రశేఖర అవధాని

సనాతన ధర్మం

19 Feb, 10:34


జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత ||

ఇలాంటి మరిన్ని శ్లోకములు, రామాయణ మహా కావ్యములు కోసం సనాతన ధర్మం గ్రూపు లో జాయిన్ అవ్వండి,

https://chat.whatsapp.com/IToTTEJvyEuE3gAGJ03Y2d

*చంద్రశేఖర పాహిమాం*

సనాతన ధర్మం

19 Feb, 10:22


#ముకుందమాల #31వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

19 Feb, 08:16


శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయము ధౌమ్యుడు మరియు ఆయన ముగ్గురి శిష్యుల కథ
ముందు అధ్యాయాలు ఈ ఛానల్ లో playlist లో ఉన్నాయ్ మొదటి నుండి వినాలి అనుకునే వారు చుడగలరు
https://youtu.be/bgSLm0k0YrU

సనాతన ధర్మం

19 Feb, 05:36


అస్త్ర సంహార గ్రహణము( అస్త్ర నామాలు శ్లోకములతో) శ్రీమద్రామాయణము బాలకాండ 28వ సర్గ ,

https://youtu.be/vUD2eljrI8s

సనాతన ధర్మం

19 Feb, 04:14


ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా | శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా || 🙏

సనాతన ధర్మం

19 Feb, 03:52


శ్రీమద్రామాయణము|| యుద్ధకాండము
నూట ఇరవై రెండవ సర్గ.(122)

పుష్పక విమానమును తెచ్చి తన ముందు నిలిపి, తన ఆజ్ఞ
కోసరం ఎదురు చూస్తున్న విభీషణుని చూచి రాముడు ఆదరంతో
ఇలా అన్నాడు. “విభీషణా! ఈ వానరములు భల్లూకములు నా కొరకు
ఇంత శ్రమపడి వచ్చారు. వారిని అందరినీ ఆభరణములతో, రత్నముల తోనూ, మణులతోనూ, మాణిక్యములతోనూ, ధనముతోనూ నీకు తోచినట్టు సత్కరించు. ఎందుకంటే లంకను జయించడం వీరి త్యాగఫలము మాత్రమే. నేనుచేసింది ఏమీ లేదు. కాబట్టి వీరి త్యాగమునకు తగిన ప్రతిఫలము వారికి బహుమానముల
రూపములలో ఇవ్వు. వారందరూ ఆనందిస్తారు. నిన్ను శ్లాఘిస్తారు.
విభీషణా! ధనము, ఐశ్వర్యము లభించగానే సరికాదు. ఆ ధనమును ఐశ్వర్యమును సాటి వారితో పంచుకొంటేనే ఆనందం కలుగుతుంది. రాజు తన సైన్యాధిపతులను, సైనికులను ప్రేమించాలి, ఆదరించాలి. అలా కాకుండా ఒక నియంతలాగా యుద్ధాలు చేస్తూ సైన్యమును యుద్ధములో చంపిస్తుంటే, ఆ రాజుకు సైనికులు ఎదురు తిరుగుతారు. త్వరగా విడిచిపెడతారు. ” అని అన్నాడు రాముడు.
"విభీషణుడు వెంటనే అపారమైన ధనరాసులను, మణి
మాణిక్యములను తెప్పించి వానర సేనలకు పంచి పెట్టాడు.
వానరులందరూ పరమానందభరితులయ్యారు. విభీషణుని వేనోళ్ల
శ్లాఘించారు. అప్పుడు రాముడు పుష్పక విమానమును
అధిరోహించాడు. సీతను కూడా చెయ్యిపట్టుకొని ఎక్కించి తన పక్కనే కూర్చుండపెట్టుకున్నాడు. వారి వెంట లక్ష్మణుడు ఎక్కాడు. తరువాత రాముడు సుగ్రీవుని, విభీషణుని, వానర వీరులను, వానరులను చూచి ఇలా అన్నాడు. "మీరంతా నాకు మిత్రులు. మిత్రకార్యమును సాధించడానికి వచ్చారు. వచ్చిన కార్యము ఫలవంతమైనది. ఇంక మీరందరూ మీ మీ స్వగృహములకు వెళ్లండి. సుగ్రీవా! నీవుకూడా నీ సేనలతో మిత్రులతో కిష్కింధకు వెళ్లు. విభీషణా! నీవు ప్రజారంజకంగా లంకారాజ్యమును ధర్మబద్ధంగా పాలించు. అప్పుడు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అందరూ నిన్ను ఆదరిస్తారు. నేను మీ అందరి దగ్గరా సెలవు తీసుకొని నా తండ్రిగారి రాజధాని అయోధ్యకు వెళుతున్నాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని అన్నాడు. అప్పుడు వానర నాయకులు, వానరులు ముక్తకంఠంతో ఇలా అన్నారు. “రామా! మేమందరమూ అయోధ్యను చూడాలని కోరుకుంటున్నాము. అక్కడ ఉన్న వనములలో విహరించాలని మా కోరిక. మా కోరిక మన్నించు. నీవు అయోధ్యారాజ్యమునకు పట్టాభిషిక్తుడివి కావడం మాకు చూడాలని ఉంది. నీ పట్టాభిషేక మహోత్సవమును చూచిన తరువాత, మీ తల్లి కౌసల్యకు నమస్కరించి, ఆమె ఆశీర్వాదము తీసుకొని మేము తిరిగి మా మా స్వస్థానములకు వెళ్లిపోతాము. కాబట్టి మేము అయోధ్యకు రావడానికి అనుమతి ఇవ్వు." అని ప్రార్థించారు. అప్పుడు రాముడు వానరులతో ఇలా అన్నాడు. “మీరందరూ అయోధ్యకు వచ్చి నా ఆతిధ్యము స్వీకరించడం కన్నా నాకు ప్రియం కలిగించే విషయం ఇంకా ఏముంటుంది. మీరందరికీ ఇదే నా ఆహ్వానము. మీరందరూ అయోధ్యకు రండి. సుగ్రీవా! నీవు, నీ వానరనాయకులు, వానర సైన్యముతో సహా విమానము ఎక్కు. విభీషణా, నీవు నీ సచివులు, నీ అనుచరులతో సహా విమానము ఎక్కు.” అని అన్నాడు. అంతే.
బిలబిల మంటూ వానరవీరులు, రాక్షస వీరులు అందరూ ఆ విమానము ఎక్కారు. అందరూ ఎక్కిన తరువాత ఆ విమానము
గాలిలోకి ఎగిరింది. ఆ విమానములో వానరులు, భల్లూకములు,
రాక్షసులు అందరూ ఏమాత్రం అసౌకర్యం లేకుండా హాయిగా కూర్చుని
ప్రయాణం చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూట ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

18 Feb, 04:50


మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః |
అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత

ఇలాంటి మరిన్ని శ్లోకములు, రామాయణ మహా కావ్యములు కోసం సనాతన ధర్మం గ్రూపు లో జాయిన్ అవ్వండి,

https://chat.whatsapp.com/IToTTEJvyEuE3gAGJ03Y2d

*చంద్రశేఖర పాహిమాం*

సనాతన ధర్మం

06 Feb, 12:26


ఈ ప్రశ్నకు సమాధానం '- గణపతి మహా భారతాన్ని 18 రోజులలో వ్రాశాడు

సనాతన ధర్మం

06 Feb, 12:22


#ముకుందమాల #24వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

06 Feb, 12:04


శ్రీ ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి వారు కాకినాడ

సనాతన ధర్మం

06 Feb, 04:28


శంకు స్థాపన, గృహప్రవేశాది సమస్త శుభకార్యముల కొరకు, వేద పారాయణ, వేద ఆశీర్వచనం,వాస్తు హోమం, గణపతి, లక్ష్మీ గణపతి చండీ హోమములు చేయించుకోవటం కొరకు,నక్షత్ర, నవగ్రహ శాంతుల కొరకు, సూర్య నమస్కారములు, మొదలైన వైదిక కార్యక్రమాల కోసము

జాతకము లు చూపించుకోవటం కోసం లేదా ముహూర్తాల కోసం సంప్రదించగలరు ,

తంగిరాల దత్తాత్రేయ అవధాని,
+91 86396 72644

తంగిరాల చంద్రశేఖర అవధాని,
+91 7989784772

సనాతన ధర్మం

05 Feb, 16:20


శ్రీ గురుచరిత్ర శ్రీ వసుదేవనంద సరస్వతీ స్వామి వారి చరిత్ర

https://youtu.be/LLb5aNFEecQ

సనాతన ధర్మం

05 Feb, 15:47


ఈ దత్త పురాణము చివరిలో చెప్పబడింది, ఎవ్వరైనా ఈ ఈ దత్త పురాణం లోని ఒక అంశాన్ని కానీ లేదా దత్త పురాణాన్ని కానీ చదివినా ఆకళింపు చేసుకున్న , దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు, అలాగే స్వామి అనుగ్రహం తో సకలాభీష్టాలూ సిద్ధిస్తాయి. కడపటికి అపునర్భవమైన విష్ణుసాయుజ్యం పొందుతాడు. అని కాబట్టి చదివే ప్రయత్నం చేయండి,
ఎన్నో ఇబ్బందులు లో ఉండి ఏమి తోచని పరిస్థితి లో ఉన్న వారికి *శ్రీ గురుచరిత్ర*
*సుందర కాండ* *మహా భారతం* *భాగవతం* *దత్త పురాణం* ఇలాంటి పురాణాలు పారాయణ వల్ల ఆ ఇబ్బందులు తొలగుతాయి, ఇవి పారాయణ చేసి ఎంతో మంది అనుభవ పూర్వకముగా ఆ అనుభూతిని పొందారు, కాబట్టి వీలు చేసుకుని ఒక్కసారి అయినా ఈ గ్రంధాలు పారాయణ చేసే ప్రయత్నం చేయండి

*చంద్రశేఖర పాహిమాం*

సనాతన ధర్మం

05 Feb, 15:47


ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహము తో ఈ రోజు తో దత్త పురాణము పూర్తి అయ్యింది , అంత స్వామి వారి కృప ఈ గ్రూప్ లో ఉన్న వారిలో కనీసం ఒక 10 మంది అయినా మొదటి నుండి చివరి దాకా చదివారు అని ఆశిస్తున్న
🙏🏻శ్రీ దత్తాత్రేయాయ నమః🙏🏻
🙏శ్రీ దత్తాయ గురవే నమః 🙏
🙏శ్రీ దత్త శ్శరణం మమ 🙏

సనాతన ధర్మం

05 Feb, 13:12


శ్రీదత్త పురాణము || చతుర్ధ భాగం
ఇరవై తొమ్మిది లో మూడు (29-3)

జనార్ధనుణ్ని అర్చిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది. మోక్షమూ దొరుకుతుంది. హరిపూజా పరులకు చతుర్విధపురుషార్ధాలు కరతలామలకాలు. సందేహంలేదు. మోహనిద్రాసమాకులమై అతిఘోరాకారమైన ఈ సంసారంలో శ్రీహరిని శరణువేడుకున్నవారు నిశ్చయంగా కృతార్థులు. ఓరోరీ మానవుడా ! భార్యాపుత్రులూ, ఇల్లూ వాకిలీ, ధనమూ ధాన్యమూ వీటితో నిన్ను సమ్మోహపరిచే మానుషివృత్తిని చూసుకుని దర్పంతో విర్రవీగకు. అహంకరించి ఎగిరిపడకు. కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలను విడిచిపెట్టు. పరాపవాదాలకు నిందలకు పాత్రుడవు కాకుండా శక్తిమేరకు
శ్రీహరిని ఉపాసించు. సకల వ్యాపారాలు విడిచిపెట్టి జనార్ధనుణ్ని పూజించు. అవయవాల పటుత్వం క్షీణించకముందే ముసలితనం ముసురుకోకముందే నరకలోకపు అసిపత్రవనాలు చేరువలో కనిపించకముందే హంస ఎగిరిపోకముందే శ్రీ హరిని అర్చించు.
ఆశాశ్వతమైన ఈ శరీరంమీద ధీమంతులెవ్వరూ ఆట్టే నమ్మకం పెట్టుకోరు. నిత్యం సన్నిహితో మృత్యుః అన్నారు. సంపదలా అత్యంత చంచలాలు. ఆసన్నమరణోదేహః అంచేత ఎవ్వరికీ ఏ దర్పమూ పనికిరాదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే. అంతా క్షణభంగురం. ఇది ఎరిగి అందరూ అన్నివేళలా హరిభజన చెయ్యాలి. మహాయోగులకూ మహాతపస్వులకూ ధుర్లభమైన వైకుంఠ నివాసం విష్ణుమూర్తిని భక్తితో స్మరించిన వారికి అర్చించిన వారికి, అనాయాసంగా లభిస్తుంది. సందేహంలేదు. సర్వతీర్ధ సంసేవనం సర్వయజ్ఞ నిర్వహణం సాంగోపాంగ వేదాధ్యయనం - ఇవన్నీ నారాయాణార్చనలో పదహారవ కళకు సాటిరావు. అటువంటి
విష్ణుభక్తి లేకపోయాక వేదశాస్త్రాలు అభ్యసించి ఏం లాభం ? తీర్థయాత్రలు చేసి ఏమి ప్రయోజనం ? తపస్సులెందుకూ ? యజ్ఞాలెందుకు ? నైమిశేయులారా ! శౌనకాది మహామునులారా ! నారదుడు సనత్కుమారుడికి దత్తాత్రేయ - ధర్మకీర్తి సంవాదరూపంగా చెప్పిన ప్రాయశ్చిత్తవిధులు సంక్షేపంగా మీ చెవిని వేశాను. ఇంకా అనేక ధర్మాలూ సదాచారాలూ దత్తదేవుడు ధర్మకీర్తికి బోధించాడు. అతని నుంచి వాటిని విన్న గాలవుడు ధన్యుడు.

భజంతి యే విష్ణు మనంతమూర్తిమ్
నిరీహమోంకార గతం వరేణ్యమ్ !
వేదాంత వేద్యం భవరోగవైద్యమ్
తేయాంతి సర్వేపద మచ్యుతస్య !!

అనాదిమాత్మానమనంతశక్తిమ్
ఆధారభూతం జగతాంపరేశమ్ !
జ్యోతిస్స్వరూపం పరమచ్యుతాఖ్యమ్
సంపూజ్యతే యాంతి పదం పవిత్రమ్ !!

సూత మహర్షీ ! దత్తదేవుడి అనుగ్రహం వల్ల నీముఖతః వీటిని అన్నింటిని వినగలిగిన మేము కూడా ధన్యులం. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం. అందుకని కృతమెరిగి నీకిదే నమస్కరిస్తున్నాం. ఇంతకీ - బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ మహేతిహాసాన్ని తన గురువు వేదధర్ముడి నోటి నుండి ప్రత్యక్షంగా విన్న ఉత్తమశ్రోత
దీపకుడు ఏమన్నాడు ? గురువుగారికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకున్నాడు ? - ఇవి తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది.
వీటిని వినేసి ఈ రోజుకింక మా యోగ విధుల్లోకి మేము వెళ్ళిపోతాం.
మహామునులారా ! వేదధర్ముడికి కార్తవీర్యార్జునుడంటే అదొకరకం ప్రీతి, అభిమానం అంచేత అతడి గాధల్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తూ వుంటాడు. పునరుక్తి అవుతున్నా పట్టించుకోడు. అవునుకదా! మీరూగమనించే వుంటారు. ఇప్పుడూ అదే చేశాడు. కార్తవీర్యుని చరిత్రను క్లుప్తంగా మళ్ళీమళ్ళీ చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా కొత్తది వింటునట్లే వినడం దీపకుడి ప్రత్యేకత. ఇప్పుడూ అలాగే విన్నాడు. ఇంకా ఏమి వినాలనుకుంటున్నారో నిస్సంకోచంగా అడుగు అని వేదధర్ముడు ముగించగానే గురువుగారి పాద పద్మాలకు తుమ్మెదలాంటి దీపకుడు ఆనందంతో పులకించిపోతూ ఆర్థమైన కన్నుల్ని ఒత్తుకుంటూలేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురుదేవా ! అత్యంత మహిమాన్వితమూ అత్యంత పవిత్రమూ అత్యంత రమణీయమూ అయిన శ్రీ దత్తపురాణాన్ని సవిస్తరంగా నాకు ఎరుకపరిచారు. దీనికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను ? బ్రతికి ఉన్నంతకాలమూ ఇలాగే మీసేవ
చేసుకుంటాను. మీ వెంట వుంటాను. అనుమతించండి మహానుభావా! అని సాగిలపడి మ్రొక్కాడు. వాత్సల్యమూర్తి
వేదధర్ముడు శిష్యుణ్ని లేవనెత్తి ప్రేమగా కౌగలించుకొని శిరస్సు నిమురుతూ ఆనందబాష్పాలను ఆశీరక్షతలుగా రాల్చాడు.
నైమిశారణ్యవాసులారా ! మహా మునీశ్వరులారా ! దత్తాత్రేయుడి కటాక్షంతో రూపొందిన ఈ పురాణాన్ని విన్నవారూ, చదివినవారూ సర్వపాపవిముక్తులవుతారు. విష్ణు శివాలయాల్లో పారాయణమే చెయ్యగలిగితే ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి వైకుంఠధామం చేరుకుంటారు. ఎవ్వడైనా ఈ దత్తపురాణంలోని ఒక అంశాన్ని గానీ పూర్తి పురాణాన్ని గానీ అర్థంతో సహా సమాజానికి వివరించి చెప్పినా లేదా తాను ఆకళింపుజేసుకున్నా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. దానితో సకలాభీష్టాలూ
సిద్ధిస్తాయి. కడపటికి అపునర్భవమైన విష్ణుసాయుజ్యం పొందుతాడు.


మంగళం దేశికేంద్రాయ
అనసూయాత్రి సూనవే !
యోగ విద్యా నిధానాయ
దత్తాత్రేయాయమంగళమ్ !!


దత్త పురాణం సంపూర్ణం

సనాతన ధర్మం

05 Feb, 12:56


రాముని మాటలను శిరసావహించాడు విభీషణుడు. వెంటనే తన అన్న రావణునికి దహన సంస్కారములు చేయడానికి ఏర్పాట్లు చేసాడు.(మొదట్లో రావణుని మరణానికి ఎంతగానో దుఃఖించిన
విభీషణుడు ఇప్పుడు తన అన్నకు దహన సంస్కారములు చేయడానికి నిరాకరించడం అంత సమంజసంగా లేదు. పైగా ఈ శ్లోకములు ప్రాచ్యప్రతిలో లేవు. కాబట్టి ఇవి తరువాత చేర్చి ఉండవచ్చును అని పండితుల అభిప్రాయము).

విభీషణుడు రావణుని ఇంటి నుండి అగ్నిహోత్రమును తెప్పించాడు. కాల్చడానికి కట్టెలను తెప్పించాడు. ఋత్విక్కులను పిలిపించాడు. అగరు, చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను తెప్పించాడు. మణులను, ముత్యములను తెప్పించాడు. తరువాత శాస్త్ర
ప్రకారము మాల్యవంతునితో రావణుని అంత్య క్రియలను
నిర్వహించాడు. రావణుని శరీరాన్ని బాగా అలంకరించిన బంగారు పల్లకీలో ఎక్కించారు. భేరీ మృదంగములు వాయించారు. పూలు చల్లారు. వంది మాగధులు రావణుని గుణగణములను స్తోత్రం చేస్తున్నారు. విభీషణుడు అగ్ని పట్టుకొని ముందు నడువగా,
రావణుని పల్లకీ వెనుక బయలుదేరింది. అందరూ శ్మశానం చేరుకున్నారు. అంతఃపుర స్త్రీలు అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రావణుని కడసారి చూపులు చూచుకున్నారు. ఒక పవిత్రమైన ప్రదేశములో చితి పేర్చారు. దాని మీద మెత్తని వస్త్రములను పరిచారు. వాటిని సుగంధ ద్రవ్యములతో తడిపారు. రావణుని మృతదేహాన్ని ఆ చితిమీద ఉంచారు. అగ్నిని ఆగ్నేయదిశలో ఏర్పరిచిన వేదిక మీద ఉంచారు. పెరుగు నెయ్యి కలిపి ఆయన బుజాలకు రుద్దారు. ఒక శకటమును పాదాల దగ్గర ఉంచారు. ఒక రోలును తొడల దగ్గర పెట్టారు. కర్రలతో చేసిన గిన్నెలను, అరణిని, ఉత్తర అరణిని (యజ్ఞము కొరకు నిప్పు పుట్టించడానికి ఉపయోగించే సాధనములు) ఒక రోకలిని వాటి వాటి స్థానములలో ఉంచారు.
విభీషణుడు మొదలగు వారు చితిచుట్టు ప్రదక్షిణం చేసారు. రావణుని చితి దగ్గర ఒక పశువును బలి ఇచ్చారు. దాని శరీరమును చీల్చి దాని కడుపులో ఉండే పదార్థములను నేతితో తడిపి రావణుని ముఖం మీద ఉంచారు. రావణుని మీద పుష్పములు గంధము అక్షతలు సుగంధ ద్రవ్యములు ఉంచారు. పేలాలు చల్లారు.
విభీషణుడు శాస్త్రోక్తముగా రావణుని చితికి నిప్పు అంటించాడు.
తరువాత స్నానం చేసి తడి వస్త్రములతో దర్భలు, నువ్వులను, నీళ్లతో సమర్పించి జలతర్పణము విడిచాడు. కడసారిగా తన అన్న రావణునికి భక్తితో తల వంచి నమస్కారము చేసాడు. అప్పటి దాకా ఏడుస్తున్న అంత:పుర స్త్రీలను ఓదార్చి అంత:పురములకు పంపాడు. స్త్రీలందరూ వారి వారి గృహములకు వెళ్లిన మీదట విభీషణుడు రాముని వద్దకు వచ్చి నిలబడ్డాడు. విభీషణుడు తన అన్న రావణునికి యధావిధిగా దహన సంస్కారములు జరిపి రావణునికి ఉత్తమ గతులు కలిగించినందుకు చాలా సంతోషించాడు రాముడు. శత్రు సంహారం జరిగింది. విజయము లభించింది. రాముడు తన కోపాన్ని విడిచిపెట్టాడు. ధనుర్బాణములను, కవచమును విడిచిపెట్టాడు. శాంతమూర్తిగా సౌమ్యతను పొందాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూటపదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

05 Feb, 12:56


శ్రీమద్రామాయణము||యుద్ధకాండము
నూటపదకొండవ సర్గ లో మూడవ భాగం (111-3)

ఇంతకూ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే... మూడులోకములను జయించిన నీవు, అత్యంత పరాక్రమవంతుడ వైన నీవు, ఒక ఆడుదానిని ఎలా దొంగతనంగా తీసుకొని వచ్చావు?
ధైర్యంగా ఆమె భర్తకు తెలిసే తీసుకురావచ్చు కదా! నీవు ఇంత
పిరికివాడికి అని నాకు తెలియదు. నీవు ఎప్పుడుకానీ, ఏ యుద్ధములో కానీ, ఎవరికి కానీ భయపడినట్టు నాకు తెలియదు. కానీ, సీత భర్తకు భయపడ్డావు. అదే నీ పాలిటమృత్యువు అయింది. నీవు సీతను తీసుకురాగానే నీ తమ్ముడు విభీషణుడు బాగా ఆలోచించి నీ స్త్రీ వ్యామోహంతో లంకానగరానికి చేటు వచ్చింది అని అన్నాడుకదా! ఆనాడు విభీషణుని మాట ఎందుకు వినలేదు? ఈ రాక్షస కులమును ఎందుకు సర్వనాశనం చేసావు? నాథా! నీవు వీరమరణం పొందావు. నిజానికి నీ గురించి నేను దు:ఖించకూడదు. శోకించకూడదు.. విచారించకూడదు. కాని నేను స్త్రీని. నీ భార్యను. అందుకే దుఃఖము ఆపుకోలేక ఏమోమో అంటున్నాను. నామనస్సు మనసులో లేదు. నీవు పుణ్యం చేసావు. పాపాలు చేసావు. నీ పుణ్యపాపములను మోసుకొని నీ దారిన నీవు వెళ్లిపోయావు. నీ మరణం చేత నాకు దు:ఖం మిగిలింది. అందుకే ఈ విచారమంతా!
ఆనాడు నీ బంధుమిత్రులు చెప్పిన మాటలు విని ఉంటే నీకు
మాకు లంకకు ఇంతచేటు దాపురించదు కదా! కనీసం నీ తమ్ముడు
విభీషణుని మాటలు విన్నా బాగుపడి ఉండేవాడివి. మాకు ఈ దు:ఖము కలిగేది కాదు. నాడు మారీచుని మాట విన్నా బాగుండేది. నా మాట విన్నా బాగుండేది. కనీసం నా తండ్రి గారి మాట విన్నా బాగుండేది. ఇంత అనర్థము జరిగేది కాదు. ఎవరి మాటా వినని ఫలితం ఈ నాడు అనుభవిస్తున్నావు. ఏమిటి నాధా ఇది! నేను
ఇంతగా అడుగుతుంటే. శోకిస్తుంటే, ఆ ప్రకారం దుమ్ములో ధూళిలో పడి ఉన్నావు కానీ ఒక్క మాట కూడా అనడం లేదు. నా మీద కోపమా నాధా! పోనీ నిద్రపోతున్నావా! నేను మేల్కొలుపుతున్నాను కదా! మరి నిద్రలేవవా! నాతో మాట్లాడవా! యుద్ధములో ఎన్నడూ భయంతో వెనుకంజవేయని నీవు నాతో మాట్లాడటానికి భయపడుతున్నావా! నీకు భయపడి సూర్యుడు ఎన్నడూ లంకలో తన కిరణములను తీక్షణంగా ప్రసరించలేదు. ఈ నాడు నీవు లేవని చూడు సూర్యుడు ఎంత తీవ్రంగా ప్రకాశిస్తున్నాడో! నాధా! నాకన్నా ఈ యుద్ధభూమి ఎక్కువయిందా. ఈ ప్రకారంగా గాఢంగా కౌగలించుకొని పడుకొని ఉన్నావు. కనీసం నాతో ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. నా కన్నా భూమి ఎక్కువ అయిందా నీకు. అవునులే. నేను కఠినాత్మురాలను. అందుకే నీవు నాతో మాట్లాడటం లేదు. లేకపోతే నీ మరణం కళ్లారా చూచి కూడా నా గుండెలు బద్దలు కాలేదంటే నా గుండె బండరాయి కన్నా కఠినం కదా! " అని రావణుని శరీరం మీద పడి మండోదరి పరిపరి విధాల విలపిస్తూ ఉంది. అలా ఏడ్చి ఏడ్చి రావణుని వక్షస్థలముమీద పడి మూర్ఛపోయింది. రావణుని భార్యలు ఆమెను లేసి కూర్చుండబెట్టి సేదదీర్చారు. ఆమెనుమంచి మాటలతో ఓదారుస్తున్నారు. “అమ్మా మండోదరీ! నీకు తెలియనిది ఏమున్నది. ఈ అస్థిరము కదా. మరి ఈ లోకములో ఉన్న జీవులు కూడా
అస్థిరములే కదా. ఈ జీవుల ఐశ్వర్యములు భోగభాగ్యములు కూడా
అస్థిరములు, చంచలములే కదా. నిన్న ఉన్న రాచభోగములు ఈ రోజు లేవు కదా. విధి వైపరీత్యము. వీటి కోసరం మనము శోకించి
ప్రయోజనము లేదు." అని మండోదరిని ఓదారుస్తున్నారు. కాని
మండోదరి ఏడుపు మానలేదు. ఇదంతా చూస్తున్న రాముడు విభీషణుని చూచి ఇలా అన్నాడు. “మిత్రమా విభీషణా! నీవు రావణుని భార్యలను ఓదార్చు. నీ అన్న రావణునికి అంతిమ సంస్కారములకు ఏర్పాట్లు చెయ్యి." అని అన్నాడు. “రామా! నా అన్న ధర్మము తప్పాడు. అతి క్రూరుడుగా ప్రవర్తించాడు. సత్యము పలకడానికి ఏనాడూ ఆసక్తి చూపలేదు. ఇతరుల భార్యల పట్ల మక్కువ పెంచుకున్నాడు. ఇటువంటి దుర్మార్గునికి అంతిమసంస్కారములు నేను చేయలేను. నా కన్నా పెద్దవాడు.
కాదనను. కానీ, ఇతడు పెద్దవాడు, పూజ్యుడు అని చెప్ప తగ్గ వాడు
కాదు. మంచి మాటలు చెప్పినందుకు నన్ను రాజ్యము నుండి
వెళ్లగొట్టాడు. ఇతడు నాకు సోదరరూపంలో ఉన్న శత్రువు. కాని ఒక
విషయానికి నేను భయపడుతున్నాను. ఇతని కుమారులందరూ చని
పోయారు. నేను తప్ప రావణునికి అంతిమ సంస్కారములు
చేయడానికి ఎవరూ లేరు. ఇప్పుడు నేను నిరాకరిస్తే లోకం అంతా
నన్ను కనీసము అన్నకు అగ్ని సంస్కారము చేయనందుకు నిందిస్తుంది. కాని లోకం ఇటువంటి దుర్మార్గుడికి అంతిమ సంస్కారములు చేయ నిరాకరించినందుకు నన్ను పొగుడుతుంది కూడా. నిర్ణయం నీది. నీవు ఏమి చెయ్యమంటే అది చేస్తాను." అని అన్నాడు విభీషణుడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “విభీషణా! నేను నీకు మిత్రుడను కదా. నీ సహాయము వలననే నేను లంకను జయించగలిగాను. నీ అన్న రావణుడు అధర్మ వర్తనుడు, అసత్యవాది కావచ్చును. కానీ ఇతడు మహాపరాక్రమ వంతుడు శూరుడు. వీరుడు. యుద్ధములో వీరుడిగా మరణించాడు. ఇతనిని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా జయించలేకపోయాడని విన్నాము కదా! పైగా అతడు నీకు అన్న. నీ చేత దహన సంస్కారములు చేయించుకొనే అర్హత అతనికి ఉంది. దానిని నీవు కాదనలేవు. ఇటువంటి వీరునికి దహన సంస్కారములు చేస్తే నీకు కీర్తిప్రతిష్టలు కూడా లభిస్తాయి. తరువాత నీ ఇష్టం.” అని అన్నాడు రాముడు.

సనాతన ధర్మం

04 Feb, 16:38


శ్రీ గురుచరిత్ర గ్రంధ మహిమ

Please like share subscribe to
సనాతన ధర్మం

https://youtu.be/mphPc7Yc4H0

సనాతన ధర్మం

04 Feb, 16:27


నవ జనార్ధనాలలో అష్టమ జనార్ధనుడు 🙏, కోరుమిల్లి

సనాతన ధర్మం

04 Feb, 16:22


నవ జనార్ధనలో సప్తమ జనార్ధనుడు 🙏. , మాచర

సనాతన ధర్మం

04 Feb, 15:26


నడిపూడి లోని శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు 🙏🏻

సనాతన ధర్మం

04 Feb, 15:23


దత్త పురాణము || చతుర్థ భాగము
ఇరవై తొమ్మిది లో రెండు (29-2)

సనత్కుమారా ! వింటున్నావుగా, దత్తాత్రేయుడు శ్రాద్ధయోగ్య పదార్థాలేమిటి వర్ణించవలసినవి ఏమిటి తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్ముడు కురుక్షేత్రంలో శరతల్పంమీద ఉండి ధర్మరాజుకి చెప్పిన అత్రి - నిమి సంవాదాన్ని వినిపించాడు. దత్తుడు కొడుకు నిమికి పుత్రవియోగం కలిగిందనీ, ఆ దుఃఖాన్ని తీర్చుకోడానికి ముమ్మొదటగా ఈ విధిని రూపొందించాడనీ, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియజేసాడని
శ్రాద్ధవిధిలో విశ్వదేవతలకూ పితృదేవతలకూ అగ్నికీ సోముడికీ ఇంకా సంబంధిత దేవతలకూ భాగాలు కల్పించాడనీ వర్ణనీయాలను నిర్ధారించాడని వివరించాడు. వీటిని దత్తాత్రేయుడు వివరిస్తుంటే శ్రద్ధగా విన్న ధర్మకీర్తి - శ్రాత స్మార్తవ్రత దానాది వైదిక సత్కర్మలకు తిథి
ప్రధానమంటారు గదా. దాని మీదనే వాటి ఫలాలు ఆధారపడి ఉంటాయి, అని కూడా విన్నాను. కాబట్టి ఇంత ప్రధానమైన తిథిని నిర్ణయించడమెలాగ ? పాపకార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలున్నాయా ? చాంద్రాయణాది వ్రతాల
స్వరూపం ఏమిటి ? ఈ విషయాలు తెలియజెప్పి నన్ను ధన్యుణ్ని చెయ్యి దేవాదిదేవా! అని అభ్యర్ధించాడు. దత్త యోగేంద్రుడు సంతోషించి - ఉపవాసాలకూ, వ్రతాలకు, దానధర్మాలకూ ఏయే తిథులు ఉత్తమాలో ఏవి పనికిరావో తిథి నిర్ణయం ఎలా చేసుకోవాలో సవిస్తరంగా తెలియజేశాడు. స్మృతులు చెప్పిన పద్ధతుల్లో తిథి వార నక్షత్రాదుల్ని నిర్ణయించుకుని సత్కర్మాచరణం చేస్తే అక్షయఫలం లభిస్తుందని ఉపదేశించాడు. ధర్మాన్ని దేవతలు ఏర్పరిచారు.
దాన్ని ఆచరిస్తే కేశవుడు సంతోషిస్తాడు. కాబట్టి ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే విష్ణుస్వరూపులే. వారికి సంసార దుఃఖాలు ఆదివ్యాధులూ అంటవు, అవి బాధించవు. ధర్మకీర్తీ ! బ్రహ్మహత్య - సురాపానం - స్వర్ణస్తేయం - గురుభార్యాగమనం - ఇవి చేసిన వాడితో స్నేహం - అనే పంచ మహాపాతకాలతోపాటు పరస్త్రీగమన ప్రాణిహింసాదులు మరికొన్ని ఉపపాతకాలూ ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపఫలం అనుభవించక తప్పదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు లేవు. కొన్నింటికి పిడకలు పేర్చుకుని తననితాను దహించుకోవడం వంటి తీవ్ర ప్రాయశ్చిత్తాలను చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు. ఏమైనా
అడుసు తొక్కనేల కాలు కడుగనేల అన్నట్టు పాపకర్మలు ఆచరించకుండా ఆత్మనిగ్రహంతో వ్యవహరించడమే ఉత్తమం. దీని సాధనకు చెప్పిన నిత్యనైమిత్తిక కర్మలను శ్రద్ధతో ఆచరించండం ధర్మాచరణపట్ల ఆదర్శప్రాయులను అనుసరించడం పురాణేతిహాసాల పఠనం ద్వారా ధర్మసూక్ష్మాలను మంచిచెడులనూ తెలుసుకొని మంచిని అలవరచుకోవడం - ఇవే ఉత్తమోత్తమమైన పరిష్కార మార్గాలు. ధర్మకీర్తీ ! అనుతాపంతో అంత శ్శుద్ధినీ ఉపవాసాలతో బహిశ్శుద్ధినీ సాధించి పదిమందికీ ఆమోదయోగ్యుడై మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా పాప ప్రాయశ్చిత్తాలుగా నైతేనేమి ఆయా ఆశ్రమవాసుల ఆచారాలుగానైతేనేమి చాంద్రాయణాది వ్రతాలు కొన్నింటిని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని వివరించమన్నావు
గదా ఆలకించు - అంటు దత్తాత్రేయుడు కొనసాగించాడు. ఏ వ్రతానికైనా బ్రహ్మచర్యం దయ ఓర్పుమౌనం సత్యదీక్ష అకామ్యత అహింస అస్తేయం (దొంగతనం చెయ్యకపోవడం) మాధుర్యం బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం స్నానం ఉపవాసం ఇజ్య (హోమం) స్వాధ్యాయం గురుశుశ్రూష శౌచం అక్రోధిత అప్రమాదిత - ఇవి తప్పక పాటించవలసిన నియమాలు. వీటిని పాటిస్తూ చంద్రుడి వృద్ధిక్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని తీసుకుని కాలం గడపటం వానప్రస్తులకు వ్రతంగా పెద్దలు చెబుతున్నారు. దీన్నే చాంద్రాయణ వ్రతమంటారు. శుక్ల పక్షంలో చందమామ దినదినాభివృద్ధి చెందుతాడు. రోజుకి ఒకకళ చొప్పున పెరుగుతాడు. వానప్రస్థి శుక్లపక్ష ప్రతిపత్తినాడు ఒక ముద్దతో
మొదలు పెట్టి రోజుకొకటిగా పెంచుకుంటూ పూర్ణిమనాడు పదిహేను ముద్దల ఆహారం స్వీకరిస్తాడు. బహుళ పాడ్యమి నుంచి కళలు తరుగుతాయి. కనక రోజుకొకటిగా ముద్దలు తగ్గించుకుంటూ అమావాస్య నాటికి నిరాహారుడవుతాడు. ఇదీ చాంద్రాయణ వ్రత నియమం. ఒకరోజు పగటి భోజనం, మర్నాడు రాత్రి భోజనం, మూడవనాడు అయాచిత భోజనం, నాల్గవనాడు ఉపవాసం -
దీన్ని పాద కృచ్ఛవ్రతమంటారు. ఇది నాల్గునాళ్ళ వ్రతం. దీన్ని రెట్టింపు చేస్తే అర్ధకృచ్ఛం. అంటే రెండు రోజులు పగటిభుక్తి, తరువాత రెండునాళ్ళు రాత్రిభుక్తి, ఆపై రెండునాళ్ళు అయాచిత భోజనం చివరి రెండు రోజులు ఉపవాసం మొత్తం ఎనిమిదినాళ్ళ వ్రతమిది. ఇలా కాకుండా పన్నెండు నాళ్ళు వరుసగా ఉపవాసముంటే పరాకమంటారు. పంచగవ్య ప్రాశనం చేసి వపనాదులు (గుండు) చేసుకుంటే అది సొంతపనకృచ్ఛం. పంచగవ్యాలనూ కుశోదకాన్ని
రోజుకి ఒక్కటిగా ఆరురోజులు పుచ్చుకుని ఏడవనాడు అవి కూడా
లేకుండా నిట్టుపవాసముంటే - దీన్ని
మహాసాంతపనకృచ్ఛవ్రతమంటారు. దీనికే సప్తాహకృచ్ఛమని పేరు. మహారాజా! ప్రాయశ్చిత్తాలుగా ఉపదేశించిన ఈ వ్రతాలను యాంత్రికంగా చేస్తే చాలదు. అను తాపంతో చెయ్యాలి. శ్రద్ధాసక్తులతో చెయ్యాలి. పాపభారం తొలగించు దేవా అని నారాయణుణ్ని స్మరిస్తూ చెయ్యాలి. నారాయణాంకితమైన మనస్సే ప్రధానం.

సనాతన ధర్మం

04 Feb, 15:23


రాగాది నిర్ముక్తుడై అనుతాప సమన్వితుడై సర్వభూత దయాపరుడై విష్ణుస్మరణ తత్పరుడై నట్టయితే అతడు తెలిసీ తెలియక చేసిన ఎంతటి
పాతకమైనా అంతరించిపోతుంది. నారాయణ స్మరణమే సర్వపాపాలకు ప్రాయశ్చిత్తం. ఆద్యంత రహితుడు విశ్వాకారుడు అనామయుడు అయిన శ్రీమన్నారాయణుడు తనను స్మరించిన వారినీ, పూజించిన వారినీ, ధ్యానించినవారినీ, నమస్కరించిన వారినీ పాపవిముక్తుల్ని చేసి కాపాడతాడు. తెలియకచేసినా తెలిసిచేసినా హరికీర్తనం పుణ్యప్రదమే. హరినామస్మరణ ఒక్కసారి చేసినా క్లేశాలను నశింపజేస్తుంది. నిత్యమూ చేస్తే లభించే పుణ్యాలూ భోగాలు వర్ణనాతీతం ఊహించుకోవలసిందే. మానవజన్మ దుర్లభం. అందులో హరిభక్తి కుదురుకోవడం మరీ దుర్లభం. తటిల్లతాలోలమైన మానవజన్మలో హరిని పూజించక పోవడంకన్నా తెలివితక్కువ
పని మరొకటి ఉంటుందా ? పశుపాశ విమోచనుడైన హరిని పూజచేసి తీరాలి.

సశేషం

సనాతన ధర్మం

04 Feb, 15:06


శ్రీమద్రామాయణము|| యుద్ధకాండము
నూటపదకొండవ సర్గ లో రెండవ భాగం (111-2)

అంత దాకా ఎందుకు. అందములో గానీ, ఐశ్యర్యములో
గానీ, వంశములో గానీ ఆ సీత నా కాలి గోటికి కూడా సరిపోదు.
ఎదురుగా ఉన్న నన్ను వదిలి నీవు ఆ సీత వెంట బడ్డావు. నీ అజ్ఞానము కాక మరేమున్నది. పుట్టడం యాదృచ్ఛికమే కానీ చావు మాత్రం ఏదో కారణం లేనిది రాదు. నీకు సీత రూపంలో నీ మరణం సంభవించింది. నీకు మృత్యువు ఆసన్నం కాబట్టే ఎక్కడో దండకారణ్యంలో జనస్థానంలో తన మానానతాను కందమూలములు తిని బతుకుతున్న సీతను మోసంతో అపహరించి తెచ్చావు. నీ చావును నీవే తెచ్చి నీ పక్కనే పెట్టుకున్నావు. అదును చూచి ఆ చావు నిన్ను మానుండి అపహరించింది. ఓ లంకేశ్వరా! నేను నీ తో కలిసి విమానముల మీద కైలాసపర్వతము మీద, మేరు పర్వతము మీద, ఉద్యానవనములలోనూ, విహరించాను. ఎన్నోదేశములు తిరిగాను అక్కడి వింతలు విశేషాలు చూచాను. నీ మరణంతో నా వైభవము అంతా అంతరించింది. వైధవ్యము ప్రాప్తించింది. నీ కామ కోరికలకు నేను బలి అయ్యాను. రాచభోగములు చంచలములు అని తెలుసుకోలేకపోయాను.
నాధా! ప్రతిరోజూ అందమైన వస్త్రములు ధరించి, పైపూతలు పూసుకొని, మద్యము సేవిస్తూ హంసతూలికా తల్పము మీద
పరుండే వాడివి ఇప్పుడు ఈ కటికనేలమీద, దుమ్ములో ధూళిలో
పడుకొని ఉన్నావా! విధి ఎంత చిత్రమైనది. ఇన్నాళ్లు నీ తో కూడి
సురలోకభోగములు అనుభవించాను. అవన్నీ శాశ్వతము
అనుకున్నాను. నీకు మరణమే లేదనుకున్నాను. కానీ నీ అకాల
మరణంతో నాకు వైధవ్యము పాప్తిస్తుందని కలలో కూడా
ఊహించలేదు. నా తండ్రి దానవులకు ప్రభువు అనీ, నాభర్త
రాక్షసులకు ప్రభువుఅనీ, దేవతలను జయించినవాడు అనీ గర్వంతో
తలెత్తుకు తిరిగేదాన్ని. నా తండ్రికి గానీ, నా భర్తకు గానీ ముల్లోకము
లలో ఎదురు లేదని అనుకొనేదాన్ని. అటువంటి నీకు ఒక మానవుని
వలన ఈ భయం ఎలా వచ్చిందో అర్థం కాకుండా ఉంది. ఆలోచిస్తుంటే ఇదంతా ఒక స్వప్నంలా ఉంది. నిజంగా నువ్వు చచ్చిపోయావా! నీవు మరణించావు అంటే నమ్మలేకుండా ఉన్నాను. అదీ ఒక మానవుడు అయిన రామునిచేత చంపబడ్డావు అంటే నమ్మశక్యంగా లేదు. మృత్యువుకే మృత్యువుగా ప్రసిద్ధిచెందిన నీవు ఆమృత్యువుకే లొంగిపోయావా! నా భర్త రావణుడు సామాన్యుడు కాడు. మూడు
లోకములలో ఉన్న ఐశ్యర్యముల నన్నిటినీ తన పాదాక్రాంతము
చేసుకున్నవాడు. మూడు లోకములను భయపెట్టినవాడు.
దిక్పాలకులను తన వాకిట నిలబెట్టినవాడు. కైలాసపర్వతమును
కదిపినవాడు. తన ఎదుట ఎవడైనా గర్వంతో నిలబడితే వాడి గర్వాన్ని హరించిన వాడు. శత్రువులను సంహరించి తన వాళ్లను
రక్షించుకొనేవాడు. దానవులను, యక్షులను సంహరించిన వాడు.
రాక్షసజాతిని రక్షించిన వాడు. నా భర్త ఋషులు చేసే యజ్ఞములను
పాడు చేసేవాడు. అధర్మాన్ని ఆచరించేవాడు. మాయాయుద్ధంలో
నిపుణుడు. ఏయే దేశాలను జయిస్తాడో ఆయాదేశాల నుండి
దేవ, దానవ,గంధర్వ కన్యలను తీసుకొచ్చి అనుభవించినవాడు. ఈ
లంకా ద్వీపమునకు రక్షకుడు. ఇట్టి నా భర్తను రాముడు చంపాడు
అంటే ఎలా నమ్మడం. అలాంటి భర్త మరణించి శవంగా నేల మీద పడి
ఉండటం చూచిన నేను ఇంకా బతికి ఉన్నాను అంటే ఎలా నమ్మడం.
నేను చాలా మొండిదానను అందుకే ఇంత ఘోరం జరిగినా ఇంకా
బతికి ఉన్నాను. ఓ రాక్షస రాజా! ఈ దుమ్ములో ధూళిలో ఎలా పడుకొని ఉన్నావయ్యా! అలా పడుకోడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా! నీ కుమారుడు ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపినపుడే నేను సగం మరణించాను. నీ మరణంతో పూర్తిగా మరణించాను. జీవచ్ఛవంలా మిగిలి ఉన్నాను. నీవు లేకుండా, నీతో కామభోగములు
అనుభవించకుండా శేషజీవితం అంతా దు:ఖిస్తూ, జీవచ్ఛవంలా
బతకాలా నేను. నా వల్ల కాదు. కాబట్టి నేను కూడా నీ వెంట వస్తాను.
నన్ను కూడా నీ వెంట తీసుకొని వెళ్లు. అసలు నన్ను ఒంటరిగా ఇక్కడ
వదిలిపెట్టి నీవు ఎలా వెళ్లగలిగావు. నేను ఇంతగా విలపిస్తున్నా నాతో
ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు ఎందుకని. అంత:పురంలో ఉన్న నేను నీవు మరణించావని తెలియగానే మేలి ముసుగు కూడా లేకుండా, పాదచారినై పరుగుపరుగున వచ్చానని నా మీద కోపమా నాధా! నేనే కాదు. అటు చూడు. నీ భార్యలందరూ రాచమర్యాదలను
అతిక్రమించి ఎలా నీ కోసం విలపిస్తున్నారో ఒక్కసారి చూడు. నాతో పాటు వాళ్లను కూడా కోప్పడు. వాళ్లను కూడా నిందించు. నీ కోసరం వాళ్లందరూ ఎలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారో చూడు. వాళ్లను ఓదార్చు. వాళ్లంటే నీకు ఇష్టం లేదా! ఉంటే ఎందుకు వారితో మాట్లాడవు. నాధా! నాకు ఒకటి తోస్తూ ఉంది. నీవు ఎంతమందినో
చంపి ఉంటావు. వారి భార్యలలో ఎంతో మంది పతివ్రతలు ఉండి
ఉంటారు. వారి శాపములు అన్నీ నీకు తగిలి ఉంటాయి. వారు కార్చిన
కన్నీరు వృధా పోతుందా! అందుకే ఇలా అకాలమరణం చెందావు. మా అందరినీ విధవలను చేసావు.

సశేషం

సనాతన ధర్మం

04 Feb, 03:50


మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు, ఆ సూర్య భాగవానుని అనుగ్రహము మరియు కృప తో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ సూర్య భవనానునికి నమస్కరించి ప్రార్థిస్తున్నా,

తంగిరాల చంద్రశేఖర అవధాని,
కపిలేశ్వరపురం

సనాతన ధర్మం

03 Feb, 16:05


సప్త సప్త మహాసప్త సప్తమీ రథ సప్తమి ||
సప్త జన్మ కృతం పాపం మకరే హన్తు సప్తమి ||

ఈ శ్లోకం చదువుతూ రథ సప్తమి ఉదయం రేగి పళ్ళు జిల్లేడు ఆకులు తలపైన పెట్టు కుని స్నానం చెయ్యాలి

సనాతన ధర్మం

03 Feb, 15:24


పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని , పక్షికాని , వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా ! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి , నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి , పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి , గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి , అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి , అతి సుందరాంగి , గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని *'అమ్మాయీ ! నీ వెవ్వరిదానవు ? నీ నామధాయమేమి ? నీ వృత్తాంతము యేమి ?'* అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.🙏

సనాతన ధర్మం

29 Jan, 12:23


పూరీ జగన్నాథ ఆలయం 🙏 జై జగన్నాథ్🙏

సనాతన ధర్మం

29 Jan, 12:00


#ముకుందమాల #18వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

29 Jan, 04:00


సంస్కృత సూక్తి సుధ బుద్దివంతుని లక్షణాలు

ఇలాంటి మరిన్ని శ్లోకములు నేర్చుకోవటం కోసం సనాతన ధర్మం ను ఫాలో అవ్వండి,

చంద్రశేఖర పాహిమాం

సనాతన ధర్మం

29 Jan, 02:53


శ్రీమద్రామాయణము|| యుద్ధకాండము
నూట ఆరవ సర్గ.(106)

(ఇంత విషయం జరుగుతూ ఉంటే రావణుడు ఊరుకున్నాడా అని మీకు సందేహము రావచ్చు. కాని వాల్మీకి మహర్షి ఆ సందేహానికి మొదటి శ్లోకంలోనే సమాధానం చెప్పాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయేటప్పటికి రావణుని సారథి రథమును నడుపుకుంటూ రాముడి వద్దకు వచ్చాడు అని ప్రారంభించాడు. అంటే అక్కడ రావణుడు సారథిని తిట్టడం, సారథి సమాధానం ఇవ్వడం, రావణుడు తృప్తిపడటం జరిగే సమయంలో ఇక్కడ అగస్త్యుడు రావడం,
ఆదిత్య హృదయం ఉపదేశించడం, రాముడు మూడుసార్లు పఠించడం జరిగాయి. ఇది సంభవమే కదా!)
రావణుని మాటలకు సారథి సంతోషించి రథమును నడుపుకుంటూ రాముని వద్దకు వచ్చాడు. అమిత వేగంతో వస్తున్న రావణుని రథమును చూచాడు రాముడు. రావణుని రథమునకు నల్లని గుర్రములు కట్టబడి ఉన్నాయి. రావణుని ధనుస్సునుండి బాణములు వర్షంలా కురుస్తున్నాయి. అది చూచిన రాముడు సారథి మాతలితో ఇలా అన్నాడు. “మాతలీ! అటు చూడు. రావణుడు మహావేగంతో
యుద్ధానికి వస్తున్నాడు. బాణాలు వర్షంలా కురిపిస్తున్నాడు. నీవు కూడా మన రథమును రావణుని రథమునకు ఎదురుగా తీసుకొని వెళ్లు. ఈ రోజు రావణుని చరిత్ర సమాప్తమవుతుంది. జాగ్రత్తగా రథాన్ని నడుపు. ఇంద్రుని సారథివైన నీకు నేనుచెప్పబనిలేదు. నా ఏకాగ్రత దెబ్బతినకుండా రథమును నడపమని కోరుతున్నాను." అని అన్నాడు రాముడు. రాముని మాటలలో ఆంతర్యమును గ్రహించిన మాతలి రాముని మనసును బట్టి రథమును నడుపుతున్నాడు. మాతలి ఒక్కసారి తన అశ్వములను ముందుకు ఉరికించాడు.
దుమ్ములేపుకుంటూ రాముని రథము రావణుని రథం చుట్టు
ప్రదక్షిణంగా తిరిగింది. ఆ దుమ్ము రావణుని రథాన్ని కమ్మేసింది. ఆ
చర్యకు కోపించిన రావణుడు రాముని మీద శరవర్షము కురిపించాడు. రాముడు ఇంద్రుడు తనకు పంపిన దివ్య ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. ఇంద్రబాణములను సంధించాడు. రావణుని
విచక్షణా రహితంగా కొట్టాడు. ఇద్దరి మధ్య పోరు ఘోరంగా జరిగింది.
రెట్టించిన ఉత్సాహంతో పోరుతున్న రామరావణ యుద్ధము
చూడటానికి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆకాశంలో
నిలబడి ఉన్నారు. ఇంతలో కొన్ని ఉత్పాతాలు కనిపించాయి. ప్రత్యేకించి రావణుని రథము మీద రక్తపు వర్షము కురిసింది. సుడి గాలి రావణుని రథమును చుట్టు తిరిగింది. ఆకాశంలో గ్రద్దలు ఎగురుతూరావణుని రథం ఎటు తిరుగుతుందో అటు వేపుకు తిరుగుతున్నాయి. అప్పటికి సాయం సంధ్య అయింది. సాయంకాలపు ఎండ ఎర్రగా పడమటి దిక్కు మండుతున్నట్టు ఉంది. ఉరుములు ఉరుముతున్నాయి. ఉల్కలు ఆకాశంనుండి జారిపడుతున్నాయి. భూమి స్వల్పంగా కంపించింది. యుద్ధభూమిలో నక్కలు నోళ్లు తెరుచుకొని రావణుని రథం వంక చూస్తూ అరుస్తున్నాయి. యుద్ధభూమిలో గాలి విపరీతంగా వీస్తూ దుమ్ము లేస్తూ ఉంది. ఆ దుమ్ములో రావణునికి ఎదురుగా ఉన్న రాముని రథం సరిగా కనపడటం లేదు. ఆకాశంలో మేఘములు లేవు. కానీ ఉరుములు ఉరుముతున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి.
పిడుగులు పడుతున్నాయి. చుట్టు చీకట్లు కమ్ముతున్నాయి. ఆకాశం
అంతా దుమ్ముతో నిండిపోయింది. ధూళి మేఘాలు కమ్ముకున్నాయి.
రావణుని రథమునకు కట్టిన గుర్రముల కళ్లనుండి నీళ్లు కారుతున్నాయి. ఈ అపశకునములు అన్నీ రావణుని వినాశనాన్ని,
రాముని విజయాన్ని సూచిస్తున్నాయి. ఈ దుర్నిమిత్తములను చూచి
రాముడు ఈరోజు రావణుని వధ తప్పదు అని అనుకున్నాడు. తన
పరాక్రమాన్ని ద్విగుణీకృతం చేసాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూట ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

28 Jan, 15:10


వింధ్య వాసిని టెంపుల్🙏, వింధ్యాచల్

సనాతన ధర్మం

28 Jan, 14:50


దత్త పురాణము || చతుర్థ భాగము
నమస్కారవిధి || ఇరవై మూడు (23)

జ్ఞాన తపో వయో వృద్ధులకు బ్రహ్మచారి అభివాదన శీలియై ఉండాలి. వేదశాస్త్రాదుల్ని ఉపదేశించి ఆధ్యాత్మికాది దుఃఖాలను తొలగించే గురువుకు ముందుగా నమస్కరించాలి. బ్రాహ్మణుడు తన పేరుకి చివర శర్మపదం తగిలించి గోత్రనామాలు చెప్పుకుంటూ విప్రుడికి నమస్కరించాలి. క్షత్రియాదులకి ఎప్పుడూ నమస్కరించకూడదు. నాస్తికుడికీ భిన్నమర్యాదుడికీ (బహుశ మతాంతరుడు) కృతఘ్నుడికీ గ్రామయాజకుడికీ చోరుడికీ జూదగాడికీ (కితవుడు) ఉన్మత్తుడికీ,
శర-ధూర్త-పాషండులకీ, అశుచికీ నమస్కరించకూడదు. అభ్యంగనస్నానం చేస్తున్న వాడికీ, జపం చేస్తున్నవాడికీ నక్షత్రజీవికీ, పరుగెత్తుతున్నవాడికీ, పాపాత్ముడికీ, స్నానం చెయ్యని వాడికీ, సమిత్కుశాదులు సేకరిస్తున్నవాడికీ, దండలు గుచ్చుతున్నవాడికీ, నీళ్ళకుండ మోసి తెస్తున్నవాడికీ, భోజనం చేస్తున్న వాడికీ వివాదశీలికి దిగంబరుడికీ, వాంతి చేసుకుంటున్న వాడికీ నీళ్ళమధ్యలో ఉన్నవాడికీ, భిక్షాన్నధారికీ, నిద్రిస్తున్న వ్యక్తికీ - నమస్కరించకూడదు. భర్తను చంపిన దానికి, పుష్పవతికీ, జారిణికీ, బాలింతకు, గర్భపాతినికి, కృతఘ్నికీ, చండిక్కీ (కోపిష్ఠి) - నమస్కరించకూడదు. సభలో యజ్ఞశాలలో దేవాలయంలో ఎవరు ఎవరికైనా ప్రత్యేకంగా నమస్కారం చేస్తే చేసినవారి పురాకృత పుణ్యమంతా నశించిపోతుంది. పుణ్యక్షేత్రంలో పుణ్యతీర్ధంలో స్వాధ్యాయ సమయంలో ఎవరూ ఎవరికీ ప్రత్యేకంగా నమస్కరించకూడదు. శ్రార్దం - వ్రతం - దానం - దేవతాభ్యర్చనం - యజ్ఞం - తర్పణం - వీటిని చేస్తున్న వ్యక్తికి చేస్తున్న వేళ నమస్కరించకూడదు. నువ్వు ఎవరికైనా నమస్కరిస్తే అతడు ప్రతినమస్కారం చెయ్యకపోతే మరింక ఆ వ్యక్తికి ఎప్పుడూ నమస్కరించకూడదని కఠిన నియమం. కనక నమస్కరించదగిన వారికే అయినా సమయం సందర్భం చూసి మరీ నమస్కరించాలి.

హరిః ఓం తత్సత్
శ్రీ దత్తాయ గురవేనమః

సనాతన ధర్మం

28 Jan, 10:59


ఈ ప్రశ్నకు సమాధానం:- కుబేరుని తండ్రి విశ్రవసుడు,
అలాగే పులస్త్యుడు అంటే విశ్రవసుని తండ్రి, తృణ బిందువు అంటే పులస్త్యుని మమ గారు, అలాగే వైశ్రవణుడు అంటే అది కుబేరుని మరొక పేరు

సనాతన ధర్మం

28 Jan, 04:13


కుశ లవుల రామ కథా గానము || శ్రీమద్రామాయణము బాలకాండ 4వ సర్గ

please like share comment
subscribe to సనాతన ధర్మం

https://youtu.be/kE5CyjjuQ9g

సనాతన ధర్మం

28 Jan, 03:10


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
నూట ఐదవ సర్గ.(105) ,,ఆదిత్య హృదయం

రావణుడు అలసిపోయినట్టే రాముడు కూడా అలసిపోయాడు. అలసిన రావణుని సారథిపక్కకుతీసుకొని వెళ్లాడు. కాస్త విశ్రాంతి తీసుకొని రావణుడు మరలా యుద్ధానికి వచ్చాడు. కాని రాముడు రావణునితో యుద్ధం చేసే పరిస్థితిలో లేడు. పైనుండి రామరావణ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు, గంధర్వులతో పాటు అగస్త్య
మహాముని కూడా ఉన్నాడు. వెంటనే రామునికి సాయం చేయదలచి
అగస్త్య మహాముని రాముని వద్దకు వచ్చాడు. రామునితో ఇలా అన్నాడు. “రామా! ఈ సమయంలో నీకు ఒక మహా స్తోత్రము గురించి
చెబుతాను. దానిని చక్కగా పఠించు. దీనిని పఠిస్తే శత్రువులతో చేసే
యుద్ధంలో జయం కలుగుతుంది. దీనిపేరు ఆదిత్య హృదయము.
దీనిని నిత్యమూ పఠిస్తే సకల శత్రువులను నాశనం చేస్తుంది. విజయం కలుగజేస్తుంది. కాని ఇది చాలా పవిత్రమైనది. అన్ని స్తోత్రములలో కెల్లా ఈ ఆదిత్య హృదయము చాలా మంగళకరమైనది. దీనివలన ఆయుష్షు కూడా వృద్ధిచెందుతుంది. దీనిని నీకు ఉపదేశిస్తాను. ఇది సూర్యుని గురించి చేసే స్తోత్రము. సూర్యుడు లోకముల కెల్లా ఆరాధ్యుడు. ప్రతి రోజూ ఉదయ పర్వతము మీద ఉదయిస్తాడు. ఒక్క మానవులే కాదు దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ సూర్యుని ఉపాసిస్తారు. లోకానికి కాంతిని, ప్రాణాన్ని ప్రసాదిస్తాడు సూర్యుడు. మీ వంశకర్త. అట్టి సూర్యుని ఆరాధించు. విజయం సాధించు. అని మొదలు పెట్టి అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు.

*ఆదిత్య హృదయం*

1.రశ్మిమన్తం సముద్యన్తం దేవాసురనమసృ్కతం,
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరం
2.సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి:
3.ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతి:,
మహేన్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతి:.
4.పితరో వసవః సాధ్యా అశ్వినౌ మరుతోమను:
వాయుర్వహ్నిః ప్రజా: ప్రాణ ఋతుకర్తాప్రభాకర:
5.ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకర:
6. హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శమ్భుస్త్వష్టా మార్తణకో అంశుమాన్
7.హిరణ్యగర్భః శిశిరస్తపనో అహస్కరో రవి:
అగ్నిగర్భో అదితేః పుత్రః శఙ్ఞ: శిశిరనాశన:
8 వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుసామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో విన్య వీథీ ప్లవంగమ:
9.అతపీ మణ్డలీ మృత్యు: పిఙ్గల: సర్వతాపన:
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవ:
10.నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావన:
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమో స్తుతే
11.నమ: పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ:
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ:
12.జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:
నమోనమ: సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ:
13.నమ ఉగ్రాయ వీరాయ సారజ్గాయ నమోనమః
నమ: పద్మప్రబోధాయ ప్రచణ్ణాయ నమో2స్తు తే.
14.బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ:
15.తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:
16.తప్తచామీకరాభాయ హరయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే
17.నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభు:
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి:
18.ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత:
ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్
19. దేవాశ్చ క్రతవశ్చైవ క్రతూనాంఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభు:

ఓ రామా! ఇది ఆదిత్యహృదయము అనే స్తోత్రము. ఈ
స్తోత్రమును ఆపదలలోగానీ, దుర్గమ ప్రదేశములలో ప్రయాణం
చేయునప్పుడు గానీ, భయపడే సమయములలో గానీ, పఠిస్తే అతనికి ఏ భయమూ ఉండదు. విజయాన్ని పొందుతాడు. నీవు కూడా ఈ జగత్తునకు ప్రభువైన సూర్యుడిని పూజించు. ఈ ఆదిత్య హృదయ స్తోత్రమును మూడుమార్లు జపించు. రావణ సంహారం చెయ్యి. నీకు విజయం సిద్ధిస్తుంది.” అని అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయము అనే స్తోత్రమును ఉపదేశించి వెళ్లిపోయాడు.
రాముడు చాలా సంతోషించాడు. ఆదిత్య హృదయమును
నిశ్చలమైన మనస్సుతో ఏకాగ్రతతో మూడు సార్లు పఠించాడు.
సూర్యుడికి నమస్కరించాడు. ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు.
రావణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. తనను స్తోత్రము
చేయుచున్న రాముని అనుగ్రహించాడు సూర్యుడు. త్వరగా రావణుని మీదికి యుద్ధమునకు వెళ్లు అని ప్రేరేపించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూట ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

27 Jan, 13:56


శ్రీదత్త పురాణము ||చతుర్ధ భాగం
షోడశ సంస్కారాలు || ఇరవై రెండు (22)
-
అన్ని వర్ణాలవారికి గర్భాదానాది సంస్కారాలు పదహారు ఉన్నాయి. అని కూడా తెలుసుకోవడం అవసరమే. గర్భాదానం - పుంసవనం సీమంతం - జాతకర్మ - నామకరణం - అన్నప్రాశనం చౌలం - ఉపనయం -ప్రజాపత్యం - సౌమ్యం - ఆగ్నేయం - వైశ్వదేవం - గోదానం - సమావర్తనం- వివాహం - అంత్యకర్మం - ఇవీ షోడశసంస్కారాలు. వీటిలో గర్భాదానం పురుషుడికి సమంత్రకంగా స్త్రీకి అమంత్రకంగా చెయ్యాల్సిన సంస్కారం. తొలిచూలు గర్భిణికి 4-6-7-8 మాసాలలో సీమంత సంస్కారం చెయ్యాలి. పుత్రోదయం కాగానే తండ్రి కట్టుబట్టలతో సహా స్నానం చెయ్యాలి. స్వస్తి వాచన పూర్వకంగా నాందీశ్రాద్ధం ఆచరించాలి. బంగారంతో గానీ, ధాన్యంతో గానీ జాతశ్రాద్ధం చెయ్యాలి. అన్నంతో మాత్రం చేయరాదు. సూతకమయ్యాక యధావిధిగా మౌనంగా తండ్రి బిడ్డకు నామకరణం చెయ్యాలి. అర్థవేది (అతిప్రకటితమైన అర్థం కలది) అర్థహీనం, అతి గుర్వక్షరాన్వితం విషమాక్షర సహితం - అయిన పేరును పెట్టకూడదు.
గుహ్య సూత్రోక్త ప్రకారంగా 3-5-6-7-8 సంవత్సరాల వయస్సులో బిడ్డడికి చౌల సంస్కారం చెయ్యాలి. దైవయోగం వల్ల ఈ గర్భాదానాది సంస్కారాలకు కాలాతి క్రమణం జరిగితే పాదకృఛ్ఛ ప్రాయశ్చిత్తం చౌలానికి కాలాతి క్రమణం జరిగితే అర్థకృఛ్ఛ ప్రాయశ్చిత్తం చెయ్యాలి.
గర్భాష్టమంలో గానీ ఎనిమిదేళ్ళ వయస్సున గానీ పుత్రుడికి ఉపనయనం చెయ్యాలి. అధమ పక్షం పదహారేళ్ళ లోపులో జందెం వెయ్యాలి. క్షత్రియుడికి పదకొండో యేట ప్రశస్తం. అధమ పక్షం ఇరవైరెండేళ్ళు దాటేలోగా, వైశ్యుడికి గర్భద్వాదశంలో ఉపనయనం ఉత్తమపద్ధతి. అధమ పక్షం ఇరవైనాలుగేళ్ళ వయస్సు దాటేలోగా 'చెయ్యడం మంచిది. బ్రాహ్మణవటువు కాషాయాంబరం క్షత్రియ వటువు మాంజిష్టాంబరం, వైశ్యవటువు హరిద్రాంబరంధరించాలి.
ఉపనయనానంతరం ఈ వటువులు గురుకులంలో నివసిస్తూ గురుశుశ్రూష చేస్తూ వేదాధ్యయనం సాగించాలి. తెల్లవారు జామునే స్నానం చెయ్యడం గురువు గారికి సమిత్కుశ ఫలాదుల్ని అడవి నుండి తెచ్చి అందించడం వీరి నిత్యకృత్యం, యజ్ఞోపవీత - అజిన - దండాలను ధరించి ఉండాలి. వీటిలో ఏది ఎప్పుడు తెగినా, విరిగినా, వెంటనే సమంత్రకంగా కొత్తది ధరించి పాతదాన్ని నీటిలో వదిలిపెట్టాలి. బ్రహ్మచారులు భిక్షాన్నంతోనే జీవించాలి. శ్రోత్రియుల
ఇళ్ళల్లోనే బిక్షాటన చెయ్యాలి. భవతి భిక్షాందేహి అని బ్రాహ్మణవటవు. భిక్షాం భవతి దేహి అనిక్షత్రియవటువు. భిక్షాందేహి
భవతి అని వైశ్యవటువు భిక్షను అభ్యర్ధించాలి. సంబుద్ధి ఆది - మధ్య - అంతాలలో క్రమంగా రావాలి. ఉభయ సంధ్యల్లో అగ్ని కార్యం చెయ్యాలి. అటుపైన భిక్షాన్నం తెచ్చుకొని గురువు గారికి నివేదించి వారి అనుజ్ఞతో మౌనంగా భుజించాలి. మధువు - స్త్రీ - మాంసం - లవణం - తాంబూలం - దంత ధావనం - ఎంగిలి తినడం - (ఉచ్ఛిష్ట
భోజనం) - పగటి నిద్ర - (దివాస్వాపం) - గొడుగు - పాదుకలు - చందన గంధాది పరిమళద్రవ్యాలు - జలకేళి - ద్యూతం - గీతనృత్యవాద్యాదులు - పరివాదం - ఉపతాపం - విప్రలాపం - అంజనం - పాషండ జన సంయోగం - శూద్ర సంగం - వీటిని పరిహరించాలి.

శ్రీ దత్తాయ గురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

27 Jan, 13:46


#ముకుందమాల #17వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

27 Jan, 02:43


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
నూటనాలుగవ సర్గ.(104)

ఏం జరుగుతూ ఉందో రావణునికి తెలియడం లేదు. ఏదో మైకం కమ్మినట్టయింది. తెలివి వచ్చి చూచేసరికి తాను యుద్ధభూమిలో లేడు. దూరంగా ఉన్నాడు. సారధిని చూచి ఇలా అన్నాడు.“ ఓసారథీ! ఏమిటిది! నేను ఎక్కడున్నాను? రాముడు ఎక్కడ?” అని అడిగాడు. సారథి జరిగింది చెప్పాడు. రావణుని రక్షించడానికి రథమును రణభూమి నుండి పక్కకు మరల్చాను అని అన్నాడు. రావణుని కోపం తారస్థాయికి చేరింది. కళ్లు నిప్పులు కక్కుతూ ఇలా అన్నాడు.
“ఓరి దుర్మార్గుడా! నేను ఏమన్నా సామాన్యుడిని అనుకున్నావా! అసమర్ధుడిని, పౌరుషహీనుడిని, పరాక్రమం లేని వాడిని, భయం కలవాడిని అనుకున్నావా! నేను రావణుడిని! నీ ఇష్టం వచ్చినట్టు
రథం తీసుకురావడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? శత్రువుల
ముందు నాకు ఎంత అవమానం జరిగిందో నీవు ఊహించావా! నన్ను
అడగకుండా, నా అభిప్రాయము తెలుసుకోకుండా రథమును
ఎందుకు మళ్లించావు? నేను ఇన్నాళ్లు ఇన్నేళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కరోజులో నాశనం చేసావు. నన్ను ఒక భీరువుగా, పరాక్రమ
హీనుడిగా, నీచుడిగా చేసావు. నీవు చేసిన పని శత్రువులు చేయదగినది కానీ మిత్రులు చేయదగినది కాదు. నాకూ చూడ నిన్ను నా శత్రువులు ధనము ఇచ్చి వశం చేసుకున్నట్టు కనపడుతూ ఉంది. నీవు నా దగ్గర చాలా కాలం నుండి సారథిగా పని చేస్తుంటే, నా సంగతి నీకు పూర్తిగా తెలిసి ఉంటే, వెంటనే రథమును రాముడి వద్దకు తీసుకొని వెళ్లు. రాముడు యుద్ధభూమి నుండి వెళ్లిపోక ముందే త్వరగా రాముని ఎదుటికి రథమునుపోనివ్వు." అని ఆజ్ఞాపించాడు రావణుడు. రావణుని మాటలకు సారథి భయపడిపోయాడు. రావణుని క్షమాపణ కోరుకున్నాడు. “మహారాజా! నేను ఎవరికీ భయపడలేదు. నన్ను శత్రువులు వశపరచుకోలేదు. నేను శత్రువుల నుండి ఎటువంటి ధనము తీసుకోలేదు. నేనంత మిత్రద్రోహిని కాను. నేను తమరి వద్ద
ఎంతో కాలము నుండి పని చేస్తున్నాను. మీరు నాకు చేసిన
సహాయములను మరువలేను. నేను తమరి మంచి కోరి, తమరి
ప్రాణములను శత్రువుల నుండి రక్షించడానికి ఈ పని చేసాను. నేను
చేసిన పని మీకు ఇష్టము ఉండదని తెలుసు. కాని సారథిగా నా
ధర్మము నేను నెరవేర్చాను. మీరు నన్ను అకారణంగా, ఒక దుర్మార్గుడిని దూషించినట్టు దూషించకండి. నేను యుద్ధరంగమునుండి తమరి రథమును ఎందుకుపక్కకు తీసుకొని వచ్చానో వివరంగా చెబుతాను వినండి. తమరు శత్రువుతో యుద్ధముచేసి బాగా అలసి పోయారు. మీరు యుద్ధమునకు సుముఖంగా లేరని తెలుసుకున్నాను. అప్పుడు శత్రువు విజృంభించడం చూచాను. పైగా తమరి రథమునకు కట్టిన
అశ్వములు కూడా బాగా అలసిపోయి ఉన్నాయి. రథమును వేగంగా
లాగలేకుండా ఉన్నాయి. ఒక్కోసారి అసలు కదలడం లేదు. తరువాత
నాకు దుశ్శకునములు కూడా గోచరించాయి. రాక్షసేంద్రా! మంచి
సారథి రధికుని యొక్క పరిస్థితిని, అలసటను, ఉత్సాహమును
గమనించి రథము నడపాలి. రధికుని ముఖకళవళికలను బట్టి
ఆయన మనసును తెలుసుకొని రథము నడపాలి. సారథి అయిన
వాడు ఒక్క రథికుని మానసిక పరిస్థితులే కాదు. ఎదురుగా ఉన్న
శత్రువు యొక్క బలాబలములను గమనించి కూడా రథము తోలాలి.
తమ సారథి రథము తోలు మార్గమును కూడా నిశితంగా
గమనించాలి. ఎప్పుడు శత్రువుకు దగ్గరగా వెళ్లాలి, ఎప్పుడు శత్రువుకు దూరంగా వెళ్లాలి అనే విషయమును సారథి తెలుసుకొనాలి. యొక్క అలసటను తీర్చి మరలా తమరిని యుద్ధమునకు ఆయత్తము చేయు నిమిత్తము రథమును పక్కకు తీసుకొని వచ్చాను. ఒక తెలివైన సారథి ఆ పరిస్థితులలో ఏమి చెయ్యాలో అదే చేసాను. నేను తమరి మీద భక్తితో గౌరవంతోనే ఈ పని చేసాను కానీ, నా ఇష్టం వచ్చినట్టు చేయలేదు. ఇప్పుడు చెప్పండి. నేను ఏమి చేయాలో. తమరి రథమును తమరి ఇష్టం వచ్చినట్టు నడిపి తమరి ఋణం తీర్చుకుంటాను.” అని
పలికాడు సారథి. రావణుడు కూడా బాగా ఆలోచించాడు. తాను కోపం పట్టలేక అన్నాడే కానీ, సారథి తప్పు ఏమీ లేదని తెలుసుకున్నాడు. “సారథీ! రథమును రాముని ఎదుటికి తీసుకొని వెళ్లు. ఈ రావణుడు శత్రువును చంపకుండా వెనుదిరిగి వెళ్లడు.” అని అన్నాడు. సారథి అమితోత్సాహంతో రథమును రాముని వంకకు పరుగెత్తించాడు. క్షణకాలంలో రావణుని రథము రాముని ఎదుట నిలిచింది.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూటనాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

26 Jan, 14:31


శ్రీదత్త పురాణము || చతుర్ద భాగం
దత్తుడు ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలు|| ఇరవై రఒకటి (21)

ధర్మకీర్తి మహారాజా ! వర్ణాశ్రమాచార యుతమైన సనాతన ధర్మం చెబుతున్నాను తెలుసుకో. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు వర్ణాలువారు వున్నారు. వీరిలో మొదటి ముగ్గురికి ద్విజులు అని పేరు. తల్లి గర్భం నుండి పుట్టడం ఒక జన్మ. ఉపనయనం రెండవ జన్మ. కనుకనే వీరిని ద్విజులు అన్నారు. ఈ నాలుగు వర్ణాలవారూ స్వధర్మం తప్పకుండా జీవితాలు గడపాలి. వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలు పాటించేటట్లుగా చెయ్యడం రాజుకి ప్రధమ కర్తవ్యం. స్వవర్ణ ధర్మాన్ని త్యజిస్తే వీరిని పాషండులు అంటారు. వీరిని కఠినంగా శిక్షించాలి. తనకు నిర్దేశించిన గుహ్యసూత్రాలను, కర్మలను, విప్రుడు తు.చ. తప్పకుండా పాటించాలి. అది కృతకృత్యత పాటించకపోతే పతితుడైనట్లు సర్వధర్మ బహిష్కుృతుడైనట్లు లెక్క చతుర్వర్ణాలవారూ యుగధర్మాలను గమనించాలి. యధోచితంగా వాటికి లోబడి స్వధర్మాలను పరిష్కరించుకోవాలి. అలాగే స్మృతి విరోధం లేనంత వరకూ గ్రామాచారాలను పాటించాలి. త్రికరణ
శుద్ధిగా ధర్మాచరణం చెయ్యాలి. స్వర్గ సంపాదం కాని ధర్మాన్ని, లోకం ఒప్పని ధర్మాన్ని వదిలి వెయ్యాలి. - ధర్మకీర్తి! సముద్ర యానం, కమండలు ధారణ, అన్యకన్యను వివాహం ఆడటం, దేవర న్యాయం చొప్పున వంశం నిలబెట్టుకోవడం (మరిదివల్ల పిల్లల్ని కనడం) మధుపర్క సందర్భంగా పశువధ చెయ్యడం శ్రాద్ధాలలో మాంసం పెట్టడం, వాన ప్రస్తస్వీకారం, స్త్రీ పునర్వివాహం, దీర్ఘకాల బ్రహ్మచర్యం నర - అశ్వమేధాలు చెయ్యడం, మహా ప్రస్థానగమనం, ఇవి ఈ కలియుగంలో పరిహరణీయాలని పెద్దలు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలవారు - వారి వారి దేశీయాచారాలను విధిగా పాటించాలి. లేదంటే పతితుడవుతాడు. సర్వధర్మ బహిష్కృతుడవుతాడు.
చాతుర్వర్ణాలవారికి విడివిడిగా ధర్మాలున్నాయి. వాటిని ఎరుక పరుస్తాను తెలుసుకో, బ్రాహ్మణుడు దాన ధర్మాలలో సాటి బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. జీవన భృతికోసం యోగ్యులకు యాజ్ఞికం స్వీకరించవచ్చు. అధ్యాపనం చెయ్యవచ్చు. స్నానసంధ్యలు నిత్యమూ ఆచరించాలి. వేదాధ్యయనమూ చెయ్యాలి. ఆయుధ జీవికాకూడదు. అగ్ని పరిగ్రహం నిత్యకృత్యం. పరద్రవ్యాన్ని మట్టితో సమంగా చూడాలి. ఎప్పుడూ లోకహితం కోరాలి. మృదువుగా
సంభాషించాలి. ఋతుకాలంలోనే ధర్మపత్నితో సంగమించడం ప్రశస్తం. క్షత్రియుడు కూడా ఇలాగే ఎవ్వరికీ అహితం పలుకకూడదు. దానధర్మాలతో విప్రుల్ని సంతోషపెట్టాలి. వేదాధ్యయనం చెయ్యాలి. యజ్ఞాలతో దేవతల్ని ఆనందపరచాలి. ఆయుధ జీవి కావాలి. ధర్మబద్ధంగా భూమిని పరిపాలించాలి. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసితీరాలి. పశుపాలన వాణిజ్యం కృషి వేదాధ్యయనం - ఇవీ ప్రధానంగా వైశ్యవర్ణ ధర్మాలు - యజ్ఞాలతో దేవతల్ని దానధర్మాలతో విప్రుల్ని సంతృప్తి పరచాలి. శూద్రులు - క్రయవిక్రయాలలో ఆర్జించిన లాభాలతో గానీ శిల్ప విద్యలతో సంపాదించిన ధనంతోగాని దానధర్మాలు యజ్ఞయాగాలు నిర్వహించాలి. ద్విజులకు అన్నింటా సహకరించడం వీరికర్తవ్యం. ఋతుకాలంలో ధర్మపత్నిని కలవడం ప్రశస్తం. లోకహితం కోరడం, మంగళప్రదంగా ప్రియంగా మృదువుగా
మాట్లాడటం. అనాయాసిత్వం (అట్టే శ్రమలేకుండా నిపుణంగా పనులు చెయ్యడం) మహోత్సాహిత్వం నిగర్విత్వం సహనగుణం (తితిక్ష) - ఇవన్నీ అన్ని వర్ణాల వారికీ సాధారణ ధర్మాలు. - తమ వర్ణాశ్రమాలకూ తగినకర్మలను అనుష్టించడం ద్వారా అందరూ ముక్తికి అర్హులవుతారు. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియాచారాన్ని క్షత్రియుడు వైశ్యాచారాన్ని ఆశ్రయించవచ్చు. ఇదీ ఆపద్ధర్మం మాత్రమే. వర్ణాలు లాగానే ఆశ్రమాలు కూడా నాలుగే. అయిదవదిలేదు. బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం - వానప్రస్థం - సన్యాసం. కర్మయోగరతులై నిస్పృహులై శాంతమనస్కులై స్వకర్మ పరినిష్ఠుతులై అన్ని ఆశ్రమాలవారూ పునరావృత్తి రహితమైన
ముక్తిని పొందగలుగుతారు. వీటిలో స్వకర్మను పరిత్యజించి పరకర్మను ఆశ్రయించినవాడు పాషండుడు అనబడతాడు.
అతడే సర్వధర్మ బహిష్కృతుడు.

ఓం శ్రీ దత్తాయ గురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

26 Jan, 10:27


#ముకుందమాల #16వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

26 Jan, 03:37


ఈరోజు (26-1-2025 ) ఉజ్జయినీ మహా కాళేశ్వర స్వామి దర్శనమ్

సనాతన ధర్మం

26 Jan, 02:23


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
నూటమూడవ సర్గ.(103)

అలసట కలిగినా రావణుడు ఊరుకోలేదు. రామునిమీద బాణ వర్షము కురిపిస్తూనే ఉన్నాడు. కోపంతో దహించుకుపోతున్నాడు.
రావణుడు వేసే బాణములను అన్నిటినీ రాముడు తన బాణములతో
అడ్డుకుంటున్నాడు. రావణుడు రాముని వక్షస్థలమునకు గురిపెట్టి
వేలకొలది బాణములను ప్రయోగించాడు. రాముని శరీరము నుండి
రక్తము ధారగా ప్రవహిస్తూ ఉంది. రాముడు కూడా రావణుని
మర్మస్థానములకు గురి చూచి బాణములను ప్రయోగించాడు. ఆ
ప్రకారంగా రాముడు రావణుడు ఒకరి మీద ఒకరు వాడి అయిన
బాణములను ప్రయోగించుకుంటున్నారు. రాముడు రావణుడు ఎదురు ఎదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు రాముడు రావణుని చూచి ఇలా అన్నాడు. “ఓరీ రాక్షసా! నీవూ ఒక మగాడివేనా! నీదీ ఒక
పౌరుషమేనా! భర్త ఇంట లేని సమయమున భార్యను అపహరించి
తేవడం పరాక్రమము అనిపించుకుంటుందా! ఇతరుల భార్యలను
అపహరించి తేవడం శూరత్వమా! రక్షణ లేని స్త్రీలను వీరులు తాకరు. కానీ నీవుదానికి పాల్పడ్డావు. అది నీచులు చేసేపని. కాని అదేదో ఘనకార్యము, శూరత్వము అనుకుంటున్నావు. సిగ్గు లేకుండా ఇంకా యుద్ధానికి వచ్చావా! వీరులు వీరగతిని పొందుతారు. కానీ నీకు నీచమైన మరణం రాసి పెట్టి ఉంది. అనుభవించు. నీవు కుబేరుని సోదరుడవు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసావు. తపస్సులు చేసావు. సాటి వారిలో గొప్పయశస్సును సాధించావు.
కాని ఏం లాభం! ఆ కీర్తి అంతా నీవు చేసిన ఈ ఒక్క పాడు పనితో పటాపంచలయింది. నీవు చేసిన దుర్మార్గానికి తగిన ఫలితం ఇప్పుడే అనుభవిస్తావు. మగవారు ఇంటలేని సమయమున దొంగ వలె ఇంట్లో దూరి, పరుల భార్యను అపహరించడం శూరత్వము అనుకుంటున్నావా! ఆ పని చేయడానికి నీకు సిగ్గువేయడం లేదా!
ఆసమయంలో నేను ఆశ్రమంలో ఉంటే, అప్పుడు నిన్ను నీ సోదరుడు, ఖరుని వద్దకు పంపి ఉండేవాడిని. ఆ రోజు తప్పించుకున్న నీవు ఈ రోజు నా కంట పడ్డావు. నిన్ను వదలను. నా వాడి అయిన బాణములతో నిన్ను యమపురికి పంపుతాను. ఈ రోజు రాత్రికి నీ శిరస్సుతో క్రూరమృగములు విందుచేసుకుంటాయి. నీ శరీరమును గ్రద్దలు పీక్కుతింటాయి.” అని పలుకుతూ రాముడు రావణుని మీద
శరవర్షముకురిపించాడు. రాముడు రావణుని మీద తనకు మనసులో స్ఫురించిన అన్ని అస్త్రములను ప్రయోగిస్తున్నాడు. రాముడు ఇలా అస్త్రములు ప్రయోగిస్తుంటే, వానరులు రాళ్లతోనూ, వృక్షములతోనూ రావణుని మోదుతున్నారు. రావణునికి ఊపిరి ఆడటం లేదు. రాముని మాటలతో సగం చచ్చిపోయాడు. ధనుస్సు సంధించలేకపోయాడు. అతని మనస్సు బాగా వ్యాకులము అయింది. రావణుని పరిస్థితిని చూచాడు సారథి. రథమును మెల్లిగా యుద్ధభూమి నుండి ఆవలకు తీసుకొని వెళ్లాడు. రావణుని రథము యుద్ధభూమిని విడిచి పెట్టి లంకానగరం వైపు వెళ్లిపోయింది.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూటమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

25 Jan, 15:34


ఈరోజు ఉజ్జయిని *మహాకాళేశ్వరుడు*

సనాతన ధర్మం

25 Jan, 15:06


ఈ రోజు శ్రీ గురుడు,గాణుగాపురం లో🌺🙏🌷🌸
Today pallaki utchava murthi darsan at Ganugapur.25.1.2025
आज की उत्चव मूर्ति ,गाणगापुर में।

సనాతన ధర్మం

22 Jan, 15:42


ఈ రోజు శ్రీ గురుడు,గాణుగాపురం లో🌺🙏🌷🌸
Today pallaki utchava murthi darsan at Ganugapur.22.1.2025
आज की उत्चव मूर्ति ,गाणगापुर में।

సనాతన ధర్మం

22 Jan, 13:15


#ముకుందమాల #14వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

22 Jan, 13:15


శ్రీదత్త పురాణము || చతుర్ధ భాగం
భద్రశీల గాధ || ఇరవై లో ఒకటి (20-1)

సనత్కుమారా ! ఈ విషయంలో పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉంది. చెబుతాను ఆలకించు. పూర్వకాలంలో గాలవుడు అనే ముని వున్నాడు. నర్మదాతీరంలో కందమూల ఫలాలూ సమిత్కుశ పుష్పాదులూ సమృద్ధిగా దొరికే ఒక సుందరారణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. శాంతి- దాంతులు కలవాడు. సత్యపరాయణుడు. జితేంద్రియుడై తపస్సు కొనసాగిస్తున్నాడు. ఆ అరణ్య సౌందర్యం పక్షిమృగాలకోలాహలం సిద్ధచారణ గంధర్వ యక్ష విద్యాధరాదుల్ని సహితం ఆకర్షిస్తూ వుండేది. వారు వచ్చి అక్కడ సంచేరించేవారు. ఈ తపోనిధి
గాలవునికి భద్రశీలుడు అనే కుమారుడుండేవాడు. చాలా అందగాడు. పేరుకి తగ్గట్లే శీలసంపన్నుడు జాతి స్మరుడు. నారాయణభక్తి పరాయణుడు. అతడు బాలుడుగా వున్నప్పుడే ఆటలూపాటలు శ్రీ హరిపరంగా సాగించేవాడు మట్టితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని అర్చించడం బాల్యక్రీడగా జరిపేవాడు. అర్చన ముగిసాక సకలజగత్తులకు సకల శుభాలు కల్పించమనీ ప్రార్థిస్తూ స్వామికి నమస్కరించేవాడు. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున ఈ రోజు ఏకాదశి అని ఉపవాస దీక్ష స్వీకరించేవాడు. రాత్రి జాగారం చేసేవాడు. బాల్యం నుండీ ఇలాహరి భక్తి తత్పరుడైన బిడ్డడిని చూసి తల్లి తండ్రులు ఎంతగానో మురిసిపోయేవారు. ఒకనాడు తండ్రిగాలవుడు భద్రశీలుడ్ని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ - నాయనా ! మహాయోగులకు సైతం దుర్లభమైన నీ భక్తి నీ ప్రవర్తనా నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. పేరుకి తగ్గట్లుగా వున్నావు. నిత్యమూ నువ్వు చేసే హరి పూజలూ సర్వభూతహితమూ, ఏకదశీ వ్రతాలూ, నిర్మమంగా శాంతచిత్తంతో చేసే హరి నామ స్మరణలూ, - ఇవన్నీ నీ ఈడు పిల్లల్లో ఉన్నవి, విన్నవి, కన్నవి కావు. నీకసలు ఈ విష్ణుభక్తి ఇంత చిన్నవయస్సులోనే ఎలా ఏర్పడింది ? నా ఆలోచనకు అందడం లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు ! వినినిండుగా సంతోషిస్తాను అన్నాడు. తండ్రీ ! జాత స్మరుణ్ని కనుక క్రిందటి జన్మలో యమధర్మరాజు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వున్నాయి. నువ్వు అడిగావు కనుక అన్నీ వివరంగా చెబుతాను విను. నేను క్రిందటి జన్మలో సోమవంశంలో పుట్టిన మహారాజుని అప్పుడు నా పేరు ధర్మకీర్తి దత్తాత్రేయుడి శిక్షణలో ఆయావేదశాస్త్రాలు తెలుసుకొని ధర్మబద్ధంగా తొమ్మిదివేల
సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాను. కీర్తి గడించాను. ధర్మకీర్తి అనే పేరుని చరితార్థం చేసుకున్నాను. ప్రజలంతా నన్ను దైవంతో సమానంగా చూసేవారు. రాజ్యం అకంటకంగా ధనధాన్యసమృద్ధులతో తులతూగుతోంది. ఆ కీర్తి, ఆ భోగాలూ - రెండూ కలిసి లక్ష్మీ మదం గట్టిగా తలకెక్కింది. పాషండుల సలహాలు వింటూ అధర్మాలు అనేకం చేసాను. పూర్వ సంచితాలైన పుణ్యాలన్నింటినీ పోగొట్టుకొన్నాను. కూడనియుక్తులు చెబుతూ వితండవాదాలు చేస్తూ రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులూ సమస్త ధర్మకార్యాలనూ - నోములూ, వ్రతాలూ, జపాలూ - అన్నింటినీ నిలుపుదల చేసాను. నేను అధర్మ మార్గం పడితే నా ప్రజలు అంతకన్నా ముందుకు వెళ్ళారు. ఎన్నెన్నో ఘోరాలు చేసారు. వారుచేసిన పాపకృత్యాలలో పరిపాలకుడుగా నా భాగం నాకూ దక్కుతూ వచ్చింది. ఇలా రకరకాలుగా పాపం ప్రోగుచేసుకున్నాను.
ఒకనాడు - పదిమంది స్నేహితులతో కలిసి మృగయా వినోదం కొరకు అడవికి వెళ్ళాను. క్రూరమృగాలను వేటాడి అలసిపోయాను. సాయంకాలం అయ్యేసరికి రేవా నదీతీరం చేరుకున్నాను. అలసి గుర్రాన్ని ఒడ్డున నిలిపి హాయిగా నదిలో స్నానం చేసాను. వేటలో పడి ఉదయం నుండీ ఏమీ తినలేదు కనుక నీళ్ళతో కడుపు నింపుకున్నాను. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. నెమ్మదిగా చీకట్లు క్రమ్ముకున్నాయి. సేదతీర్చుకొని జలక్రీడముగించి గట్టుకి
చేరుకున్నాను. అల్లంత దూరాన మనుజలు అలకిడి అయ్యింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. ఎవరో సమీప గ్రామస్థులు రేవానదీతీరంలో గుట్టుగా ఏకాదశీ వ్రతం ఆచరిస్తున్నారు. నేను కూడా వారిలో ఒకడినై కూర్చుండిపోయాను. వారితో పాటు ఆరాత్రంతా జాగారం చేసాను. గుర్రపు స్వారీ, రోజంతా వేట, తిండీతిప్పలు లేకపోవడం జాగరణం - అన్నీ కలసి అలసటలో ప్రాణాలు ఎగిరిపోయాయి.

సశేషం

సనాతన ధర్మం

22 Jan, 04:38


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
తొంభైతొమ్మిదవ సర్గ.(99)

తనతో వచ్చిన విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు మరణించడం గురించి రావణునికి తెలిసింది. తాను రణభూమిలో ఒంటరిగా మిగిలిపోయాడు. అయినా తనమూర్ఖపుపట్టు విడవలేదు. రావణుడు.యుద్ధాన్ని కొనసాగించాడు. సారధిని చూచి ఇలా అన్నాడు. “ఈరోజు నేను రాముడిని లక్ష్మణుడిని సంహరించి, ఈ
యుద్ధములో చనిపోయిన రాక్షస వీరుల ఋణం తీర్చుకుంటాను.
సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, ద్వివిదుడు,
మైందుడు, అంగదుడు, గంధమాధనుడు, హనుమంతుడు, సుషేణుడు, మొదలగు వానర వీరులను ఈరోజు చంపుతాను. నారథమును రాముని మీదికి మళ్లించు" అని పలికాడు.రావణుని రథం రాముడు ఉన్న చోటికి వెళ్లింది. రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన భయంకరమైన తామసాస్త్రమును వానరుల మీదా ప్రయోగించాడు. ఆ అస్త్రము వానరులను మలా మలా మాడ్చివేసింది. ఆ అస్త్రము ధాటికి తట్టుకోలేక వానరులు పారిపో
సాగారు. ఇది చూచిన రాముడు రావణుని ఎదురుగా నిలిచాడు.
రావణుడు తన ఎదురుగా నిలబడి ఉన్న రాముని తేరిపార
చూచాడు. తామర రేకుల వంటి కళ్లు, ఆజానుబాహువులు,
అఖండమైన తేజస్సుతో వెలిగిపోతున్న రాముని చూచాడు రావణుడు.తన మీదికి వస్తున్న రావణుని చూచాడు రాముడు. రాముని పక్కనే నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. రాముడు ధనుష్టంకారము చేసాడు. ఆ ధ్వనిని భరించలేక రాక్షసులు వేల కొద్దీ కిందపడిపోయారు. ఒకపక్క రాముడు మరొక పక్క లక్ష్మణుడు మధ్యలో రావణుడు, సూర్యచంద్రుల మధ్య రాహువు వలె ఉన్నాడు.
ముందుగా లక్ష్మణుడు వాడిఅయిన బాణములను రావణుని మీదికి సంధించాడు. కాని రావణుడు ఆ బాణములను మధ్యలోనే విరిచాడు. రావణుడు లక్ష్మణుడిని వదిలి పెట్టి రాముడితో తలపడ్డాడు. రాముడి మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షము
కురిపించాడు. రాముడు కూడా భల్లబాణములను సంధించి
రావణుడు సంధించిన బాణములను మధ్యలోనే విరిచాడు.
రాముడు, రావణుడు ఒకరి మీద ఒకరు శరవర్షము కురిపిస్తున్నారు. ఇద్దరూ తమ తమ రథముల మీద గుండ్రగా తిరుగుతూ బాణాలు సంధించుకుంటున్నారు. వారు వదులుతున్న బాణములతో ఆకాశం కప్పబడి పోయింది. సూర్యుని వెలుగు ప్రసరించకుండా చీకట్లు కమ్ముకున్నాయి. ఇద్దరూ గొప్ప ధనుర్ధారులే. అస్త్రవిద్యలో ప్రవీణులే. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. రావణుడు రాముని నుదుటిమీద మూడు నారాచ బాణములను నాటాడు. దానికి ప్రతిగా రాముడు రౌద్రాస్త్రమును సంధించి, మంత్రము జపించి ప్రయోగించాడు. కాని ఆ రౌద్రాస్త్రము కూడా రావణుని దివ్యకవచమును భేదించలేకపోయింది. తరువాత రాముడు ఒక అస్త్రమును ప్రయోగించి రావణుని లలాటభాగమును కొట్టాడు. కాని రావణుడు ఆ బాణములను తిప్పి కొట్టాడు. రావణుడు అసురాస్త్రమును ప్రయోగించాడు. రావణుడు సింహము, పులి, నక్క, తోడేలు మొదలగు భయంకరమైన మృగముల ముఖముల మాదిరి ఉన్న బాణములను రాముని మీద ప్రయోగించాడు. సర్పముఖముల మాదిరి బుసలుకొడుతున్న బాణములను ప్రయోగించాడు. గాడిద, వరాహము, కుక్క, కోడి, మకరము, మొదలగు జుగుప్సాకరములైన ముఖముల మాదిరి కనపడుతున్న బాణములను ప్రయోగించాడు.
రావణుడు ప్రయోగించిన అస్త్రములకన్నిటికీ సమాధానంగా రాముడు పావకాస్త్రమును ప్రయోగించాడు. ఆ పావకాస్త్రము
మహిమకు రావణుని అస్త్రములు అన్నీ బూడిదఅయ్యాయి. రాముడు అగ్ని ముఖములు, సూర్యముఖము, చంద్రము, అర్థచంద్రము, ధూమకేతు మొదలగు ఆకారములు మొనలుగా గల బాణములను రావణుని మీద ప్రయోగించాడు. ఆ ప్రకారంగా ఒకరు వేసిన అస్త్రములను ఒకరు భగ్నం చేసుకుంటున్నారు. రావణుని అస్త్రములు భగ్నం అయినపుడు వానరులు, రాముని అస్త్రముల భగ్నం అయినపుడు రాక్షసులు హర్షధ్వానాలు చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొంభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

22 Jan, 04:36


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
నూరవ సర్గ. (100) రామ రావణ యుద్ధం

తను ప్రయోగించిన అస్త్రములను అన్నీ వృధా కావడం చూచిన రావణుడు కోపంతో చెలరేగిపోయాడు. మయుడు నిర్మించిన ఒక గొప్ప అస్త్రమును రావణుడు రాముని మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి శూలములు, గదలు, ముసలములు దూసుకుపోతున్నాయి. కాని రాముడు ఆ అస్త్రమును గాంధర్వాస్త్రముతో ఛేదించాడు. రావణుడికి కోపం నసాళానికి
అంటింది. వెంటనే సౌర అస్త్రమును రాముని మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి సూర్యుని మాదిరి వెలుగుతున్న చక్రములు
నలువైపులకు దూసుకుపోతున్నాయి. రాముడు ఆ అస్త్రమును తన
బాణములతో ఖండించాడు. ఇలా కాదని రావణుడు తన బాణములతో రాముని మర్మస్థానములయందు కొట్టసాగాడు. ఆ బాణములను మధ్యలోనే విరిచి రాముడు కూడా రావణుని మర్మస్థానములలో కొట్టాడు. ఇంతలో లక్షణుడు ఏడు బాణములతో రావణుని ధ్వజమును విరిచాడు. మరొక బాణంతో రావణుని విల్లు విరగ్గొట్టాడు. విభీషణుడు తన గదతో రావణుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. తన తమ్ముడే ఇలా చెయ్యడం చూచి ఓర్వలేకపోయాడు రావణుడు. రథము నుండి కిందికి దుమికాడు. వజ్రాయుధముతో సమానమైనశక్తి గల శక్తి అనే అస్త్రమును విభీషణుని మీద ప్రయోగించాడు. కాని లక్ష్మణుడు ఆ అస్త్రము విభీషణుని చేరకముందే మధ్యలోనే తుంచాడు. తరువాత రావణుడు యముడు కూడా భయపడే ఒక మహాశక్తి బాణమును తీసుకున్నాడు. ఆ శక్తి బాణము రావణుని చేతిలోనే అగ్ని కణాలు విరజిమ్ముతూఉంది. రావణుడు ఆ అస్త్రమును విభీషణుని మీదికి విడిచి పెట్టకముందే లక్ష్మణుడు రావణుని చేతిని తన బాణములతో కొట్టాడు. రావణుడు ఆ శక్తిని సంధించలేకపోయాడు. ఇంక విభీషణుని చంపే కార్యక్రమమును విరమించాడు రావణుడు. రావణుడు లక్ష్మణుని మీద పడ్డాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! నీవు ఈ మహాశక్తినుండి విభీషణుని రక్షించావు. కాని ఈ శక్తిని నీ మీదికి వదులుతున్నాను. ఈ శక్తి నిన్ను చంపి నన్ను చేరుతుంది. చేతనైతే నిన్ను నీవు రక్షించుకో!' అంటూ ఆ మహాశక్తిని
లక్ష్మణుని మీదికి ప్రయోగించాడు. వజ్రాయుధముతో సమానమైన ఆ
శక్తి అస్త్రము లక్ష్మణుని వైపుకు మహావేగంతో దూసుకువస్తూ ఉంది. ఆ శక్తి సరాసరి వచ్చి లక్ష్మణుని వక్షస్థలములో దిగబడింది. లక్ష్మణుడు
నేలమీద పడిపోయాడు. మూర్ఛపోయాడు. అది చూచిన రామునికి కోపము మిన్నుముట్టింది. ఒక పక్క లక్ష్మణుని పరిస్థితికి శోకము, మరొక పక్క రావణుని మీద కోపము ఒకే సారి వచ్చాయి. రాముడు తమాయించుకున్నాడు. “ఇది దు:ఖించడానికి సమయం కాదు, ముందు రావణుని ఆపాలి.” అనుకున్నాడు రాముడు. లక్ష్మణుని గుండెల్లోకి దిగిన శక్తి బాణమును బయటకు లాగాలి అని అనుకున్నాడు రాముడు. అది వారి వల్ల కాలేదు. అప్పటికే వానర యోధుల శరీరముల నిండా బాణములు దిగబడి ఉన్నాయి. రావణుడు ప్రయోగించిన శక్తి లక్ష్మణుని గుండెల్లోకి దూసుకొనిపోయి కింద నేలలో కూడా దిగబడింది. అదిచూచి రాముడికి కోపం వచ్చింది. రెండు చేతులతో బలంగా లాగాడు. లక్ష్మణుని శరీరంలో నుండి శక్తి బాణం ఊడి వచ్చింది. దానిని రెండు ముక్కలుగా విరిచాడు రాముడు. రాముడు లక్ష్మణుని శరీరంలో నుండి శక్తి బాణమును లాగుతూ ఉండగా, ఇదే సమయమని రావణుడు రాముని మర్మ స్థానముల మీద శరములను ప్రయోగించాడు. కాని రాముడు వాటిని లెక్కచేయలేదు. సుగ్రీవుని, హనుమంతుని చూచి ఇలా అన్నాడు. “మీరు లక్ష్మణుని చుట్టు నిలిచి ఆయనను రక్షిస్తూ ఉండండి. నేను రావణునితో యుద్ధం చేస్తాను. ఇంక కొద్దిసేపట్లో ఈ భూమి మీద రాముడో రావణుడో ఎవరో ఒకరే ఉంటారు. ఇది సత్యము. నా గురించి మీకు తెలుసు. రాజ్యం పోగొట్టుకున్నాను. అడవులలో తిరుగుతున్నాను. భార్యను పోగొట్టుకున్నాను. ఇంతకంటే దుఃఖము ఇంకేమి ఉంటుంది. ఇప్పుడు రావణుని సంహరించి ఆ దుఃఖమును పోగొట్టుకుంటాను. ఓ సుగ్రీవా! ఎవరి కోసరం నేను నీతో స్నేహం చేసానో, ఎవరి కోసరం నూరుయోజనముల సముద్రం మీద వారధి కట్టానో, ఎవరి కోసరం వానరసేనలతో సహా వారధిని దాటి లంకను
ముట్టడించానో, ఆ రావణుడు ఇప్పుడు నా కంట బడ్డాడు. వీడిని నేను విడువను. వీడి జీవితం ఈరోజుతో సమాప్తం. మీరు అనవసరంగా చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. దూరాన నిలబడి
రామరావణయుద్ధం చూడండి. ఈ రామరావణ యుద్ధమును మీరే
కాదు దేవ,గంధర్వ,ఋషిగణములు కూడా చూస్తున్నాయి. ఈభూమి
యుద్ధం ఉన్నంత వరకూ రామరావణ యుద్ధము గురించి జనం
చెప్పుకుంటారు. " అని అన్నాడు రాముడు. తరువాత వాడి అయిన బాణములను తన ధనుస్సుకు సంధించి రావణుని మీదికి వదిలాడు. రావణుడు కూడా నారాచ బాణములను, ముసలములను, రాముని మీద వర్షం లాగా కురిపించాడు. రాముడు రావణుడు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములు ఒకదానితో ఒకటి ఢీకొని పెద్ద శబ్దం కలుగుతూ ఉంది. రాముడు, రావణుడు, ప్రయోగించిన బాణములు ఆకాశమును కప్పేసాయి.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నూరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

21 Jan, 15:21


దత్త పురాణము నుండి ఏకాదశి ఉపవాస ఫలము

సనాతన ధర్మం

21 Jan, 14:22


#ముకుందమాల #13వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

21 Jan, 13:01


హరే కృష్ణ , కృష్ణం వందేజగద్గురుమ్ 🙏🏻🙏🏻

సనాతన ధర్మం

20 Jan, 15:44


ఇట్లాంటి నియమాలు పాటించి నిగ్రహం కలవాడై సర్వహితం కోరుతూ ఏకాదశీవ్రతం పరిసమాప్తం చేస్తే పరమపదం కైవసమవుతుంది. సారాంశంగా ఒక్కమాట - గంగకు సాటివచ్చే తీర్ధం లేదు. తల్లికి సాటివచ్చే గురువులేడు, శ్రీహరికి సాటివచ్చే దేవదేవుడు లేడు,
(ఏకాదశీ) ఉపవాసానికి సాటివచ్చే తపస్సులేదు. వేద సమమైన శాస్త్రం, శాంతిసమమైన సుఖం, సత్యసమయమైన
వెలుగు, ఉపవాస సమమైన తపస్సులేవు. తల్లికి సరితూగే ఓర్పరి, కీర్తికి సరితూగేధనం, జ్ఞానానికి సరితూగేభావం, ఉపవాసానికి సరితూగే తపస్సు లేవంటే లేవు.

నాస్తి గంగాసమం తీర్థం నాస్తి మాతృసమో గురుః ।
నాస్తి విష్ణుసమో దేవః తపో నానశనాత్పరమ్ ||
నాస్తి వేదసమం శాస్త్రం నాస్తి శాంతిసమం దుఖం |
నాస్తి సత్యసమం జ్యోతి: తపోనానశనాత్పరమ్ ||
నాస్తి క్షమాసమా మాతా నాస్తికీర్తి సమం ధనమ్ |
నాస్తి జ్ఞానసమో భావః తపోనానశనాత్పరమ్

ఓం శ్రీ దత్తాయ గురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

20 Jan, 15:44


శ్రీదత్త పురాణము || చతుర్ధ భాగం
ఏకాదశీ వ్రతం || పంతొనిమిది (19)

సనత్కుమారా ! సర్వపాప వినాశకంగా సర్వపుణ్యదాయకంగా ముల్లోకాలలోనూ ప్రసిద్ధికెక్కిన మరొక వ్రతం మీకు చెబుతున్నాను. దీన్ని చాతుర్వర్ణాల వారూ స్త్రీ పురుషులూ అందరూ చేసుకోవచ్చును. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం. భక్తితో చేస్తే ముక్తి లభించి తీరుతుంది. దీనిపేరు ఏకాదశీ వ్రతం, కృష్ణ పక్షంలో గానీ శుక్ల పక్షంలోగానీ ఏకాదశినాడు ఉపవాసం ఉండాలి, భుజించడం మహాపాపం. నరక హేతువు. ఉపవాస ఫలం పూర్తిగా దక్కాలి అంటే దశమినాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలూ, ద్వాదశినాటి రాత్రి - మొత్తం నాలుగు భోజనాలు మానెయ్యాలి. ఏకాదశినాడు భోజనం చెయ్యడమంటే సర్వపాపాలనూ కావాలని ఏరికోరి
భుజించడమన్నమాట. అంచేత ఏకాదశినాడు రెండుపూటలా నిరాహారులై ఉండాలి. బ్రహ్మహత్యమహాపాతకంతో సాటివచ్చే సర్వపాపాలూ ఏకాదశినాడు అన్నాన్ని ఆశ్రయిస్తాయి. అంచేత ఆరోజు భుజించినవాడికి అవి సంక్రమిస్తాయి. ఇక అతడికి నిష్కృతి ఎలా చెప్పు ? పాపాలు చేసిన వారుగానీ చెయ్యని వారు గానీ ఏకాదశినాడు నిరాహారులుగా ఉంటే పరమపదం చేరుకుంటారు.
ఈ తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతపాత్రం కనక భవబంధాలను తెగతెంచుకోవాలనుకునేవారు తప్పకుండా ఏకాదశీవ్రతం ఆచరించాలి. దశమి రోజున తెల్లవారు జామునే లేచి దంతధావనాదులు ముగించి తలారా స్నానం చేసి నియతేంద్రియుడై భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ రాత్రికి నారాయణ సన్నిధిలోనే నిద్రించాలి. ఏకాదశి నాటి ఉదయమూ అల్లాగే లేచి స్నానాదికం ముగించుకుని జనార్ధనుణ్ని గంధపుష్పాదులతో షోడశోపచార విధి పూర్వకంగా అర్చించాలి అటుపైని ఇలా చెప్పుకోవాలి పుండరీకాక్షా! ఏకాదశినాడు ఉపవాసం ఉండి మర్నాడు
భోజనం చేస్తాను, అచ్యుతాశరణు, శరణు. - ఈ మంత్రం పఠించి దేవదేవుడైన చక్రిపట్ల భక్తిభావంతో సంతుష్టాత్ముడై ఉపవాసం స్వామివారికి సమర్పించాలి. ఆ రాత్రి స్వామి సన్నిధిలోనే జాగరణం ఉండాలి. గీత వాద్యనృత్య పురాణ శ్రవణాదులతో కాలక్షేపం
ధూపం - దీపం - నైవేద్యం - పుష్ప , గీతం - వాద్యం - నృత్యం - పురాణపఠనం - వేదపఠనం గంధానులేపనం - ఫలం - అర్ఘ్యం - ప్రదక్షిణం - సాష్టాంగ నమస్కారం - ఆర్తికం - వీటిని భక్తిశ్రద్ధలతో
చెయ్యాలి ఇంద్రియ నిగ్రహంతో త్రికరణశుద్ధిగా జాగరూకుడై ఆ రాత్రి జాముజాముకీ ఆచరించాలి. ఉపవాసం ఎంతముఖ్యమో జాగారం
అంత ముఖ్యం. విష్ణుమూర్తికి షడ్వింశతి గుణాధికంగా సంతృప్తి కలిగిస్తుంది. ఈ రెండింటినీ భక్తితో చేసిన వారికి మరి పునర్జన్మలేదు. ఈ వ్రతంలో విత్తశాఠ్యం ఎంతమాత్రమూ పనికిరాదు. ధనవంతుడు లోభించి క్లుప్తంగా ఈ వ్రతం చేస్తే ఆ దురాత్ముడు విష్ణుమూర్తిని మోసగించినట్టు. దానికి తగిన శాస్తి జరుగుతుంది. కలిభుజంగ దుష్టులై మాయాపాశవిమోహితులై కొందరు పాపాత్ములు ఏకాదశినాడు నిద్రిస్తారు. వాళ్ళు ఏమి నష్టపోతున్నారో ఎంత
నష్టపోతున్నారో తేల్చిచెప్పడం కష్టం. జీవితం అధ్రువం కాబట్టి ఒకసారి జారవిడుచుకున్న ఏకాదశిని కూడదీసుకోవడం
అసంభవం. పౌరాణికుడు దొరక్కపోతే గీతానృత్యాదులతో జాగారం చెయ్యాలి. దొరికితే పురాణ పఠనం చెయ్యడమే అత్యుత్తమం. ఇలా జాగరణం చేసిన హరిభక్తులు పితృదేవతలు వైకుంఠవాసులవుతారు. జన్మాంతంలో తామూ వైకుంఠధామం చేరుకుంటారు. షష్ఠి సహస్రవర్షాలు ఆశ్వేతద్వీపంలోనే నివసిస్తారు. తాను కాళ్ళతో రేపిన దుమ్ములో ఎన్ని కణాలుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఏకాదశీ జాగరికి వైకుంఠవాసమనీ కనకనే ఆ రోజున ఎంతదూరమైనా నడిచి మాధవాలయానికి వెళ్ళాలనీ పెద్దలు చెబుతారు. ఏకాదశీ జాగరణ తరువాత ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తికి పుష్పమంటపం నిర్మించాలి. దీనికి సమర్పించే ఒక్కొక్క పువ్వూ ఒక్కొక్క అశ్వమేధ ఫలం ఇస్తుంది. ఇలాంటి విశ్వాసాలతో విశుద్ధ భావాలతో ఏకాదశి ఉపవాసం - జాగరణం చేస్తే నిమిష నిమిషానికీ చేకూరే పుణ్యం తీర్ధకోటికి సాటి వస్తుంది. ద్వాదశినాటి ఉదయం స్నానసంధ్యాదులు ముగించి షోడశోపచారాలతో శ్రీహరిని అర్చించాలి. ఏకాదశినాడు స్వామికి పంచామృతస్నానం, ద్వాదశినాడు క్షీరాభిషేకం జరపాలి. ఈ రెండూ చేసిన భక్తుడు హరి సారూప్యం పొందుతాడు. కేశవా! అజ్ఞాన తిమిరాంధుణ్ని నేను ఈ
వ్రతంలో నువ్వు ప్రసన్నుడవై సుముఖడవై జ్ఞాన దృష్టిని ప్రసాదించు అని ప్రార్ధిస్తూ నారాయణుడికి సాగిలిమ్రొక్కాలి. చక్రికి ఇలా విజ్ఞాపన చేసి ద్వాదశినాటి మధ్యాహ్నం బ్రాహ్మణ సంతర్పణ జరపాలి. భూరిదక్షిణలతో తాంబూల నూతన వస్త్రప్రదానాలతో సంతృప్తి పరచాలి. అటుపైని తాను తనకు నిత్య విధులైన పంచయజ్ఞాలు ముగించి బంధుమిత్రులతో కలిసి మౌనంగా నారాయణ పరాయణుడై భుజించాలి. ఇలా చేసిన హరి భక్తుడికి ఏకాదశీ వ్రత ఫలంగా పునరావృత్తి రహితమైన విష్ణులోక నివాసం లభించి తీరుతుంది.
ఈ వ్రత దీక్షతో ఉన్నంతసేపూ - వృషులులతో వేదనిందకులతో వృషలీపతులతో అయాజ్యయాజకులతో కుండాశులతో (అక్రమసంతానం) గోళకులతో (విధవాసంతానం) దేవలకాశులతో (స్థావర పూజలతో జీవించేవాళ్ళు) భిషక్కులతో కావ్యకర్తలతో దేవద్విజ విరోధులతో పరాన్న లోలుపులతో పరస్త్రీ నిరతులతో మాట్లాడకూడదు. మర్యాదకోసం మాటమాత్రంగానైనా పలకరించకూడదు. (వాజ్ఞ్మాత్రేణాపి వార్చయేత్).

సనాతన ధర్మం

20 Jan, 15:28


#ముకుందమాల #12వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

20 Jan, 15:18


నవ నారసింహ క్షేత్రములు

సనాతన ధర్మం

20 Jan, 02:36


శ్రీమద్రామాయణము|| యుద్ధకాండము
తొంబది ఎనిమిదవ సర్గ. (98)

మహోదరుడు మరణించడం చూచాడు మహాపార్శ్వుడు. కోపంతో మండి పోయాడు. వానర సైన్యాన్ని అల్లకల్లోలం చేసాడు. వృక్షముల నుండి పండ్లను రాలగొట్టినట్టు వానరుల శరీరముల నుండి వారి శిరస్సులను తన బాణములతో రాలగొడుతున్నాడు మహాపార్శ్వుడు కొందరి చేతులను, కొందరి కాళ్లను విరగగొడుతున్నాడు. మహాపార్శ్వుడి దెబ్బకు చాలా మంది వానరులు స్పృహ తప్పిపడిపోయారు. ఇంతలో అంగదుడు ఒక పరిఘను తీసుకొని
మహాపార్శు ్వడినికొట్టాడు. ఆ దెబ్బకు మహా పార్శ్వుడు
మూర్ఛపోయాడు. రథం నుండి కిందపడ్డాడు. వెంటనే జాంబవంతుడు ఎగిరి అతడి రథం ముందు పడ్డాడు. ఒక పెద్ద బండ శిలతో మహాపార్శ్వుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. రథాన్ని విరుగగొట్టాడు. ఇంతలో మహాపార్శ్వుడు మూర్ఛనుండి తేరుకున్నాడు. మరలా అంగదుని మీద బాణ ప్రయోగం చేసాడు. జాంబవంతుడి మీద మూడు బాణములు, గవాక్షుడి మీద లెక్కలేనన్ని బాణములు ప్రయోగించాడు. ఇంతలో అంగదుడు ఒక పరిఘను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఇనుప పరిఘను రెండు చేతులతో గిరా గిరా తిప్పి మహాపార్శ్వుని మీదికి బలంగా విసిరాడు.
ఆ పరిఘ మహాపార్శ్వునికి తగిలి అతని ధనుస్సును విరిచింది. కిరీటాన్ని పడగొట్టింది. వెంటనే అంగదుడు అతని మీదికి దూకి అరి చేతితో మహాపార్శ్వుని కణత మీద బలంగా మోదాడు. ఆ దెబ్బను
తప్పించుకున్న మహాపార్శ్వుడు ఒక గండ్రగొడ్డలిని తీసుకొని అంగదుని మీదికి విసిరాడు. అంగదుడు ఆ వేటును తప్పించుకున్నాడు. పిడికిలి బిగించాడు. మహాపార్శ్వుని గుండెల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడి గుండెలు పగిలిపోయాయి. వాడు కిందపడి గిలా గిలా కొట్టుకొని మరణించాడు.
మహాపార్శ్వుడి మరణం చూచిన వానరులు పెద్దగా కేరింతలు కొట్టారు. హర్షధ్వానాలు చేసారు. అంగదుని పొగడ్తలతో
ముంచెత్తారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొంభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

19 Jan, 08:06


శ్రీమద్రామాయణము|| యుద్ధకాండము
తొంబది ఏడవ సర్గ.(97) సనాతన ధర్మం

మరొక చోట యుద్ధముచేస్తున్న రావణునికి విరూపాక్షుని మరణ వార్త తెలిసింది. రావణుడుకోపంతో మండిపడ్డాడు. పక్కనేఉన్న మహోదరుని చూచి ఇలా అన్నాడు. “మహోదరా! నా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. నీవే ఈ శత్రు సైన్యమును చంపాలి. ఈ రోజు నీవు ప్రాణాల మీద ఆశవదిలి యుద్ధం చెయ్యి. నీ చక్రవర్తి ఋణం
తీర్చుకో." అని అన్నాడు. రావణుని మాటలకు మహోదరుడు కోపంతో రెచ్చిపోయాడు. “రాక్షసేంద్రా! ఈ రోజు నా పరాక్రమం అంతా చూపించి వానరసేనలను తుదముట్టిస్తాను.” అంటూ తన సేనలతో వానరసేనలోకి చొచ్చుకొని పోయాడు. వానరులను తన బాణములకు ఆహుతి చేస్తున్నాడు. వానరులు కూడా విరూపాక్షుని మరణంతో రెచ్చిపోయారు. చేతికి అందిన వృక్షములను, బండరాళ్లను తీసుకొని రాక్షసులను మోదుతున్నారు. మహోదరుడు కూడా తన వాడి అయిన బాణములతో వానరులను చంపుతున్నాడు. మహోదరుని ధాటికి తట్టుకోలేక వానర సేనలు సుగ్రీవుని వద్దకు పరుగెత్తారు. విరూపాక్షుని చంపి సేదతీరుతున్న సుగ్రీవుడు మహోదరుని విజృంభణకు వానరులు బెదిరి పోవడం చూచి సహించలేకపోయాడు. మహోదరుని మీదికి దూకాడు. పర్వతంతో సమానమైన రాతిని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు ఆ రాయిని తన బాణములతో నుగ్గు నుగ్గు చేసాడు. సుగ్రీవుడు ఒక పెద్ద సాలవృక్షమును తీసుకొని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు ఆ వృక్షమునుకూడా ఖండించాడు. తరువాత వాడి
అయిన బాణములతో సుగ్రీవుని శరీరం అంతా చీరుకుపోయేట్టు
కొట్టాడు మహోదరుడు. అప్పుడు సుగ్రీవునికి కిందపడి ఉన్న పరిఘ ఒకటి కనిపించింది. సుగ్రీవుడు ఆపరిఘను తీసుకొని ఆ పరిఘతో
మహెూదరుని రథమునకు కట్టిన గుర్రములనుచంపాడు. వెంటనే
మహోదరుడు రథమునుండి దూకి గదను చేతిలోకి తీసుకున్నాడు.
సుగ్రీవుడు పరిఘతోనూ, మహోదరుడు గదతోనూ యుద్ధము
చేస్తున్నారు. మహోదరుడు తన గదను సుగ్రీవుని మీదికి విసిరాడు.
సుగ్రీవుడు ఆ గదను తన చేతిలో ఉన్న పరిఘతో కొట్టాడు.
మహోదరుని గదాఘాతమునకు పరిఘ విరిగిపోయింది. తరువాత
సుగ్రీవుడు ఒక ముసలమును తీసుకొన్నాడు. దానిని మహోదరుని
మీదికి విసిరాడు. మహెూదరుడు మరొక గదను సుగ్రీవుని మీదికి
విసిరాడు. రెండూ ఒకదానితో ఒకటి కొట్టుకొని కిందపడ్డాయి. ఇప్పుడు ఇద్దరి చేతులలోనూ ఆయుధములు లేవు. ఇద్దరూ నేల మీద నిలబడి ముష్టియుద్ధము చేస్తున్నారు. కింద పడుతున్నారు పైకి లేస్తున్నారు. గుద్దుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. ఇంతలో మహెూదరుడు అక్కడే పడి ఉన్న కత్తిని డాలును చేతిలోకి తీసుకున్నాడు. యుద్ధరంగంలో ఎన్నో కత్తులు డాలులు పడి ఉన్నాయి. సుగ్రీవుడు కూడా ఒక కత్తి డాలు తీసుకున్నాడు. ఇద్దరూ కత్తియుద్ధం చేయడం మొదలెట్టారు. మహెూదరుడు తన కత్తిని సుగ్రీవుని డాలు మీదికి
విసిరాడు. అది సుగ్రీవుని చేతిలోని డాలులోకి దిగబడింది.
మహెూదరుడు ఆ కత్తిని లాగుతున్నాడు. అదే అదునుగా సుగ్రీవుడు
తన చేతిలోని ఖడ్గముతో మహోదరుని తలను ఖండించాడు. మహోదరుని శిరస్సు నేలమీద దొర్లుతూ ఉంది. మహోదరుని మరణం చూచిన రాక్షససేనలు రావణుని వద్దకు పారిపోయారు. వానరులు మహోదరుని మరణం చూచి జయజయ ధ్వానాలుచేస్తున్నారు.
వానరవీరులు అందరూ మహెూదరుని చంపిన సుగ్రీవునిపొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొంబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

18 Jan, 16:44


అన్నమయ్య కీర్తన, ఫాల నేత్రానల, అర్థంతో

సనాతన ధర్మం

18 Jan, 14:18


శ్రీమద్రామాయణము|| యుద్ధకాండము
తొంభై ఆరవ సర్గ.(96) సనాతన ధర్మం

రావణుని ధాటికి వానరులు నిలువలేక పోతున్నారు. వానరుల మృతశరీరములతో యుద్ధభూమి అంతా కప్పబడి పోయింది.
రావణుని బాణములకు వానరులు అగ్నిలో పడ్డ పురుగుల మాదిరి
మాడిపోతున్నారు. కొంత మంది పారిపోతున్నారు. మరి కొందరు
రాముని వద్దకు సుగ్రీవుని వద్దకు పారిపోయారు.వానరులు అందరూ రాముడు ఉన్న వైపుకు పారిపోవడం చూచిన రావణుడు తన రథము రాముడు ఉన్న వైపుకు పోనిచ్చాడు. దూరంనుండి ఇదిచూచాడు సుగ్రీవుడు. సుషేణుని పిలిచి తన బదులు అక్కడ యుద్ధం చేయమని చెప్పి తాను రావణుడు ఉన్న వైపుకు వెళ్లాడు. సుగ్రీవుడు రావణుని వైపుకు వెళ్లడం చూచిన వానరులు తలా ఒక వృక్షమును, పర్వతశిఖరములు పట్టుకొని సుగ్రీవుని వెంట బయలుదేరారు.
సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ అడ్డం వచ్చిన రాక్షసులను చంపుతూ రావణుని వంక దూసుకుపోతున్నాడు. వడగళ్ల వాన కురిసినట్టు రాక్షసుల మీద బండరాళ్లను వర్షంలా విసురుతున్నాడు. సుగ్రీవుని ధాటికి రాక్షసులు తలలు తెగి, కాళ్లు చేతులు విరిగి నేలకూలుతున్నారు. ఇది చూచిన విరూపాక్షుడు తన రథము దిగి ఒక
పెద్ద ఏనుగు ఎక్కాడు. తన ఏనుగును వానర సేనల మీదికి
పోనిచ్చాడు. సుగ్రీవుని మీద వాడిఅయిన బాణములను ప్రయోగించాడు. పారిపోతున్న రాక్షసులకు ధైర్యం కలిగించాడు.
విరూపాక్షుడు ప్రయోగించిన బాణములను తిప్పికొట్టిన సుగ్రీవుడు విరూపాక్షుని చంపాలని నిశ్చయించుకున్నాడు. సుగ్రీవుడు
ఒక పెద్ద చెట్టును చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క ఉదుటునపైకి ఎగిరి ఆ చెట్టుతో విరూపాక్షుడు ఎక్కిన ఏనుగు కుంభస్థలము మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు తూలి కిందపడి భీకరంగా అరిచింది. గిలా గిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. విరూపాక్షుడు ఏనుగు మీదినుండి కిందికి దిగాడు. ఖడ్గము, డాలు తీసుకున్నాడు. పెద్దగా అరుస్తూ సుగ్రీవుని మీదికి దూకాడు. వాడి దూకుడుచూసిన సుగ్రీవుడు ఒక పెద్ద బండరాయి తీసుకొని వాడి తల మీద మోదాడు. విరూపాక్షుడు పక్కకు తొలగి ఆ దెబ్బ తప్పించుకున్నాడు. తిరిగి విరూపాక్షుడు సుగ్రీవుని గుండెల మీద పిడికిలితోకొట్టాడు. వెంటనే సుగ్రీవుడు విరూపాక్షుని ముఖం మీద అరిచేతితో చరిచాడు. ఆ దెబ్బకు విరూపాక్షుని ముక్కుల నుండి చెవుల నుండి రక్తం కారింది. కిందపడిపోయాడు. రక్తం కక్కుకుంటున్నాడు. కాళ్లు చేతులుకొట్టుకుంటున్నాడు. కాసేపటికి ప్రాణాలు విడిచాడు. ఆ విధంగా విరూపాక్షుడు సుగ్రీవుని చేతిలో మరణించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొంబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

17 Jan, 14:14


శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది.రాజధానిలో వీధివీధికీ ఇంటింటికీ ఈ శుభవార్త పరిమళంలా వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనంత తాను రూపుగట్టింది. అది రాజ్యమంతటా గుబాళించింది. తండ్రీ ! కుంజలా ! వేన తపస్వికి ప్రత్యక్షమై జనార్థనుడు చెప్పిన దత్తమహిమ ఇది. నహుషవృత్తాంతమిది. ఇది చెప్పి గోవిందుడు అదృశ్యుడయ్యాడు. ఈ రోజు నేను కన్నదీ విన్నదీ వింత ఇది - అని ముగించాడు పక్షియువకుడు కపింజలుడు.సూతమహర్షీ ! మహాప్రాజ్ఞా! మా జన్మలు చరితార్థమయ్యాయి. మా స్వాధ్యాయ తపోయజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రమూ మధురాతిమధురమూ అయిన దత్తకథామృతాన్ని శృతిపుటాలతో ఆస్వాదించగలిగాము.
జన్మజరామృత్యువేదనలను మరచిపోగలము. విన్నకొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇక చాలు అనిపించడంలేదు. అంచేత
ఓ మహాబుద్ధీ! ఆయా సందర్భాలలో దత్తాత్రేయుడు ఉపదేశించిన ధర్మాలనూ వ్రతదాన విధులనూ పాపప్రాయశ్చిత్తాలకూ కాలనిర్ణయాలనూ శ్రాద్ధాదిక కర్మవిధానాలనూ గంగామాహాత్మ్యాదులనూ మాకు వినిపించి సంతృప్తి పరచవలసిందిగా కోరుతున్నాం. శౌనకాది మునులారా ! మీరు అడిగినట్టే దీపకుడు సైతం తన గురువు గారిని అడిగాడు. వేదధర్ముడు స్వయంగా అతడికి బోధించిన ఈ అంశాలను మీరు ఆలకించండి. వత్సా ! దీపకా ! దత్తాత్రేయుడు ప్రబోధించిన ధర్మాలను
సనత్కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు. వాటిని నీకు నేను చెబుతున్నాను. శ్రద్ధగా విని గ్రహించు. విష్ణుభక్తి పరాయణుడైన నారదుడు మేరుశృంగంమీద సనత్కుమారాదులకు అనేక వ్రతాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు.

శ్రీ దత్తాయ గురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

17 Jan, 14:14


శ్రీదత్త పురాణము ||చతుర్ధ భాగం
ఇందుమతీ కృతదత్తస్తవం || పద్దెనిమిడిలో రెండు (18-2)

యుద్ధాహ్వాన సూచకంగా శంఖం పూరించాడు. ఆ ధ్వనికి మహోదరనగరం కంపించింది. హుండుడు కలవర పడ్డాడు. ఎవడో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు ఆయు పుత్రుడు, వశిష్ఠుల శిష్యుడు నహుషుడట. యుద్ధం కావాలిట, నీకు మరణం తప్పదట - తిరిగివచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుండుడు ఉలిక్కిపడ్డాడు. ఆయు పుత్రుణ్ని నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే
వండించుకుని తినేశాను గదా ! మరి వీడెక్కడివాడు? అనుకుంటూనే భార్యను మేకలను సూదకుణ్నీ పిలిచి గద్దించి ఆరాతీశాడు. సూదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడు దగ్గర సకల విద్యలూ నేర్చి ఈ ఆయుపుత్రుడు నామీదకి వచ్చాడన్నమాట. హుండుడికి అర్థం అయ్యింది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించనప్పుడు అన్నీ అనుకూలించనట్టే ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే జరగవలసిందేదో
జరుగుతుంది. అని ఒక నిర్ణయానికి వచ్చి మొండిధైర్యంతో ఆ హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ని ఎదిరించాడు. వశిష్ఠుడు నేర్పిన ధనుర్విద్య, ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శాస్త్రాలు, సుదర్శన చక్రంలా పయనించగలిగిన దివ్యరథం - వీటితో నహుషుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికెలో మట్టుపెట్టాడు. హుండాసురుడితో తలబడ్డాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్చాదితుడైన బాలభానుడిలా కనిపించాడు. దేవతలూ ఋషులూ విషన్న వదనులయ్యారు. నహుషుడొక్కసారి గురుదేవుల్ని తలుచుకున్నాడు. విశిష్టాస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్ళి హుండాసురుని రెండు బాహువులను తన్నుకుపోయాయి. వాడికి క్రోథంతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులుకడుతున్నా లక్ష్యపెట్టక నహుషుణ్ని కబళించాలని విరుచుకుపడ్డాడు. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణ మాలస్యం చెయ్యకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రీశక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా విద్యుజ్ఞలన సన్నిభంగా వెళ్ళి వాడి గుండెకు తగిలింది. ఆ దెబ్బకు కొండ గుహలు మారుమోగేట్టు భీషణంగా మూలిగి మెలికలు తిరుగుతూ హుండుడు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. హతశేషులైన దానవులు అడవులకూ, కొండలకూ పలాయనం చిత్తగించారు. దేవతలూ ఋషులూ మునులూ హర్షధ్వానాలు చేశారు. దేవదుందుభులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. అప్సరాంగనలు నాట్యాలు చేశారు. గంధర్వ కిన్నరాదులు బృందగానాలు చేశారు. అశోక సుందరిని వెంటబెట్టుకొని రంభ వచ్చింది. తపః కృశాంగి, కారాగారవాస పరిప్రశాంత, అశోకసుందరి తనను తాను నహుషుడికి సమర్పించుకుంది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని. నీకోసం నే చేసిన తపస్సు
ఇప్పటికి ఫలించింది - అంటూ చేరువకు వచ్చి పాదాభివందనం చేసింది. కృశాంగీ ! నా కోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను. ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను - రండి, మీరిద్దరూ రథం అధిరోహించండి. వశిష్టాశ్రమానికి వెడదాం అన్నాడు నహుషుడు.అన్నట్టుగానే రధం కదిలింది. క్షణంలో వశిష్టాశ్రమాన నిలిచింది. ముగ్గురూ దిగివెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగ పడ్డారు.
నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. మహర్షికి తనువు పులకించింది. శిష్యుడి వీరగాధ మనస్సుకి గిలిగింతలు పెట్టింది. కౌగలించుకుని వత్సా అంటూ శిరస్సు మూర్కొన్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తానన్నాడు. ముహుర్తం నిశ్చయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుంటే వైదికంగా అశోకసుందరీ నహుషులకు సకలదేవతలూ సాక్షిగా వివాహం జరిపించాడు. సదస్యమయ్యింది. పసుపుబట్టలతోనే వెళ్ళి తల్లితండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపజెయ్యండి అని చెప్పి నవదంపతులను అదే రథంమీద రాజధానికి
పంపించాడు. అప్పటికే దేవతల పంపున మేనక వెళ్ళి ఇందుమత్యాయు దంపతులకు శుభవార్త అందించింది. మీ కొడుకు
కోడలు దివ్యరథం మీద వస్తున్నారని ఉప్పు అందించింది. అంతటి శుభవార్త అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహూకరించాడు ఆయువు. ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్నీ నారద వచనాలనూ గుర్తు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఇన్ని సంవత్సరాలు దత్తారాధన ఇప్పటికి ఫలిస్తోందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది. దేవతలకోలాహలం. గంధర్వాప్సరసల గీతనృత్యవాద్య ఘోష, మందార పుష్పవృష్టి, దేవవర్చస్వీ మహాబాహువూ నహుషుడూ ధర్మపత్నీ సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లి తండ్రులకు పాదాభివందనం చేశారు. తండ్రీ కొడుకులూ అత్తా కోడళ్ళూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతో మూర్థాభిషేకం చేశారు. కొడుకును దగ్గరకు తీసుకుని ఇందుమతి

సనాతన ధర్మం

17 Jan, 13:59


#ముకుందమాల #11వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

17 Jan, 13:58


https://whatsapp.com/channel/0029VamwYOp89inl15KDVT3X/573

సనాతన ధర్మం

17 Jan, 05:10


శ్రీమద్రామాయణము యుద్ధకాండము
తొంభై ఐదవ సర్గ. (95)

లంకా వాసులు రావణుని గురించి ఇలా అనుకుంటుంటే,
రావణుడు మాత్రం తన పట్టు వదల లేదు. లంకా నగరంలో ఉన్న
ఇండ్లలో నుండి ఏడుపులు వినపడుతున్నా అతని మనస్సు
చలించలేదు. పైగా క్రోధంతో ఊగిపోతున్నాడు. పళ్లు పటపట
కొరుకుతున్నాడు. రావణుడు తన మంత్రులు అయిన మహోదరుని,
మహాపార్శ్వుడిని, విరూపాక్షుడిని వెంటనే బయలు దేరి రమ్మని
వర్తమానము పంపాడు. వెంటనే ఆ రాక్షస వీరులు రావణుని వద్దకు
వచ్చి చేతులుకట్టుకొని నిలబడ్డారు. (ఇదే పేర్లు ఇదివరకు వచ్చాయి.
వాళ్లు సైన్యాధిపతులు, రావణుని సోదరులు. వీళ్లు రావణుని
మంతులు). “ఈ రోజు నేను రాముడిని యమలోకమునకు అతిథిగా
పంపుతాను. ఈ రోజు నేను, ఖరుడు, కుంభకర్ణుడు, ప్రహస్తుడు,
ఇంద్రజిత్తును చంపినందుకు రాముని మీద ప్రతీకారము
తీర్చుకుంటాను. నా బాణములతో అన్ని లోకములను కప్పివేస్తాను.
ఒక్కొక్క వానర నాయకుని, అతని సేనలను విడి విడి గా చంపుతాను. నా రథము వాయు వేగంతో ప్రయాణిస్తుంటే, నేను వానరసేనలను ఊచకోత కోస్తాను. వానర సేనల కళేబరములతో ఈ భూమినంతా నింపుతాను. అసలు నేల అనేది కనపడకుండా చేస్తాను. నా ఒక్కొక్క బాణమునకు నూరుమంది వానరులు బలి అవుతారు. నా శత్రువులైన రామలక్ష్మణులను చంపి లంకావాసుల కన్నీళ్లు తుడుస్తాను. నా చేత చంపబడిన వానర సేనల శరీరములతో ఆకాశంలో తిరిగే గ్రద్దలు, డేగలు ఇంకా ఇతర పక్షులు విందు చేసుకుంటాయి. ఇంక ఆలస్యంచేయకండి నా రథము సిద్ధం చేయండి. నా ధనుర్బాణములను సిద్ధం చేయండి. లంకలో మిగిలిన సేనలు అన్నీ నా వెంట బయలుదేరాలి.” అని ఆదేశాలు ఇచ్చాడు రావణుడు. మహాపార్శ్వుడు వెంటనే సైన్యాధిపతులను పిలిపించి
సేనలను సిద్ధం చేయమన్నాడు. రాక్షస సైన్యాధిపతులు సైనికుల ఇళ్లకు వెళ్లి వారిని యుద్ధానికి సన్నద్ధం చేసారు. రావణుని కోసం ఎనిమిది గుర్రములను కట్టిన రథాన్ని సిద్ధం చేసారు. ఆ రథము నిండా రకరకాల ఆయుధములను, బాణములను పెట్టారు. రావణుడు ఆ రథమును ఎక్కాడు. రాక్షస సేనలు వెంటరాగా, రావణుడు వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. రాక్షస సేనలు భేరీలు, మృదంగములు, శంఖములు మోగించారు. రావణుని రాకతో రాక్షససేనలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. రాక్షస సేనల పదఘట్టనలకు భూమి అదిరిపోయింది. ఆ శబ్దానికి వానరులు భయపడ్డారు.
రావణుని వెంట రావణుని మంత్రులు అయిన మహాపార్శ్వుడు, మహోదరుడు కూడా తమ తమ రథముల మీద యుద్ధానికి బయలుదేరారు. రావణుడు తన రథమును రాముడు, లక్ష్మణుడు ఉన్న ద్వారము వద్దకు పోనివ్వమన్నాడు. ఆ సమయంలో ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. సూర్యకాంతి తగ్గిపోయింది.
దిక్కులన్నీ చీకట్లు ఆవరించాయి. పక్షులు వికృతంగా అరుస్తున్నాయి.
భూమి కంపించింది. రక్తవర్షము కురిసింది. నక్కలు వికారంగా
కూస్తున్నాయి. రావణుని రథమునకు కట్టిన ధ్వజము మీద
గ్రద్దవాలింది. రావణునికి ఎడమ కన్ను అదిరింది. కాని రావణుడు ఈ
దుశ్శకునములను లెక్కచేయలేదు. ముందుకు కదిలాడు. రాక్షస సేనలు, వానర సేనలు ఒకరిని ఒకరు ఢీకొన్నారు. పోరు భీకరంగా సాగుతూ ఉంది. రావణుడు తన వాడి అయిన బాణములతో వానరులను విచక్షణా రహితంగా చంపుతున్నాడు. కొందరి తలలు తెంచుతున్నాడు. మరి కొందరి గుండెలు చీలుస్తున్నాడు. వానరులను ఊపిరి ఆడకుండా చంపుతున్నాడు. రావణుని ముందు ఎవరూ నిలువలేకపోతున్నారు. రావణుని ఎదురుపడ్డవాడు ప్రాణాలతో బయటపడటం లేదు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొంభై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

16 Jan, 15:51


శ్రీశైలం లోని కళ్యాణ మూర్తులు

సనాతన ధర్మం

15 Jan, 16:35


శ్రీదత్త పురాణము ||చతుర్ధ భాగం
ఇందుమతీ కృతదత్తస్తవం || 18 లో ఒకటి (18-1)

1.నమః పరస్మై పురుషాయవేధసే
షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే ।
పరాత్మనేఃహంకృతి దూషితాత్మనాం
గుణాత్మనాం సంసృతి హేతుకేతవే ॥

2. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే
విశుద్ధ విజ్ఞాన ఘనాయ సాక్షిణే ।
ద్విజాయదేవాయ చదేవ హేతవే
మునీశ్వరాయాత్రి సుతాయ యోగినే ॥

3. వృజిన జలధిపారం ప్రాపయేద్యః ప్రపన్నాన్
సుత మమర సుతాభం యోదదద్దత్తదేవః |
తదహ మమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యం
పురుష మృషభమాద్యం త్వాం ప్రపన్నాస్మి భూయః

4. యోయేఃదత్సుతం దివ్యం విభుతేజోపబృంహితం ।
సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చ యద్గతిః ॥

5. యస్సప్రసాదజో బ్రహ్మా రుద్రస్తే జస్సముద్భవః |
కింకరాశ్చ సురాయస్య సమాంపాతు సదాహరిః |

6. నమస్తేపురుషాధ్యక్ష మైకాధ్యక్ష జగద్గురో |
దత్తాత్రేయసురేశాన పాహిమాం భవసంకటాత్ II

7. త్వత్ప్రసాదేన దేవేశ సర్వం సౌఖ్య మవాప్తవాన్ ।
గతింమేదేహి పాదాబే నాన్యమిచ్ఛామ్యహంప్రభో ॥

పరాత్పరుడు, పురుషోత్తముడూ, బ్రహ్మ స్వరూపుడూ, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడూ, అహంకార దూషితాలకు దూరంగా వుండేవాడూ, సంసారహేతువుకు కేతువైనవాడూ - దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన ఘనుడికి, జగత్సాక్షికి, ద్విజుడికి దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగేశ్వరుడికి - ఆ అత్రి పుత్రుడుకి ప్రణామం. ప్రపన్నులకి పాపజలధి దాటించేవాడూ, అమర సుతుడులాంటి బిడ్డను ప్రసాదించినవాడూ, అమరపూజ్యుడూ, సిద్ధవంధ్యుడూ, శరణ్యుడూ, అయిన ఆ పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలినై ఇదే ప్రణతి
సమర్పిస్తున్నాను. - తేజశ్శాలియైన పుత్రుణ్ని ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నిసుగును సంరక్షించుగాక.
బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతరించినవాడే. రుద్రుడు దత్త తేజస్సంభూతుడు. సకలదేవతలూ సేవకులు. ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది.పురుషాధ్యక్షా ! లక్ష్మీవల్లభా ! జగద్గురూ ! దత్తాత్రేయా ! సురేశానా ! భవ సంకటం నుంచి నన్ను ఉద్ధరించుదేవా ! నీ అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు
అనుభవిస్తున్నాను. నీ పాదపద్మాలే నాకు దిక్కు, ప్రభూ ! నేనింకేమి కోరను - అని ఆయువు స్తుతించాడు. ఇలా దంపతులిద్దరూ దత్తదేవుణ్ని స్తుతిస్తూ అర్చిస్తూ వరమాహత్యాన్ని తలుచుకుంటూ పుత్రాగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. ఆశ్రమంలో వశిష్ఠులవారు ఒకనాడు నహుషుణ్ణి పిలిచి సమిత్కుశలూ కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించారు. అన్నింటినీ సేకరించుకొని తిరిగివస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహషుడు. ఆయు మహారాజు గారి ఏకైక సుతుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠుడు అనుగ్రహంతో సకల విద్యాపారంగతుడు అయ్యాడు. ఇతణ్ని వలచి వివాహం
చేసుకోదలచి శివకన్య అశోక సుందరి దుష్కరతపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో? ఈ మాటలు విని నహషుడు చకచకా ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడివక్కడ సర్థాడు. వసిష్ఠులకు నమస్కరించి చేరువలో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారంగా నవ్వి అతడి జన్మవృత్తాంతం అంతా ఎరిగించాడు. పుత్రా ! ఆనందపరచు-అని ఆజ్ఞాపించాడు. నహుషుడు మహర్షికి
సాష్టాంగపడి దీవెనలందుకుని ధనుఃఖడ్గతూణీరాలను ధరించి హుండాసురుడిమీదకు బయలుదేరాడు దేవదుందుభులు
మ్రోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది.పరిమళ భరిత శీతలవాయువులు అనుకూలదిశగా వీతెంచాయి. శుభశకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారధికమైన దివ్యరధాన్ని దివ్యాస్త్ర శస్త్రాలనూ అందించి హుండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు ఋషులూ సకల దేవమానవ జాతులవారూ జయోస్తు పలికారు. సహుషుడు ఇంద్ర రథం అథిరోహించాడు. సూర్యుడులా తళతళలాడాడు. వాయువేగ మనోవేగాలతో హుండరాజధాని మహోదరనగరం శివారుకు
చేరుకున్నాడు. అశోక సుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ని కలుసుకుంది. నహుషా ! శివకన్య అశోక
సుందరికి నేను ప్రాణసఖిని రంభను రూపగుణశీల సంపన్న మా అశోక సుందరి నీ కోసమే తపస్సు చేస్తోంది. హుండుడు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగారగృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్భంధిస్తున్నాడు. అశోక సుందరి శపించింది. నహుషుడు వస్తాడు నిన్ను సంహరిస్తాడు - నన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తపిస్తు నీ కోసం దుఃఖిస్తూ నీ కోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోక సుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి
- అని అభ్యర్ధించింది. రంభా ! నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హుండుణ్ని సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవుగదా, వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేయసిని ఊరడించు - అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు.

సశేషం

సనాతన ధర్మం

15 Jan, 14:01


మానస సరోవరం గురించి, తాటక వృత్తాంతం శ్రీరాముడికి చెప్పిన విశ్వామిత్ర మహర్షి

https://youtu.be/kHRhS60bBdw

సనాతన ధర్మం

15 Jan, 08:14


#ముకుందమాల #10వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

15 Jan, 08:10


చుట్టుముట్టిన అడవిలో ఉన్న జంతువుల మాదిరి అయింది. లంకను
చుట్టుముట్టిన వానరసేనలతో లంక మొత్తం తగలబడిపోతోంది.
ఇదంతా ముందే ఊహించే, విభీషణుడు ముందు జాగ్రత్త పడ్డాడు.
రాముని శరణు జొచ్చాడు. ప్రాణాలు దక్కించుకున్నాడు. " అని కొంత
మంది అనుకొన్నారు. ఈ ప్రకారంగా లంకలో ఉన్నరాక్షసులు,రాక్షస
స్త్రీలు, ఎవరికి తోచినట్టు వారు అనుకుంటూ, పోయిన వారికోసం
కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొంభైనాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

15 Jan, 08:10


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
తొంభైనాలుగవ సర్గ.(94)

ఆ రోజు మరణించి నంతగా రాక్షసులు ఏ రోజూ మరణించలేదు. చావగా మిగిలిన రాక్షసులు లంకా నగరమునకు పోయి చచ్చిన వారి బంధువులకు వారి మరణవార్త చెప్పారు. మరణించిన సైనికుల భార్యలు, తల్లులు, తండ్రులు, కుమారులు, బంధువులు, మిత్రులు అందరూ ఎంతగానో విలపించారు. వారంతా ఈ యుద్ధమునకు కారణములను ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు.
ఆ ముసలి శూర్పణఖ, ఆ కురూపి శూర్పణఖ, ఒక మూల
కూర్చోకుండా తగుదునమ్మా అని రాముని వద్దకు ఎందుకు వెళ్లాలి?
రాముని ఎందుకు మోహించాలి? మంచి వాడైన రాముని మీద
దానికి ఎందుకు మోహం పుట్టిందో? దానికి పుట్టిన దుర్బుద్ధి వలన
కదా ఖరదూషణులు, 14,000 వేలమంది రాక్షసులు జనస్థానములో
మరణించినది. దానిచావు అది చచ్చింది. అంతటితో ఊరుకోకుండా
రావణుని వద్దకు వచ్చి లేని పోని మాటలు చెప్పడం ఎందుకు?
రావణుడు పోయి సీతను అపహరించి తీసుకు రావడం ఎందుకు?
రావణుడు తన చావు తాను కొని తెచ్చుకోవడమే కాకుండా, లంకా
నగరంలో ఉన్న రాక్షసులు చావుకు కూడా కారణం అయ్యాడు.
రామణుడికి సీత దక్కలేదు కానీ, రాముడితో వైరం మాత్రం దక్కింది.
సీతను పట్టుకున్న విరాధుడి చావు చూచి కూడా రావణుడు
సీతను తాకడం ఏమిటి? ఈ నిదర్శనం చాలదా రామునితో వైరం
ఎంత వినాశకరమైనదో! జనస్థానములో రాముడి చేతిలో, 14,000రాక్షసులు, ఖరుడు, దూషణుడు, త్రిశిరస్సు, వారి సేనానాయకులు చచ్చారు కదా! ఈ నిదర్శనము చాలదా!
ఇంకా రావణుడు బుద్ధిలేకుండా సీతను అపహరించడం ఏమిటి? రాముడు సామాన్యుడా! అరణ్యములో కబంధుని చంపాడు.
ఇక్కడ ఇంద్రజిత్తును చంపాడు. ఈ నిదర్శనము చాలదా రామునితో
వైరం ఎంత ప్రమాదకరమో! అదీకాకుండా ఇంద్రుని కొడుకు, మహా బలవంతుడు అయిన వాలిని రాముడు అవలీలగా చంపాడు. ఈ నిదర్శనము చాలదా! సుగ్రీవునితో మైత్రి చేసి, వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేసాడు. ఈ నిదర్శనం చాలదా!
సీతను రామునికి ఇచ్చి వేసి, లంకను కాపాడమని విభీషణుడు ఎన్నోసార్లు చెప్పాడు. కాని మూర్ఖుడైన రావణుడు వినలేదు. విభీషణుడు చెప్పిన మాటలను విని ఉంటే లంక ఈ నాడు
శ్మశానంగా మారేది కాదు. కనీసము కుంభకర్ణుని చావుతో నైనా
ఇంద్రజిత్తు చావుతో నైనా రావణునికి జ్ఞానోదయం కలగలేదు. మరలా
ఈ రోజు కూడా యుద్ధం చేసి రాక్షసులకు అపార ప్రాణనష్టం
కలుగచేసాడు." అని రాక్షస స్త్రీలు రావణుని మూర్ఖత్వం గురించి
పరిపరి విధాలుగా అనుకుంటున్నారు. నాకొడుకుపోయాడని ఒకామె, నా భర్త పోయాడని ఒకామె, నాసోదరులు మరణించారని ఒకామె ఏడుస్తున్నారు. మరి కొంత మంది రాక్షసులు, విష్ణువో, ఇంద్రుడో,రుద్రుడో రాముని రూపంలో వచ్చి రాక్షసులను చంపుతున్నాడు అని అనుకుంటున్నారు. “ఎవరు చంపినా నష్టం మనకే కదా కలిగింది. భర్తలను, కుమారులను, సోదరులను, బంధువులను,మిత్రులను పోగొట్టుకొని అనాధలము అయ్యాయు" అని ఆక్రోశిస్తున్నారు. “రావణుడు తనకు బ్రహ్మ ఇచ్చిన వరములు ఉన్నాయి అని విర్రవీగుతున్నాడు కానీ, రాముని పరాక్రమం గురించి, రాముని వలన తనకు పట్టిన భయం గురించి, తెలుసుకోలేకపోతున్నాడు." అని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. “రాముడి ఎదుట పడిన వాడు, వాడు రాక్షసుడైనా, అసురుడైనా, దానవుడైనా, పిశాచి అయినా, బతికి బయటపడటం కష్టం." అని అనుకుంటున్నారు. “కనీసం యుద్ధానికి వెళ్లేటప్పుడు కనిపించిన అపశకునములను, దుశ్శకునములను చూచి అయినా రాముడు యుద్ధమును విరమించి ఉంటే బాగుండేది" అని శకున శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. “రావణుడు ఎంత గర్విష్టి, తెలివితక్కువాడు కాకపోతే, దేవ, దానవ, గంధర్వ, యక్షుల నుండి మరణం సంభవించకుండా వరం కోరినవాడు, మానవులను ఎందుకు వదిలేసాడు. అదే ఇప్పుడు రావణుని కొంపముంచింది.” అని వాపోతున్నారు. “అది కాదు. నాకు తెలియక అడుగుతాను! బ్రహ్మవలన వరాలు పొందినంత మాత్రాన, దేవతలను, సత్పురుషులను బాధించాలని, చంపాలని, వారి యజ్ఞములు భగ్నం చెయ్యాలని లేదుకదా! అందుకే దేవతలు ఈశ్వరుని గురించి తపస్సు చేసారు. వారికి ఈశ్వరుడు వరాలు ఇచ్చాడు. “రాక్షసులను నాశనంచెయ్యడానికి కారణం అయిన స్త్రీ పుడుతుంది. ఆమె రాక్షసుల
వినాశనానికి కారణం అవుతుంది." అని ఈశ్వరుడు చెప్పాడట! ఇప్పుడు అదే నిజం అయింది కదా!" అని అనుకుంటున్నారు.

(ఈ సందర్భంలో ఆ స్త్రీ సీత అని కొంతమంది రాసారు. కాని
శూర్పణఖ అనికూడా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికంతటికీ కారణం శూర్పణఖ. ఆమె రాముని మోహించకుండా, వెంటపడకుండా ఉంటే, ఎవరి పాటికి వాళ్లు ఉండేవాళ్లు, జనస్థానంలో ఉన్న రాక్షసుల గురించి రామునికి తెలిసేది కాదు. ఏది ఏమైనా ఒక స్త్రీ కారణంగా రాక్షస వంశం నాశనం అయింది అనేది నిర్వివాదాంశము).

“ఇంతకూ ఈ రావణుని చెడ్డ ప్రవర్తన, పరస్త్రీవ్యామోహమే లంకకు చేటుతెచ్చింది. ఈ సమయంలో లంకను, లంకలో ఉన్న రాక్షస
జాతినీ రక్షించే వాడు ఎవడున్నాడు? మన పరిస్థితి కార్చిచ్చు

సనాతన ధర్మం

14 Jan, 05:18


మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటు మకర సంక్రమణ శుభాకాంక్షలు ,

తంగిరాల చంద్రశేఖర అవధాని,

సనాతన ధర్మం

13 Jan, 13:36


శ్రీమద్రామాయణము బాలకాండ 23 వ సర్గ || యాగ సంరక్షణకు విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామ లక్ష్మణులు,

https://youtu.be/YajXI0385iI

సనాతన ధర్మం

13 Jan, 06:59


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
తొంభైమూడవ సర్గ.(93) శ్రీరాముని ప్రతాపము

సీతను చంపడం అనే కార్యక్రమాన్ని విరమించిన రావణుడు తిరిగి తన సభాభవనంలో అడుగు పెట్టాడు. ఒక పక్క దు:ఖము మరొక పక్క కోపము, ఏమిచెయ్యాలో తోచని పరిస్థితుల్లో బుసలుకొడుతున్నాడు రావణుడు. అంతలోనే నిట్టూరుస్తున్నాడు.
రావణుడు ఏమి చెబుతాడా అని చావగా మిగిలినసేనానాయకులు
ఎదురు చూస్తున్నారు. వారికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు
రావణుడు. “మనం ఆఖరి పోరాటం సాగించాలి. మీరందరూ
యుద్ధానికి సన్నద్ధులై మీ మీ సైన్యములతో యుద్ధభూమికి రండి. మీ
పని ఒక్కటే. రాముని చుట్టుముట్టడం. చంపడం. కేవలం రాముని
చంపడం. మిగిలిన వారి సంగతి మీకు అనవసరం. రాముడు చావాలి. అదే నాకు కావాలి. లేకపోతే మరొక పని చేయండి. మీరు ఈ రోజంతా రాముని తో యుద్ధము చేసి రాముని ఘోరంగా గాయముల పాలు చేయండి. రాముడు అలసిపోవాలి. గాయములతో తల్లడిల్లిపోవాలి. రేపు నేను రామునితో యుద్ధము చేసి అవలీలగా చంపేస్తాను. ఏదో ఒకటి చెయ్యండి." అని అన్నాడు రావణుడు.
రావణుని ఆదేశము మేరకు సైన్యాధిపతులు అందరూ తమ
తమ సేనలతో యుద్ధభూమికి వెళ్లారు. రాక్షస సేనలు వానరుల మీదికి
బాణములను, పరిఘలను, కత్తులను, గొడ్డళ్లను విసురుతున్నారు.
వానరులు వృక్షములను బండరాళ్లను, పర్వతశిఖరములను
విసురుతున్నారు. రాక్షసులకు వానరులకు ఘోరంగా యుద్ధం
జరుగుతూ ఉంది. రక్తం వరదగా ప్రవహిస్తూ ఉంది. వానరులు
ఆకాశంలో ఎగురుతూ రాక్షసుల రథముల మీద ధ్వజములను
విరగ్గొడుతున్నారు. రాక్షసుల కవచములను, రథములను
విరగ్గొడుతున్నారు. అశ్వములను చంపుతున్నారు. చేతికి దొరికిన
రాక్షసుల ముక్కులను చెవులను కొరుకుతున్నారు. వాడి అయిన
గోళ్లతో రక్కుతున్నారు. ఒక్కొక్క రాక్షసుని నూరుగురు వానరములు
పంచుకొని చంపుతున్నారు. రాక్షసులు కూడా తమ దగ్గరగా వచ్చిన వానరములను గదలతోనూ, గొడ్డళ్లతోనూ కొట్టి చంపుతున్నారు. కొన్ని వానరములు పోయి రాముని శరణువేడాయి. వారికి అండగా రాముడు రాక్షస సేనల మీద బాణములను వర్షముగా కురిపించాడు. రాముని బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షస సేనలు వెనక్కు మరలాయి.రాముని బాణముల దెబ్బకు రాక్షసుల రథములు విరుగుతున్నాయి. కవచములు పగులుతున్నాయి. అశ్వములు చస్తున్నాయి. సారథులు నేలకూలుతున్నారు. రాక్షస నాయకులకు ఎవరికీ రాముని ఎదుట పడటానికి సాహసం లేకపోయింది. రణభూమి అంతా తానే అయి రాముడు రాక్షసులను చంపుతున్నాడు. అడుగో అక్కడ రాముడు గజసేనను
చంపుతున్నాడు అని కొంతమంది రాక్షసులు అరిస్తే, ఇడుగో రాముడు
ఇక్కడ ఉన్న అశ్వసేనలను నాశనం చేసున్నాడు అని అరుస్తున్నారు.
ఎవరికి వారు రాముడు తమ ఎదుటనే ఉండియుద్ధం చేస్తున్నాడు అని భ్రమపడుతున్నారు. రాముడు రాక్షస సేనల మీద గాంధర్వాస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రప్రభావం చేత రాముడు రాక్షసులందరికీ వేలకొద్ది రాముడులు గా కనపడుతున్నాడు. ఎవరికి వారే రాముడు తమ ముందే ఉన్నట్టు అనుకుంటున్నారు. నిరంతరము బాణములను సంధిస్తున్న రాముని ధనుస్సు
వలయాకారంలో, మృత్యు చక్రము వలె కనపడుతూ ఉంది. రాముడు
ఎప్పుడు బాణము సంధిస్తున్నాడో, ఎప్పుడు నారి లాగుతున్నాడో ఎప్పుడు బాణము వదులుతున్నాడో ఎవరికీ తెలియడం లేదు. రాముని విల్లు నుండి వెలుబడిన బాణములు మాత్రము అగ్నిజ్వాలల మాదిరి దూసుకుపోతున్నాయి. రాముడు ఒక జాము కాలములో పదివేల రథాలను విరిచాడు, పదునెనిమిది వేల ఏనుగులను,
పదునాలుగు వేల గుర్రములను, రెండు లక్షల మంది రాక్షస సైనికులను చంపాడు. చావగా మిగిలిన రాక్షసులు రాముని ఎదుట పడలేక లంకానగరం వైపు పారిపోయారు. రణభూమి రుద్ర భూమిలాగా తయారయింది. అప్పుడు రాముడు విభీషణుని, లక్ష్మణుని, సుగ్రీవుని చూచి “ఈ దివ్యాస్త్ర ప్రయోగము నాకు, ఈశ్వరునికి మాత్రమే తెలుసు.” అని చెప్పాడు. రాముని దివ్యాస్త్ర ప్రయోగమునకు, విభీషణుడు, సుగ్రీవుడు, వానరులు అందరూ రాముని ప్రశంసలతో ముంచెత్తారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము తొంభైమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

12 Jan, 13:21


వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు. తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యాప్రవీణుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుణ్ని సంహరించి ధర్మపత్నీ సమేతుడై మీ దగ్గరకి వస్తాడు. కొడుకునీ కోడల్నీ ఆశీర్వదిద్దురుగాని. సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు. అటుపైని ఇంద్రపదవి అధిష్టిస్తాడు. దత్తదేవుడిచ్చిన వరం వృధాకాదు. ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడ్కోలు తీసుకున్నాడు. రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖతీవ్రతలో దత్తాత్రేయుణ్ని అతడిచ్చిన వరాన్నీ శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తిప్రపత్తులతో నిత్యమూ ఆ స్వామిని స్తుతించారు.

శ్రీ దత్తాయ గురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

12 Jan, 13:21


శ్రీదత్త పురాణము||చతుర్ధ భాగం
నహుష వృత్తాంతం|| పదిహేడు లో రెండు (17-2)

ఒక సుముహూర్తాన స్వర్భాను తనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతడి దివ్యతేజస్సుకి ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసఖులు వీడు సూనుడు కాడు భానుడు అని తృళ్ళిపడ్డారు. సూతికాగృహం వెలుపల ఉన్న దాసదాసీ జనానికి ఈ శుభావార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండుడు లోపలికి చొరబడ్డాడు. అనుకూల సమయంకోసం వేచివేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలివారిని సమ్మోహపరచి హుండుడు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా
శత్రువు. వీణ్ని మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వండి వడ్డించమను - అన్నాడు. ఈ పసి గుడ్డేమిటి, నీకు శత్రువేమిటి, వీణ్ని చంపడమేమిటి, వండటమేమిటి, నువ్వు తినడమేమిటి - ఏమి నాకు అర్ధం కావడం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హుండుడు. కామోసనుకొని ఆమె సైరంధ్రి మేకలను పిలచి బిడ్డణ్ని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకపోతే కత్తి రెండు ముక్కలయ్యింది. బాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమయ్యింది. ఈ శిశువు అసాధారణుడు. మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అంది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండుడు దానవాధముడు. ఈ శిశువును చంపడం ఎవరి తరమూ కాదు. కర్మ రక్షిస్తూంటే ఎవడు ఎవణ్ని ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి. బందిఖానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళూచేతులూ కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమంగా తిరిగి
వస్తాడు. అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబలుక్కొని ఆ అర్ధరాత్రి శిశువుని తీసుకువెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమ ద్వారంలో పరుండబెట్టి, తిరిగి వస్తూ ఒక బుజ్జిలేడి కూనను సంహరించి తెచ్చి, ఆ మాంసం వండి, పసిబిడ్డ మాంసమని హుండుడుకి వడ్డించారు. అది భక్షించి హుండుడు నిశ్చింతగా
నిద్రపోయాడు. తెల్లవారింది, వశిష్ఠుడు లేచాడు. గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్యలక్షణాలను
గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారోనని ఆరా తీశాడు. ఆశ్రమ వాసులంతా మాకు తెలీదంటే మాకు తెలీదు అన్నారు. కొందరు పరిశీలనగా చూసి, ఆయు మహారాజుగారి పుత్రుడిలా ఉన్నాడు. ఈ తేజస్సూ ఈ కాంతీ కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాము - అన్నారు. వసిష్ఠుడు దివ్యదృష్టి సారించాడు. అంతా అర్థమయ్యింది. ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది.
దేవదుందుభులు మ్రోగాయి. అప్సరసలు నృత్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిపా ! నీ వంశం బాలభావధూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుష నామంతో విఖ్యాతికెక్కుతావు. దేవ పూజ్యత దక్కుతుంది - అని నామకరణం చేసి దీవించాడు. వసిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదవేదాంగాలూ నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో
సహా నేర్పాడు. వేదాంతం ధర్మశాస్త్రం రాజనీతి ఒకటేమిటి సమస్త విద్యలూ నేర్పాడు. నహుషుడు సర్వవిద్యావేత్త సకల కళాపారీణుడూ అయ్యాడు. అక్కడ రాజంతఃపురంలో ఇందుమతికి మెలుకువ వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించలేదు. వెదికింది, సఖులను
అడిగింది. దాసీజనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్రలేచారు. మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధివీధికీ ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలివారిని శిక్షించాడు. అంతఃపురంలోకి ప్రవేశించి
పట్టమహిషి పొత్తిలిలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు ? ఎలా అపహరించగలిగారు ? ఎవరిని ఎలా
నిర్భంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాదమేఘాలు అలుముకున్నాయి. అందరి ముఖాలలోను అదే దిగులు. ఇందుమతి దుఃఖానికి అంతే లేదు. వంశోద్దారకుణ్ని ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు ఇలా మాయం చేశాడేమిటి ? దివ్య స్వప్నం పగటికలేనా ? అని ఆవిడ ఆక్రోషం. దత్తాత్రేయుడిచ్చిన వరం ఇలా
అయ్యిందేమిటి ? అని ఆయువు విస్తుపోతున్నాడు. తపస్సులు నిష్ఫలాలు, దాన ధర్మాలు నిష్ఫలాలు. వరాలూ ఇంతేనా ? దేవుడే మోసం చేశాడా ? - మధనపడుతూ లోపలలోపల కుమిలిపోతున్నాడు మహారాజు. సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టు నారదమహర్షి వచ్చాడు. అర్ఘ్యపాద్యాలూ అతిథి మర్యాదలూ అయ్యాయి. కుశల ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. మహారాజా ! చింతించకు, నీ

సనాతన ధర్మం

08 Jan, 08:04


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
ఎనభై తొమ్మిదవసర్గ.(89) సనాతన ధర్మం

లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరితో ఒకరు ఘోరంగా యుద్ధము
చేస్తుంటే. పక్కనే ఉన్న విభీషణుడు తన వంతు సహకారాన్ని
అందించాడు. తాను కూడా ధనుస్సు చేత పట్టి రాక్షసులను
సంహరిస్తున్నాడు. రాక్షసుల ఆనుపానులు తెలిసిన విభీషణుడి
బాణముల ధాటికి రాక్షసులు కుప్పలుకుప్పలుగా చచ్చిపడుతున్నారు.విభీషణుడు రాక్షసులను చంపుతుంటే, విభీషణుని నలుగురు మంత్రులు కూడా కత్తులు చేత బట్టి రాక్షసులను నరుకుతున్నారు. విభీషణుడు కూడా వాళ్లను ప్రోత్సహిస్తూ ఇలా అంటున్నాడు.“ఓ వానరవీరులారా! రావణునికి వీడొక్కడే గతి. వీడు చస్తే రావణుని పక్షాన యుద్ధం చేసే వాళ్లు ఎవరూ లేరు. రాక్షస వీరులైన ప్రహస్తుడూ, నికుంభుడూ, కుంభకర్ణుడూ, కుంభుడూ, ధూమ్రాక్షుడు, జంబుమాలి, మహామాలి, అశనిప్రభుడూ సుప్తఘ్నుడూ, యజ్ఞకోపుడూ,వజ్రదంష్ట్రుడూ, సంహాది, వికటుడూ,
తపనుడూ, మందుడు, ప్రఘాసుడు, ప్రఘసుడూ, జంఘుడూ, ప్రజంఘుడూ, అగ్నికేతువూ,రశ్మికేతువూ, విద్యుజ్జిహ్వుడు, ద్విజిహ్వుడు, సూర్యశత్రువు, అకంపనుడు,సుపార్శ్వుడు, చక్రమాలి, కంపనుడు, దేవాంతకుడు, నరాంతకుడు అందరూ మన చేతిలో చంపబడ్డారు. ఇంక లంకలో మనతో యుద్ధం చేయగల వీరులు ఎవరూ లేదు. ముందుకు దూకండి ఇంద్రజిత్తును చంపండి. రాక్షసులను తునుమాడండి. రాక్షసులతో చేసిన యుద్ధములో యోధానుయోధులను చంపాము. నూరుయోజనముల
సముద్రమును దాటిన మీకు ఈ ఇంద్రజిత్తు, ఆవు పాదము(గోష్పాదము)తో ఏర్పడిన చిన్న గుంటలాంటి వాడు. . వీడిని చంపడం
మనకు లెక్కలోనిది కాదు.నేనే ఇతనిని చంపగలను. కాని నాకు ఇతడు కుమారుడు.నేను వీడికి తండ్రిని. వీడి మీదున్న పుత్రవాత్సల్యము నన్ను అడ్డుకుంటూ ఉంది. వీడిని చంపాలని అనుకున్నప్పుడల్లా నా కళ్లలో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. కాబట్టి లక్ష్మణుడే వీడిని చంపగలడు. ముందు మీరందరూ ఇంద్రజిత్తు చుట్టుమోహరించి ఉన్న రాక్షసులను చంపండి.తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపగలడు" అని వానర వీరులను ప్రేరేపించాడు విభీషణుడు. విభీషణుని మాటలతో వానరులలో ఉత్సాహం పెల్లుబికింది. సింహనాదాలు చేస్తున్నారు. వానరులు, భల్లూకములు ఒక్కసారిగా రాక్షస సేనల మీద పడ్డారు. వారిని రక్కారు, పీకారు. కొరికారు. రాళ్లతో కొట్టారు. జాంబవంతుడు కూడా యధాశక్తి రాక్షసులను చంపుతున్నాడు. రాక్షసు లందరూ జాంబవంతుని చుట్టు ముట్టారు. తమ చేతులలో ఉన్న పట్టిసములతోనూ, గండ్రగొడ్డళ్లతోనూ, కత్తులతోనూ దారుణంగా కొట్టారు. జాంబవంతుడుకూడా వారికి తగురీతిలో సమాధానం చెప్పాడు. వానరులకు రాక్షసులకూ యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది.
అప్పటిదాకా లక్ష్మణుని తన వీపు మీద మోస్తున్న హనుమంతుడు, లక్ష్మణుని కిందికి దింపి, ఒక పెద్ద బండరాయిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ బండరాతితో మోదుతూ హనుమంతుడు రాక్షసులను చంపుతున్నాడు. విభీషణుడితో యుద్ధం చేస్తున్న
ఇంద్రజిత్తు, ఆయనను వదిలి లక్ష్మణుని మీదికి వెళ్లాడు. లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకు సమరం సంకులంగా మారింది. ఒకరి మీద ఒకరు బాణవర్షము కురిపిస్తున్నారు. ఇద్దరూ సమానమైన యుద్ధకౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు సంధించిన బాణములతో ఆకాశం కప్పబడిపోయింది. ఒక సారి లక్ష్మణుడిది పైచేయిగా ఉంటే ఇంకాసేపటికి ఇంద్రజిత్తు విజయకేతనం ఎగరవేస్తున్నాడు. అంతలోనే
లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద పట్టుసాధిస్తున్నాడు. జయాపజయాలు ఇద్దరి మధ్య అటు ఇటు పరుగెడుతున్నాయి. లక్ష్మణుడు, ఇంద్రజిత్తు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములతో ఆకాశం కప్పబడిపోయింది. చీకట్లు కమ్ముకున్నాయి. వానరులు రాక్షసుల రక్తంతో అక్కడ రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి.ఆ సమయంలో లక్ష్మణుడు నాలుగు బాణములతో ఇంద్రజిత్తు రథానికి కట్టిన గుర్రములను చంపాడు. మరొక భల్లబాణంతో ఇంద్రజిత్తు సారధిని చంపాడు. ఇంద్రజిత్తు మరొక రథాన్ని ఎక్కి తన రథమును తానే తోలుకుంటూ లక్ష్మణునితో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద తన వాడి అయిన బాణములను ప్రయోగించాడు. మరలా రథమునకు కట్టిన గుర్రములను తన బాణములతో కొట్టాడు లక్ష్మణుడు. అవకాశం దొరకడం ఆలస్యం లక్ష్మణుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంద్రజిత్తును దెబ్బతీస్తున్నాడు. ఇంద్రజిత్తుకు క్రమక్రమంగా సామర్థ్యం సన్నగిల్లింది.
అలసిపోతున్నాడు. ఇది చూచిన వానర నాయకులు హర్షధ్వానాలు
చేసారు. ఇంతలో ప్రమాథి, రభసుడు, శరభుడు, గంధమాధనుడు అనే వానర శ్రేష్ఠులు ఇంద్రజిత్తు మీదికి దూకారు. ఎగురుకుంటూ వెళ్లి
ఇంద్రజిత్తు రథం మీద కూర్చున్నారు. ఇంద్రజిత్తు రథమునకు కట్టిన
గుర్రములను బలంగా కొట్టారు. అవి రక్తం కక్కుకున్నాయి. కిందపడి
మరణించాయి. తరువాత ఆ నలుగురు వానర వీరులు ఇంద్రజిత్తు
ఎక్కిన రథమును ముక్కలు ముక్కలుగా విరుగ గొట్టారు. మరలా
వెనక్కు ఎగిరి లక్ష్మణుని పక్కన నిలబడ్డారు. ఇదంతా క్షణాలలో

సనాతన ధర్మం

08 Jan, 08:04


జరిగిపోయింది. ఆ వానర వీరుల వేగానికి ఇంద్రజిత్తు ఆశ్చర్యపోయాడు.విరిగిన రథము నుండి కిందికి దుమికి వేగంగా బాణములు విసురుతూ లక్ష్మణుని మీదికి వెళ్లాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు తన మీద సంధిస్తున్న బాణములను మధ్యలోనే ఖండిస్తూ, ఇంద్రజిత్తును ముందుకు రాకుండా కట్టడి చేస్తున్నాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఎనభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

07 Jan, 15:49


జై శ్రీ గురుదేవదత్త

ఈ నెల 11 వ తారీకు న (11-01-2025) న శని త్రయోదశి అయ్యింది,

- కర్కాటక రాశి వారికి అష్టమ శని
- వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని
- మకర కుంభ మీన రాశుల వారికి ఏలినాటి శని

రేపు మార్చ్ నెల చివరితో పూర్తి అవుతోంది,చివరకు రావటం వల్ల ఎక్కువ బాధలు కలుగుతాయి చాలా సమస్యలు కలుగుతాయి, ఈ రాశుల వారికి మానసిక ప్రశాంతత కొరవడడం గృహములో సమస్యలు కలుగుతాయి, దానికి పరిహారం గా ఈ జనవరి - 11 వ తారీకు శనివారం *శని త్రయోదశి పర్వదినం పురస్కరించుకుని మా గృహములో *శని* కి పాశుపత సంపుటితో తైలాభిషేకం చేస్తున్నాము ఈ రాశుల వారు ఎవరైనా మీ గోత్ర నామాలతో ఈ తైలాభిషేకం చేయించుకోదలిస్తే సంప్రదించండి,

తంగిరాల దత్తాత్రేయ అవధాని,
కొత్తపేట :-+91 86396 72644

తంగిరాల చంద్రశేఖర అవధాని,
Whats app :- 7989784772

సనాతన ధర్మం

07 Jan, 15:03


#ముకుందమాల #6వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

07 Jan, 14:55


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
ఎనభై ఎనిమిదవ సర్గ (88) లో రెండవ భాగం

ఇరువురి మధ్య పోరు భయంకరంగా సాగుతూ ఉంది.
లక్ష్మణుడు, ఇంద్రజిత్తు ఒకరికి ఒకరు తీసిపోనట్టుగా పోరాడుతున్నారు.కాక పోతే లక్ష్మణుడు మానవుడు. ఇంద్రజిత్తు రాక్షసుడు. లక్ష్మణుడికి ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యడం తెలుసు. ఇంద్రజిత్తుకు మాయాయుద్ధం తెలుసు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద పగ తీర్చుకోడానికా అన్నట్టు బాణవర్షము కురిపిస్తున్నాడు. ఆ బాణముల ధాటికి ఇంద్రజిత్తు తట్టుకోలేక పోయాడు. కాస్త వెనుకంజ వేస్తున్నట్టు కనపడింది. వెంటనే విభీషణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. "లక్ష్మణా! ఇంద్రజిత్తు అలసిపోయాడు. ఇదే మంచి సమయము. నీవు తొందరపడు. ఇంద్రజిత్తు మీద అస్త్రప్రయోగం చెయ్యి" అని అన్నాడు విభీషణుడు. వెంటనే లక్ష్మణుడు సర్పముల వంటి బాణములను ఇంద్రజిత్తు మీద ప్రయోగించాడు. ఆ బాణముల దెబ్బకు ఇంద్రజిత్తు స్పృహ తప్పి కిందపడ్డాడు. వెంటనే తెలివి వచ్చింది. ఎదురుగా రథము మీద స్థిరంగా నిలబడి ఉన్న లక్ష్మణుని చూచాడు ఇంద్రజిత్తు. లక్ష్మణుని
మాటలతో నిర్వీర్యుడిని చెయ్యాలని అనుకున్నాడు ఇంద్రజిత్తు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! అప్పుడే మరిచిపోయావా! యుద్ధము జరిగిన మొదటి రోజు నా శరముల ప్రభావానికి నువ్వు నీ అన్న స్పృహ తప్పి నేల మీద పడ్డారు కదా! నా బాణముల రుచి అప్పుడే మరిచిపోయావా! ఈ రోజు అలా చెయ్యను సరాసరి నిన్ను యమసదానానికి పంపుతాను. ఆ రోజు నువ్వు నాపరాక్రమాన్ని పూర్తిగా చవిచూడలేదు. ఆ ముచ్చట ఈరోజు తీరుస్తాను. బహుశా ఆ రోజు జరిగినది నీకు జ్ఞాపకం లేక ఈ రోజు నాతో యుద్ధానికి వచ్చావు. బతకాలని ఉంటే పారిపో. లేకపోతే నా
బాణాలకు బలి అవుతావు. కాచుకో" అంటూ లక్ష్మణుని మీద ఏడు
బాణములను సంధించి వదిలాడు. మరో పదిబాణములతో
హనుమంతుని కొట్టాడు. దీని కంతకీ కారణమయిన విభీషణుని మీద
నూరు బాణములు ప్రయోగించాడు. ఆ బాణములను అన్నిటినీ
లక్ష్మణుడు అవలీలగా ఛేదించాడు. మరలా ఇంద్రజిత్తు మీద వాడి
అయిన బాణములను ప్రయోగించాడు. “ఓ రాక్షసా! ఇవేమి బాణములు. నా మీద పువ్వుల మాదిరి పడుతున్నాయి. ఇంతకన్నా వాడి అయిన బాణములు నీ దగ్గర లేవా! నా దగ్గర చూడు ఎంతటి వాడి అయిన బాణాలు ఉన్నాయో” అని ఇంద్రజిత్తు మీద వాడి అయిన బాణములు ప్రయోగించాడు. లక్ష్మణుని బాణముల దెబ్బకు ఇంద్రజిత్తు ధరించిన కవచము ముక్కలయింది.ఇంద్రజిత్తు గుండెల్లో బాణాలు గుచ్చుకొని గాయం అయింది. ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు. లక్ష్మణుని మీద ఒకే సారి వెయ్యి బాణాలు
ప్రయోగించాడు. ఇంద్రజిత్తు వేసిన బాణములకు లక్ష్మణుని కవచము
కూడా బద్దలయింది. ఇద్దరూ సమానంగా ఉన్నారు. ఇరువురి
దేహములలో బాణాలు దిగబడ్డాయి. రక్తం కారుతూ ఉంది. ఒకరితో
ఒకరు అలసట అనేది లేకుండా పోరాడుతున్నారు. వారు ఒకరి మీద
ఒరకు వేసుకొనే బాణములతో ఆకాశము కప్పబడి పోయింది. ఆ
ప్రకారంగా ఒకరితో ఒకరు ఘోరంగా యుద్ధము చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఎనభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

05 Jan, 10:49


పెట్టుకో అని విదురుడు ధృత రాష్ట్రుణ్నీ హెచ్చరించాడు. దీపకా ! విన్నావుగదా. ఇవి ఇహపర సాధకాలైన నీతివాక్యాలు. ఇంకా చాలామంది ఇలాగ దత్తుణ్ని ఆశ్రయించి సంశయాలు తొలగించుకొని సన్మార్గాలు అలవరచుకొని జీవన్ముక్తులైనవారు ఉన్నారు. పరమాత్మగా ధ్యానించి అపునర్భవమైన ముక్తిని పొందుతున్నవారూ ఉన్నారు. మరింకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అన్నాడు వేదధర్ముడు. గురూత్తమా ! అత్రిపుత్రుడి మహాత్మ్యాలు ఇంకా వినాలి అన్నదొక్కటే నా కోరిక. ఎంతకీ తనివి తీరడంలేదు.
భరత వంశంలో ఆయువుకి దత్తానుగ్రహం వల్లనే నహుషుడు జన్మించాడనీ ఆ యోగీంద్రుణ్ని ఆరాధించి శత్రవుల్ని జయించి చక్రవర్తి అయ్యాడనీ క్లుప్తంగా విన్నాను. ఇది కాస్త వివరంగా ఈ శిష్యుడికి వినిపించి హృదయాబ్జాన్ని వికసింపజేయండి. దీపకా ! నువ్వు ధన్యుడవు కావటమే కాదు నీ తల్లిదండ్రుల్ని సైతం ధన్యుల్ని చేస్తున్నావు. పితృదేవతల్ని తరింపచేస్తున్నావు. నువ్వు సంపాదించుకుంటున్న ఈ పుణ్యకథా శ్రవణఫలం అంతటిది. అంతేకాదు అడిగి నాతో వీటిని చెప్పించి నన్ను కూడా ధన్యుణ్ని చేస్తున్నావు. నాయనా ! నీలో ఇంకొక సుగుణం నాకు మరీ నచ్చింది.
ప్రతికథనూ నేను చెబుతున్నంత శ్రద్ధగానూ వింటున్నావు. ఏదైనా ఒకటి మునుపు విన్నదే మళ్ళీ ప్రస్తావనకు వచ్చినా నన్ను ఆనందపరచడంకోసం ఇదే మొదటిసారి అన్నంత శ్రద్ధగా వింటున్నావు. ఇలాంటి శ్రోత దొరకడం చాలా అదృష్టం పైగా కథకూడా అటువంటిది.

శ్రీ దత్తాయ గురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

05 Jan, 10:49


శ్రీదత్త పురాణము|| చతుర్ధ భాగం
విదుర నీతి || పదిహేనవ వృత్తాంతం (15)

దృతరాష్ట్రా ! నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. ఇది
కులానికి చేటు తెచ్చిపెడుతుంది. కనక త్వరగా మేల్కొని నీ పెద్దకొడుక్కి తగిన బుద్ధులు నేర్పు.విదురా ! నువ్వు జ్ఞానివి. సకల నీతి శాస్త్రవేత్తవు. దుర్యోధనుడికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నువ్వు నాకు ఉపదేశించు. వాటిని వాడికి బోధిస్తాను. ఆపైన ఏది జరగాలో అది జరుగుతుంది.ధృతరాష్ట్రా ! సరే అయితే ఆలకించు, పూర్వకాలంలో దత్తయోగీంద్రుడు సాధ్యజాతి వారికి ఉపదేశించిన కొన్ని గొప్ప నీతులు ఉన్నాయి. వాటిని నీకు ఉపదేశిస్తాను. శ్రద్ధగా ఆలకించు - అని విదురుడు ఆరంభించాడు.ముందుగా మనస్సుకి సంశ్రుతం అలవర్చాలి. దానితో శమదమాదులూ సత్యమూ ధృతీ అలవడతాయి. వాటివల్ల హృదయగ్రంథి విడుతుంది. అరిషడ్వర్గం అంతరిస్తుంది. క్రోధాన్ని క్రోధంతో జయించలేం. సహనంతో ఓర్పుతో
జయించగలం. క్రోధమనేది అన్ని అనర్థాలకూ మూలకందం. ఎవడి క్రోధం వాడినే దహించేస్తుంది. వాడి పూర్వజన్మార్జిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది. అంచేత అందరూ తితిక్ష అలవరుచుకుని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి. అలాగే ఏ మనిషీ ఆక్రోశి కాకూడదు, అవమాని కాకూడదు. మిత్రద్రోహి కాకూడదు. నీచోపసేవి కాకూడదు, దురభిమాని కాకూడదు, హీనవృత్తుడు కాకూడదు. రూక్షంగా, పరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకంగా
వదుల్చుకోవాలి. ఇది హృదయాలనూ, మర్మాలనూ అస్థికలను సైతం దహించి వేస్తుంది. ఇటువంటి వాక్పారుష్యరూప మహాపాపాన్ని ధర్మారాములందరూ వెంటనే వదిలిపెట్టి దానికి ఆమడల దూరం తొలగిపోవాలి ఈటెలలాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లుపొడిచే మానవుణ్ని లక్ష్మి సరస్వతులు ఆ క్షణంలోనే
పరిత్యజిస్తాయి. దరిద్రదేవత వాడి ముఖంలో స్థిర నివాసమేర్పరుచుకుంటుంది. నిప్పులు కక్కుతున్న వాగ్భాణాలతో
ఎవరు ఎంతగా హింసించినా చలించని వాడూ గుండెలు దహించుకుపోనివాడూ నిజమైన యోగి. అతడు తన సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడని గ్రహించు. అంబికేయా ! వస్త్రాలకు రంగులు అంటుకున్నట్టే మనుషులకు గుణాలూ అంటుకుంటాయి. సజ్జనుణ్ని సేవిస్తే సజ్జనత్వం దుర్జనుణ్ని సేవిస్తే దుర్జనత్వం తపస్విని సేవిస్తే తపస్విత్వం చోరున్ని సేవిస్తే చోరత్వం క్రమంగా సంక్రమిస్తాయి. ఆరు నెలల సావాసంతో వీరు వారవుతారని లోకోక్తి. తనను నిందించిన వాణ్ని తాను నిందించకుండా మరొకరితో నిందింపజెయ్యకుండా, తనను కొట్టినవాణ్ని తాను కొట్టకుండా కొట్టించకుండా, తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చెయ్యకుండా చేయించకుండా జీవించేవాడికి ఏ పాపమూ అంటదు. దేవతలు మెచ్చి స్వయంగా ఎదురువచ్చి అతణ్ని తమ లోకానికి తీసుకువెడతారు. -రాజా ! అవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయ ఆహు మాట్లాడటంకన్నా మౌనం ఎప్పటికీ శ్రేయోదాయకమన్నారు. ఒకవేళ మాట్లాడవలసివస్తే సత్యమే పలకాలి. అది రెండురెట్లు మంచిది. అది ప్రియం కూడా అయ్యేట్టు మాట్లాగడలిగితే మూడురెట్లు మంచిది. సత్యమూ ప్రియమే కాక ధర్మబద్ధంకూడా అయ్యేట్టు పలకగలిగితే అది నాలుగురెట్లు మంచిది. మనిషి ఎవరిని జతచేర్చుకుంటాడో, ఎవరితో జతకడతాడో, తానెటువంటివాడు కాదలుచుకున్నాడో దాన్నిబట్టి
మార్పులు వస్తాయి. అటువంటివాడు అవుతాడు. ఏయే విషయాలను నివర్తించగలుగుతాడో తాను ఆయా విషయాల
నుంచి విముక్తుడవుతాడు. ఇలా క్రమంగా అన్నింటినీ నివర్తించుకోగలిగిన వాడికి అణుమాత్రమైన దుఃఖం ఉండదని
తెలుసుకో. ఇదొక నిరంతరసాధన. దుఃఖాన్ని జయించే ఏకైక మార్గం. నిందా, ప్రశంసలు రెండింటినీ సమానంగా చూడగలిగినవాడు ఒకరిని జయించడు. ఒకరికి తాను ఓడిపోడు. ఒకణ్ని శత్రువనుకోడు, ఒకడికి తాను శత్రువుకాడు. ఇటువంటివాడికి సుఖదు:ఖాలు అంటవు. అందరికీ మంచి జరగాలనీ ఎవ్వరికీ కీడు జరగకూడదనీ కోరుకునేవాడూ, మృదు స్వభావం కలవాడూ, అంతర్భహిరింద్రియాలను నిగ్రహించినవాడూ - అతడూ ఉత్తమ పురుషుడంటే. - యాచకుల్ని ఆదరించేవాడూ, ఇస్తానన్నది వెంటనే ఇచ్చేవాడూ, ఇతరుల్లో రంధ్రాన్వేషణ చేయనివాడూ ఉత్తముడు.
ఇక దుష్టుడెలా ఉంటాడంటే ఎవ్వరు ఏమంచి పని చెప్పినా వినడు. పరుల్ని శంకించడం తనని తాను శంకించుకోవడం, నిత్య శంకితుడుగా ఉంటాడు. మిత్రుల్ని ఉత్తపుణ్యానికి దూరం చేసుకుంటాడు. అంతరాత్మను చంపుకుంటాడు. కోపవివశుడుగా ఉంటాడు. ఇతరులు చేసిన మేలుని ఆ నిమిషంలోనే మరచిపోతాడు- ఇవీ దుష్టుడి లక్షణాలు, వీణ్ని అధమపురుషుడంటారు.
శ్రేయస్కాముడు ఎప్పుడూ తనకంటే ఉత్తములనే సేవించాలి. కాలానుగుణంగా అవసరమైతే మధ్యముల్ని కూడా సేవించవచ్చు. అంతేకాని అధముల్ని ఛస్తే సేవించకూడదు. లోకంలో ఒక్కొక్కసారి అధములుకూడా బాగా ధనం ఆర్జిస్తారు. తెలివితేటలనండి, బలమనండి, పౌరుషమనండి - ఏదో ఒకటి ఉపయోగించి బాగా కూడబెడతారు. అంత మాత్రాన సంఘంలో అతడు ప్రశంసా పాత్రుడుకాడు. పెద్దల సరసన కూర్చోలేడు.దత్తాత్రేయుడు అందించిన ఈ నీతి వాగామృతాన్ని ఆస్వాదించి సాధ్యులు స్వామి దగ్గర సెలవు తీసుకున్నారు. ఈ నీతుల్ని నీ పెద్దకొడుక్కి బోధించి దారిలో

సనాతన ధర్మం

05 Jan, 10:23


#ముకుందమాల #5వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

05 Jan, 10:19


శ్రీమద్రామాయణము యుద్ధకాండము
ఎనభై ఎనిమిదవ సర్గ (88) సనాతన ధర్మం నుండి

తాను రహస్యంగా హెూమం చేసే ప్రదేశాన్ని తన శత్రువులకు
తెలిపినందుకు ఇంద్రజిత్తు తన చిన్నాన్న విభీషణుని మీద మండి
పడ్డాడు. నోటికి వచ్చినట్టు దూషించాడు. దానికి తగినట్టు సమాధానం
చెప్పాడు విభీషణుడు. మాటలతో లాభం లేదని ఇంద్రజిత్తు లక్ష్మణునితో యుద్ధానికి దిగాడు. ఆ సమయంలో ఇంద్రజిత్తు తన రథం మీద ఉన్నాడు. లక్ష్మణుడు హనుమంతుని వీపుమీద ఎక్కికూర్చుని ఉన్నాడు.ఇంద్రజిత్తు విభీషణుని, లక్ష్మణుని, వానర సేనానాయకులను చూచి ఇలా అన్నాడు. “ఇప్పటిదాకా మాటలు మాట్లాడాను ఇంక నా యుద్ధంకౌశలం చూపిస్తాను చూడండి. ఆకాశము నుండి కుంభవృష్టి కురిసినట్టు మీ మీద శరవర్షము కురిపిస్తాను. సాధారణంగా వర్షంలో తడుస్తారు. కాని నా బాణవర్షంలో మీరందరూ మాడి మసి అయిపోతారు. మీరందరూ యమసదనమునకు వెళ్లడానికి సిద్ధంగా ఉండండి. నా పేరే మేఘనాధుడు. నేను మేఘము వలె గర్జిస్తూ బాణములు వర్షం మాదిరి కురిపిస్తుంటే నా ముందు ఎవడు ఆగగలడు? కొన్ని రోజుల క్రితం నా చేతిలో పడి నువ్వు నీ అన్న రాముడు మూర్ఛపోయి చావుకు దగ్గరగా వెళ్లారు. అప్పుడే మర్చిపోయారా! ఏదో విధివశాత్తు బతికి బయటపడ్డారు. లేకపోతే ఆ నాడే యుద్ధము పరిసమాప్తి అయి ఉండేది. మరలా ఏముఖం పెట్టుకొని నాతో యుద్ధానికి వచ్చావు? నా చేతిలో చావాలనే కోరికతో వచ్చిఉంటావు. చావడానికి సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండటమేమిటి! నీవు ఈ పాటికి యమలోకం చేరుకున్నావు.”అని బీరములు పలికాడు ఇంద్రజిత్తు.ఇంద్రజిత్తు పలికిన పలుకులు అన్నీ సావధానంగా విన్నాడు లక్ష్మణుడు. ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు. “ఓ రాక్షసా! నీవు కేవలము మాటలతోనే కాలం గడుపుతున్నావు. అనుకున్నది చేసేవాడే బుద్ధి
మంతుడు. కేవలం మాటలతో పొద్దుపుచ్చేవాడు పిరికివాడు. నీవు
పలికేవన్నీ ధర్మపన్నాలు, చేసేవి దుష్టకార్యాలు. ఎదురుగా నిలబడి
యుద్ధం చేసేవాడే వీరుడు, పరాక్రవంతుడు. నీమాదిరి కనపడకుండా
యుద్ధం చేసేవాడు చోరుడు. పిరికి పంద. నీ లాంటి దొంగ, ఎదురుగా
నిలబడి యుద్ధం చేయడానికి భయపడి అదృశ్యంగా ఉండి యుద్ధం
చేస్తాడు. అలా యుద్ధం చేయడం వీరులకు, వీరత్వానికే సిగ్గుచేటు.
ఓ రాక్షసాధమా! నేను నీ ఎదురుగా ధనుర్బాణములు పట్టుకొని నిలబడిఉన్నాను. నీవు కూడా మాటలు కట్టిపెట్టి నా ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యి. చచ్చేముందు వీరుడవు అనిపించుకో. కనపడకుండా యుద్ధం చేసి దొంగలా చావకు.” అన్నాడు లక్ష్మణుడు.
ఆమాటలకు ఇంద్రజిత్తుకు కోపము, రోషము, పౌరుషము కలిగాయి. మారు మాటాడకుండా లక్ష్మణుని మీద శరప్రయోగము చేసాడు. విషసర్పముల వంటి బాణములను ప్రయోగించాడు. కాని
వాటన్నిటినీ లక్ష్మణుడు తన బాణములతో నిర్వీర్యము చేసాడు.
ఇంద్రజిత్తు కొడుతున్న బాణముల దెబ్బకు లక్ష్మణుని శరీరం రక్తసిక్తము అయింది. “ఓ లక్ష్మణా! చూచావా నా అస్త్రవిద్యా కౌశలము. ఇవిగో ఈ నారాచములతో నీ ప్రాణం తీస్తాను కాచుకో. చచ్చిన నీ శరీరం మీద డేగలు గద్దలు వాలి నీ శరీరాన్నిపీక్కుతింటాయి. అది నేను కళ్లారా చూస్తాను. తను నా చేతిలో చస్తాను అనే భయంతో నీచుడైన రాముడు నిన్ను నా మీదికి యుద్ధానికి పంపాడు. అది నీవు తెలుసు కోలేక తగుదునమ్మా అంటూ నా మీదికి యుద్ధానికి వచ్చావు. నీ తల తెగి నేలమీద దొర్లుతుంటే, అది చూడానికి రాముడు ఇప్పుడు వస్తాడు. చూస్తూ ఉండు.” అంటూ వాడి అయిన బాణముల వంటి మాటలు విసురుతున్నాడు ఇంద్రజిత్తు. ఆ మాటలకు లక్ష్మణుడు నవ్వుతూ " ఏం రాక్షసా! ఊరికే
మాట్లాడట మేనా.యుద్ధం చేయడం ఏమన్నా ఉందా. నీ గొప్పలు నీవు చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది. అవి చేతలలో చేసి చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు. నీ మాదిరి నేను ప్రగల్భములు పలుకను. అలా పలకడం కూడా నా చేత కాదు. నీ మాటలకు నా బాణాలే సమాధానం చెబుతాయి" అంటూ లక్ష్మణుడు ఐదు నారాచబాణములను ఇంద్రజిత్తు మీద ప్రయోగించాడు. అవి సూటిగా వెళ్లి ఇంద్రజిత్తు వక్షస్థలంలో గుచ్చుకున్నాయి. వెంటనే ఇంద్రజిత్తు మూడు బాణములతో లక్ష్మణుని కొట్టాడు.

సశేషం

సనాతన ధర్మం

04 Jan, 13:18


ఈరోజు మందేశ్వర స్వామి వారు🙏🙏 ( మందపల్లి)

సనాతన ధర్మం

04 Jan, 12:43


#ముకుందమాల #4వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

04 Jan, 05:56


శ్రీమద్రామాయణము||యుద్ధకాండము
ఎనభై ఏడవ సర్గ.(87) సనాతన ధర్మం నుండి

లక్ష్మణుడు, విభీషణుడు ఇంద్రజిత్తు ఉన్న వైపుకు వెళ్లారు.
కాని వారు ఇంద్రజిత్తుతో యుద్ధం చేయలేదు. ఇంద్రజిత్తు హోమం
చేయబోయే ప్రదేశమునకు వెళ్లారు. ఆ ప్రదేశము పెద్ద వనము
మధ్యలో ఉంది. అక్కడ బాగా విస్తరించిన మర్రిచెట్టును లక్ష్మణునకు
చూపాడు విభీషణుడు. "లక్ష్మణా! ఇంద్రజిత్తు యుద్ధానికి
బయలుదేరేటప్పుడు అక్కడే భూత బలులు ఇచ్చి యుద్ధమునకు
బయలుదేరుతాడు. అప్పటి నుండి ఇంద్రజిత్తు ఎవరికీ కనపడకుండా
యుద్ధం చేస్తాడు. అతడు వేసే బాణాలు కనపడతాయి కానీ అతను
కనపడడు. ఇంద్రజిత్తు ఈ మర్రిచెట్టు దగ్గరకు రాక ముందే అతనిని
చంపాలి.” అని అన్నాడు విభీషణుడు.లక్ష్మణుడు తన ధనుస్సును ఎత్తి నారిని సారించి, ఇంద్రజిత్తు కోసం వేచి ఉన్నాడు. ఇంతలో రథమును ఎక్కి ఖడ్గమును ధరించిన ఇంద్రజిత్తు రావడం కనిపించింది. లక్ష్మణుడు ఇంద్రజిత్తు ముందు నిలబడ్డాడు. “నేను నీతో యుద్ధానికి వచ్చాను. నాతో యుద్ధం చెయ్యి." అని ఇంద్రజిత్తును యుద్ధానికి ఆహ్వానించాడు. తాను అక్కడకు వస్తున్నట్టు, హోమం చేస్తున్నట్టు లక్ష్మణునికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్తు. ఇంతలో లక్ష్మణుని పక్కనే ఉన్న విభీషణుని చూచాడు. ఇంద్రజిత్తు కోపం మిన్నుముట్టింది. విభీషణుని చూచి ఇలా అన్నాడు.
“ఓ విభీషణా! నీవు రాక్షస కులంలో పుట్టావు. లంకలో పుట్టి
పెరిగావు. నా తండ్రికి తమ్ముడివి. నాకు తండ్రితో సమానుడవు.
అటువంటి నీవు, నీ కుమారుడనైన నాకే ద్రోహం తలపెట్టడానికి నీకు
మనసెలా ఒప్పింది. అయిన వాళ్లను అందరినీ కాదని శత్రువులతో
చేతులు కలిపినందుకు నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతూ ఉంది.
సాటి వాళ్లు నిన్ను ఎన్నటికీ క్షమించరు. నీకు అసలు బుద్ధి లేదు. ఉన్నా అది పనిచేయడం లేదు. లేకపోతే బంధువులకు శత్రువులకు తేడా తెలియదా నీకు! బంధువులను వదిలి శత్రువులతో చేతులు కలిపిన నిన్ను బంధువు అని చెప్పుకోడానికి మనసు రావడం లేదు.
నీ శత్రువులు గుణవంతులే కావచ్చు నీ స్వజనులు నీచులే
కావచ్చు. కాని గుణవంతులైన శత్రువులకన్నా గుణములేని స్వజనులే మేలు అని తెలియదా! శత్రువు ఎన్నటికీ శత్రువే అని గుర్తుపెట్టుకో! తన వాళ్లను వదిలి శత్రు పక్షము చేరిన వానిని, అవసరం ఉన్నంతవరకూ ఉపయోగించుకొని, అవసరం తీరగానే ఆ శత్రువులే నిన్ను చంపుతారు. అదే రాజనీతి. ఆ మాత్రం తెలియదా నీకు! నీకు జాలి, దయ లేదు. అందుకే లక్ష్మణుని ఈ రహస్య
ప్రదేశానికి తీసుకొని వచ్చావు. నీవు పౌరుషహీనుడవు. పైగా జ్ఞాతివి.
అందుకే ఇంతటి హేయమైన పనికి ఒడిగట్టావు. నీ ముఖం చూడడం
కూడా మహాపాపము." అని అన్నాడు ఇంద్రజిత్తు.ఆ పరుషమైన మాటలకు విభీషణుడు ఇలా అన్నాడు."కుమారా! ఎందుకు అలా మితిమీరి మాట్లాడతావు. నా గురించి, నా గుణగణముల గురించి, నా స్వభావము గురించి నీకు తెలియదా! నేను నీ తండ్రి సోదరుడను అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. నేను దుర్మార్గపు వంశమైన రాక్షస వంశములో జన్మించాను. కాని మానవులకు సహజంగా ఉండే శీలాన్ని,సుగుణాలను స్వంతం చేసుకున్నాను. రాక్షస గుణములను విడిచిపెట్టాను. రాక్షసులకు స్వభావసిద్ధమైన దారుణమైన పనులు చేయడం నాకు ఇష్టం లేదు. అధర్మంగా ప్రవర్తించడం అసలు నచ్చదు.కేవలం నేను మంచి వాడిని అనే నెపంతో, తానే చేసే చెడ్డ పనులను సమర్ధించలేదనే నెపంతో, నీ తండ్రి నన్ను వెళ్లగొట్టాడు. ఏ అన్న అయినా తమ్ముడిని వెళ్లగొడతాడా! అదీ నా మంచికే జరిగింది. దుర్మార్గులను వదిలి సన్మార్గుల పంచన చేరాను. సుఖంగా ఉన్నాను.ఇతరుల ధనాన్ని అపహరించేవాళ్లను, ఇతరుల భార్యలను కోరుకొనేవాడిని వెంటనే విడిచిపెట్టమన్నారు పెద్దలు. ఎందుకంటే ఇతరుల ధనాన్ని కోరడం, ఇతరుల భార్యలమీద కోరిక పెంచుకోవడం, మంచి వాళ్లను అనుమానించడం మంచి లక్షణములు కావు. అవి వినాశహేతువులు.నీవు, నీ తండ్రి, నీ వాళ్లు చేసిన పనులు ఏమిటి! మహర్షులను చంపడం, దేవతలతో విరోధం పెంచుకోవడం, నా కన్నా గొప్పవాడు లేడని అహంకరించడం, అందరితో శత్రుత్వము పెట్టుకోవడం, ఇవే కదా. ఈ దుర్గుణాలే నిన్ను నీ తండ్రిని చెడుమార్గం పట్టించాయి. ఆ మార్గంలో నేను నడవదలచుకోలేదు. అందుకనే బయటకు వచ్చాను. నీవు నీ తండ్రి ఈ లంకానగర నాశనమునకు కంకణం కట్టుకున్నారు అందుకే నా మాట విని సీతను రామునికి ఇవ్వకుండా, యుద్ధానికి పాల్పడ్డారు.
ఓ కుమారా! నీ తండ్రి మాదిరి నీవు కూడా అహంకారివి. మూర్ఖుడవు. నీకు తెలియదు. ఒకరు చెబితే వినవు. నీకు పెద్దల ఎడల
గౌరవము వినయము మచ్చుకైనా లేవు. నీకు యమలోకము
సందర్శించు కాలము సమీపించినది. అందుకే నీ ఇష్టం వచ్చినట్టు
మాట్లాడుతున్నావు. ఓ ఇంద్రజిత్తూ! నీ వినాశనం దాపురించింది. నీవు ఈ మర్రిచెట్టులో ప్రవేశించలేవు. లక్ష్మణుణ్ణి ఎదిరించలేవు. జయించలేవు. చేతనైతే యుద్ధం చేసి, లక్ష్మణుడి బాణాలకు బలి కా! యమలోకంలో నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నీ కన్నా ముందు యమలోకం చేరిన నీ వాళ్లు, నీకోసరం ఎదురు చూస్తున్నారు.
త్వరగా వెళ్లు." అని పలికాడు విభీషణుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము. ఎనభైఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

03 Jan, 02:42


శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారు *విశాఖపట్నం*🙏

సనాతన ధర్మం

03 Jan, 02:36


శ్రీమద్రామాయణము||యుద్ధకాండము
ఎనభై ఆరవ సర్గ.(86) సనాతన ధర్మం నుండి

విభీషణుడు వానర సేనా నాయకులతో ఇలా అన్నాడు.
“రాక్షససేనలు ఇంద్రజిత్తుకు రక్షణ కల్పిస్తున్నారు. మీరు ఎలాగైనా వారు మీతో యుద్ధం చేసేటట్టు రెచ్చగొట్టండి. వారు మీతో యుద్ధం చేస్తున్న సమయంలో మేము ఇంద్రజిత్తును ముట్టడిస్తాము.” అని అన్నాడు. తరువాత లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా!ఇంద్రజిత్తు సైన్యం మధ్యలో ఉన్నాడు. నీవు నీ యుద్ధవిద్యాకౌశలంలో ఈ సైన్యాన్ని చీల్చుకుంటూ ఇంద్రజిత్తును పట్టుకో. ఇంద్రజిత్తు హోమం చెయ్యడానికి వెళ్లక ముందే నీవు ఇంద్రజిత్తును సంహరించాలి. ఇంద్రజిత్తును చంపడంలో అధర్మము పాపం లేదు ఎందుకంటే వాడు మాయావి. దుర్మార్గుడు, క్రూరుడు. లోకాలన్నీ వాడిని చూచి భయపడుతున్నాయి. అట్టి వానిని చంపడంలో దోషం లేదు.” అని అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు వెంటనే రాక్షస సేనల మీద
శరవర్షము కురిపించడం మొదలెట్టాడు. వానర సేనలు భల్లూక
సేనలు కూడా వృక్షములతోనూ పెద్ద పెద్ద బండరాళ్లతోనూ రాక్షసులతో
యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు కూడా ఖడ్గములు, శక్తి ఆయుధములు, తోమరములు ధరించి వానరులతో యుద్ధం
చేస్తున్నారు. రాక్షసులకు వానరులకు మధ్య ఘోరమైన యుద్ధం
జరుగుతూ ఉంది. ఇరుపక్షముల వారు ఒకరి మీద ఒకరు
విసురుకుంటున్న ఆయుధములతో ఆకాశం కప్పబడి పోయిందా
అన్నట్టు ఉంది. వానరులు పెద్ద పెద్ద వృక్షములను, కొండ శిలలను
చేతులలో ధరించి రాక్షసులను కొట్టి కొట్టి చంపుతున్నారు. తమతో
యుద్ధం చేస్తున్న భల్లూకములను, వానరములను చూచి రాక్షసులకు
భయం కలిగింది. రాక్షస సేనలు పారిపోసాగాయి.అప్పటికి ఇంద్రజిత్తు హోమం చెయ్యడానికి కూర్చోబోతున్నాడు. ఇంతలో రాక్షసులు వానరులు, భల్లూకముల ధాటికి తట్టుకోలేక పారిపోతున్నారు అన్న వర్తమానం అందింది. ఇంద్రజిత్తు హెూమం ప్రారంభించకుండానే లేచాడు. తన రథము ఎక్కాడు. ధనుర్బాణములు ధరించాడు. వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. తమ నాయకుడు యుద్ధము చేయడానికి వచ్చాడు అని తెలియగానే పారిపోతున్న రాక్షస సేనలు వెనక్కు తిరిగాయి. అమితోత్సాహంతో వానరుల మీదికి దుమికాయి.అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద వృక్షమును పెకలించి దానితో రాక్షసులను చితకబాదుతున్నాడు. హనుమంతుని ధాటికి రాక్షస సైన్యము చనిపోవడమో మూర్ఛపోవడమో జరుగుతూ ఉంది.ఆ ప్రకారంగా రాక్షస సేనలను చంపుతున్న హనుమంతుని
చూచిన రాక్షస సేనలు ఒక్కుమ్మడిగా హనుమంతుని చుట్టు
ముట్టాయి. హనుమంతుని మీద శూలములను, ఖడ్గములను, శక్తి
ఆయుధములను, పట్టిశములను, పరిఘలు, గదలు, కుంతములు,
శతఘ్నులు, ఇనుముతో చేసిన ముద్గరలు, గండ్రగొడ్డళ్లు మొదలగు
ఆయుధములను ప్రయోగించారు రాక్షసులు. ఆ ఆయుధముల బారి
నుండి తప్పించుకుంటూ హనుమంతుడు చేతికందిన రాక్షసుని
అందినట్టు చంపుతున్నాడు.అలా ముందుకు చొచ్చుకుపోతున్న హనుమంతునికి రథము మీద ఉన్న ఇంద్రజిత్తు కనపడ్డాడు. రాక్షసులను మట్టికరిపిస్తున్న హనుమంతుని చూచాడు ఇంద్రజిత్తు. తన రథమును హనుమంతుని ఉన్నచోటికి పోనిచ్చాడు. ఇంద్రజిత్తు హనుమంతుడు ఎదురు ఎదురుగా వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్తు హనుమంతుని మీద బాణములు, ఖడ్గములు, పట్టిశములు, గండ్రగొడ్డళ్లు వర్షంలా కురిపించాడు. ఆ ఆయుధములను లెక్కపెట్టలేదు హనుమంతుడు. ఇంద్రజిత్తును చూచి ఇలా అన్నాడు.
“ఓ రాక్షసాధమా! వీరుడవైతే, చేతనైతే యుద్ధం చెయ్యి. నాముందు నిలబడ్డవాడు ప్రాణాలతో వెనుదిరిగిపోలేడు. రా! నీ రథం దిగిరా. నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి. నా వేగాన్ని తట్టుకొని నిలబడు.
వీరుడవు అనిపించుకో!" అని ఇంద్రజిత్తు మీదికి దూకాడు.అప్పుడు ఇంద్రజిత్తు తన ధనుస్సు ఎత్తి హనుమంతుని మీద దివ్యాస్త్రములను ప్రయోగించడానికి సిద్ధం అయ్యాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న విభీషణుడు లక్ష్మణునితో "లక్ష్మణా! ఇంద్రజిత్తు
హనుమంతుని చంపడానికి వెళుతున్నాడు. ఇంద్రజిత్తు మీద నీ వద్ద
ఉన్న అస్త్రములను ప్రయోగించు. ఇంద్రజిత్తును అంతమొందించు.”
అని అన్నాడు.విభీషణుని మాటలు విన్న లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద దృష్టిసారించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఎనభైఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

02 Jan, 12:30


శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి లీలలు|| శ్రీ గురుచరిత్ర 13 వ అధ్యాయము
https://youtu.be/2yiQPmBBINo

సనాతన ధర్మం

01 Jan, 13:12


శ్రీమద్రామాయణము,బాలకాండ 20వసర్గ
శ్రీరాముని యాగ సంరక్షణ కు పంపమని అడిగిన విశ్వామిత్రుడు||
Like share subscribe
https://youtu.be/1GSyrQWj-Rs

సనాతన ధర్మం

01 Jan, 13:12


కోనసీమ జిల్లాలోని వ్యాఘ్రేశ్వరం గ్రామము లో ఏకాదశ రుద్రులలో ఒకరైన *విశ్వేశ్వర రుద్రుడు* , శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి వారి ఆలయము, మరియు స్థలపురాణము
https://youtu.be/FqNpfJIjPZo

సనాతన ధర్మం

01 Jan, 13:01


#ముకుందమాల #3వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

01 Jan, 12:51


శ్రీదత్త పురాణము|| చతుర్ధ భాగం
భార్గవ రాముని చరిత్ర || పద్నాలుగు లో రెండు (14-2)

తల్లి పవిత్రురాలై పునరుజ్జీవించాలనీ ఈ శిరఃఖండన వృత్తాంతం ఆమెకు గుర్తుండకూడదనీ సోదరులు నలుగురూ శాపవిముక్తులు కావాలనీ తనకు మాతృహననదోషం అంటకూడదనీ రణరంగంలో అప్రతిహత శక్తి దీర్ఘాయువూ తనకు కావాలనీ రాముడు కోరుకున్నాడు. జమదగ్ని తథాస్తు అన్నాడు. రేణుకాదేవి నిద్రనుంచి మేల్కొనట్టు కళ్ళు తెరచి చూసింది. అన్నగార్ల జడత్వం వదిలిపోయింది. తానూ విముక్తుడు అయ్యాడు. అటుపైన కొంతకాలానికి కార్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కుపోయాడు. దీనికి అలిగిన భార్గవ రాముడు కార్తవీర్యుడి సహస్ర బాహులను ఖండించి సంహరించాడు.హోమధేనువుని తోలుకుని తెచ్చుకున్నాడు. దీనికి ప్రతీకారంగా కార్యవీర్యుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా
ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు. దీనికి కసలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భూమండలమంతా ఇరవై యొక్కసార్లు గాలించి దుష్టక్షత్రియ సంహారం చేశాడు. వారి రక్తంతో శమంతపంచకంలో తొమ్మిది మడుగులు నింపి పితృ తర్పణాలు విడిచిపెట్టాడు. ఆ తరువాత పదిబారల పొడుగూ తొమ్మిది బారల వెడల్పుతో బంగారు
వేదికను నిర్మించి భూరిదక్షిణలతో మహాయజ్ఞం చేశాడు. యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు
కశ్యపుడికి దానం చేశాడు. దాన్ని ఆ మహర్షి అనుజ్ఞతో సమభాగాలుగా ఖండించి యార్టికులందరూ పంచుకున్నారు.
అప్పటి నుంచీ ఆ బ్రాహ్మణులకు ఖండవాయనులని పేరు ఏర్పడింది.
క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టాడు. సరస్వతీ నదీలో అవభృధస్నానం చేశాడు. కల్మషాలన్నీ తొలగించుకున్నాడు. ఈ మహేంద్రపర్వతం మీద నివాసం ఏర్పరుచుకుని ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు - అని అకృతబ్రాహ్మణుడు భార్గవరామ కథను ముగించాడు. అప్పటికి తెల్లవారింది చతుర్ధశి వచ్చింది, భార్గవరాముడు వచ్చాడు. ధర్మజాదులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో పాదపూజలు చేశారు. భార్గవుడు కూడా వారినందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమంలోనే ఆతిథ్యమిచ్చి మర్నాడు వీడ్కోలు పలికాడు. తానూ దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు. దీపకా ! విన్నావు కదా ! శ్రీమన్నారాయణుడు దత్తరూపంలో వరాలిచ్చి కార్యవీర్యార్జునుణ్ని మహావీరుణ్ని చేసి అతడు కోరుకున్నట్టే అధికవీరుడై విప్రుడై భార్గవరాముడై వచ్చి అతణ్ని సంగ్రామంలోనే సంహరించాడు. నాయనా ! ఇదీ విష్ణోశ్చరితమధ్భుతమ్ ! సంక్షేపంగా చెప్పాను - అని వేదధర్ముడు ముగించాడు. గురుదేవా ! దత్తాత్రేయుడు సాధ్యజాతిదేవతలు వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించే శమదమాదుల్నీ, నీతుల్నీ ఉపదేశించాడని విన్నాను. వాటిని తమరు నాకుకూడా ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను. దీపకా ! జ్ఞానకళా స్వరూపుడూ - స్వయంభువూ అయిన పరమేశ్వరుడే అత్రిపుత్రుడుగా అవతరించాడు. అతడు జ్ఞాన ఘనుడు. సాక్షాజ్జగద్గురుడతడు. దేవతలకూ, సిద్ధులకూ, సాధ్యులకూ, మనుష్యులకు అందరికీ అతడే పరమ గురువు. జ్ఞాన - యోగ - తపో - యమ - నియమ - శమాది మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా సేవించినా దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహం పొందుతారు. ఆయనే అందరికీ మార్గమూ గమ్యమూను. సంసార సాగరాన్ని తరించి కృతార్థత పొందాలంటే ఈ సద్గురూపాసన ఒక్కటే సాధనం. అంచేత సాధ్యజాతి దేవతలు సైతం దత్తాత్రేయుణ్ని ఆశ్రయించి భక్తిజ్ఞాన యోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకికాలౌకిక విషయాలన్నింటినీ అడిగి తెలుసుకొని వెడుతుంటారు. అలా ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రభోదాలను
ఒకానొక సందర్భంలో విదురుడు దృతరాష్ట్రుడికి వినిపించాడు. వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందు ఉంచుతాను
గ్రహించుకో - అని వేధర్ముడు ఇలా ప్రవచించాడు.

హరిః ఓం తత్సత్
శ్రీ దత్తాయ గురవేనమః

సనాతన ధర్మం

01 Jan, 05:28


శ్రీమద్రామాయణము||యుద్ధకాండము
ఎనభైఐదవ సర్గ.(85) సనాతన ధర్మం

“సీత క్షేమంగా ఉంది. ఆమెకు ఏమీ కాలేదు.” అన్నమాట మాత్రం
వినబడింది రాముడికి. ఆ ఆనందంలో విభీషణుడు ఏమి చెబుతున్నాడో దేని గురించి చెబుతున్నాడో అర్థం కాలేదు కాసేపటికి
రాముడు లేచి కూర్చున్నాడు. విభీషణునితో ఇలా అన్నాడు. “విభీషణా! నీవు ఏమి చెప్పావో నేను సరిగా వినలేదు. ఏదీ
మరలా ఒకసారి చెప్పు.” అని అడిగాడు.విభీషణుడు మరలా చెప్పనారంభించాడు. “ఓ రామా! నీవు నన్ను సేనలను నిర్ణీత ప్రదేశములలో నిలుపమని చెప్పావు కదా. నేను ఆ పనిలో ఉన్నాను. సైన్యములను విభాగములుగా చేసి వాటిని నిర్ణీత స్థలములలో నిలిపి సేనానాయకులకు తగిన సూచనలు ఇచ్చాను. ఆ విషయము నీతో చెప్పడానికి వస్తే ఇక్కడ నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నీవు అకారణంగా శోకిస్తున్నావు. నీవు ఇలా శోకిస్తున్నావు అని తెలిస్తే
ఇంద్రజిత్తు ఇంకా రెచ్చిపోతాడు. కాబట్టి నీ శోకము మాను. కర్తవ్యమును ఆలోచించు. మనము రాక్షసులను సంహరించి సీతను
దక్కించుకోవాలంటే ముందు దుఃఖించడం మానుకోవాలి. మనసంతా
సంతోషం నింపుకోవాలి. అప్పుడే సరి అయిన నిర్ణయం తీసుకోగలము. ప్రస్తుతము ఇంద్రజిత్తు నికుంభిల అనే దేవి ఆలయములో ఉన్నాడు.ఇంద్రజిత్తును చంపడానికి ఇదే తగిన సమయము. ఆ పనిమీద లక్ష్మణుని నా వెంట పంపు. ఇంద్రజిత్తు తాను తలపెట్టిన హెూమమును నికుంభిల ఆలయములో పూర్తిచేస్తే
అతనిని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. అతడు మనలను అందరినీ చంపుతాడు. మన మరణము తథ్యము.దీనికి ఒక కారణం ఉంది. ఇంద్రజిత్తు బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. "ఓ ఇంద్రజిత్! నీవు నికుంభిల ఆలయంలో హెూమం చెయ్యి. అప్పుడు నీవు అజేయుడవు అవుతావు. కానీ, నికుంభిల ఆలయం చేరక ముందుకానీ, చేరిన తరువాత, ఆ హెూమం చేయకముందుకానీ, ఎవడైతే నిన్ను ఎదిరిస్తాడో అతడే నిన్ను
చంపుతాడు. అతడే నీ మృత్యువు. కాబట్టి ఆ హోమాన్ని రహస్యంగా
చెయ్యి" అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇంద్రజిత్తు నికుంభిల
ఆలయంలో ఆ హెూమం చేయబోతున్నాడు. ఆ విషయం నేను నా
మంత్రుల ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి మనం తొందరగా
నికుంభిల ఆలయానికి సైన్యాలతో చేరుకోవాలి. దానికి లక్ష్మణుడు
నాయకత్వం వహించాలి. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు చంపబడితే,
రావణుడు కూడా చంపబడినట్లే.” అని అన్నాడు విభీషణుడు.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ విభీషణా! రాక్షస మాయలు నాకు కొత్త కాదు. కానీ సీతను తన కళ్లముందే వధించడం గురించి హనుమంతుడు చెప్పగా విని మూర్ఛపోయాను. ఇంద్రజిత్తు
సామాన్యుడు కాడు. ఎన్నో మాయలు తెలిసిన వాడు, మహా
పరాక్రమవంతుడు. బ్రహ్మాస్త్ర ప్రయోగము తెలిసినవాడు. యుద్ధములో వరుణుని కూడా ఓడించగల సమర్ధుడు. ఎవరికీ కనపడకుండా మాయాయుద్ధము చేయడంలో ఇంద్రజిత్తు దిట్ట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మణా! నీవు, సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు అంతా కలిసి వెళ్లండి. ఇంద్రజిత్తు మాయలు,యుద్ధతంత్రములు బాగా ఎరిగిన విభీషణుడు, అతని అనుచరులు మీ వెంట ఉంటారు. ఇంద్రజిత్తును సంహరించండి. విజేతలై తిరిగి రండి.” అని ఇంద్రజిత్తును చంపడానికి అనుజ్ఞ ఇచ్చాడు రాముడు.వెంటనే లక్ష్మణుడు తన ధనుర్బాణములు తీసుకున్నాడు.కవచము ధరించాడు. ఖడ్గము నడుముకు బిగించాడు. రాముని పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు. “రామా! నేను నా పదునైన బాణములతో ఇంద్రజిత్తును సంహరిస్తాను.” అని పలికాడు. తరువాత ఇంద్రజిత్తు హోమం చేస్తున్న నికుంభిల ఆలయమునకు వెళ్లాడు. సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు, హనుమంతుడు లక్ష్మణుని వెంట వెళ్లారు. వారి వెంట వేలకొద్దీ వానర సైన్యము అనుసరించింది.
నికుంభిల ఆలయము చుట్టు మోహరించి ఉన్న రాక్షస సైన్యమును చూచాడు లక్ష్మణుడు. ఎలాగైనా ఆలయమునకు చేరుకోక ముందే లేక హెూమము పూర్తి కాకముందే ఇంద్రజిత్తును చంపడానికి నిశ్చయించుకున్నాడు లక్ష్మణుడు. వానర సేనలు రాక్షస సేనలను ఎదుర్కొన్నాయి.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఎనభై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

31 Dec, 11:24


#ముకుందమాల #2వశ్లోకము

#ప్రతిరోజుఒకశ్లోకము

హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే!!

#చంద్రశేఖరపాహిమాం

సనాతన ధర్మం

31 Dec, 04:49


శ్రీమద్రామాయణము|| యుద్ధకాండము
ఎనభైనాలుగవ సర్గ.(84)

జై శ్రీరామ్ , ప్రతీరోజూ రామాయణము

ధ్యానం
శ్లో " రామాయ రామభద్రాయ.
రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః
పతయే నమః ||

శ్లో " ఆపదా మపహర్తారం దాతారం
సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో
భూయో నమామ్యహూమ్ ||

శ్లో " దక్షిణే లక్ష్మణోయస్య వామేచ
జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే
రఘునందనమ్ ||

రాముడి పక్కన కూర్చున్న లక్ష్మణుడు ఇలా విలపిస్తుంటే,
అంతకు ముందు రాముడు ఇచ్చిన ఆదేశముల మేరకు విభీషణుడు
సైనికులకు, సేనాపతులకు తగిన సూచనలు ఇచ్చి ఆ విషయం
రామునికి చెప్పడానికి, రాముని వద్దకు వచ్చాడు. అక్కడ అంతా విషాద వాతావరణము నెలకొని ఉండటం చూచాడు. లక్ష్మణుడితో సహా అక్కడ అంతా ఏడుస్తున్నారు. ఎందుకో అర్ధం కాలేదు విభీషణుడికి. లక్ష్మణుడి ఒడిలో స్పృహలేకుండా పడి ఉన్న రాముడిని చూచాడు. “ఏమిటిది! రాముడికి ఏమయింది? అందరూ ఎందుకు
శోకిస్తున్నారు?" అని ఆతురతగా అడిగాడు.అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు. "సీతను రణభూమికి తీసుకొని వచ్చి హనుమంతుడు ఇతర వానర నాయకుల ఎదురు గుండా ఇంద్రజిత్తు సీతను చంపాడు. ఆ విషయాన్ని హనుమంతుడు రామునికి చెప్పాడు. రాముడు మూర్ఛపోయాడు. వానర నాయకులంతా శోకిస్తున్నారు. అని ఇంకా ఏదో చెప్పబోతుంటే విభీషణుడు ఇలా అన్నాడు. " “ఓ రామా! సముద్రము ఎండి పోయింది అని చెబితే ఎలా ఉంటుందో సీతను ఇంద్రజిత్తు చంపాడు అని చెబితే అలాగే ఉంటుంది. సీతమీద ఈగ వాలినా రావణుడు సహించడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అటువంటిది ఇంద్రజిత్తు సీతను చంపడానికి ఎలా ఒప్పుకుంటాడు? సీతను ఇంత దూరం తీసుకొని వచ్చింది, సీత కోసం ఇంత యుద్ధం చేస్తున్నది సీతను చంపుకోడానికి కాదు కదా! నేను రావణునితో సీతను విడిచిపెట్టమని ఎన్నోమార్లు చెప్పినా, బతిమాలినా, రావణుడు ససేమిరా అన్నాడు. అసలు సీతను రావణుడు ఎక్కడ ఉంచిందీ ఎవరికీ తెలియదు. ఇంద్రజిత్తుకు కూడా తెలియదు.
ఇదంతా ఇంద్రజిత్తు పన్నిన రాక్షస మాయ. అది మీరు తెలుసుకోలేక
పోయారు. ఆమె మాయా సీత. సీతను పోలిన రాక్షస స్త్రీ. ఇంద్రజిత్తు
మిమ్ములను సమ్మోహితులను చేసాడు. ఇంక సీత విషయం గురించి
శోకించడం ఆపి అసలు విషయం వినండి. ఇప్పుడు ఇంద్రజిత్తు నికుంభిల దేవి ఆలయమునకు వెళ్లాడు. అక్కడ హోమం చేస్తున్నాడు. ఆ హెూమం పూర్తి అయితే ఇంద్రజిత్తును ఓడించడానికి ఇంద్రుడి తరం కూడా కాదు. తాను చేయబోయే హెూమమునకు వానరులు విఘ్నం కలుగచేయకుండా, వారిని శోక సముద్రంలో ముంచి వారి దృష్టిని మరల్చడానికి సీతను చంపడం అనే మాయను పన్నాడు. మీరు ఆ మాయలో పడ్డారు. ఇంద్రజిత్తు చేస్తున్న హెూమం పూర్తి అయేలోగా మనము మన సైన్యములతో అక్కడికి చేరుకోవాలి.
రామా! నీవు అకారణంగా ఇలా శోకిస్తుంటే వానర సేనా నాయకులు అంతా శోకిస్తున్నారు. నీ సీత క్షేమంగా ఉంది. ఆమెకు ఏమీ కాలేదు. నీవు ఇక్కడే ఉండు. లక్ష్మణుని మా వెంట పంపు. మేము నికుంభిలా దేవాలయమునకు వెళతాము. లక్ష్మణుడు తన బాణములతో ఆ యజ్ఞమును విఘ్నము చేయగలడు. అప్పుడు మనము ఇంద్రజిత్తును సులభంగా చంపవచ్చును. మాకు ఆజ్ఞ ఇమ్ము. నీ ఆదేశము కొరకు ఎదురుచూస్తున్నాము. ఇంద్రజిత్తు వధకు అనుజ్ఞ ఇమ్ము.” అని పలికాడు విభీషణుడు. నిజం తెలుసుకున్న రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఎనభైనాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

30 Dec, 15:52


కోల్హాపూర్ *మహాలక్ష్మి* అమ్మవారు

సనాతన ధర్మం

30 Dec, 15:49


Photo from తంగిరాల చంద్రశేఖర అవధాని

సనాతన ధర్మం

30 Dec, 15:48


Photo from తంగిరాల చంద్రశేఖర అవధాని

సనాతన ధర్మం

30 Dec, 15:48


శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారి దివ్య దర్శనం

సనాతన ధర్మం

30 Dec, 15:22


నవ జనార్ధనాలలో ఒకటైన ఆరవ జనార్ధన స్వామి వారు, కపిలేశ్వరపురం

సనాతన ధర్మం

30 Dec, 15:15


శ్రీదత్త పురాణము || చతుర్ధ భాగం
భార్గవరాముని చరిత్ర || పద్నాలుగు లో ఒకటి (14-1)

మాయాద్యూతంలో సర్వస్వాన్నీ కోల్పోయిన ధర్మరాజు అనుద్యూతంకూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్నితో వనవాసానికి బయలుదేరాడు. మరికొందరు హితులూ, సన్నిహితులూ, మునులు వారి వెంట నడిచారు. అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి దీవెనలు పొందుతూ వనవాసం గడుపుతున్నారు. కొంతకాలానికి మహేంద్ర పర్వతంమీద భార్గవరాముని ఆశ్రమం చేరుకున్నారు. పాండవులు అక్కడి పుణ్యతీర్ధాలలో పవిత్ర స్నానాలు చేసి దేవర్షి పితృతర్పణ విధులు నిర్వహించారు. రోమశమహర్షి మార్గదర్శకత్వంలో అక్కడి ఆశ్రమాలనూ అక్కడి ఋషులను సందర్శించారు, ఆశీస్సులు పొందారు. భృగు - అంగిరస - వాసిష్ఠ - కాశ్యప - అకృతవ్రణాది మహర్షుల్ని దర్శించి సంబరపడిన ధర్మరాజు - భార్గవరాముని
ఆశ్రమమైతే కనిపించింది కానీ ఆ మహర్షి దర్శన భాగ్యం లభించలేదు. ఈ జన్మకి నాకు ఆ అదృష్టం ఎప్పుడో - అని తన అభిలాషను ఆ మహర్షులముందు ప్రకటించాడు. అది విన్న అకృత వ్రణుడు - ధర్మజా ! మీ రాక భార్గవరామునికి ముందే తెలుసు. మీరంటే చాలా ఇష్టం, కనక దర్శనం ఇస్తాడు. సాధారణంగా అష్టమికీ చతుర్ధశికీ ఈ ఆశ్రమానికి వస్తాడు. ఈ రాత్రి గడిస్తే రేపు చతుర్థశి. కాబట్టి మీరిక్కడ ఉండగలిగితే రేపే భార్గవరాముణ్ని సందర్శించవచ్చు - అన్నాడు. దీనికి సంబరపడి ధర్మజాదులందరూ ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు.
- - అతిథి మర్యాదలన్నీ అయ్యి అందరూ తీరికూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు. అకృతివ్రణా ! నువు భార్గవరాముని అనుచరుడివి. ఆ మహాబలపరాక్రమశాలి చేసిన ప్రతి పనికీ నువ్వు ప్రత్యక్ష సాక్షివి. అంచేత భార్గవరాముని పూర్వ వృత్తాంతంలో నీకు తెలియనిదిలేదు. ఆ మహానుభావుడు ముయ్యేడు మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారంగా జయించాడు ? ఏ కారణంగా జయించాడు ? ఈ వివరాలు యథాతధంగా వాస్తవరూపంలో తెలుసుకోవాలని నా కోరిక. అందుకు నువ్వొక్కడివే సమర్థుడివి దయచేసి నన్ను కృతార్ధుణ్ని చెయ్యి - అని అభ్యర్ధించాడు. ధర్మ సంభవా ! భృగువంశంలో జమదగ్ని కుమారుడుగా పుట్టి భార్గవరాముడు - జామదగ్నుడు అనే పేరు
పొంది అతి వజ్రాయుధమైన గండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడుగా విఖ్యాతిపొందిన ఆ మహానుభావుడి
చరిత్ర చెబుతాను ఆలకించు. హైహయవంశంలో పుట్టిన కార్తవీర్యార్జునుడు భార్గవ రాముని చేతిలో నిహతుడయ్యాడు. అతడికి వెయ్యి చేతులుండేవి. దత్తాత్రేయ ప్రసాదంవల్ల దివ్యకాంచన విమానం ఉండేది. అతడి రధమూ అటువంటిదే. దాని గమనానికి
అడ్డూ ఆపూ లేదు. ఆ రధం అధిరోహించి సమస్త భూపాలకుల్నీ ఓడించి సామంతుల్ని చేసుకున్నాడు. ఏడు ద్వీపాల వసుంధరను మొత్తం తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. అహంకరించి దేవతలను యక్షులనూ ఋషులనూ సమస్త భూతాలను పీడించసాగాడు. భరించలేక దేవతలూ ఋషులూ కలిసివెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. కార్తవీర్యుణ్ని సంహరించు, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. ఇంద్రుడు కూడా తన చేదు అనుభవం ఒకటి చెప్పాడు. శచీ సమేతుడై నందనంలో విహరిస్తున్న తనను దివ్యవిమానంమీద అటువైపు వచ్చిన కార్తవీర్యార్జునుడు అవమానించాడనీ, అతడి ఆగడాలు మితిమీరిపోయాననీ ఇక ఉపేక్షింపరాదనీ విన్నవించాడు. విష్ణుమూర్తి అందరి వేదనలూ విన్నాడు. ఆలోచిస్తాను వెళ్ళిరండి - అని పంపించాడు. తాను బయలుదేరి తన బదరికావనం చేరుకున్నాడు. ఇదేకాలంలో కాన్యకుబ్జాన్ని గాధి అని ఒక మహారాజు పాలిస్తున్నాడు. అతడు మహాబలశాలి. పరాక్రమశాలి.పరిపాలన బాధ్యతల్ని మంత్రులకి అప్పగించి అతడు కొంతకాలం సతీసమేతుడై వనవాసం చేశాడు. ఆ సమయంలో ఆ రాజదంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది. సత్యవతి అని పేరుపెట్టారు. దినదిన ప్రవర్థమాన అయ్యింది. అప్సరసలను
తలదన్నే సౌందర్యం. అందానికి తగిన గుణసంపద, భార్గవ వంశంలో పుట్టిన ఋచీకుడు సత్యవతిని చూసి ముచ్చటపడ్డాడు. తనకిచ్చి వివాహం చెయ్యమని గాదిదంపతుల్ని అభ్యర్ధించాడు. సంశిత ప్రతుడైన ఆ బ్రాహ్మణుణ్ని చూసి తన కులాచారం వెల్లడించాడు గాధి. శరీరమంతా తెల్లగా ఉండి ఒక్క చెవి నల్లగా ఉండే వెయ్యి గుర్రాలు
కన్యాశుల్కంగా ఇచ్చి సత్యవతిని పరిణయమాడమన్నాడు. శుల్కం తీసుకోకుండా కన్యాదానం చెయ్యడం మా కులాచారం కాదని చెప్పి కాన్యకుబ్జానికి వెళ్ళిపోయాడు.ఋచీకుడు వరుణుణ్ని అడిగి అటువంటి వెయ్యి గుర్రాలూ పొందాడు. అవ్వి కాన్యకుబ్జం చెంత గంగనుంచి పైకి వచ్చాయి. అప్పటి నుంచీ ఆ రేవుకి అశ్వతీర్ధమనే పేరు స్థిరపడింది. ఆ గుర్రాలని గాధికి అందించి ఋచీకుడు సత్యవతిని అగ్నిసాక్షిగా సొంతం చేసుకున్నాడు. కాన్యకుబ్జంలోనే ఉండి రాజభోగాల్లో శృంగార క్రీడల్లో మునిగితేలుతున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున ఋచీకుడి తండ్రి భృగువు వచ్చాడు. కొడుకునీ కోడల్నీ వారి అన్యోన్యదాపంత్యాన్ని చూసి సంతోషించాడు. కోడలు చేస్తున్న ఉపచారాలకి సంబరపడ్డాడు. భృగువును ఉన్నతాసనం

సనాతన ధర్మం

30 Dec, 15:15


మీద అర్చించి ఆ దంపతులు వినయంగా అతడికి చేరువులో నేలమీద కూర్చున్నారు. సత్యవతీ ! నీ గుణగణాలకు సంతోషించాను. ఏదైన వరం కోరుకో, ఇస్తాను - అన్నాడు భృగువు. తనకూ తన తల్లికీ పుత్రసంతానం కలిగేట్టు వరమిమ్మంది సత్యవతి. భృగువు తథాస్తు! అన్నాడు. ఋతుస్నాతవై నువ్వు మేడిచెట్టును కౌగిలించుకో. ఇదిగో ఈ హవిస్సును (చరువు) భుజించు. అలాగే నీ తల్లి రావిచెట్టును కౌగిలించుకోవాలి. ఈ చరువును ఆరగించాలి భద్రంగా పట్టుకు వెళ్ళి దీన్ని మీ తల్లికి అందించు - అని చెప్పి రెండు చరువులూ కోడలికి ఇచ్చాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. తల్లీ కూతుళ్ళు తాము కౌగలించుకోవలసిన తరువులనూ భుజించవలసిన చరువులనూ
పొరపాటున తారుమారు చేసుకున్నారు. దీన్ని గమనించిన భృగువు మళ్ళీ వచ్చి జరిగిన పొరపాటుని కోడలికి తెలియజెప్పాడు. ఇందువల్ల - నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియాచారపరుడవుతాడు. నీ తల్లికి జన్మించే క్షత్రియుడు బ్రాహ్మణాచారపరుడవుతాడు. ఇంతకన్నా ప్రమాదం ఏమీలేదులే అని కోడల్ని ఓదార్చాడు. అయితే ఇది సత్యవతికి నచ్చలేదు. తన కొడుకు బ్రాహ్మణాచారపరుడే కావాలని క్షత్రియాచారాన్ని తరువాత తరానికి అంటే మనుమడికి సంక్రమించేట్టు చెయ్యమనీ అభ్యర్ధించింది. తథాస్తు! అన్నాడు భృగుమహిర్షి. కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది. మగబిడ్డను ప్రసవించింది. జమదగ్ని అని నామకరణం చేశారు. అతడు చతుర్వేదాలనూ అభ్యసించి షట్శాస్త్రాలను స్వాధీనం చేసుకొని మహాతేజస్వి అయ్యాడు, మహాతపశ్శాలి అయ్యాడు. ప్రసేనజిత్తు కూతురు రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వసుమంతుడు - సుషేణుడు - వసువు - విశ్వావసువు- రాముడు - అని అయిదుగురు కుమారులు కలిగారు. ఒకనాడు రేణుకాదేవి స్నానానికి వెళ్ళింది. ఆ సరోవరంలో మూర్తికావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యాలతో జలక్రీడలు ఆడుతున్నాడు. రేణుకాదేవి కొంచెంసేపు నిలబడి వాళ్ళని చూసింది. తానూ అలాంటి జలకేళికి
ముచ్చటపడింది. వెంటనే మనస్సును నిగ్రహించుకుంది. స్నానం ముగించుకొని త్వరత్వరగా ఆశ్రమం చేరుకుంది.ఆలస్యానికి జమదగ్ని మండిపడతాడని భయపడుతూనే ఉంది. ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రేణుకను మహర్షి తేరిపారచూశాడు. ముఖంలో బ్రాహ్మ్యకళ లోపించడాన్ని గుర్తించాడు. ఆగ్రహోదగ్రుడు అయ్యాడు.
సమత్కుశలకోసం అడవికి వెళ్ళిన నలుగురు కొడుకులూ అదే సమయానికి తిరిగివచ్చారు. వాళ్ళని చూసి, మీ తల్లిని సంహరించండి అని ఒక్కొక్కరికీ పేరుపేరునా ఆజ్ఞాపించాడు జమదగ్ని. అయితే ఆ కుమారులు కన్నతల్లిని సంహరించడానికి మనసాప్పక స్థాణువులై నిలబడిపోయారు. దీనితో జమదగ్నికి క్రోధం రెట్టింపు అయ్యింది. నా మాట వినలేదు కాబట్టి మీరు నలుగురూ ఈ అరణ్యంలో మృగాల్లాగా పక్షుల్లాగా జడజీవితం గడపండి అని శపించాడు. అంతలోకీ పరశురాముడు వచ్చాడు. జమదగ్ని అతడికీ ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. పాపశీల నీ తల్లిని సంహరించమన్నాడు. అనడమేమిటి అతడు తన గండ్రగొడ్డలితో తల్లి శిరస్సు నరికివేశాడు. జమదగ్ని కోపం చల్లారింది. సంతోషించాడు. భార్గవరామా ! వరాలు కోరుకో ఇస్తానన్నాడు.

సశేషం
హరిః ఓం తత్సత్
శ్రీ దత్తాయగురవేనమః

సనాతన ధర్మం

30 Dec, 06:37


ఇలాంటి మంచి విజ్ఞానం కోసం లేదా పురాణాల పట్ల ఆసక్తి ఉన్న వారిని ఈ గ్రూప్ లో చేర్చగలరు ఇంక ఎవరినైనా ఈ గ్రూప్ లో చేర్చాలి అనుకుంటే add person లోకి వెళ్ళి add చెయ్యచ్చు,

సనాతన ధర్మం

30 Dec, 06:35


ఈరోజు నుండి ముకుంద మాల అనే అద్భుత స్తోత్రము నుండి ప్రతీరోజూ ఒక శ్లోకము దానితో పాటు అర్ధము కూడా పెడతాను, అసలు నేను ఈ *సనాతన ధర్మం* అనేది పెట్టిన ఉద్దేశమే ఎంతో అద్భుతమైన స్తోత్రములు పురాణాలు మరుగున పడిపోతున్నాయి వాటిని మరల అందించాలి అని పెట్టాను, కానీ కుదరకపోవడం వల్ల, స్తోత్రములు పెట్టడం ఆపి రామాయణం పెడుతున్నాను, ఇలానే ఇకపైన స్తోత్రములు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను, అలాగే అష్టాదశ పురాణాలు కూడా పెడతాను, ఇప్పుడు పెడుతున్న రీతిలో అందరికీ అర్థం అయ్యే రీతిలో అందించే ప్రయత్నం చేస్తాను,
ఎవరైనా నేర్చుకోవటానికి సులువుగా ఉంటుంది, ఎవరైనా ఆడియో లో కూడా కావాలి అంటే మెసేజ్ చేస్తే ఆడియో కూడా రికార్డు చేసి పెడతాను,
*చంద్రశేఖర పాహిమాం*

సనాతన ధర్మం

24 Dec, 05:02


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
డెభైతొమ్మిదవ సర్గ. (79)

కొత్తగా వచ్చిన మకరాక్షుడిని వింతగా చూస్తున్నారు వానరులు.
వచ్చినవాడు వచ్చినట్టు యమలోకానికి ప్రయాణం కట్టడం యుద్ధము
మొదలైనప్పటినుండి ఆనవాయితీ. అందుకని వీడు ఎంతసేపు
నిలుస్తాడా అని లెక్కలు వేసుకుంటున్నారు వానరులు. యుద్ధము
మొదలయింది. భీకరంగా పోరాడుతున్నారు రాక్షసులు, వానరులు.
వానరుల చేతిలో వృక్షములు, శిలలు ఉంటే రాక్షసుల చేతిలో
శూలములు, పరిఘలు ఉన్నాయి. వాటితో ఒకరిని ఒకరు పొడుచు
కుంటున్నారు, నరుక్కుంటున్నారు.రాత్రి అయినా కూడా వాళ్లు యుద్ధం ఆపలేదు. రాక్షసులు తమ చేతులలో వివిధ రకకములైన ఆయుధములను ధరించి వానరులను చంపుతున్నారు. వానరులు రాక్షసుల మీద వృక్షములను కొండ శిలలను విసిరి చంపుతున్నారు. ఫలితం నరమేధం. దానికి తోడు మకరాక్షుడు తన బాణములతో వానర సేనలను చికాకు పరుస్తున్నాడు. అతని శరవర్షమునకు భయపడి పారిపోతున్నారు వానరులు. పారిపోతున్న వానరులను చూచి రాక్షసులు హర్షధ్వానాలు చేస్తున్నారు రాక్షసులు.ఇది చూచాడు
రాముడు. తాను రంగంలోకి దిగాడు.రాక్షస సైన్యం మీద బాణవర్షము కురిపించాడు. రాక్షస సేనలు ముందుకు చొచ్చుకు రాకుండా నిలువరించాడు. మకరాక్షుడు రాముని చూచి ఇలా అన్నాడు. “ఓ రామా! నీవేనా నా తండ్రిని చంపిన నరుడివి. రా! నా ముందుకు రా! మనం ఇద్దరం యుద్ధం చేద్దాము. నా ధనుస్సునుండి వెలువడిన బాణము నీ ప్రాణాలు తీయగలదు. ఆ నాడు దండకా రణ్యములో తన మానాన తాను బతుకుతున్న నా తండ్రిని అకారణంగా
చంపావు. నా తండ్రిని చంపిన దానికి ప్రతీకారము తీర్చుకొనే
సమయం వచ్చింది. ఇన్నాళ్లు నీ కోసం నేను మృగము కొరకు
సింహము వెదుకుతున్నట్టు వెదుకుతున్నాను. ఆ దేవుడు పంపినట్టు
నువ్వే నా ఎదురుగా నిలబడ్డాడు. ఇంక నిన్ను ఎవరూ రక్షించలేరు. నీ
చావు నాచేతిలో ఉంది. నిన్ను చంపి నా తండ్రి ఆత్మకు శాంతి
చేకూరుస్తాను. నీవు చంపిన రాక్షసులు నీ కొరకు యమలోకంలో
ఎదురుచూస్తున్నారు. నీ చేతిలో చచ్చిన నా వాళ్లను కలుసుకో.
రామా! మనం ఎలా యుద్ధం చేయాలో నువ్వే నిర్ణయించు. అస్త్రములా, శస్త్రములా, ద్వంద్వయుద్ధమా, లేక నీకు నచ్చిన, నీవు నేర్చిన యుద్ధవిద్య ప్రదర్శించు. దేనికైనా నేను సిద్ధముగా
ఉన్నాను.” అని ప్రగల్భాలు పలికాడు మకరాక్షుడు. ఆ మాటలకు రాముడు నవ్వుకున్నాడు. మకరాక్షునితో ఇలా అన్నాడు. “కుమారా! శూరులు మాట్లాడరు. శౌర్యము ప్రదర్శిస్తారు.నీవేమో యుద్ధం చేయడం మాని నీ వాక్చాతుర్యాన్ని వాగాడంబరాన్ని ప్రదర్శిస్తున్నావు. నీవు నన్ను ఏ విధంగా కూడా జయించలేవు. నేను
దండకారణ్యములో నీ తండ్రినే కాదు, దూషణుని, త్రిశిరుడిని,
పదునాలుగువేలమంది రాక్షస వీరులను చంపాను. ఇంక నీ వంతు
వచ్చింది. రా. యుద్ధం చెయ్యి. వృధా మాటలు కట్టిపెట్టు.” అని అన్నాడు రాముడు. రాముని మాటలకు బదులు చెప్పకుండా మకరాక్షుడు రాముని మీద శరవర్షము కురిపించాడు. రాముడు ఆ బాణములను తన బాణములతో మార్గమధ్యములోనే విరిచాడు. రాముడు, మకరాక్షుడు ఒకరితో ఒకరు బాణములతో యుద్ధము చేస్తున్నారు. ఇద్దరి ధనుస్సుల నుండి వెలువడిన బాణములు ఒకదానితో ఒకటి కొట్టుకొని ఉరుములు ఉరిమినట్టు శబ్దం చేస్తున్నాయి. వారి యుద్ధమును చూడటానికి దేవతలు, గంధర్వులు, యక్షులు ఆకాశంలో బారులు తీరి నిలబడ్డారు.రాముడు, మకరాక్షుడు ఒకరితో ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. ఒకరు ప్రయోగించిన అస్త్రములను మరొకరు నిర్వీర్యం చేస్తున్నారు. వారు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములతో ఆకాశం అంతా కప్పబడి పోయింది. ఇలా కాదని రాముడు ఒకే ఒక బాణంతో మకరాక్షుని ధనుస్సును విరిచాడు. ఎనిమిది నారాచములతో సారథిని కొట్టాడు. తరువాత వరుస బాణాలతో రథమును విరిచాడు. రధమునకు కట్టిన గుర్రములను చంపాడు. మకరాక్షుడు రథము మీది నుండి దూకి కింద నిలబడ్డాడు. ఒక శూలమును తీసుకున్నాడు. మకరాక్షుడు ఆ శూలమును గిరా గిరా తిప్పి రాముని మీదికి విసిరాడు. రాముడు నాలుగు బాణములతో ఆ శూలమును విరిచాడు. చేతిలో ఉన్న ఆయుధము కూడా విరిగి పోవడంతో మకరాక్షుడు తన పిడికిలి బిగించి రాముని మీదికి దూకాడు. తన మీదికి దూకుతున్న మకరాక్షుని మీదికి ఆగ్నేయాస్త్ర మును ప్రయోగించాడు రాముడు. ఆ అస్త్రము మకరాక్షుని దహించి
వేసింది. మకరాక్షుడు కిందపడి మరణించాడు. మకరాక్షుని మరణమును చూచిన రాక్షసులు రాముని బాణముల బారి నుండి తప్పించుకోడానికి లంకలోకి పారిపోయారు. మకరాక్షుని మరణానికి దేవతలు, గంధర్వులు, యక్షులు అమితానందము పొందారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము డెభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

23 Dec, 17:00


ఈ రోజు శ్రీ గురుడు,గాణుగాపురం లో🌺🙏🌷🌸
Today pallaki utchava murthi darsan at Ganugapur.23.12.2024
आज की उत्चव मूर्ति ,गाणगापुर में।

సనాతన ధర్మం

23 Dec, 13:40


ధర్మజా! కృతవీర్య దంపతులు ఈ వ్రతాన్ని చేసినందువల్లనే వీరి కుమారుడు కార్తవీర్యార్జునుడు దీర్ఘాయుష్మంతుడై ఎనభై అయిదువేల సంవత్సరాలు భూగోళాన్ని పరిపాలించగలిగాడు.
భాస్కరుణ్ని ఆరోగ్యం కోరాలి. అగ్నిని ధనం కోరాలి. శంకరుణ్ని జ్ఞానం కోరాలి. జనార్ధనుణ్ని సద్గతి కోరాలి అని పెద్దలు చెబుతున్నారు. ఈ సప్తమీస్నపన వ్రతాన్ని ఏకాగ్రచిత్తంతో పఠించినవారూ, విన్నవారు, సకల శుభా భీష్ట సిద్ధులూ పొందుతారు. అని మహర్షుల వాక్కు.
ధర్మరాజా కృతవీర్యుని ధర్మపత్ని శీలధర కూడా కొన్ని ప్రత్యేక నోములూ, వ్రతాలూ చేసింది. ఒక రోజు యాజ్ఞవల్క్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషిపత్ని అయిన మైత్రేయిని దర్శించింది. కుశల ప్రశ్నల అనంతరం తన మనోవేదనను చెప్పుకుంది. గుణవంతుడు, వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుడు కలిగేందుకు ఎదైనా నోమో, వ్రతమో
ఉపదేశించమని అభ్యర్థించింది. అప్పుడు మైత్రేయి ఆమెను ఓదార్చి ఇలా చెప్పింది.

ఓం శ్రీ దత్తాయ గురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

23 Dec, 13:40


శ్రీదత్త పురాణము || చతుర్ధ భాగం
సూర్యుడు చెప్పిన సప్తమీ స్నపనవ్రతం || పదవ వృత్తాంతము (10)

ధర్మరాజా ! వరాహకల్పంలో వైవస్వతమన్వంతరంలో కృతయుగంలో ప్రధమ పాదాన హైహయవంశం ఉండేది.ఆ వంశంలో కృతవీర్యుడు అనే మహారాజు మహాప్రతాపశాలియై సప్త ద్వీపాకృతమైన మహీమండలాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. డెబ్భైయేడు వేల సంవత్సరాలు పాలించాడు. ఆ మహారాజుకి వందమంది పుత్రులు జన్మించి, చ్యవన మహర్షి శాపాగ్నికి ఆహుతి అయ్యారు. పుత్ర శోకం తట్టుకోలేక రాజదంపతులు వోలువోలున విలపిస్తూ బృహస్పతిని శరణువేడారు. ఎందుకు ఇలా జరిగింది ? మాకు ఈ జన్మలో పుత్రోత్సాహం ఉన్నదా ? వంశోద్ధారకుడు
కలుగుతాడా ? - మేమేమి చెయ్యాలి ? దివ్యదృష్టితో పరిశీలించి అనుగ్రహించండి - అని కాళ్ళా వేళ్ళా పడి అభ్యర్ధించారు. బృహస్పతి మహాపండితుడే అయినా హృదయం కలవాడు కనుక స్పందించాడు. దివ్యదృష్టి సారించాడు. కృతవీర్యా! దుఃఖించకు క్లేశాలుపడతావుగానీ త్వరలోనే నీకు దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అయితే ఈలోగా నువ్వు వదిలించుకోవలసిన కల్మషాలు కొన్ని ఉన్నాయి. వాటి ఫలితంగానే మీకిద్దరకూ ఈ పుత్ర శోకం.
వాటిని వదిలించుకో. దీనికి ఒక మార్గం వుంది. దత్తాత్రేయుడు తన భక్తులకి ప్రబోధించిన సప్తమీ స్నపనవ్రతాన్ని మీరు ఆచరించండి.
కల్మషాలు తొలగిపోతాయి. మీకోరికలు తీరతాయి. ఈ వ్రతవిధానం తెలిసినవాడు కర్మసాక్షి- సూర్య భగవానుడు కనుక ముందుగా అతణ్ని అర్చించి ప్రసన్నుణ్ని చేసుకోండి. ఇక క్షణం కూడా వృధాచేయకండి. వెళ్ళిరండి శుభమగు గాక - అని ఆశీర్వదించి పంపించాడు. కృతవీర్యుడు ఉపవాసదీక్షతో వేదమంత్రాలతో నెలనాళ్ళూ సూర్యుణ్ని అత్యద్భుతంగా ఆరాధించాడు. దానికి
సంతుష్టుడై సహస్రకిరణుడు ప్రత్యక్షమయ్యాడు. సప్తమీస్న పనవ్రతాన్ని ఉపదేశించాడు. రాజా ! ఈ వ్రతాన్ని ఆచరిస్తే
శిశుమరణాలు అంతరిస్తాయి. వ్యాధిపీడలు తొలగుతాయి. అన్ని వయస్సులవారికీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నీ చింతలను తొలగిస్తుంది. వ్రత విధానం చెబుతున్నాను శ్రద్ధగా గ్రహించు.
మృతవత్స అయిన ఇల్లాలు మళ్ళీ గర్భందాల్చాక ఏడోనెల రాగానే గ్రహతారాబలాదులు సరిచూసి ఒక శుభముహూర్తం నిశ్చయించుకోవాలి. ఆ పూట దంపతులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పురోహితులచేత పుణ్యాహవచనం చేయించుకోవాలి. పేడతో అలికి ముగ్గులు పెట్టిన మండపంలో అగ్నిహోత్రుణ్ని స్థాపించాలి.
బియ్యం రక్తశాలేయాలూ ఆవుపాలతో కలిపి చరువులు తయారుచేసుకోవాలి. వాటిని సూర్య - రుద్ర - సప్త మాతృకా గణాలకు ఆహుతి చెయ్యాలి. సౌరసూక్తాలతో సూర్యదేవునికి ప్రత్యేక హోమాలు చేయాలి. జిల్లేడు లేదా మోదుగ సమిధలనే హోమాలకు
ఉపయోగించాలి. యవలూ, నల్లనువ్వులతో అష్టోత్తర శతంగా ఈ హోమాలు సాగాలి. ఏడు కలశాలను గంగాజలంతో నింపాలి. ఆ కలశాలను మండపంలో నాల్గు కోణాల్లో నాల్గు, తూర్పున ఒకటి,
పడమట ఒకటి, మధ్యలో ఒకటి ఉంచాలి. మంచి గంధంతో పరిమళ భరిత పూలతో దర్భలతో కలశారాధన చెయ్యాలి.ఏడుకలశాలని ఏడు అద్దాలతో కప్పాలి. సప్తర్షుల్ని వీటిలోకి ఆహ్వానించి ఆవాహన చెయ్యాలి. తూర్పు - పడమర కలశాల్లోకి సూర్యచంద్రుల్ని అభిమంత్రించాలి. ఓషధీ సూక్తాలు పఠించాలి. పంచప్రకార జలన్వితాలు చెయ్యాలి. పంచరత్నాలతో పంచపల్లవాలతో అలంకరించాలి. శుద్ధి చేసిన మట్టి తెచ్చి ఏడుకలశాల్లోనూ వెయ్యాలి. రత్నాలు వేసిన అయిదు కలశాల నుండీ మధ్యమ కలశాన్ని పురోహితుడు సూర్యమంత్రాలు ఉచ్ఛరిస్తూ వుండగా పైకి తీయాలి.
భోజనాలు చేసి నూతన వస్త్రాలూ ఆభరణాలూ ధరించిన ఏడుగురు దంపతులూ (సంతానం కలవారై వుండాలి) ఆ కలశాన్ని అందుకొని మండలాకారంగా నిలబడిముందుకు ఒకింతవంగి అందులోని నీళ్ళుపంపుతూ మృతవత్స (ఇప్పుడు ఏడోనెల గర్భిణి) అయిన ఆ యజమానురాలిని ఏకధారగా అభిషేకించాలి. గర్భస్థ శిశువుకు దీర్ఘాయుష్యాన్ని గర్భిణీకి జీవత్పుత్రతనూ ఆకాంక్షించి ఆశీర్వదించాలి. నవగ్రహాలు అష్ట దిక్పాలకులూ హరిహర హిరణ్య గర్భులూ శిశువును రక్షించాలనీ దుష్టగ్రహాలు తల్లీ బిడ్డలను పీడించక తొలగిపోవాలనీ దీవించాలి. అటుపైన యజమానదంపతులు ఈ
ఏడుగురు దంపతుల్నీ షోడశోపచారములతో అర్చించాలి. గణేశుడ్నీ కుమారస్వామినీ అర్చించి బంగారంతో ధర్మరాజు ప్రతిమ చేయించి దాన్ని తిలపాత్రమీద ఉంచి గురువుకి దానం ఇవ్వాలి. విత్తలోభము సుతారమూ పనికిరాదు. భూరిదక్షిణలతో, నూతన వస్త్రాలతో, విందు భోజనాలతో బ్రాహ్మణులనూ. బంధుమిత్రులనూ, సంతృప్తి పరచాలి. అయ్యింతరువాత గురువు ఇలా ఆశీర్వదించాలి - బాలుడు సుఖంగా నూరేళ్ళు జీవించుగాక ! ఇంకా ఏమైనా దురిత
శేషముంటే అది బడడబాముఖంలో పడిపోవుగాక. బ్రహ్మ - రుద్ర - విష్ణు - స్కంద - వాయు - శక్ర - వహ్ని ప్రభృతులు అందరూ దుష్టగ్రహాల నుండి మాతాశిశువుల్ని రక్షిస్తూ సకల శుభాలు కలిగింతురుగాక. ఇలాంటి శుభాశీస్సులు అందించాలి.
ఆశీర్వదించిన గురువుకి ప్రణమిల్లి కపిలగోవును బహూకరించాలి. ఇది యధాశక్తిగా చెయ్యవచ్చు. ఆపైన సూర్యుడికి శివునికి నమస్కరించి ఆ గర్భిణి హుతాశేషమైన చరువును భుజించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్షం సప్తమీ తిథినాడు చేస్తే చాలా మంచిది. దీన్ని శ్రద్ధగా ఆచరించండి అని ఉపదేశించి సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు.

సనాతన ధర్మం

23 Dec, 03:48


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
డెభైఎనిమిదవ సర్గ.(78) సనాతన ధర్మం

కుంభ, నికుంభుల మరణవార్త రావణునికి తెలిసింది.వరుసగా రాక్షస వీరుల మరణ వార్తలు వినడం అలవాటైపోయింది రావణునికి. అతని దు:ఖానికి అంతులేదు. అయినా పట్టినపట్టు వీడలేదు. అమీ తుమీ తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. జనస్థానంలో రాముని చేతిలో చంపబడ్డ ఖరుని కుమారుడు అయిన మకరాక్షుడిని పిలిపించాడు. రాముని మీదికి యుద్ధానికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. మకరాక్షుడు కూడా సంతోషంగా అంగీకరించాడు. వెంటనే తన రథమును. సైన్యమును సిద్ధం చేయమని సేనానాయకునికి ఆదేశాలు ఇచ్చాడు. వెంటనే మకరాక్షునికి ఒక రథము, రాక్షస సైన్యమును సమకూర్చారు. మకరాక్షుడు తన రథమునకు ప్రదక్షిణము చేసి రథము ఎక్కాడు. రాక్షస సేనలను చూచి ఇలా అన్నాడు. “ఓ రాక్షస వీరులారా! రాక్షసరాజు రావణుని ఆజ్ఞమేరకు మనము రాముని మీదికి యుద్ధానికి పోతున్నాము. మీరందరూ మీ మీ ప్రాణాలు పణంగా పెట్టి వానర సేనలతో యుద్ధం చేయండి. నేను రామలక్ష్మణులతోనూ, సుగ్రీవునితోనూ, ఇతర వానర వీరులతోనూ యుద్ధం చేస్తాను. మనము వానర సైన్యమును అడవిని కార్చిచ్చు కాల్చినట్టు కాల్చివేయాలి.” అని సేనలను ఉత్సాహపరిచాడు. రాక్షస సేనలు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. భేరీ నినాదాలు మిన్నుముట్టాయి.
శంఖములు పూరించారు. సింహ నాదాలు చేసారు. ఉత్సాహంతో
యుద్ధభూమికి వెళ్లారు.అంతలోనే కొన్ని దుశ్శకునములు కనిపించాయి. మకరాక్షుని సారధి చేతిలోని కొరడా జారి కిందపడింది. అతడి ధ్వజము విరిగి కిందపడింది. పెనుగాలులు వీచాయి. కాని
మకరాక్షుడు ఆ శకునములను లెక్క చేయలేదు. ముందుకు కదిలాడు. అతని వెంట రాక్షస సేనలు కత్తులు ఝళిపిస్తూ, జయజయధ్వానాలు చేస్తూ కదిలారు.

యుద్ధకాండము
డెభైఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

22 Dec, 15:27


ఈ రోజు శ్రీ గురుడు,గాణుగాపురం లో🌺🙏🌷🌸
Today pallaki utchava murthi darsan at Ganugapur.22.12.2024
आज की उत्चव मूर्ति ,गाणगापुर में।

సనాతన ధర్మం

22 Dec, 12:59


ఈరోజు అయోధ్య శ్రీరాముని దర్శనమ్
22-12-24🙏జై శ్రీరామ్ 🙏

సనాతన ధర్మం

22 Dec, 12:45


స్వామి ! వింతగా వుంది. మహానుభావులు నిరంతరం ఆమెనే ధ్యానిస్తూనే వుంటారని అంటున్నావు అదెలా సాధ్యం ? ప్రాణులన్నాక కర్మఫలానుభవం ఉంటుంది గదా ! దారుణకర్మలకి బాధలను అనుభవిస్తారు గదా ! ఎంతటి మహానుభావులైతే మాత్రం ఆ సమయాల్లో కూడా సంధ్యావందన విధి సాగించగలరా ? మునీశ్వరులారా ! బ్రహ్మరూపిణి, సంధ్యారూపిణి రేణుకాదేవిని మూడు కాలాల్లోనూ సందర్శించి వందన మాచరించగలిగినవారే మహానుభావులు. లౌకికమైన ఆటుపోట్లు కర్మానుభవక్లేశాలూ దీనికి అడ్డంకి కాకూడదు. అలాసాగించే సంధ్యావందనం వల్లనే వీరూ వందితులు కాగలుగుతారు. మూడు కాలాలు అంటే చైత్రం - ఆషాడం - కార్తీకం - ఈ మూడు కాలాల్లోనూ ఏ ఒక్క నెలలో రేణుకాదేవిని ఉపాసించినా ఇహపరాల్లో భుక్తి ముక్తులకు లోటు వుండదు. మూడు కాలాల్లో ఉపాసిస్తే ఇక చెప్పేదేమిటి ఇహంలో ఇంద్రభోగాలు అనుభవించి పరమపదం చేరుకుంటారు. అటువంటి సర్వకాలాను వర్తిని పరబ్రహ్మ స్వరూపిణి - సంధ్యాదేవి అయిన రేణుకా మాతకే నేను వందనం ఆచరించి వచ్చాను. గృహాలలో ఉండేవారు పవిత్రులై కాలత్రయస్వరూపిణి, సంధ్యా స్వరూపిణి అయిన ఈ రేణుకాదేవిని
భక్తితో నిత్యమూ ఉపాసిస్తే ఆమె దర్శనం ఆమె అనుగ్రహం వెంటనే పొందుతారు. ఇహంలో భోగాలను అనుభవించి పరంలో సద్గతి పొందుతారు. ఇలా రేణుకాదేవియే సంధ్యాదేవి అని చెప్పి దత్తాత్రేయుడు మళ్ళీ అంతర్థానం చెందాడు. ఇది విన్న ఆ
దేవజాతులవారూ, ఋషులూ మునులూ సంబరపడి సకల తీర్ధోదకాలతోనూ వరాహరూపి అయిన విష్ణుమూర్తికి అభిషేకం చేసి అత్యంత భక్తి ప్రపత్తులతో యోగమాత రేణుకాదేవిని అర్చించి విష్ణు స్వరూపం అయిన అమలకీ తరువుకి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతర్ధానం చెందిన దత్తాత్రేయ స్వామికి మనస్సుల్లోనే వందనాలర్పించి దత్తస్వామి మహిమలను రేణుకా మహిమలనూ తలచుకొంటూ కొనియాడుతూ ఎవరిస్థానాలకు వారు బయలుదేరారు. దీపకా ! అలనాడు కైలాసం మీద మహర్షులకు స్కందుడు స్వయంగా చెప్పిన రేణుకా మహిమ ఇది. విన్నావు
గదా ! మరిక నీ కోరిక ఏమి ? - అన్నాడు వేదధర్ముడు.గురుదేవా ! దత్తాత్రేయుడి ప్రభావమే నాకు ఇంకా వినాలనీ తెలుసుకోవాలని ఉంది. కార్తవీర్యార్జునుడ్ని అంతటి మహావీరుణ్ని చేసిన దత్తదేవుడి దయను ఎంతని కొనియాడగలం. అటువంటి పుత్రుణ్ని పొందడానికి కృతవీర్య దంపతులు పుణ్యాలు చేసారో ? ఏ వ్రతాలు ఆచరించారో ? సాధన సంపత్తి లేకుండా ఫలాలు దక్కవు గదా. ఆ వివరాలు చెప్పండి - అని అభ్యర్ధించడమే తడవుగా వేదధర్ముడు ఆరంభించాడు.
దీపకా ! వెనుకటికి పాండవ మధ్యముడైన అర్జునుడు అడిగితే శ్రీ కృష్ణుడు ఈ వృత్తాంతం అంతా అతడికి వివరించి చెప్పాడు. అదే నేను నీకిప్పుడు యధాతధంగా చెబుతాను. ధర్మజకృష్ణ సంవాదంగా నడుస్తుంది విను.

శ్రీ దత్తాయగురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

22 Dec, 12:45


శ్రీదత్త పురాణము|| చతుర్ధ భాగం
రేణుకాదేవి - మహిమ || తొమ్మిదవ వృత్తాంతము (9)

మహర్షులారా ! రేణుకాదేవి అంటే త్రి జగన్మాత. అందుకనే ఆ తల్లి నివసించిన స్థలాన్ని మాతృతీర్ధం లేదా మాత్రాలయం అంటారు. ఒకప్పుడు దత్తాత్రేయుడు తాను ఆచార్యుడై నిలచి ఆ పవిత్ర స్థలంలో పరశురాముని చేత ఒక మహాయజ్ఞం చేయించాడు. అది రేణుకా యజ్ఞం. దానికి ప్రజాపతియే ప్రధాన ఋత్విక్కుగా బ్రహ్మస్థానం
అలంకరించాడు. తక్కిన మహర్షులందరూ వేదమంత్రాలు పఠిస్తూ మిగిలిన భూమికలు నిర్వహించారు. ఆ యజ్ఞంలో నారదాది దేవర్షులు సిద్ధచారణ గంధర్వాధి దేవజాతులవారూ శుభప్రదమైన రేణుకా చరిత్రను భక్తిప్రపత్తులతో గానం చేశారు. దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నృత్యాలు చేశారు. యజ్ఞపరి సమాప్తిలో - క్షీర సముద్రం నుంచి పాలు, దధ్యుదధి నుండి పెరుగు, ఘృతాబ్ధి నుండి నెయ్యి ఇలా సప్తసముద్రాల నుండీ సప్తద్రవాలను తెచ్చి కృష్ణామలకి నుండి మధుశర్కరలు గ్రహించి గంగాది పుణ్యనదుల నుండి పవిత్రోదకాలు తెచ్చి - వీటన్నింటితో
దత్తాత్రేయుడు స్వయంగా ఏకవీరాదేవికి అభిషేకం చేశాడు. సాష్టాంగపడి లేచి చతుర్వేద మంత్రాలతో స్తుతించాడు.
పద్మాసనం వేసికూర్చుని మెల్లగా ధ్యానంలోకి జారుకున్నాడు. దేవతలు అందరూ చూస్తూనే వున్నారు. దత్తాత్రేయుడు
హఠాత్తుగా అంతర్ధానం చెందాడు.అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. రేణుకాదేవిని ధ్యానిస్తూ మనకళ్ళ ఎదుటే కళ్ళు మూసుకొని కూర్చున్న దత్తాత్రేయుడు ఏమయ్యాడంటే ఏమయ్యాడు ? ఎటువెళ్ళాడంటే ఎటువెళ్ళాడు ? అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారే తప్ప ఎవరికీ సమాధానం దొరకలేదు.దత్త దేవుడికి రేణుకా ధ్యానంతప్ప మరొకటి లేదు. ఆయన గారి శయనాసనయాన కధాదులన్నీ రేణుకామయమే. ఎరుగుదుంగదా ! కాబట్టి రేణుకాదేవిలో లీనమయ్యుంటాడు అని దేవతలు భావించారు. ఋషులు మరొకలా అనుకున్నారు. రేణుకా హృదయమూ మనకు తెలీదు. దత్త హృదయమూ మనమెరుగం. ఇద్దరూ దివ్యతేజోమయులే. దేవి తన దివ్య తేజస్సుతో దత్త దేవుణ్ని ఆచ్ఛాదించిందేమో, లేదా దత్తస్వామి వేడుకగా పాతాళానికెళ్ళాడేమో. స్వామివి అన్నీ చిత్ర విచిత్ర లీలలు గదా ! అనుకున్నారు. ఇక్కడే అదృశ్యరూపంతో గూఢంగా వుండి వుంటాడు. మన స్వామివి ఇలాంటి కూతూహలాలు ఉన్నవే కదా ! అనుకున్నారు సిద్ధులు. కాసేపట్లో కూసేపట్లో ప్రత్యక్షమవుతాడు చూడండి. ఆ నగ్న సుందరితో మధువును సేవిస్తూ ప్రత్యక్షమవుతాడని విధ్యాధరులు అభిప్రాయపడ్డారు. ఈ అజ్ఞానమనే వలను మన అందరిమీదకు వదలి తమాషాగా ఇక్కడే తనను తానే ఆజ్ఞాపించుకుని మనల్ని గమనిస్తు ఉండి ఉంటాడు అని నిశ్చయించుకున్నారు చారణులు.
వీరందరి సంభాషణలు విని సంబరపడ్డ దత్తాత్రేయుడు కొంచెంసేపటికి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. సురగంధర్వ సిద్ధ సాధ్యదేవర్షి గణమంతా స్వామిని దర్శించి హమ్మయ్య అని గుండెలనిండుగా గాలి పీల్చుకున్నారు. స్వామికి ప్రణమిల్లి కౌగలించుకొని తమతమ లోపలి అలజడిని తీర్చుకున్నారు. ఇలా తేరుకున్నాక అందరూ కలిసి ఏకగ్రీవంగా స్వామిని ప్రశ్నించారు. దత్తవిభూ ! నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ? దేవతలకీ, మంత్రద్రష్టలకీ, ఋషులకీ కనిపించని చోటుకి వెళ్ళివచ్చావు. దివ్యదృష్టులకు సైతం అందని ఆ చోటు ఏది ? ఎక్కడ ? ఇలాంటి తపస్సు కానీ, ధ్యానం కానీ, తత్వంకానీ మరెక్కడా ఏనాడూ కన్నదికాదు, విన్నది కాదు. మొదలూ, తుదీ నువ్వే కనుక నువ్వే తెలియజెప్పాలి.దేవతలారా ! మహర్షులారా ! పరశురాముని యజ్ఞ విధిలో మునిగివుండగా సంధ్యావందన కాలంగడిచిపోతున్న
సంగతి గుర్తించాను. కాలాతీతంకాకుండా సంధ్యావందనం చేసి వద్దామని వెళ్ళాను. సంధ్యాదేవికి వందనం చెయ్యడం కన్నా మహాయజ్ఞం లేదని మీకు తెలుసుకదా ! స్వామి ! మాకు తెలిసిన సంధ్యావందనం వేరు. దానికి ఇలా అదృశ్యమై ఎక్కడికో పోనవసరం లేదు. నీవు నమస్కరించిన సంధ్యాదేవి ఎవరు ? నివాస స్థలం ఏమిటి ? వెళ్ళివచ్చినవాడివి నీకు తెలియదా ?ఆ సంధ్యావందనానికి
కాలమేమిటి ? కర్త ఎవరు ? తీర్థ మెక్కడ ? ఇవన్నీ మాకు కటాక్షించు.
ఆర్యులారా ! యోగీశ్వరుల హృదయాలలో సర్వదా నివసించే యోగిని రేణుకాదేవియే సంధ్యాదేవి. ఆమెకే నేను వందనం ఆచరించి వచ్చాను. ధ్యాన నిర్మలము, అమృతానంద పూర్ణమూ అయిన మనస్సులో సర్వతీర్ధమయి రేణుకాదేవికి వందనమాచరించి వచ్చాను. యోగమార్గ రతులు, నిరంతరం ఆ మహామాయనే ధ్యానిస్తుంటారు. రేణుకయే సంధ్యాదేవి సందేహం లేదు. ఆవిడయే ఏకవీర, మిూకూ, నాకూ, అందరికీ వందనీయ ఆ జగన్మాతయే. ఆమెకే వందనం ఆచరించివచ్చాను. దత్తగురూత్తమా ! సంధ్యావందన కాలమూ, అదేదో దాటిపోవడం అన్నారు. ఆ వివరాలు కూడా కరుణించి చెప్పండి.మాన్యులారా ! ఆసన - ప్రాశన - శయన యానాది సమయాలలో ఎప్పుడైనా ఎక్కడైనా గానీ అందరికీ
సర్వదా, సర్వధా వందనీయురాలు ఈ సంధ్యాదేవి. దీనికి ప్రత్యేకంగా ఒక సమయం అంటూ వుండదు. సర్వకాల సర్వావస్థల్లోనూ వందనీయ - మహానుభావులు ఇలావందనం ఆచరిస్తూనే వుంటారు.

సనాతన ధర్మం

22 Dec, 11:59


శ్రీమద్రామాయణము,బాలకాండ, 18 వ సర్గ, శ్రీరామ లక్ష్మణ భరత శతృఘ్నుల జననము, వివరంగా

https://youtu.be/ssNyi5plRWM

సనాతన ధర్మం

22 Dec, 03:38


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
డెభై ఏడవ సర్గ (77) || సనాతన ధర్మం

కుంభుని సోదరుడు నికుంభుడు. తన సోదరుని మరణం కళ్లారా చూచిన నికుంభుడు కోపంతో రగిలిపోయాడు. ఒక పరిఘను
తీసుకున్నాడు. పెద్దగా అరిచాడు. గర్జించాడు. వాడిని వాడి పరిఘను
వానరులు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. హనుమంతుడు వాడి
ముందు రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు. నికుంభుడు తన చేతిలో
ఉన్న పరిఘను హనుమంతుని వక్షస్థలమునకు గురి చూచి
విసిరాడు. హనుమంతుని వక్షస్థలమునకు తగిలి ఆ పరిఘ
ముక్కలయింది. ఆ పరిఘ దెబ్బకు హనుమంతుడు కూడా కొంచెం
చలించాడు. కాని అంతలోనే నిలదొక్కుకున్నాడు. వెంటనే పిడికిలి
బిగించాడు. బిగించిన పిడికిలితో హనుమ నికుంభుని గుండెల మీద
చాచి ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు నికుంభుని కవచము బద్దలయింది. వాడి గుండెలు పగిలి రక్తం కారింది. నికుంభుని కళ్ల
ముందు మెరుపు మెరిసినట్టయింది. కొంచెంసేపటికి తేరుకున్న
నికుంభుడు హనుమను పట్టుకున్నాడు. పైకి లేపాడు. అది చూచి
రాక్షసులు పెద్దగా అరుస్తూ కేరింతలు కొట్టారు. అప్పుడు హనుమంతుడు తన పిడికిలి బిగించి నికుంభుని తలమీద మోదాడు.
వాడు హనుమను కిందికి జారవిడిచాడు. కింద పడ్డ హనుమంతుడు
పైకి లేచి అదే ఊపుతో నికుంబుని కింద పడదోసాడు. హనుమ పైకి
ఎగిరి వాడి గుండెల మీద పడ్డాడు. హనుమ నికుంభుని మెడ
పట్టుకొని పిసికాడు. వాడి తలను బలవంతంగా శరీరం నుండి వేరు
చేసాడు. ఆ ప్రకారంగా నికుంభుడు హనుమ చేతిలో మరణించాడు.
నికుంభుని చావు చూచిన వానరులు హనుమను పొగిడారు. హర్షధ్వానాలు చేసారు. రాక్షసులకు మనసులో భయం
పట్టుకుంది.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము డెభైఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

21 Dec, 09:35


ఈ ప్రశ్నకు సరైన సమాధానం:- విష్ణు ధనుస్సు , ఈ ప్రశ్నను అందరూ సరిగ్గా చడవలేదో లేదంటే సరిగ్గా అర్థం చేసుకోలేదో, సీతా స్వయంవరం కి వెళ్ళిన శ్రీరాముడు, అక్కడ స్వయంవరం లో వర పరీక్ష లు భాగం గా శివ ధనుస్సు కు నారి సంధిస్తూ ఉంటే ఆ ధనుస్సు విరిగిపోతుంది, దానితో ఆగ్రహించిన పరశురాముడు అక్కడకు వచ్చి శ్రీ రాముడు శ్రీ మహా విష్ణు స్వరూపం అని ముందు గ్రహించక శ్రీరాముని శక్తిని పరీక్షించదలచి అప్పుడు విష్ణు ధనుస్సు ను ఇచ్చి సందించమన్నారు, కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం పరశురాముడు శ్రీరాముడికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు :- విష్ణు ధనుస్సు

సనాతన ధర్మం

21 Dec, 04:43


శ్రీమద్రామాయణము,బాలకాండ, 18 వ సర్గ, శ్రీరామ లక్ష్మణ భరత శతృఘ్నుల జననము, వివరంగా

https://youtu.be/ssNyi5plRWM

సనాతన ధర్మం

21 Dec, 03:10


తన నుదురు నుండి రక్తం కారుతూ ఉంటే అంగదునికి కళ్లు కనిపించడం లేదు. రక్తం తుడుచుకుంటున్నాడు. అలాంటి స్థితిలోకూడా అంగదుడు ఒక పెద్ద సాలవృక్షమును పెకలించి తీసుకొని
కుంభుని మీదికి విసిరాడు. కుంభుడు ఆ సాలవృక్షమును రెండుగా
ఖండించాడు.నుదుటి మీద గాయంతో అంగదుడు అలసిపోయాడు.
యుద్ధం చేయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని వానరులు రామునికి
తెలిపారు. రాముడు జాంబవంతుని వానర సేనలతో అంగదునికి
సాయంగా పంపాడు. వానరులందరూ చేతులలో వృక్షములు, రాళ్లు
తీసుకొని కుంభుని వైపు పరుగెత్తారు. వారి వెంట జాంబవంతుడు,
సుషేణుడు, వేగదర్శీ అంగదునికి సాయంగా వెళ్లారు. ఇది చూచిన
కుంభుడు ఆ వానర నాయకుల మీద శరవర్షము కురిపించాడు. ఆ
వానర నాయకులు కుంభుని బాణముల ధాటికి తట్టుకోలేకపోతున్నారు.ఇది గమనించిన సుగ్రీవుడు తాను కూడా అంగదునికి సాయంగా వెళ్ళాడు. సుగ్రీవుడు చేతికందిన వృక్షములను పెకలించి కుంభుని మీదికి వరుసగా ఎడతెరిపి లేకుండా విసురుతున్నాడు. తన మీద ఆ వర్షము వలె పడుతున్న ఆ వృక్షములను కుంభుడు తన శరవర్షముతో ఛేదించాడు. తాను విసిరిన వృక్షములు వృధా కావడం చూచిన సుగ్రీవుడు, రెట్టించిన ఉత్సాహంతో కుంభుని మీదికి దూకాడు. వాడి ధనుస్సును విరిచాడు. కుంభుని పట్టుకొని ఇలా అన్నాడు. “ఓ వీరుడా! నీ యుద్ధము ప్రశంసనీయము. నీ శరప్రయోగము అభినందనీయము. యుద్ధములో నీవు, రావణుడు సరిసమానులే. నీ తండ్రికి తగ్గ కుమారుడవు అనిపించుకున్నావు. కాని ఇప్పుడు నేను నీతో యుద్ధము చేస్తున్నాను. నా పరాక్రమం కూడా చూడు. నీ తండ్రి కుంభకర్ణుడు తన సహజ పరాక్రమంతో మమ్ములను ఎదిరించాడు. కాని నీ పినతండ్రి రావణుడు వరబలంతో మమ్ములను ఎదిరించాడు. నువ్వు కూడా నీ తండ్రి మాదిరి సహజమైన బల పరాక్రమములు కలిగిన వాడవు. పరాక్రమంలో రావణుని, బాణ ప్రయోగంలో ఇంద్రజిత్తును మరిపిస్తున్నావు. ఇప్పటి దాకా నేను చూచిన రాక్షస వీరులలో నీవే గొప్పవాడివి. అటువంటి నిన్ను నేను యుద్ధంలో ఎదుర్కొంటున్నాను. ఇప్పటిదాకా నీ అస్త్రశస్త్ర నైపుణ్యంతో
వానర వీరులను నిస్తేజులుగా చేసావు. నీవు ఇప్పటి దాకా వానర
చేయడం వలన అలసినట్టున్నావు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని నాతో యుద్ధానికి తలపడు. అప్పుడు మనం ఇద్దరం బలాబలాలు చూసుకుందాము.” అని అన్నాడు సుగ్రీవుడు. వీరులతో యుద్ధం
ఈ మాటలు విన్న కుంభునికి అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. మారు మాటాడకుండా కుంభుడు తన ఎదురుగా ఉన్న సుగ్రీవుని తన బాహువుల మధ్య గట్టిగా పట్టుకున్నాడు. సుగ్రీవుడు కుంభుడు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. సుగ్రీవుడు కుంభుని పైకి ఎత్తి గిరా గిరా తిప్పి సముద్రంలోకి గిరాటు వేసాడు. సముద్రంలో పడ్డ కుంభుడు బంతి మాదిరి లేచి వచ్చి సుగ్రీవుని వక్షస్థలము మీద పిడికిలితో మోదాడు. ఆ దెబ్బకు సుగ్రీవుని గుండెల నుండి రక్తం స్రవిస్తూ ఉంది. దెబ్బ తిన్న సుగ్రీవుడు కోపంతో పిడికిలి బిగించాడు. కుంభుని వక్షస్థలము మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బను తట్టుకోలేక
కుంభుడు నేలమీద పడిపోయాడు. కుంభుని గుండెలు బద్దలయ్యాయి. కుంభుడు గిలా గిలా కొట్టుకొని మరణించాడు. కుంభుని మరణం చూడగానే రాక్షస వీరులు భయంతో వణికిపోయారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము డెభై ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

21 Dec, 03:10


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
డెబ్బది ఆరవ సర్గ.(76) సనాతన ధర్మం

రాక్షసులు వానరులు ఆ ప్రకారంగా ఘోరయుద్ధము
చేస్తుంటే అంగదుడు, రాక్షస వీరుడు కంపనునితో యుద్ధము
చేస్తున్నాడు. అంగదుడు కంపనుని తన గదతో మోదాడు. ఆ దెబ్బకు
కంపనుడు చలించిపోయాడు. కాసేపు కళ్లు బైర్లు కమ్మాయి.
అంతలోనే తేరుకున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని
అంగదుడు కంపనుడి మీద ఒక పర్వత శిఖరమును విసిరాడు. ఆ
దెబ్బకు కంపనుడు నేలకూలాడు. గిలా గిలా కొట్టుకొని ప్రాణాలు
వదిలాడు. కంపనుడి మరణమును కళ్లారా చూచిన శోణితాక్షుడు
తన రథాన్ని అంగదుని మీదికి పోనిచ్చాడు. కాలాగ్నితో సమానమైన
బాణములను అంగదుని మీద ప్రయోగించాడు. క్షురములు,
నారాచములు, వత్సదంతములు, శిలీముఖములు మొదలగు వాడి
అయిన బాణములను అంగదుని మీద ప్రయోగించాడు. దానికి ప్రతిగా అంగదుడు శోణితాక్షుని ధనుస్సును, బాణములను, రథమును విరగ్గొట్టాడు. అప్పుడు శోణితాక్షుడు రథమును దిగి తన ఖడ్గము, డాలు తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అంగదుడు వాడి కన్నా ఎత్తుకు ఎగిరి, వాడి చేతిలోని ఖడ్గము లాక్కుని పెద్దగా అరిచాడు. తన చేతిలో ఉన్న ఖడ్గముతో అంగదుడు శోణితాక్షుని భుజం దగ్గర నరికాడు. శోణితాక్షుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. ఆ ప్రకారంగా శోణితాక్షుని నేలకూల్చిన అంగదుడు చేతిలో ఉన్న ఖడ్గముతో సింహనాదము చేసాడు. రాక్షస సేనలమీదికి వెళ్లాడు. ఇది చూచిన యూపాక్షుడు, ప్రజంఘునుడు ఇద్దరూ అంగదుని మీదికి దూకారు. ఇంతలో మూర్ఛనుండి తేరుకున్న శోణితాక్షుడు ఒక గదను తీసుకొని అంగదుని ఎదుర్కొన్నాడు. మరొక పక్కనుండి ప్రజంఘుడు తన గదతీసుకొని అంగదుని మీదికి వెళ్లాడు. ఆ ప్రకారంగా ఆ ముగ్గురు రాక్షస వీరులు అంగదుని చుట్టుముట్టారు.
ఇది చూచిన మైందుడు, ద్వివిదుడు అంగదుని రక్షణ కోసం అతని వద్దకు వచ్చారు. ఆ ముగ్గురు రాక్షస వీరులకు, ముగ్గురు వానర వీరులకు ఘోరమైన యుద్ధము జరిగింది. ఆ వానర వీరులు
రాక్షసులు మీదికి వృక్షములు, పర్వతశిఖరములు విసురుతుంటే,
యూపాక్షుడు తన బాణములతో వాటిని నాశనం చేస్తున్నాడు.
ద్వివిదుడు, మైందుడు పెద్ద పెద్ద పర్వత శిఖరములను పెకలించి
రాక్షస వీరుల మీదికి విసురుతుంటే వాటిని శోణితాక్షుడు తన గదతో
ఎదుర్కొంటున్నాడు. ప్రజంఘుడు తన ఖడ్గము తీసుకొని అంగదుని
మీదికి వెళ్లాడు. ప్రజంఘుని తన దగ్గరగా రానిచ్చి, అంగదుడు ఒక పెద్ద మద్దిచెట్టుతో వాడిని తలమీద కొట్టాడు. తరువాత ప్రజంఘుని
కత్తిపట్టుకున్న చేతిని విరిచాడు. ప్రజంఘుని ఖడ్గము నేలమీద
పడిపోయింది. చేతిలో ఏమీ లేకపోవడంతో ప్రజంఘుడు పిడికిలి
బిగించి అంగదుని మీదికి దూకాడు. అంగదుని నుదుటి మీద
బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అంగదుడు సృహ తప్పాడు. అంతలోనే
తేరుకున్న అంగదుడు ప్రజంఘుని తలనుపట్టుకొని గిరా గిరా తిప్పి
మొండెము నుండి వేరు చేసాడు. ప్రజంఘుని తల నేల మీద దొర్లింది.
ప్రజంఘుడు యూపాక్షునికి పినతండ్రి అవుతాడు.కళ్లముందే పినతండ్రి తల నేల కూలడం చూచిన యూపాక్షుడు చలించిపోయాడు. అప్పటికే అతని వద్ద ఉన్న బాణములు
అయిపోయాయి. అందువలన ఖడ్గము చేతిలోకి తీసుకొని రథము
నుండి కిందికి దిగాడు. ద్వివిదుడిని ఎదుర్కొన్నాడు. ద్వివిదుడు వాడిని గట్టిగా పట్టుకొని గుండెల మీద కొట్టాడు. తన సోదరుడైన
యూపాక్షుని ద్వివిదుడు పట్టుకోడం చూచి, శోణితాక్షుడు ద్వివిదుడిని
వక్షస్థలం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ద్వివిదుడు తొట్రుపడ్డాడు. ద్వివిదుడిని కొట్టడానికి శోణితాక్షుడు గద పైకెత్తాడు. ద్వివిదుడు ఆ గదను లాక్కున్నాడు. ఇంతలో మైందుడు ద్వివిదునికి సాయంగా వచ్చాడు. తన అరిచేతితో యూపాక్షుడిని గుండెల మీద కొట్టాడు. ఒక పక్క మైందుడు, ద్వివిదుడు, మరొక పక్క శోణితాక్షుడు,
యూపాక్షుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ద్వివిదుడు శోణితాక్షుని ముఖం అంతా తన గోళ్లతో రక్కాడు. కిందపడేసి తొక్కాడు. శోణితాక్షుడు మరలా లేవలేదు.మైందుడు యూపాక్షుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా నలిపేసాడు. మైందుడి చేతుల్లో నలిగిన యూపాక్షుడు ప్రాణాలు కోల్పోయాడు. యూపాక్షుడు, శోణితాక్షుడు చావడం చూచిన రాక్షస సేనలు కుంభకర్ణుని కుమారుడు కుంభుని వైపు పరుగెత్తారు. వారిని చూచిన కుంభుడు వారికి ధైర్యము చెప్పి వారిని యుద్ధోన్ముఖులను చేసాడు. కుంభుడు తన ధనుస్సును తీసుకొని అత్యంత విషపూరితము లైన సర్వములతో సమానమైన బాణములను (అంటే విషము పూసిన బాణములు) వానర సేనల మీదికి సంధించాడు. మొదటిసారిగా ద్వివిదుడిని కొట్టాడు. ఆ దెబ్బకు ద్వివిదుడు తూలి కిందపడ్డాడు. అది చూచిన మైందుడు ఒక పెద్ద గండశిలను తీసుకొని కుంభుడి మీదికి విసిరాడు. కుంభుడు ఆ శిలను తన బాణములతో ముక్కలు చేసాడు. కుంభుడు మైందుని వక్షస్థలము చీల్చేటట్టు ఒక బాణమును సంధించాడు. ఆదెబ్బకు మైందుడు కిందపడి మూర్ఛపోయాడు. ఇది చూచిన అంగదుడు కుంభుని మీదికి ఉరికాడు.కుంభుడు ఐదు నాచారములను అంగదుని మీదికి ప్రయోగించాడు.అంగదుడు ఆ బాణములకు భయపడకుండా వృక్షములతోనూ బండరాళ్లతోనూ కుంభుని కొట్టాడు. అంగదుడు తన మీదికి విసిరిన వక్షములను, రాళ్లను తన బాణములతో పొడి పొడి చేసాడు కుంభుడు. అంతే కాకుండా రెండు బాణములతో అంగదుని ఫాలభాగమున కొట్టాడు.

సనాతన ధర్మం

14 Dec, 15:39


బాల దత్తుడు. గాణుగాపూర్ లో

సనాతన ధర్మం

14 Dec, 15:35


14-12-2024 అయోధ్య శ్రీరాముని దర్శనమ్

సనాతన ధర్మం

14 Dec, 12:54


నువ్వు సర్వజ్ఞుడవు. త్రిలోకాధిపతివి. రేణుకా సుతుడవు. పైగా నీ మీద ప్రేమతో గణాధిపతి నీకు ఆత్మతత్వ స్వరూపం కూడా బోధించాడు. కాబట్టి నీ తల్లి రేణుకాదేవి స్వరూపాన్ని మహాత్మ్యాన్ని నువ్వు పూర్తిగా గుర్తించి ఉంటావు. దయజేసి ఆ జగన్మాత మూల తత్వాన్ని మాకు తెలియపరుచు.దత్తాత్రేయా ! రేణుకాదేవికి తనయుడన్న మాటేకానీ ఆ తల్లిమూలతత్వం ఏమిటో నాకు ఏ మాత్రమూ తెలీదు. ఏకవీరాదేవి స్థూల సూక్ష్మాత్మక తత్వాలన్నీ తెలిసినవాడవు నువ్వే. కనుక నువ్వే మాకు చెప్పు - అన్నాడు
పరశురాముడు. రామా ! నీకు తెలియదంటే నేనెందుకు నమ్ముతాను. నాతో చెప్పించాలని నీ ప్రయత్నం పోనీలే అలాగే చెబుతాను
విను. ముల్లోకాలను తన గర్భకోశంలో సంరక్షించే జగదేకమాత -రేణుకాదేవియే - ఆమె దివ్యరూపం స్థూలసూక్ష్మా భేదాలతో రెండు విధాలుగా వుంటుంది. అద్భుతావహమైన అంశం ఇది. అరణ్యాలు, నదులు, సముద్రాలు, పర్వతములు, ప్రాణికోటి ఈ భూగోళం - ఇదంతా తల్లికి స్థూలరూపం, స్వర్గాలు, సర్వతీర్ధాలు, దేవతలు, మహర్షులు, సప్తపాతాళ లోకాలు, శేష కూర్మాదులు - ఈ దృశ్యమాన జగత్రయమంతా ఆ తల్లి స్థూలరూపమే. పరబ్రహ్మమే ఆమె సూక్ష్మరూపం - అని దత్తాత్రేయుడు చెబుతూంటే విని పరశురాముడు ధ్యాన నిమగ్నుడయ్యాడు. అక్కడే అలాగే అమలకీ తరువు చెంత ఏకవీరాదేవిని ఉపాసిస్తూ ఉండిపోయాడు. దీపకా ! ఒకప్పుడు కైలాసదర్శనానికి వెళ్ళిన మహర్షులు కుమారస్వామిని ఇదే వృత్తాంతం అడిగారు. ఆ షణ్ముఖుడు చెప్పిన రేణుకా మహత్మ్యం నీకు తెలియపరుస్తాను, శ్రద్ధగా విను.

ఓం శ్రీ దత్తాయగురవేనమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

14 Dec, 12:54


శ్రీదత్త పురాణము || చతుర్ధ భాగం
పద్మ తీర్థ మహిమ || ఎనిమిదవది(8)

దీపకా ! పనిలో పనిగా ప్రణీతానదిలోని పద్మ తీర్థ ప్రభావం కూడా చెబుతాను ఆలకించు - అని వేదధర్ముడు తన ప్రవచనాన్ని ఇలాకొనసాగించాడు.పూర్వకాలంలో ఉషా సూర్యదంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. భానుమతి అని పేరుపెట్టుకున్నారు. సర్వశుభలక్షణలక్షిత. రోజుకొక ఏడాదిగా త్వరత్వరగా ఎదిగింది. అందానికి చురుకుదనానికి చలాకీ ఆటపాటలకు పెట్టింది పేరయ్యింది. పరిపూర్ణ కన్యకామణి అయ్యింది. ఆ విశ్వమోహినిని చూసి భాస్కరుడే దురదృష్టవ శాత్తూ మోహితుడయ్యాడు. కోరికతీర్చమంటూ వెంటపడ్డాడు. అజ్ఞానావృతుడైన తండ్రి నుండి తప్పించుకొని ఆ భానుమతి పాపభీతయై మృగీరూపం ధరించి ఘోరారణ్యంలోకి పారిపోయింది. మోహాంధుడైన సూర్యుడు ఆ రూప ద్రవిణ సంపన్నను వెదుక్కుంటూ ముల్లోకాలూ సంచరించాడు. ఎట్టకేలకు అరణ్యంలో మృగీరూపంలో దాక్కున్న భానుమతిని
పట్టుకున్నాడు. బలాత్కారం చెయ్యబోయేలోగా ఇంద్రాది దేవతలూ కశ్యపాది ఋషులూ ప్రత్యక్షమై వారించారు. కానీ కన్న కూతుర్ని కామించిన పాప చింతనకూ బలాత్కార ప్రయత్నానికి శిక్షగా కుష్టురోగం సంక్రమించింది. అది దిన దిన ప్రవర్థమానమై సూర్యుణ్నిదారుణంగా పీడించసాగింది. అవయవాలు తిమ్మిరిలెక్కి వికలేంద్రియుడయ్యాడు. తండ్రి పరిస్థితి చూసి భానుమతి దిగులుపడింది. మృగీరూపం విడిచిపెట్టింది. తండ్రికి నమస్కరించి ఆశీస్సులు తీసికొని బ్రహ్మాదిదేవతలను సందర్శించి తండ్రి కుష్టురోగం నయమయ్యేదారి చెప్పమని అభ్యర్థించింది. స్మరణతో సందర్శనతో అందరికీ ఆరోగ్యం పంచిపెట్టే భాస్కరుడు మండల మధ్యభాగంలో విష్ణుమూర్తిని సకలదేవతలను ధరించే సూర్యభగవానుడు, సురసిద్ధ ఋషిగణపూజితుడు మళ్ళీ సర్వాయవసంపూర్ణుడై అందర్నీ ఆరోగ్యవంతుల్ని చేసేదెప్పుడూ ? దీనికేదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అని బతిమాలుకుంది. అమ్మాయీ ! మీ నాన్నకు కుష్టు రోగం ఎందుకు వచ్చిందో తెలుసుగదా ! నిన్ను కామించిన మహా పాపానికి అది ఫలం. బ్రహ్మహత్యకన్నా గురుభార్యాభిగమనం కన్నా ఘోరమైన పాతకమిది. దీన్ని తొలగించగల శక్తి కేవలం ఒక్క పద్మ తీర్థానికి మాత్రమే వుంది. అమలకీవనంలో దత్తాత్రేయ ఆశ్రమం ఉంది. దాని చెంత ప్రవహిస్తున్నదియే ప్రణీతానది. ఆశ్రమ తీర్థమే పద్మ తీర్థం. మీ తండ్రిని అక్కడకు వెళ్ళమను. అందులో స్నానం చేసి ఏకవీరా దేవిని
అర్చించమను. ఆవిడ సకలదేవతాధీశ్వరి, జగన్మాత, భక్తితో ఆరాధిస్తే కరుణిస్తుంది. భుక్తిముక్తి ఫలాలు ప్రసాదిస్తుంది. వెంటనే బయలుదేరమను. రోగం మరీముదిరి కదలలేని దశవస్తే కష్టం.
దేవతలు చెప్పిన ఉపాయాన్ని భానుమతి, తండ్రికి వినిపించింది. అతడు వెంటనే బయలుదేరి పడుతూ లేస్తూ పాకుతూ డేకుతూ దత్తాశ్రమం చేరుకున్నాడు. నిత్యం పద్మతీర్థంలో స్నానం చేస్తూ దత్తదేవుడ్ని ధ్యానిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. రేణుకాదేవిని బహు విధాలుగా మంత్రాలతో శ్లోకాలతో స్తుతించాడు. ఆ తల్లి కరుణించింది. తేజోరాశీ! నీ స్తుతులకు ప్రసన్నురాలినయ్యాను. నీ శరీరం ఆరోగ్యంతో రెట్టింపు అవుతుంది. నువ్వే అందరికీ వరాలు ఇచ్చేవాడివి. నీకు ఇవ్వేళ వరమిస్తున్నాను. ఇక ఆలసింపకు - స్వస్థానం చేరుకో. ఈ పద్మతీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు
తర్పణాలు విడిచి పెట్టినవారంతా త్రివిధ ఋణాల నుండీ విముక్తులై దివ్యగతులు పొందుతారు. ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఇహలోకంలో సుఖించి పరలోకంలో ఇంద్రభోగాలు అనుభవిస్తారు. అని రేణుకాదేవి అంతర్థానం చెందింది. భాస్కరుడు ఆ క్షణంలోనే కుష్టురోగం నుండి విముక్తుడయ్యాడు. తన సూర్యలోకం చేరుకున్నాడు. దీపకా ! తెలిసిందికదా ! పద్మ తీర్థ మహిమ ఎంతటిదో. నువ్వు ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో, అడుగు
చెబుతానంటూ వేదధర్ముడు కమండలూదకంతో కాసింత గొంతు తడుపుకొన్నాడు. - గురుదేవా ! సర్వధర్మజ్ఞా ! సర్వసందేహ భేదకా ! ఈ దత్త దేవుడి చరిత్ర నువ్వు చెబుతూంటే నేను వింటూంటే ఎంతకీ తనివితీరడంలేదు. కన్నమ్మకే వాపు, తిన్నమ్మకే తీపు అన్నట్లు ఇంకాఇంకా వినాలనిపిస్తోంది. నిజమే రసజ్ఞుడెవడు సంతృప్తి చెందకుండా వుంటాడు. ఆధ్యాత్మిక దుఃఖాలన్నింటినీ నశింపజేసే కధలివ్వి. అలనాడెప్పుడో దేవతలు సేవించారని చెబుతున్న అమృతం - ఈ దత్త కథామృతం ముందు అతితుచ్ఛం. దీనికి సాటిరానేరాదు. దయజేసి అదే అమృతగోళాన్ని మరింతగా అందించు. రేణుకాదేవి స్వరూపం గురించి ప్రసక్తి వశాత్తూ చెప్పావు
కానీ క్లుప్తంగా చెప్పావు. దాన్ని ఇంకా విస్తారంగా వినాలని నా తహతహ కరుణానిధీ ! అనుగ్రహించు. ఈ జగత్తుకి ధేనువు, ఖని, ధాత్రి అయిన ఆ మహాదేవి తత్వాన్ని నీ కన్నా బాగా ఎరిగినవారు కానీ ఎరుక పరచగలవారు కానీ మరొకరు ఉన్నారని నేననుకోను.
నాయనా దీపకా ! నీ జిజ్ఞాస నన్ను ఆనందపరుస్తోంది. రేణుకాదేవి మహాత్మ్యాన్ని సమగ్రంగా వివరిస్తాను తెలుసుకో. ఇది వింటే చాలు సకల ప్రాణులకు సర్వశ్రేయస్సులు కలుగుతాయి. సుర - సిద్ధ - ఋషిమండలితో పరివేష్టితుడై అమలకీవృక్ష ఛాయలో కూర్చుండి ఒకనాడు దత్తాత్రేయుడు పరశురాముణ్ని ఇలా అడిగాడు. రామా !

సనాతన ధర్మం

14 Dec, 09:43


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
డెబ్బది ఐదవ సర్గ.(75) సనాతన ధర్మం

ఆ ప్రకారంగా వానర సేనలు అందరూ పునర్జీవితులయ్యారు.
సుగ్రీవుడు హనుమంతుని చూచి ఇలా అన్నాడు. “హనుమా!
కుంభకర్ణుడు యుద్ధములో మరణించాడు. ప్రస్తుతము లంకనుండి
మనతో యుద్ధము చేయడానికి వచ్చే వాళ్లు ఎవరూ ఉన్నట్టు
కనపడటం లేదు. ఈ సమయంలో మన వానరులు అందరూ ఈ
రాత్రికి లంకలో ప్రవేశించి రావణుని నివాసమును కాల్చివేస్తారు. ఇది
నా ఆజ్ఞ." అని ఆదేశించాడు. సుగ్రీవుని ఆదేశము ప్రకారము కొంత మంది వానర వీరులు చేతిలో కాగడాలు ధరించి, చీకటి పడగానే లంక వైపుకు వెళ్లారు. ఆ వానరులను చూచి లంకకు కాపలాగా ఉన్న రాక్షసులు పారిపోయారు. చేతిలో కాగడాలు ధరించిన వానరులు లంకా నగరంలో ప్రవేశించారు. లంకలోని నివాసములకు, మేడలకు,
చైత్యములకు అన్నిటికి నిప్పుపెట్టారు. లంకా నగరం అంతా
తగలబడిపోయింది. ఎన్నో భవనములు చైత్యములు అగ్నిగి ఆహుతి
అయ్యాయి. ఆయుధములు, రథములు, కవచములు, కత్తులు, డాళ్లు,ధనుస్సులు, బాణములు,, వస్త్రములు, అన్నీ కాలిబూడిదయ్యాయి. రాక్షస పౌరులందరూ భార్యా పిల్లలతో ప్రాణాలు దక్కించుకోడానికి పరుగులు పెడుతున్నారు. అగ్ని ఒక భవనము నుండి మరొక భవనమునకు వ్యాపిస్తూ అన్నిటినీ దహిస్తూ ఉంది. రాక్షస స్త్రీలందరూ వీధుల్లో పరుగులుపెడుతున్నారు. ఏనుగుల శాలలలో ఉన్న ఏనుగులను, గుర్రపు శాలలలో ఉన్న గుర్రములను వాటి రక్షకులు కట్టు విప్పి పారి పొమ్మని సైగలు చేస్తున్నారు. ఏనుగులు, గుర్రములు తమ కట్లువిప్పగానే పారిపోతున్నాయి. కొన్ని ఏనుగులు, గుర్రములు బలవంతంగా కట్లు తెంచుకొని పారిపోతున్నాయి. కొద్ది సేపట్లోనే సుందరమైన లంకా నగరమంతా బూడిద అయింది. స్త్రీలు, పిల్లలు చేస్తున్న ఆర్తనాదాలతో లంక అంతా మార్మోగుతోంది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు రాక్షసుల మీదికి యుద్ధానికి సన్నద్ధము అవుతున్నారు. తమ తమ ధనుస్సులను సారిస్తున్నారు. ధనుష్టంకారములు చేస్తున్నారు. ఒక పక్క ఇళ్లు వాకిళ్లు దగ్ధం అయిపోతుంటే, మరొక పక్క రాక్షస సైనికులు యుద్ధరంగానికి వెళుతున్నారు. రామలక్ష్మణులు లంకా నగరం మీదికి తమ బాణాలు వదులుతున్నారు. ఆ బాణాల దెబ్బకు లంకా నగరంలోని పెద్ద పెద్ద
చైత్యములు గోపురములు కూలిపోతున్నాయి. రాక్షస నాయకులకు ఆ రాత్రి కాళరాత్రి అయింది. సుగ్రీవుడు వానర నాయకులనందరినీ
సమావేశ పరిచి వారితో ఇలాఅన్నాడు. “వానర నాయకులారా! మీరందరూ మీ మీ స్థానములలో నిలబడి యుద్ధం చేయండి. ఎవరూ నా ఆజ్ఞను ధిక్కరించరాదు” అని ఆదేశించాడు. ఆ ప్రకారము వానర వీరులు తమ తమ సైన్యములతో చేత కాగడాలు ధరించి యుద్ధం చేస్తున్నారు.లంకా నగర ద్వారములు దాకా వచ్చిన వానర వీరులను చూచి రావణుడు కోపంతో ఊగిపోయాడు. వెంటనే కుంభకర్ణుని
కుమారులైన కుంభుడు, నికుంభుడు అనే వారిని రాక్షస సేనలతో
యుద్ధానికి పంపాడు. వారి వెంట యూపాక్షుడు, శోణితాక్షుడు,
ప్రజంఘుడు, కంపనుడు అనే రాక్షస వీరులను కూడా పంపాడు.
వారందరూ సింహనాదాలు చేస్తూ వానరుల మీదికి యుద్ధానికి
బయలుదేరారు.చంద్రుడు ప్రసరించే వెన్నెలలో, నక్షత్రాల కాంతిలో, చేతిలో ఉన్న కాగడాల కాంతిలో వారు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు పరిఘలు, ప్రాసలు ధరించి యుద్ధము చేస్తున్నారు. వానరులు తమ చేతులలో వృక్షములు, పెద్ద పెద్ద బండరాళ్లు ధరించి యుద్ధము చేస్తున్నారు. దగ్గరకు వచ్చిన రాక్షసులను గోళ్లతో చీలుస్తున్నారు. రాక్షసులు తమ చేతిలో ఉన్న ధనస్సుల నుండి బాణములు సంధించి వానరులను చంపుతున్నారు. వానరులు రాక్షసుల చెవులను కొరుకుతున్నారు. తలలు పగలగొడుతున్నారు.శరీరాలను రాళ్లతో మోదుతున్నారు. కొట్టండి, చంపండి, నిలవండి,వాడిని చంపు వీడిని చంపు అనే మాటలతో యుద్ధరంగము మార్మోగిపోతోంది. కొన్ని బాణములు సూటిగా వచ్చి తగులుతుంటే చాలా మటుకు గురితప్పి వ్యర్ధము అవుతున్నాయి. ఈ ప్రకారంగా ఆ రాత్రి రాక్షసులు వానరులు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము డెబ్బది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

09 Dec, 13:14


ఈరోజు (9-12-2024)శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారు🙏, కుండలేశ్వరం,

సనాతన ధర్మం

09 Dec, 13:05


దశరథ మహారాజు ముగ్గురు భార్యలు పాయసాన్ని స్వీకరించడం||
శ్రీమద్రామాయణము బాలకాండ లోని 16 వసర్గ తెలుగు లో
https://youtu.be/mkVT94jxCuI

సనాతన ధర్మం

09 Dec, 12:50


శ్రీ దత్త పురాణము ||చతుర్ధ భాగం
పింగళనాగ వృత్తాంతం ||ఐదవ వృత్తాంతం (5)

ప్రణీతానది ఒడ్డున కృష్ణా మలకీ తరుచ్ఛాయలో ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయుడి దగ్గరకు ఒకనాడు పింగళనాగుడు అనే ముని దర్శనార్ధం వచ్చాడు. సభక్తిగా నమస్కరించి దత్త దేవుడి అనుమతితో చేరువలో కూర్చున్నాడు. స్వామీ! నాకు తెలీక అడుగుతున్నాను. నా అజ్ఞానాన్ని క్షమించి నా సందేహం తొలగించండి. నాకు తెలిసీ నాలుగు ఆశ్రమాలే ఉన్నాయి. వాటికి వాటి నియమ నిబంధనలున్నాయి. వీటిలో తమరు ఏ ఆశ్రమానికి చెందిన వారుగా కనిపించడం లేదు. మీరిద్దరూ దిగంబరులై ఉంటారు. మదిరా మాంసాలను పుచ్చుకుంటూ కనిపిస్తారు. దిగంబరీ! ఈ అందగత్తెను ఎప్పుడూ అంకపీఠం దింపవు. ఏమిటి స్వామి! ఇదంతా. దీన్ని ఏ ఆశమ్రం అంటారు? ఈ ఆశ్రమదీక్షను మీకు ఇచ్చిన ఆ గురు మహానుభావుడెవరు? ఎంతో కాలంగా మిమ్మల్ని అడగాలని. ఇప్పటికి
కుదిరింది. కాసింత విశ్రాంతిగా ఏకాంతంగా దొరికారు. అందుకని అడిగేశాను. నొప్పిస్తే క్షమించండి చెప్పకూడనిది అయితే చెప్పవద్దు. తెలుసుకోవాలని మాత్రం చాలా కుతూహలంగా ఉంది. మునిశ్రేష్టా! అడగవలసిందే అడిగావు. ఇందులో నన్ను నొప్పించింది ఏమీ లేదు. నువ్వన్నట్లు ఇంత వరకూ లోకంలో ఉన్నవి నాలుగే ఆశ్రమాలు. కానీ నాది - ఆపైది, అయిదో ఆశ్రమం. ఈ చరాచర జగత్తునంతటినీ
ఆత్మాభిన్నమనీ అవికల్పంగా చూడగలిగినవాడు, కామక్రోధాదులనైన అరిషడ్ వర్గాన్ని జయించి సర్వ భూతకోటిపట్లా సమచిత్తంతో వైరాగ్యంతో ఉండగలిగినవాడు మాత్రమే ఈ అయిదవ ఆశ్రమానికి అర్హుడు. నేను చెప్పిన ఈ తత్వం నువ్వన్న నాలుగు ఆశ్రమాలలోనూ ఎక్కడైనా వున్నట్లా, లేనట్లా? బహుశ నీకు తెలీదు. చెప్పలేవు. కేవలం బ్రహ్మవాదులు మాత్రమే గుర్తించగలరు. మహానుభావా! నువ్వే విశ్వేశ్వరుడవు. నువ్వే పురుషోత్తముడవు. అనసూయ - అత్రిదంపతులకు జన్మించిన నువ్వే కమలాపతివి. అజ్ఞానంతో నేను చేసిన ఈ అధిక ప్రసంగాన్ని క్షమించు. నన్ను రక్షించు. నీ ఉదరంలో ప్రవేశించి సురక్షితంగా ఉండాలని నా ఆకాంక్ష. హే శ్రీ రామా! నారాయణా! వాసుదేవా! గోవిందా! వైకుంఠా! ముకుందా! కృష్ణా!
శ్రీ కేశవా! అనంతా! నృశింహా! విష్ణూ! సంసార సర్ప ద్రష్టుణ్ని. నన్ను కాపాడు - అని పింగళనాగుడు సాగిలపడి మ్రొక్కాడు. పింగళనాగుడి ప్రార్ధనను మన్నించి దత్తాత్రేయుడు శివరూపంతో అతడిని గర్భాన ధరించాడు.

శ్రీ దత్తాయ గురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

09 Dec, 05:29


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
డబ్బై ఒకటవ సర్గ (71) లో రెండవ భాగం

లక్ష్మణుని మీద బాణమును సంధించాడు. అతి కాయుని మాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసాధమా! నేను నీ ఎదుట నిలిచి ఉన్నాను. చేతనైతే నీ బలం పరాక్రమం చూపించు. కేవలం నిన్ను నీవు పొగుడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎవరిని
వారు పొగుడుకొనేవారు ఉత్తములు కారు. పరాక్రమం చూపేవాడినే
శూరుడు అంటారు కానీ కేవలం మాటలతో పొద్దుపుచ్చేవాడిని కాదు.
ఇక్కడ నోరు కాదు, బాణాలు మాట్లాడాలి. నీవు రథం మీద ఉన్నావు.
అన్ని రకములైన అస్త్ర శస్త్రములు కలిగి ఉన్నావు. ఇంకెందుకు ఆలస్యం. శరప్రయోగం చెయ్యి. ఆ తరువాత నా పరాక్రమము ఏపాటిదో చూద్దువుగానీ! నేను కొట్టిన ఒకే ఒక బాణమునకు, పక్వమైన తాటి పండు చెట్టునుండి పడినట్టు నీ తల తెగి నేలమీద పడుతుంది. నా బాణాలు నీ రక్తం తనివిదీరా తాగుతాయి. నీవు చెప్పినట్టు నేను నీ కన్నా చిన్నవాడినే. కాని గట్టి వాడను. చిన్న వాడు అని చులకనగా చూడకు.నేను చిన్నవాడినైనా వృద్ధుడను అయినా నీ పాలిట మృత్యువును. మృత్యువుకు వయోబేధం లేదు కదా! బాలుడైన వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి అణగతొక్కడం నీవు వినలేదా! నేనూ అంతే.” అని ముగించాడు లక్ష్మణుడు.
ఏదో చిన్నవాడు కదా, చెబితే వింటాడు కదా అని అనుకున్నాడు అతికాయుడు. కానీ లక్ష్మణుడు రెచ్చిపోవడం చూచి సహించలేకపోయాడు. ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే బాణమును
సంధించాడు. ఏం జరుగుతుందో ఏమో అని ఆకాశం నుండి
దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అతికాయుడు ఒక వాడి అయిన బాణమును
లక్ష్మణుని మీదకు వదిలాడు. తన మీదికి దూసుకువస్తున్న ఆ
అస్త్రమును లక్ష్మణుడు ఒక అర్థచంద్రబాణంతో రెండుగా ఖండించాడు.తాను విడిచిన శరము వృధా కావడంతో అతికాయుడికి కోపం వచ్చింది. వెంటనే లక్ష్మణుని మీద ఐదుబాణములను సంధించాడు. దానికి సిద్ధంగా ఉన్న లక్ష్మణుడు ఆ బాణములను కూడా మధ్యలోనే విరిచాడు. అతికాయుడు ఆశ్చర్యపోయాడు. లక్ష్మణుడు ఆలస్యం చేయకుండా మరొక వాడి అయిన బాణంతో అతికాయుని నుదుటి భాగమునకు గురి చూచి కొట్టాడు. లక్ష్మణుని బాణము అతికాయుని నుదుటిలో లోతుగా దిగబడింది. రక్తం ధారగా కారుతూ ఉంది.ఆ దెబ్బకు అతి కాయుడు అటు ఇటు తూలాడు. అంతలోనే సర్దుకున్నాడు. లక్ష్మణుని వంక ప్రశంసాపూర్వకంగా చూచాడు. “ఇన్నాళ్లకు నాకు సరి అయిన శత్రువు దొరికావు. నీ అస్త్రలాఘవానికి మెచ్చుకుంటున్నాను. కానీ నా నుండి తప్పించుకోలేవు. కాచుకో.” అన్నాడు అతికాయుడు. వెంటనే తన ధనుస్సు నుండి వరుసగా రెండు, ఐదు, ఏడు బాణములను ఒకే సారి సంధించి వేగంగా లక్ష్మణుని మీదికి విడిచిపెట్టాడు. తన మీదికి దూసుకువస్తున్న వాడి అయిన ఆ బాణములను చూచి లక్ష్మణుడు ఏ మాత్రం కంగారు పడలేదు. తాను కూడా వాటికి దీటుగా బాణములను సంధించి అతికాయుడు సంధించిన బాణములను అన్నిటినీ మధ్యలోనే తుంచాడు. ఒకే ఒక బాణంతో లక్ష్మణుని చంపవచ్చు అనుకున్న అతికాయునకు. తన బాణములు అన్నీ వృధా కావడం చూచి మండిపోయింది. ఈ సారి అమోఘము వాడి అయిన బాణం ఒకటి తీసాడు. ఆ బాణమును లక్ష్మణుని గుండెలకు గురిచూచి కొట్టాడు. ఆ బాణము సూటిగా వచ్చి లక్ష్మణుని వక్షస్థలమును తాకింది. రక్తం ధారగా కారింది. లక్ష్మణుడు ఆ బాణమును తన శరీరమునుండి లాగేసాడు. లక్షణుడు ఒక బాణమును తీసి దాని మీద ఆగ్నేయాస్త్రమును సంధించి అతికాయుని మీదకు ప్రయోగించాడు.దానికి ప్రతిగా అతికాయుడు తన బాణము మీద సౌరాస్త్రమును ఆహ్వానించి సంధించాడు. లక్ష్మణునికి గురిచూచి వదిలాడు. లక్ష్మణుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము అతికాయుడు ప్రయోగించిన సూర్యాస్త్రము ఆకాశంలో ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. రెండు అస్త్రములు కాలిపోయి నేలమీద పడ్డాయి. తన అస్త్రము వృధా కావడం చూచిన అతికాయుడు మరొక అస్త్రమును సంధించి దాని మీద త్వష్ట అనే
దేవతను ఆహ్వానించి, లక్ష్మణుని మీదికి ప్రయోగించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అస్త్రమును ఇంద్రాస్త్రముతో నిర్వీర్యము గావించాడు. అతికాయుడు మరొక బాణం మీద యముడిని ఆహ్వానించి దానిని లక్ష్మణుని మీదికి విడిచిపెట్టాడు. లక్ష్మణుడు ఆ యమ అస్త్రమును వాయవ్యాస్త్రముతో ఛేదించాడు. రెండు అస్త్రములు పనికిరాకుండా పోయాయి. ఇలా అస్త్రములతో లాభం లేదని లక్ష్మణుడు అతికాయుని మీద శరవర్షము కురిపించాడు. ఎడతెరిపి లేకుండా బాణవర్షము కురిపించాడు. లక్ష్మణుడు ప్రయోగించిన బాణములు అన్నీ అతికాయుని కవచమునకు తగిలి విరిగిపోతున్నాయి. అయినా
లక్ష్మణుడు తన పట్టువిడువలేదు. మరొక వేయి బాణములను
అతికాయుని మీద వర్షము వలె కురిపించాడు. కాని ఆ బాణముల
బారి నుండి అతికాయుని దివ్య కవచము రక్షిస్తూ ఉంది. కాబట్టి
లక్ష్మణుని బాణ పరంపరకు అతికాయుడు ఏ మాత్రం బెదరడం లేదు.
అతికాయుడు సర్పము వంటి బాణము ఒకదానిని తీసుకొని దానిని
లక్ష్మణుని మీద ప్రయోగించాడు.

సశేషం

సనాతన ధర్మం

09 Dec, 02:33


వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి

https://youtube.com/shorts/1hiB39qmMfQ?feature=share

సనాతన ధర్మం

08 Dec, 12:20


శ్రీదత్త పురాణము ||చతుర్ధ భాగం
కృష్ణా మలకం కథ || నాలుగవది (4)

ఒకానొక సందర్భంలో ఏక వీరా దేవి ఆజ్ఞ మేరకు చతుర్ముఖుడు విష్ణు సందర్శన కాంక్షతో క్షీర సముద్రానికి బయలు దేరాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. ఎంత వెదికినా ఎంతసేపున్నా శేష సాయి దర్శనమే కాలేదు. ఏమిటి ఈ వింత అని భయ సందేహ పరాభవాది భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా అక్కడ ఒక ఆమలకీ తరువు (ఉసిరిక) కనిపించింది. అది విద్యుత్కాంతులు విరజిమ్ముతున్న కృష్ణా మలకీ తరువు. దాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు విరించి. ఆ - తరు రూపంలో స్వయంగా విష్ణుమూర్తి వచ్చినట్లే అనిపించి రేణుకాదేవి పరశురామునితో - నాయనా! మరొక్కసారి ఈ కృష్ణా మలకీ రూప విష్ణుమూర్తిలోకి ప్రవేశించు. శివ స్వరూపుడైన నీ తండ్రిని స్తుతించు. ఈ కృష్ణామలకం త్రిభువనేశ్వరుడు. సాక్షాద్విష్ణువు. నీ తండ్రి సదాశివుడు. కనుక తరువు అవుతుంది. నువ్వూ దత్తాత్రేయుడు కలిసి ఈ కృష్ణామలకీ తరువుని ఇక్కడ సహ్యాద్రి మీద ఉన్న ఈ శుభ ప్రదమైన దత్తాశ్రమంలోనూ దండకలోనూ స్థాపించండి. నాకూ సంతోషం కలిగించండి. నువ్వు కూడా దీని నీడలో విశ్రాంతి తీసుకో. ఈ తరువును దర్శించిన వారుగానీ స్పృశించిన వారు కానీ సద్గతులు పొందుతారు - అంది. అప్పుడు పరశురాముడు ఆ తరువులో
ప్రవేశించి తన ఉనికితో దానికి త్రి దేవత్వాన్ని కలిగించాడు. అటు పైని బ్రహ్మ దేవుడు రేణుకా దేవివద్ద శలవు తీసుకొని తన సత్య లోకం చేరుకున్నాడు. రేణుక అంతర్థానం చెందింది. దత్తాత్రేయుడు ఆ తల్లికి నమస్కరించి ఆ తరువు క్రింద ధ్యాన నిష్ఠకు ఉపక్రమించాడు. తలపెట్టిన యజ్ఞం పూర్తి అయ్యే వరకూ భార్గవరాముడు సైతం ఆ తరువు చెంతనే విశ్రాంతి తీసుకున్నాడు.

ఓం శ్రీ దత్తాయగురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

08 Dec, 07:01


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
డెభైఒకటవ సర్గ.(71) లో మొదటి భాగం,

ఇంక మిగిలిన వాడు అతికాయుడు. వాడు సామాన్యుడు
కాడు. బ్రహ్మచేత వరములను పొందిన వాడు. దేవతలను, దానవులను జయించిన వాడు. అటువంటి అతికాయుడు తన వాళ్లు అందరూ మరణించడం చూచి ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. వెంటనే తన రథము ఎక్కి వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. పెద్దగా సింహనాదం చేస్తున్నాడు. అతికాయుని శరీరము, అరుపులు,
ధనుష్టంకారములు వానరుల గుండెల్లో గుబులుపుట్టించాయి. అతికాయుని చూడగానే కుంభకర్ణుడు మరలా లేచి వచ్చాడా అన్నట్టు అనిపించింది వానరులకు. ఇదంతా రాముడు దూరంనుండి చూచాడు. కుంభకర్ణుని వంటి దేహము కల అతికాయుని చూచిన రాముడు విభీషణుని చూచి ఇలా అన్నాడు. “విభీషణా! కుంభకర్ణుడు మరలా బతికి వచ్చాడా అన్నట్టు ఉన్న ఈ రాక్షసుడు ఎవరు? వీడు పర్వతము వలె ఉన్నాడు. వీడు రథం మీద వస్తుంటే మృత్యుదేవత వస్తున్నట్టు ఉంది. వీడి రథము కూడా విచిత్రంగా ఉంది. దానికి వెయ్యి అశ్వములు కట్టారు. నలుగురు సారధులు ఉన్నారు. వీడి రథము నిండా ధనుస్సులు అస్త్రములు,శస్త్రములు సమృద్ధిగా ఉన్నాయి. వీడి చేతిలో ఉన్న ఒక్కొక్క ఖడ్గము పదిచేతుల పొడుగు ఉంది. ఇంతకూ వీడు ఎవరు? వీడి చరిత్ర ఏమిటి? ఎందుకంటే వీడిని చూచి వానరులు అంతా పారిపోతున్నారు.వీడిని త్వరగా సంహరించకపోతే వానరులు యుద్ధం చేసేటట్టు లేరు.”అని అన్నాడు రాముడు.
విభీషణుడు రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా!రావణుడు, కుబేరుడు అన్నదమ్ములు. రావణునికి ధాన్యమాలికి పుట్టిన
వాడు ఈ అతికాయుడు. వీడు అత్యంత శక్తిమంతుడు. ఇతడు
రావణునితో సమానమైన బలపరాక్రమములు కలవాడు. వేదాధ్యనము చేసినవాడు. సకల శాస్త్ర పారంగతుడు. అస్త్ర, శస్త్ర విద్యలు తెలిసినవాడు. మంచి ఆలోచనా పరుడు. నీతిమంతుడు. ఇతని బాహు బలముతోనే లంక సురక్షితంగా ఉంది. ఇతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వరములను పొందాడు. దేవ, దానవులను, యక్షులను యుద్ధములో ఓడించాడు. రాక్షసులను సదా రక్షిస్తూ ఉంటాడు. తన అస్త్రములతో ఇంద్రుని కూడా కదలకుండా చేసిన మహావీరుడు అతికాయుడు. ఇతడిని వరుణ పాశము కూడా ఏమీ చేయలేదు. ఓ రామా! నీవు ఇతనిని తొందరగా చంపాలి. లేకపోతే వానర సేనలకు అపార నష్టం కలుగుతుంది." అన్నిఅన్నాడు విభీషణుడు.ఒక పక్క విభీషణుడు ఈ మాటలు రామునితో అంటూ
ఉండగానే అతికాయుడు తన రథం మీద సింహము లేళ్లగుంపు లోకి
చొరబడ్డట్టు వానర సేనలోకి చొరబడ్డాడు. తనతో యుద్ధం చేయడానికి వచ్చిన వానరులను తన బాణాలతో కొడుతున్నాడు. ఇది చూచిన కుముదుడు, ద్వివిదుడు, మైందుడు, నీలుడు, శరభుడు అందరూ కలిసి ఒక్కుమ్మడిగా వృక్షములతోనూ, పర్వత శిఖరముల
తోనూ అతికాయుని మీద దాడి చేసారు. అతికాయుడు తన వాడి
అయిన బాణములతో ఆ వృక్షములను, పర్వత శిఖరములను
పగలకొడుతున్నాడు. అంతే కాకుండా తన వాడి అయిన బాణములతో వానర వీరుల శరీరములను కొడుతున్నాడు. అతికాయుని బాణముల ధాటికి వానర వీరుల శరీరములు శిథిలమైపోయాయి.అతి కాయుడు ఒక నియమాన్ని పాటిస్తున్నాడు. కేవలం తనతో యుద్ధముచేస్తున్నవారి మీదనే బాణప్రయోగము చేస్తున్నాడు. ఇతరుల వంక కన్నెత్తి కూడా చూడ్డం లేదు. అతికాయుని ధాటికి భయపడి ఎవరూ అతని ఎదుటికి పోవడం లేదు. అందుకని
అతికాయుడు తన రథాన్ని రాముని వద్దకు పోనిచ్చాడు. రాముని
ఎదుట నిలిచి ఇలా అన్నాడు.“ఓరామా! ఈ చిన్న చిన్న వానరులను చంపి ఏమి ప్రయోజనము. నేను నీ ఎదుట నిలబడి ఉన్నాను. నీకు శక్తి, ఉత్సాహము, పరాక్రమము వీరత్వము ఉంటే నాతో యుద్ధం చెయ్యి"అని రాముని యుద్ధానికి పిలిచాడు. ఆ మాటలకు లక్ష్మణునికి కోపం వచ్చింది. వెంటనే లక్ష్మణుడు అతికాయుని ఎదుట నిలబడి
ధనుష్టంకారము చేసాడు. అతికాయుడు లక్ష్మణుని చూచి ఇలా
అన్నాడు. “లక్ష్మణా! నాతో పోలిస్తే నీవు బాలుడవు.. యుద్ధవిద్యలో నీకు నేర్పు లేదు. అనుభవమూ లేదు. కాలయముని వంటి నాతో నీవు యుద్ధము చేయలేవు. నా ధనుస్సు నుండి వెలువడిన బాణములకు హిమవత్పర్వతము కూడా ఎదురు నిలువ లేదు. నా వాడి అయిన శరములకు భూమ్యాకాశాలు బద్దలు అవుతాయి. నాలో ఉన్న ప్రళయాగ్నిని నిద్రలేపకు. దయచేసి వెళ్లిపో, నీ ప్రాణాలు దక్కించుకో.నా లక్ష్యం రాముడు కానీ నువ్వు కాదు. వెళ్లు. నా మాట వినకుండా మొండిగా ఇలాగే ఉన్నావనుకో, నేను ఏమీ చెయ్యలేను-- నీతో యుద్ధంచేసి నిన్ను చంపడం తప్ప. యముని సందర్శనమునకు
సిద్ధంగా ఉండు. నీకు మరొక సారి చెబుతున్నాను. నా బాణములు
సామాన్యమైనవి కావు. నా బాణములు పరమేశ్వరుని పాశు
పతాస్త్రముతో సమానములు. నిన్ను క్షణంలో కూలుస్తాయి. కాచుకో”
అని అన్నాడు అతికాయుడు.

సశేషం

సనాతన ధర్మం

08 Dec, 05:02


https://t.me/sanatanadharma1

మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని ఈ  గ్రూప్ లో ADD చెయ్యవచ్చు.

Group Name పై Touch  చేస్తే ADD Member అని ఆప్షన్ ఉంటుంది.

☝️ ఈ ADD Member ఆప్షన్ టచ్ చేయగానే మీ ఫోన్ బుక్ లో ఉన్న టెలిగ్రామ్ కాంటాక్ట్స్ లిస్ట్ కనబడుతుంది. అందులో నుండి add చేయాలనుకున్న వారిని సెలెక్ట్ చేసి Okay చేయడం ద్వారా వారు గ్రూప్ లో Add అవుతారు.

గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం.
శుభమస్తు.
🙏🙏🙏🙏❤️❤️❤️❤️💐💐💐💐

సనాతన ధర్మం

08 Dec, 04:55


ఈరోజు (8-12-2024) అయోధ్య బాల రాముని దర్శనము, జై శ్రీరామ్

సనాతన ధర్మం

07 Dec, 16:11


తణుకు సజ్జాపురం లోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 🙏🙏

సనాతన ధర్మం

07 Dec, 15:11


వ్యాఘ్రేస్వరం లోని వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు

సనాతన ధర్మం

07 Dec, 14:38


నాగులగుంట లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు

సనాతన ధర్మం

07 Dec, 14:31


పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు🙏

సనాతన ధర్మం

07 Dec, 10:18


ఉండ్రాజవరం లోని సుబ్బారాయుడు 🙏🏻🙏🏻

సనాతన ధర్మం

07 Dec, 09:31


Post:- సనాతన ధర్మం
Facebook:-
https://www.facebook.com/profile.php?id=100064200275251&mibextid=ZbWKwL
YouTube:-
https://youtube.com/@sanatanadharmam01?si=bJzTS5JCLV2E2GOn
What's app:-
https://chat.whatsapp.com/IToTTEJvyEuE3gAGJ03Y2d

Teligram:-
https://t.me/sanatanadharma1

Instagram:-
https://www.instagram.com/sanatanadharmam01?igsh=c2w1cWhpMHd1bTU5

సనాతన ధర్మం

07 Dec, 08:13


శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు🙏 మురమళ్ళ 🙏

సనాతన ధర్మం

07 Dec, 04:50


🙏శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారు, బిక్కవోలు 🙏
సనాతన ధర్మం సభ్యులు అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు,

తంగిరాల చంద్రశేఖర అవధాని,
కపిలేశ్వరపురం

సనాతన ధర్మం

07 Dec, 04:38


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
డెబ్భయ్యవ సర్గ.(70) || #సనాతనధర్మం

నరాంతకుడు మరణించడం చూచిన దేవాంతకుడు, త్రిశిరస్సు, మహోదరుడు పెద్దగా శోకించారు. మహోదరుడికి కోపం మిన్ను ముట్టింది. ఒక పర్వతము మాదిరి ఉన్న పెద్ద ఏనుగును ఎక్కి
అంగదుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. తన అన్నయ్య మరణాన్ని కళ్లారా చూచిన దేవాంతకుడు అంగదుని మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. తన పరిఘను తీసుకొని అంగదుని మీదికి ఉరికాడు. త్రిశిరస్సుడు కూడా తన రథము మీద ఎక్కి అంగదుని మీదికి వెళ్లాడు. ఈ ముగ్గురు రాక్షస వీరులు ఒక్కుమ్మడిగా అంగదుని చుట్టు ముట్టారు.ఇది చూచిన అంగదుడు ఒక పెద్ద చెట్టును పెకలించాడు.ఆ చెట్టును దేవాంతకుని మీదికి విసిరాడు అంగదుడు. త్రిశిరస్సుడు ఆ చెట్టును తన బాణములతో ఛేదించాడు. అది చూచిన అంగదుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంనుండి అంగదుడు చెట్లను, బండరాళ్లను వర్షం మాదిరి కురిపించాడు. త్రిశిరస్సుడు వాటిని తన బాణములతో నుగ్గు నుగ్గుచేసాడు. మహెదరుడు తన మీదికి విసిరిన వృక్షములను తన పరిఘతో విరుగగొట్టాడు. త్రిశిరస్సుడు బాణములను అంగదుని మీద వర్షిస్తూ అతనిమీదికి వెళ్లాడు. మహోదరుడు తన ఏనుగు మీద అంగదుని వద్దకు పోయి తన తోమరము అనే ఆయుధముతో అంగదుని గుండెలమీద కొట్టాడు. దేవాంతకుడు కూడా తన పరిఘతో అంగదుని కొట్టి దూరంగా పారిపోయాడు. ఆ ప్రకారంగా ముగ్గురు రాక్షస వీరులు ఒక్కుమ్మడిగా తనను చుట్టుముట్టి బాధపెడుతున్నా అంగదుడు చలించలేదు. అంగదుడు సమయం చూచి తన అరిచేతితో దేవాంతకుడు ఎక్కిన ఏనుగును బలంగా మోదాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు కిందపడి చచ్చిపోయింది. అంగదుడు ఆ ఏనుగు దంతమును ఊడపీకి, దానినే ఆయుధముగా ధరించి దేవాంతకుని కొట్టాడు. ఆ దెబ్బకు దేవాంతకుడికి దిమ్మతిరిగి రక్తం కక్కుకున్నాడు. అంతలోనే తేరుకున్న దేవాంతకుడు తన పరిఘను తీసుకొని అంగదుని కొట్టాడు. ఆ పరిఘ దెబ్బకు అంగదుడు బోర్లాపడ్డాడు. వెంటనే పైకి లేచాడు. ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతున్న అంగదుని లలాటమునకు గురిపెట్టి మూడు బాణములను కొట్టాడు త్రిశిరస్సుడు.ఆప్రకారంగా ముగ్గురు రాక్షస వీరులు అంగదుని చుట్టుముట్టడం చూచిన హనుమంతుడు, నీలుడు అంగదునికి సాయంగా వెళ్లారు. నీలుడు ఒక పర్వతమును ఎత్తి త్రిశిరస్సుని మీదకు విసిరాడు. దానిని త్రిశిరస్సుడు తన బాణాలతో బద్దలు కొట్టాడు.ఇంతలో దేవాంతకుడు పరిఘను చేత ధరించి హనుమంతుని మీదికి వెళ్లాడు. అది చూచిన హనుమంతుడు వేగంగా పైకి ఎగిరి తన పిడికిలితో దేవాంతకుని తలమీద కొట్టాడు. హనుమంతుడు కొట్టిన దెబ్బకు దేవాంతకుని తల ముక్కలైపోయింది. దేవాంతకుడు నేలమీద పడి ప్రాణాలు వదిలాడు.
అది చూచిన త్రిశిరస్సుడు నీలుని వక్షస్థలమునకు గురిచూచి బాణాలు వదిలాడు. మహోదరుడు కూడా తన ఏనుగును ఎక్కి నీలుని మీద శరవర్షము కురిపించాడు. ఆ ఇరువురు రాక్షస వీరులు కురిపించిన శరవర్షమునకు నీలుని శరీరం తూట్లు పడిపోయింది. నీలుడు కదలలేక కూలబడిపోయాడు. స్పృహ తప్పాడు. అంతలోనే తేరుకొని, నీలుడు ఒక పర్వతమును పెకలించి గాలిలోకి ఎగిరాడు. ఆ పర్వతముతో మహోదరుని తల మీద మోదాడు. ఆ దెబ్బకు మహోదరుని తల బద్దలు అయింది. నేల మీద పడి మరణించాడు.
మహోదరుని మరణం చూచిన త్రిశిరస్సుడు కోపంతో ఊగిపోయాడు. తన ధనుస్సును సంధించి హనుమంతుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరమును ఎత్తి త్రిశిరస్సుడి మీదికి విసిరాడు. త్రిశిరస్సుడు ఆ
పర్వత శిఖరమును తన బాణములతో ముక్కలు చేసాడు. తాను
విసిరిన పర్వతశిఖరము వృధాకావడం చూచిన హనుమంతుడు
వృక్షములను పెకలించి త్రిశిరస్సుడి మీదికి వేగంగా విసురుతున్నాడు.
తన మీదికి వేగంగా వస్తున్న వృక్షములను త్రిశిరస్సుడు తన బాణము
లతో ఖండిస్తున్నాడు. హనుమంతునికి కోపం మిన్నుముట్టింది. వేగంగా త్రిశిరస్సుడి రథం మీదికి దూకి రథమునకు కట్టిన గుర్రములను తన గోళ్లతో చీల్చాడు. అది చూచిన త్రిశిరస్సుడు శక్తి ఆయుధమును హనుమంతుని మీద ప్రయోగించాడు. హనుమంతుడు ఆ శక్తి ఆయుధమును ఒడుపుగా తన చేతితో పట్టుకొని రెండుగా విరిచాడు. అది చూచిన వానరులు హర్షధ్వానాలు చేసారు కేరింతలు కొట్టారు. వారి కేరింతలు విన్న త్రిశిరస్సుడు కోపంతో తన కత్తిని హనుమంతుని గుండెల్లో గుచ్చాడు. ఆ దెబ్బను తప్పించుకున్న హనుమంతుడు తన అరిచేతితో త్రిశిరస్సుని గుండెల మీద చరిచాడు. ఆ దెబ్బకు త్రిశిరస్సుడు చేతిలోని ఆయుధము కిందపడిపోయింది. వాడికి స్పృహ తప్పింది. హనుమంతుడు కిందపడిపోయిన త్రిశిరస్సుని ఖడ్గమును తీసుకొని పెద్దగా అరిచాడు. అంతలోనే స్పృహవచ్చిన త్రిశిరస్సుడు గాలిలోకి ఎగిరి హనుమంతుడిని తన పిడికిలితో మోదాడు. ఆ దెబ్బను తప్పించుకున్న హనుమంతుడు తన చేతిలోని కత్తితో త్రిశిరస్సుని శిరస్సులను ఖండించాడు. త్రిశిరస్సుని మూడు తలలూ నేలమీదపడి దొర్లాయి. త్రిశిరస్సుని మరణమును కళ్లారా చూచిన రాక్షసులు

సనాతన ధర్మం

07 Dec, 04:38


లంకా నగరం వైపుకు పారిపోయారు. వానరులు హర్షధ్వానాలు
చేస్తూ పారిపోతున్న రాక్షసులను తరుముతున్నారు.ఇంక మహాపార్శ్వుడు మిగిలాడు. మహాపార్శ్వుడు తన గదను చేత ధరించాడు. పూర్వము ఆ గదతో మహాపార్శ్వుడు ఇంద్రుని ఐరావతమును కూడా కొట్టాడు. అటువంటి గదను చేత ధరించి మహాపార్శ్వుడు వానరుల మీదికి వెళ్లాడు. అది చూచిన
ఋషభుడు అనే వానర వీరుడు ఎగిరి వచ్చి మహాపార్శ్వుడి ముందు
నిలబడ్డాడు. మహాపార్శ్వుడు తన గదతో ఋషభుని గుండెలమీద
మోదాడు. ఆ దెబ్బకు ఋషభుని గుండెలు బద్దలయ్యాయి. రక్తం
కారుతూ ఉంది. ఋషభుడు స్పృహ తప్పిపోయాడు.చాలాసేపటికి కానీ అతనికి స్పృహ రాలేదు. తనకు సహరాగానే ఋషభుడు మహాపార్శ్వుడు కోసం వెదికాడు.మహాపార్శ్వుడు కనపడగానే ఋషభుడు తన పిడికిలి బిగించి మహాపార్శ్వుని గుండెల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడు మొదలు నరికిన చెట్టు మాదిరి కిందపడి మూర్ఛపోయాడు. ఋషభుడు వెంటనే ఆ రాక్షసుని గదను తీసుకొని భయంకరంగా అరిచాడు.ఇంతలోనే స్పృహ వచ్చిన మహాపార్శ్వుడు ఋషభుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు కోపించిన ఋషభుడు తన చేతిలో ఉన్న గదతో మహాపార్శ్వుని గుండెలమీద మోదాడు. ఆ గదా ఘాతానికి మహాపార్శ్వుని గుండెలు బద్దలయ్యాయి. అంతటితో ఆగకుండా ఋషభుడు మహాపార్శ్వుని, గదతో కొట్టిన చోట కొట్టకుండా, కొట్టాడు. ఆ దెబ్బలకు మహాపార్శ్వుడు మరణించాడు.తిరుగులేని రాక్షస వీరుడు మహాపార్శ్వుడు కూడా మరణించడం చూచిన రాక్షస సేనలు తమ ప్రాణాలు రక్షించుకోడానికి పారిపోయాయి.

ఇది post చేసిన వారు:- సనాతనధర్మం,
తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము డెబ్భయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

06 Dec, 15:17


అరుణాచల గిరి ఎత్తు 2668 అడుగులు...మహదీపం పెట్టే చోటు నుంచి వర్షపు నీటితో కొండ చరియలు విరగడం తో ఎలా కోసుకొని పోయిందో ఈ చిత్రం లో చూడండి.
అరుణాచల శివ.🙏🙏

ఉదయం న్యూస్ లో ఒక విషయం చూసాను , ఏది ఏమైనా ఈ వానల వల్ల కొండపైన మనుష్యులు పడేసిన రెండు టన్నుల చెత్త ( వాటర్ బాటిల్స్, పాకెట్స్, box లు లాంటివి) మొత్తం తుడిచిపెట్టుకు పోయి అంతా కిందకి వచ్చేసింది, ఏ దోషం జరిగిందో కానీ వరుణుడు మొత్తం అరుణాచలాన్ని శుభ్రం చేసిన అనుభూతి అయితే కలుగుతోంది

తంగిరాల చంద్రశేఖర అవధాని,
కపిలేశ్వరపురం,

#సనాతనధర్మం #sanatana_dharmam #అరుణాచల_శివ

సనాతన ధర్మం

06 Dec, 14:32


ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అత్తిలి గ్రామము లోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 🙏🏻🙏🏻🙏🏻

సనాతన ధర్మం

06 Dec, 12:44


శ్రీదత్త పురాణము || చతుర్ధ భాగం
రేణుకా వృత్తాంతం || మూడవది (3)

కృతయుగారంభంలో సృష్టి కర్త అయిన పితామహుడు అనేకోపాయాలతో ఈ జగత్ సృష్టి చేసాడు. దేవ - దైత్య - మనుష్య - పశు - పక్షి - వృక్షాది జాతుల్ని వర్ణాశ్రమ ధర్మాలను సమస్తమూ వేద నిర్ధిష్టమైన మార్గంలో సృజించాడు. ముల్లోకాలు హాయిగా ఉన్నాయి. అందరూ జ్ఞాన విజ్ఞాన పారంగులై తపోనిష్టులై కామ క్రోధ రాగ ద్వేష
రహితులై శాంతి సౌఖ్యాలతో ప్రసన్నంగా కాలం గడుపుతున్నారు. బ్రహ్మదేవుడు గమనించాడు. ఇలాగైతే ఇక సృష్టి వృద్ధి చెందినట్టే - అనుకున్నాడు. ఆలోచించాడు. తమోగుణం, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం - అనే పంచ పర్వాలతో అవిద్యను సృష్టించి ప్రాణికోటిని సమ్మోహపరచడానికి లోకం మీదికి వదిలిపెట్టాడు. అతడు సృష్టించిన అవిద్య ముందుగా అతడినే ఆవరించింది. దాని మహిమతో వేదాలు మరిచిపోయాడు. ఎంత గింజుకున్నా ఒక్క మంత్రమూ గుర్తురావడం లేదు. కళ వళపడ్డాడు. భయపడ్డాడు. వెంటనే బయలుదేరి హంసవాహనం అధిరోహించి సహ్యపర్వతం చేరుకున్నాడు. ఒక ప్రశాంత రమణీయ స్థలంలో ఆమలకీ వనంలో (ఉసిరిక) కూర్చుని నిష్టాగరిష్టుడై రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి కరుణామయి. క్షణకాలంలో దర్శనమనుగ్రహించింది. చతుర్ముఖుడు ప్రణమిల్లి నిలిచి బహువిధాల స్తుతించాడు. మెల్లగా తన అవస్థను విన్నవించాడు. ఏ జననీ! త్రిలోక వందితా! గాయత్రీ! వేదమాతా! కటాక్షించు. వేదాలను మరచిపోయాను ఏ ఒక్క మంత్రమూ గుర్తుకు రావడం లేదు. నువ్వు పరమేశ్వరివి. జగద్గురుత్వం నీది. సర్వదేవతా మయివి. నీ అక్షరరూపాన్ని నా బుద్ధిలో తిరిగి ప్రకాశింపజెయ్యి.చతురాననా! వెళ్ళి దత్తాత్రేయుణ్ని అభ్యర్ధించు. అతడు వర్ణమాత్రా సహితంగా సకల విద్యలూ నేర్చినవాడు. అని రేణుకా దేవి బ్రహ్మకు చెప్పి, వెంటనే దత్తాత్రేయుణ్ని పిలిచింది. జ్ఞానవేత్తృ పురస్కృతా! సర్వదేవ నమస్కృతా! ఈ
బ్రహ్మ దేవుడు ఏదో అంటున్నాడు, కొంచెం కనుక్కో నాయనా - అని చెప్పింది. అప్పుడు దత్త దేవుడు బ్రహ్మను సమీపించాడు. చతుర్ముఖా ! సర్వజ్ఞానవేత్తా! ఏమిటి అడుగుతున్నావో చెప్పు. నాకు తెలిసింది తప్పక చెబుతాను.మునిశ్రేష్టా ! వేదాలను, వేదాంగాలనూ, ఉపనిషత్తులను సమస్తమూ మరచిపోయాను. దయజేసి
వర్ణమాత్రాస్వరాత్మాంకంగా వాటిని నాకు బోధించు.విరించీ! కకారాది సకల వర్ణాలలోనూ ఏకైకమై పరిఢవిల్లే అనంత నాదాత్మకత ఒక్కటే. అది ఎవరిలో ప్రకాశిస్తుందో ఆ దేవిని “సవర్ణ” అంటారు. ఆ సవర్ణ - ఈరేణుకాదేవియే తప్ప మరొకరెవ్వరూ కాదు. సవర్ణ - వేదమాత -
సావిత్రి-బ్రహ్మరూపిణి - అన్నీ ఆ జగద్ధాత్రి రేణుకాదేవియే. రెండవ శక్తి లేదు. ఏకమాత్ర - ఏక వీర - ఓంకారైక స్వర - అన్నీ ఆమెయే. అష్టపర్యాయక వాచక అని కూడా ఆమెను అంటారు. (హ్లాదిని - విమల - ఉత్కర్షిణి - జ్ఞానయోగ - ఇత్య - ఈశాన - ప్రహ్వి - అనుగ్రహ - అని అష్టపర్యాయ వాచకాలు) ఒక్కటే అయినా అనేక రూపాలు ధరిస్తుంది. కనుక ఏక వీర అన్నారు. ఆమెయే వేదమాత. గాయత్రి బ్రహ్మ రూపిణి. మునిశ్రేష్టా ! సాధు, వేదమాత అన్నా, గాయత్రి అన్నా, బ్రహ్మ రూపిణి అన్నా ఒక్కరేనని చాలా చక్కని విషయం స్పష్టపరిచావు. దత్తాత్రేయ చతుర్ముఖులు ఇలా సంభాషించుకుంటూ ఉండగానే దత్తదేవుడి అంకపీఠ నివాసినియైన శ్రీదేవి ముఖం నుంచి చతుర్వేదాలు వెలువడి రేణుకాదేవి శరీరంలో ప్రవేశించాయి. దీనితో సంతృప్తి చెందిన చతుర్ముఖుడు రేణుకాదేవియే వేద మాత అని గుర్తించి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. తల్లీ! ఛందస్స్వరూపిణివి నీవు. ఓం కార స్వరూపిణివి నీవు. అనంత రూపిణివి నీవు. తెలిసిగానీ, తెలియక గానీ నిన్ను నిందించే వాళ్ళు సకల పుణ్య ఫలాలనూ కోల్పోతారు. అని స్తుతించి మరొక్కసారి నమస్కరించి దత్తాత్రేయుడికి ప్రణమిల్లి పురాతన వేద స్మృతిని తిరిగిపొంది
సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ జగదంబికయే రేణుమహారాజు చేసిన తపస్సుకు సంతుష్టయై వారింట కన్యగా జన్మించి శివస్వరూపుడైన జమదగ్నిని పరిణయమాడింది. సేవలు చేసినది. ఆ దంపతులు కొంతకాలానికి లౌకిక దేహాలను విడిచిపెట్టి శివశివాని
రూపాలతో కైలాసం తిరిగి చేరుకున్నారు. దీపకా! ఈ కధ నీకింతకు ముందే చెప్పాను కదా! అంచేత నీ మరో ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను. తిలకించు - అని వేద ధర్ముడు కొనసాగించాడు.

శ్రీ దత్తాయగురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

06 Dec, 06:11


ఈ ప్రశ్నకు సమాధానం:- జాంబవంతుడు

సనాతన ధర్మం

06 Dec, 05:45


వృక్షములను, పర్వతములను వారి నుండి లాక్కుని రాక్షసులు
వానరులను చంపుతున్నారు. అలాగే వానరులు కూడా రాక్షసుల
చేతిలో ఉన్న ఆయుధములను లాక్కొని, వాటి తోనే రాక్షసులనుచంపుతున్నారు. వానరులు రాక్షసులు ఒకరి శరీరములను ఒకరు
బద్దలు కొట్టుకుంటున్నారు. సింహనాదాలు చేస్తున్నారు. యుద్ధము
చేయడానికి వృక్షములు, పర్వతములు దొరకని వానరులు, విరిగిన
రథములను, ఏనుగు కళేబరములను ఆయుధములుగా చేసుకొని
రాక్షసులను చంపుతున్నారు. వానరులు విసురుతున్న వృక్షములను,
పర్వతశిఖరములను రాక్షసులు అర్థచంద్రబాణము లతోనూ,
భల్లబాణములతోనూ పిండి పిండి చేస్తున్నారు. యుద్ధభూమి అంతా
వానరులు, రాక్షసుల కళేబరాలతోనూ, ఏనుగులు, గుర్రముల
కళేబరములతోనూ, విరిగిన రథములతోనూ నిండి పోయి
నడవడానికి కూడా వీలుకాకుండా ఉంది.వానరులు ఇంక తెగించారు. రాక్షసులతో తెగించి పోరాడుతున్నారు. వానరుల దెబ్బకు రాక్షసులు వందలు వేలు మరణిస్తున్నారు. వానరులు హర్షధ్వానాలు చేస్తున్నారు. పైనుండి దేవతలు, గంధర్వులు, యక్షులు రాక్షసులు పరాజయాన్ని చూచి సంతోషిస్తున్నారు. ఇది చూచిన నరాంతకుడికి కోపం మిన్నుముట్టింది. తన గుర్రము మీద ప్రాస అనే ఆయుధమును ధరించి వాయువేగంతో యుద్ధభూమి అంతా కలయదిరుగుతున్నాడు. నరాంతకుడు తన ప్రాస ఆయుధంతో దెబ్బకు ఏడువందలమంది వానరులను చంపుతున్నాడు.
వానరులు అతడిని ఎదుర్కోవాలి అనుకునే లోపలనే నరాంతకుడు
వారిని చంపుతున్నాడు. అంతవేగంగా తిరుగుతున్నాడు నరాంతకుడు. వానరులు వృక్షములను, కొండలను పెకలించే లోపే నరాంతకుని ప్రాసకు బలి అవుతున్నారు. కార్చిచ్చు అరణ్యమును కాల్చినట్టు నరాంతకుడు వానర సేనలను కాలరాస్తున్నాడు.
నరాంతకుడు ఆ ప్రాసను ఎత్తుకొని గుర్రంమీద తిరుగుతుంటే వానరులు మాటలాడుకోడానికి కానీ, నిలబడుటకు కానీ వీలు కావడం లేదు. నిలబడ్డవారిని నిలబడ్డట్టు, ఎగిరిన వారిని ఎగిరినట్టు కొడుతున్నాడు నరాంతకుడు. ఆ నరాంతకుడు వానరాంతకుడుగా ప్రకాశిస్తున్నాడు. నరాంతకుని ప్రాస ఆయుధము ధాటికి తట్టుకోలేక వానరులు పెద్ద గా కేకలు పెడుతున్నారు.వారందరూ సుగ్రీవుని వద్దకు పరుగెత్తారు. సుగ్రీవుడికి నరాంతకునికి భయపడి పారిపోతున్న వానరసేన కంటబడింది. వారి వెంట గుర్రము ఎక్కి తరుముతున్న నరాంతకుడు కనపడ్డాడు. వెంటనే అంగదుని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు. “అంగదా! అటు చూడు. ఆ గుర్రము మీద ఎక్కి వానరులను తరుముతున్న ఆ రాక్షసుడిని చూడు. వాడిని వెంటనే చంపు. వానరులను వెనక్కు మళ్లించు.” అని అన్నాడు. వెంటనే అంగదుడు ఆకాశంలోకి ఎగిరాడు. నరాంతకుని ముందు నిలిచాడు. వాడితో ఇలా అన్నాడు. “నీ ప్రాస ప్రతాపము సామాన్య వానరుల మీద కాదు. నీ ప్రాసను నా మీదికి విసురు.” అని రొమ్మువిరుచుకొని నిలబడ్డాడు. ఆమాటలు విన్న నరాంతకుడుతన ప్రాసను అంగదుని మీదికి విసిరాడు.అది అంగదుని వక్షస్థలమును తాకి రెండు ముక్కలై కిందపడిపోయింది. వెంటనే అంగదుడు తన అరిచేతితో నరాంతకుడు ఎక్కిన గుర్రము తలమీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆ గుర్రము కిందపడి పోయింది. గిలా గిలా కొట్టుకొని మరణించింది.
తన గుర్రము చావడం చూచిన నరాంతకుడు తన పిడికిలితో అంగదుని తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు అంగదుని తల పగిలింది. రక్తం కారింది. స్పృహ తప్పింది. అంతలోనే తెలివి వచ్చిన అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుని వక్షస్థలము మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు నరాంతకుడి గుండెలు బద్దలయ్యాయి.
కింతపడిపోయాడు. గిలా గిలా కొట్టుకొని మరణించాడు. అంగదుని
చేతిలో నరాంతకుడు చావగానే వానరులు హర్షధ్వానాలు చేసారు.
నరాంతకుని చంపినందుకు రాముడు అంగదుని ప్రశంసించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

06 Dec, 05:45


శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
అరవై తొమ్మిదవ సర్గ. (69)

రావణుని తమ్ముడు, మహావీరుడు, కుంభకర్ణుడు, రాముని చేతిలో మరణించాడు. కుంభకర్ణుడు మరణించాడని తెలిసి రావణుడు
భోరున విలపించాడు. అప్పుడు త్రిశిరుడు రావణుని చూచి ఇలా
అన్నాడు. “ఓ రాక్షస రాజా! కుంభకర్ణుడు మరణించాడు. నిజమే. కాని
వీరుడవైన నీవు ఈ మాదిరి శోకించడం తగదు. నీవు మూడు
లోకములను గెలువ సమర్థుడవు. అట్టి నీవు ఒక సామాన్యుని వలె
ఇలా శోకించడం తగదు. నీ వద్ద బ్రహ్మదేవుడు ప్రసాదించిన
అస్త్రములు, శక్తి కవచము, ధనుస్సు, దివ్యమైన రథము ఉన్నాయి కదా. మరి చింత ఎందుకు. ఓ రావణా! నీవు పెక్కు సార్లు దేవతలను,
దానవులను ఓడించావు. అట్టి నీవు నీ వద్ద ఉన్న అస్త్రములు,
శస్త్రములతో రాముని ఓడించలేవా! పైగా మేమంతా నీ వెంట
ఉన్నప్పుడు నీకు దిగులు ఎందుకు. ఇప్పుడే నేను రణభూమికి వెళ్తాను. నీ శత్రువులను సంహరిస్తాను. విజయంతో తిరిగి వస్తాను. నాచేత చంపబడ్డ రాముని నీవు చూడగలవు." అని పలికాడు త్రిశిరుడు. త్రిశిరుని మాటలకు రావణుడు ఎంతో సంతోషించాడు.
త్రిశిరుని వెంట దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు
బయలుదేరారు. వారి వెంట రావణుని కుమారులు కూడా యుద్ధానికి
బయలుదేరారు. వారందరూ ఆకాశంలో ఎగరగల సమర్థత ఉన్నవారు. పైగా మాయాయుద్ధములో ఆరితేరినవారు. అందరూ దేవతలతోనూ, దానవులతోనూ, యక్షులు, గంధర్వులు, పన్నగులతోనూ యుద్ధము చేసి వారిని ఓడించిన పరాక్రమవంతులు. అందరికీ అస్త్రవిద్య బాగా తెలుసు. పైగా అందరూ వరములు పొందినవారే. రావణుడు తన కుమారులను కౌగలించుకొని వారిని ఆశీర్వదించి యుద్ధమునకు పంపాడు. రావణుడు తన కుమారుల రక్షణ కొరకు ప్రత్యేకంగా తన సోదరులు, యుద్ధోన్మత్తుడు అయిన మహోదరుని, మత్తుడు అయిన మహాపార్శ్వుడిని పంపాడు. త్రిశిరుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు యుద్ధానికి మహోత్సాహంతో బయలుదేరారు. మహోదరుడు ఐరావతమును పోలిన ఏనుగును ఎక్కి యుద్ధానికి వెళ్లాడు. రావణుని కుమారుడు త్రిశిరుడు రథము మీద బయలుదేరాడు. (త్రిశిరుడు అంటే మూడు తలలు కలవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. తరువాతి శ్లోకంలో వాడు మూడు కిరీటములు ధరించాడు అని ఉంది. కాబట్టి వాడికి మూడు తలలు ఉన్నాయని చెప్పవచ్చును.) రావణుని కుమారుడు అతికాయుడు కూడా రథము మీద బయలుదేరాడు. నరాంతకుడు తెల్లటి గుర్రమును ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. చేతిలో ప్రాస అనే ఆయుధమును ధరించాడు. దేవాంతకుడు పరిఘ అనే ఆయుధమును ధరించి బయలు దేరాడు. మహాపార్శ్వుడు గదను చేత ధరించి బయలు దేరాడు. వారి వెనక రాక్షస సైన్యము బయలు దేరింది. వారందరూ, వస్తే విజయులై తిరిగిరావాలి లేకపోతే యుద్ధములో మరణించి వీరస్వర్గము పొందాలి, అనే కృతనిశ్చయంతో బయలుదేరారు. వారందరూ పెద్దగా గర్జిస్తూ సింహనాదాలు చేస్తూ వెళుతున్నారు. వాళ్ల అరుపులతోనూ సింహనాదాలతోనూ భూమి ఆకాశము బద్దలవుతున్నాయా అన్నట్టు ఉంది. వారందరూ లంకానగరము వెలుపలికి వచ్చి వానర సైన్యమును చూచారు. వానరులు కూడా రాక్షససైన్యమును చూచారు. వానరులు అందరూ తమ తమ చేతులలో పెద్ద పెద్ద
వృక్షములను పర్వతములను ఎత్తి పట్టుకొని అరుస్తున్నారు. యుద్ధానికి సన్నద్ధము అవుతున్నారు. వానరుల అరుపులు విన్న రాక్షసులు వారి కన్నా ఇంకా పెద్దగా అరుస్తున్నారు. గర్జిస్తున్నారు. వికటాట్టహాసం చేస్తున్నారు. వానరులు కొంత మంది నేల మీదా మరి కొంతమంది ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేస్తున్నారు. రాక్షసుల మీద వృక్షములను,రాళ్లను, విసురుతున్నారు. రాక్షసులు వదులుతున్న బాణములను ఎదుర్కొంటూ రాక్షసుల మీదికి పర్వతములను విసురుతున్నారు.వానరులు విసురుతున్న పర్వతముల కిందపడి రాక్షసులు పొడి పొడి అవుతున్నారు. వానరులు విజృంభించి కవచములను ధరించిన రాక్షసులను వెతికి వెతికి మరీ చంపుతున్నారు. వారి రథములను విరగ్గొడుతున్నారు. మరి కొందరు వానర వీరులు గుర్రములను,ఏనుగులను, వాటి మీద ఎక్కిన వారిని చంపుతున్నారు. రాక్షసులు బాణాలు వేసే లోపల వారి మీద పెద్ద పెద్ద పర్వతశిఖరములు పడుతున్నాయి. ఆ దెబ్బకు వారు చేతిలో బాణములు చేతిలోనే ఉన్నట్టు మరణిస్తున్నారు. కింద పడ్డ రాక్షసులను వానరులు గోళ్లతో చీలుస్తున్నారు, పిడికిళ్లతో గుద్దుతున్నారు. రాక్షసులు కూడా వాడి అయిన బాణములతో వానరుల శరీరములను చీలుస్తున్నారు. శూలములతోనూ ముద్గరలతోనూ, కత్తులతోనూ కొడుతున్నారు. చంపుతున్నారు.
ఆ ప్రకారంగా వానరులు రాక్షసులు, వారి వారి ప్రభువులకు
జయము సంపాదించి పెట్టడానికి, ఒకరిని ఒకరు దారుణంగా
చంపుకుంటున్నారు. రణభూమి అంతా రక్తసిక్తమయింది. రణభూమి
అంతా వానరుల యొక్క రాక్షసుల యొక్క మృతకళేబరములతో
నిండి పోయింది. తమ తమ ఆయుధములు విరిగి పోగా రాక్షసులు
వానరులతో ద్వంద్వయుద్ధము చేస్తున్నారు. ఒకరిని ఒకరు
చంపుకుంటున్నారు. రాక్షసులు మీదికి విసరడానికి వానరులు తెచ్చిన

సనాతన ధర్మం

04 Dec, 16:18


శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి లీలలు || శ్రీ గురుచరిత్ర 10 వ అధ్యాయము

https://youtu.be/eV-ecPJGbAc

సనాతన ధర్మం

04 Dec, 16:06


శ్రీదత్త పురాణము ||చతుర్ధ భాగం
పరశురామ ప్రతిజ్ఞ || రెండవ దానిలో మూడవది (2-3)

నాయనా, భార్గవరామా! నువ్వు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడంతటి వాణ్ని
అనాయాసంగా బాహు పరాక్రమంతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులెందరో సంహరించావు. క్రూర కర్ములూ
అధార్మికులూ అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ ముయ్యేడు మార్లు ఏరి ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి
ఘనకార్యాలు సాధించావంటే శిశూ! నువ్వు సాధారణ శూరుడవో బ్రాహ్మణుడవో కావని నా అభిప్రాయం. ఈ లోకంలో
ఈ రూపంలో సంచరిస్తున్న స్వయం శ్రీమహావిష్ణుడవని నా నమ్మకం.
స్వామిన్! దత్తదేవా! అరిందమా! నేను విష్ణువును కాను, మహాశూరుణ్ని కాను. ఇది నిజం. గురుదేవ-ద్విజులకు
నేను శిష్యుణ్ని. వటువుని. సందేహం ఏమీ లేదు. దేవ - ఋషి- పితృ తృప్తి కోసం ఏదో చెయ్యాలను కుంటున్నాను.
దానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి గురుస్థానం అంగీకరించు అంటూ ఒదిగి పరశురాముడు
దత్తాత్రేయుడికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తదేవుడు చిరునవ్వుతో అంగీకరించాడు.
ఆ రమ్యమైన సహ్యాచలమే యాగ భూమి అయ్యింది. ఋషులంతా ఆహుతులై విచ్చేశారు. ద్వారతోరణ
పతాకాలంకారాలతో యాగ మంటపం సిద్దమయ్యింది. వేదికలూ యజ్ఞ కుండాలూ శాస్త్రీయంగా రూపొందాయి.
కాశ్యపుడు ప్రధాన ఋత్విక్కుగా ఒక శుభదివసాన శుభముహుర్తాన భార్గవరాముడు యజమాన దీక్షను స్వీకరించాడు.
బ్రహ్మవేత్తలైన ఋత్విక్కులు. ఋజుభక్తి తాత్పర్యాలతో సమర్చితులై యజ్ఞాంగాలను అన్నింటినీ నిర్దుష్టంగా
సంపూర్ణంగా నిర్వహించారు. దివ్యాభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికీ
సువర్ణోపస్కరాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ధి చెప్పనవసరమే లేదు. అన్ని జాతుల వారికీ కావాలన్నదల్లా
పుష్కలంగా అందింది. ఇలా రామయజ్ఞం సుసంపన్నం, సుసంపూర్ణం అయ్యింది. దేవ మానవ యక్ష కిన్నెర నాగరాక్షస
చారణ సిద్ధ సాధక జాతులవారందరూ పితృదేవతలూ ధన - ఘన సన్మానాలతో సంతృప్తులయ్యారు. సోమంతో ఇంద్రుడూ,
భూరి దక్షిణలతో భూసురులూ, అన్న పాన వస్త్రాదులతో దీనులూ పరితుష్టి చెందారు. ప్రధాన ఋత్విక్కుగా అన్నీ
నడిపించిన కాశ్యపుడికి చాతరోత్ర విధానంగా సంపూర్ణ క్షితి మండలాన్నే దక్షిణగా సమర్పించాడు భార్గవరాముడు.
ఇరవై యొక్క మార్లు క్షత్రియ సంహారం చేసి భుజబలంతో తాను గెలుచుక్ను భూగోళమిది. కశ్యపుడికి దక్షిణ అయ్యింది.
ఆచార్యకత్వం నెరపిన దత్తస్వామిని రత్నాభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి అర్చించాడు. రాముడిచ్చిన
వాటిని అన్నింటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకూ, బ్రాహ్మణులకూ నమస్కరించి మరీ సమర్పించాడు. కాశ్యపుడు
భార్గవరాముని అనుమతి తీసుకొని తన క్షితిమండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనికి పరశురాముడు చాలా
సంబరపడ్డాడు. కాశ్యపా! నీ వంటి జ్ఞానులు చెయ్యవలసిన పనిని చేశావు. ముండిత శిరస్కుడై, దిగంబరుడై మన మధ్య
నడయాడుత్ను ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. సందేహం లేదు. ఇంత
సుదుష్కరమైన ఈ మహాయజ్ఞం ఇంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తమయ్యింది అంటే కేవలం ఇది వీరి అనుగ్రహమే,
శ్రీ దేవీ కరుణా కటాక్షమే - అని తన భక్తి భావాన్ని ప్రకటించి కాశ్యపునికి దత్త దేవునికీ మరొకసారి నమస్కరించి
రేణుకామాతను మనస్సులోనే ధ్యానించి సురసిద్ద మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞతగా
శిరసువంచి అభివాదం చేస్తూ అందరి దగ్గరా సెలవు తీసుకొని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రాన తపస్సుకి
వెళ్ళిపోయాడు.

గురూత్తమా! కార్త వీర్యార్జుని అవతార సమాప్తితో పాటు పరశురాముని వృత్తాంతం కూడా నాకు తెలియజెప్పి
ఎనలేని ఆనందం సమకూర్చారు. అయితే ఇక్కడ నాదొక సందేహం. ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడైన దత్తాత్రేయుడే నమస్కరించి స్తుతించాడంటే ఆ తల్లి అవతారగాధ వినవలసిందే. అనుగ్రహించండి. రేణు అనే మహారాజు ఒకరు ఉండే వాడనీ, ఆయనగారి కూతురు రేణుక అనీ, నేనెప్పుడో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకను దేవదేవుడు నమస్కరించడమేమిటి చెప్మా? అని నా సందేహం. అలాగే కాన్యకుబ్జంలో ఉండే
పరశురాముడికి సహ్యాద్రిలో అమలకీ గ్రామం ఎందుకు
ఆశ్రమమయ్యింది? అవి ఇప్పటికి నా చిరు సందేహాలు. దయచేసి వీటిని తీర్చండి. దీపకుడి అభ్యర్ధనతో వేద ధర్ముడు వీటికి సమాధానాలు వివరించాడు. నాయనా, దీపకా! ఇదే విషయాన్ని
పూర్వకాలంలో శ్రీశైల శిఖరం మీద మహర్షులడిగితే కుమారస్వామి వారికి వివరించాడు. అదంతా నీకు చెబుతాను - అంటూ ప్రారంభించాడు.

శ్రీ దత్తాయ గురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

04 Dec, 03:47


శ్రీమద్రామాయణము || యుద్ధకాండము
అరవై ఎనిమిదవ సర్గ. (68) #సనాతనధర్మం

కుంభకర్ణుడు మరణించడం కళ్లారా చూచిన రాక్షసులు
పరుగు పరుగున లంకా నగరం వైపు పరుగెత్తారు. రావణునికి ఈ
వార్త చెప్పారు. “లంకేశ్వరా! మహావీరుడు కుంభకర్ణుడు ఎంతో మంది
వానరులను చంపి, భక్షించి, కాలవశమున వీరగతి పొందాడు.
కుంభకర్ణుడు తన పరాక్రమమును ప్రదర్శించి, తుదకు రాముని
బాణములకు హతమైనాడు. చేతులు, కాళ్లు తెగి పడి, ముక్కు చెవులు కొరకబడి, శిరస్సు తెగి, మాంసపు ముద్ద వలె పడిఉన్నాడు. " అని వివరించారు. కుంభకర్ణుని మరణ వార్త విని రావణుడు నిర్ఘాంత
పోయాడు. నేల మీద పడి మూర్ఛపోయాడు. తమ పినతండ్రి
మరణించిన వార్త విన్న త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు,
అతికాయుడు రోదించారు. మహోదరుడు, మహాపార్శ్వుడు
చింతించారు.రావణునికి తెలివి వచ్చింది. కుంభకర్ణుని తలచుకుంటూ
రోదిస్తున్నాడు. “తమ్ముడా కుంభకర్ణా! నీవు శత్రువులను చంపి నాకు
సంతోషము కలిగిస్తావు అని అనుకున్నాను కానీ నన్ను విడిచి
యముడిని కలుసుకోడానికి పోతావని అనుకోలేదు. నాకు
శత్రువులనుండి విముక్తి కలిగించ కుండానే నన్ను ఒంటరిగా వదిలి
ఎక్కడికి వెళ్లిపోయావు. నీ మరణంతో నా కుడిభుజము పడిపోయి
నట్టు అయింది. దేవతలను, దానవులను జయించిన వాడివి, నిన్ను ఒక మానవుడు ఎలా చంపగలిగాడో అర్థం కావడం లేదు. దేవేంద్రుడి
వజ్రాయుధము కూడా నిన్ను ఏమీ చేయలేకపోయింది. అటువంటిది
ఒక మానవుడైన రాముని బాణములకు బలి అయిపోయావా! నీకు
ఇంతబలము ఇంత శౌర్యము ఉండి కూడా దైవ వశమున యమ లోకమునకు వెళ్లిపోయావా! హంసతూలికా తల్పము మీద తప్ప
శయనించని వాడవు, కటికనేలమీద పడి ఉన్నావా! దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి నీ మరణ వార్త విని హర్షధ్వానాలు చేస్తున్నారు. నీవు మరణించగానే ఆ వానరులకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. లంకానగర ప్రాకారములు ఎక్కి లంకానగరంలోకి ప్రవేశిస్తారు. నీవులేని నాకు ఈ లంకా రాజ్యము ఎందుకు? ఈ సీత ఎందుకు? ఆ రాక్షస సైన్యము ఎందుకు? నీవులేని నాకు ఈ జీవితము మీద కూడా ఆసక్తి లేదు. నా సోదరుడు కుంభకర్ణుని చంపిన రాముని చంపి పగతీర్చుకుంటాను. లేకపోతే నేను జీవించి ఉండి కూడా వృధా! నేను తక్షణం నా తమ్ముడిని చూడాలి. నేను అక్కడకు వెళ్లాలి. నేను నా తమ్ముడిని విడిచి క్షణకాలం కూడా ఉండలేను. నీ అండలేని నన్ను చూచి దేవతలు నవ్వుతారు. పరిహాసం చేస్తారు. నువ్వు లేకుండా నేను ఇంద్రుని మీదికి ఎలా యుద్ధానికి పోగలను. ఇంద్రుని ఎలా జయించగలను.
ఆనాడు విభీషణుడు చెప్పిన మాటలు నేను నా అజ్ఞానంతో
పెడచెవిని పెట్టాను. ఆ మాటలు ఈనాడు నిజం అయ్యాయి.
కుంభకర్ణుడు, ప్రహస్తుడు ప్రాణాలు కోల్పోయారు. విభీషణుని మాటలు ఒక్కొక్కటీ నిజం అవుతున్నాయి. నేను నా తమ్ముని అవమానించిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. మహావీరుడైన నా తమ్ముడు కుంభకర్ణుని పోగొట్టుకున్నాను.” అలా పరి పరి విధాలుగా విలపిస్తూ రావణుడు మూర్ఛపోయాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

03 Dec, 12:25


శ్రీదత్త పురాణము ||చతుర్ధ భాగం
పరశురామ ప్రతిజ్ఞ || రెండవదానిలో రెండవది (2-2)

తల్లీ! నాకు వందనీయవు నువ్వే. సకల దేవతాధీశ్వరివి. నువ్వు పార్వతివి. యోగీశ్వరులకు హృదయాల్లో యోగ శ్రమతో మాత్రమే దర్శనమిస్తావు. వారికైనా నీ దర్శనం చాలా కష్టసాధ్యం. సంసారార్ణవంలో మునిగి తేలుతున్న ఈ జీవులందరికీ నువ్వే నౌకవు. తరింపజేసే తెప్పవు. నువ్వు ఏక వీరవు. ఈ చరాచర జగత్తులో నువ్వు ఏకైకవు. అద్వితీయవు. కానీ సమస్త రూపాలలోనూ నీ అంశమే ఉండి అనేక రూపవై భాసిస్తుంటావు. నీకిదే నమస్కారం - అని స్తుతించి, జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు. రామా! శుభప్రదాలైన సర్వతీర్ధ క్షేత్రాలలో స్నానం
చేసిరా. నేను చెప్పినట్టు సంస్కారం చేద్దువు గాని - అని ఆజ్ఞాపించాడు. రాముడు వెంటనే ధనస్సు సంధించి దివ్యబాణం
ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణ రంద్రంనుంచి భుక్తిముక్తి ప్రదాలైన సకల పుణ్య నదీ తీర్థాలూ క్రమంగా ఆవిర్భవించాయి. ఇలా తన దివ్యబాణ శక్తితో రప్పించుకొన్న పవిత్రనదీ తీర్ధజలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి. అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపజేసి దహన సంస్కారం జరిపాడు - జగన్మాతయైన
రేణుక సర్వాభరణ భూషితయై నిలిచి దత్తాత్రేయా! పతివెంట నేను కూడా స్వస్థానానికి వెడదామనుకుంటున్నాను అని చెప్పి, నాయనా, భార్గవరామా! గురుదేవ, ద్విజులను రక్షించు - నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి, ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలిబంధంగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యా భర్తలిద్దరూ దేదీప్యమాన దివ్యరూపులై ఆనందమూర్తులై వినువీధిలో నిలిచారు. దత్తాత్రేయ, పరుశురాములిద్దరూ ఆదంపతుల్ని చూసి సంబరపడుతూ శిరసువంచి నమస్కరించారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు. అటుపైని బ్రాహ్మణులను అర్చించి మహదాశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయుణ్ని పాదాభివందన పురస్సరంగా పూజించాడు. దత్తదేవుడి అనుమతి పొంది అమలకీ వనం నుంచి బయలుదేరాడు.
తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పాడి తప్పిన క్షత్రియులందర్నీ ముయ్యేడుమార్లు గాలించి రాపాడి రాపాడి ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియరహితం చేసేశాడు. గతమత్సరుడై అదే జలం తీసుకొని దత్తాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాధి దేవతలను అర్చించాడు. దత్తాత్రేయుడికి నమస్కరించాడు. అంతలో తల్లితండ్రులు దివ్యదర్శనం అనుగ్రహించారు. సకల క్షత్రియాంతకా!
నీ సాహసానికీ శౌర్య పరాక్రమాలకూ సంతృప్తి చెందాను. ఇక ప్రతీకారాగ్నిని శాంతింపజేసుకో. హింసా ప్రవృత్తివల్ల మూటగట్టుకున్న మహాపాపం తొలగించుకోవడంకోసం మహాయజ్ఞాలు చెయ్యి. వాటితో శుద్ధి పొందుతావు- అని తండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడు. నాయనా! బ్రహ్మచారిని గదా ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తానని
సంశయించకు. దత్తాత్రేయుణ్ని గురువుగా అభ్యర్ధించు. కాశ్యపుణ్ని ప్రధాన ఋత్విక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో. యజ్ఞాలు చెయ్యి - అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది.
ఇలా ఆజ్ఞాపించిన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికంగా నమస్కరించి వీడ్కోలు పలికాడు. సహ్యాద్రి ఆమలకవనంలోని ఏక వీరాశ్రమ పదంలో ఇది జరిగింది. ఫలపుష్పభరితాలైన తరులతా గుల్మాలతో పక్షుల కిలకిల రావాలతో నానామృగ గణాకీర్ణమై దివ్యనదీ పరీవాహక ప్రాంతమై అన్నిటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకే కాదు యజ్ఞయాగాదులకూ అనువైన స్థలం. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైన పర్ణశాల ఉంది. పరశురాముడు అందులోకి
ప్రవేశించాడు. అది దత్తాత్రేయుడి పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై దత్తదేవుడు కొలువుతీరి ఉన్నాడు. పరశురాముడు వినయవిధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనందతుందిలుడై పరశురాముణ్ని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించాడు.

సశేషం
సనాతన ధర్మం నుండి
తంగిరాల చంద్రశేఖర అవధాని,

సనాతన ధర్మం

03 Dec, 05:07


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
అరవై ఏడవ సర్గ (67) నాలుగవ భాగము

రాముడు మారు మాట్లాడకుండా కుంభకర్ణుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. కాని రాముని బాణములు
కుంభకర్ణునికి ఏమీ బాధ కలిగించలేదు. కుంభకర్ణుడు తన ముద్గరను
వేగంగా తిప్పుతూ ఆ బాణములను మధ్యలోనే తునాతునకలు
చేస్తున్నాడు. ఒక పక్క రాముని బాణములను అడ్డుకుంటూ మరొక
పక్క ముద్గరతో వానరులను తరుముతున్నాడు కుంభకర్ణుడు.
రాముడు వెంటనే వాయవ్యాస్త్రమును సంధించాడు. ముద్గర ఉన్న
కుంభకర్ణుని చేతిని భుజము దగ్గర ఖండించాడు. కుంభకర్ణుని చేయి
ముద్గరతో సహా ఎగిరి అవతల పడింది. కుంభకర్ణుడు పెద్దగా
కేకపెట్టాడు. ఎగిరి పడ్డ కుంభకర్ణుని చేతి కిందపడి వందలకొద్దీ
వానరులు మరణించారు. మిగిలిన వానరులు పక్కలకు పరుగెత్తి
రాముడు, కుంభకర్ణుని యుద్ధమును ఆసక్తిగా చూస్తున్నారు.
ఒక చేతిని పోగొట్టుకున్న కుంభకర్ణుడు రెండవ చేత్తో ఒక వృక్షమును పెకలించి, దానిని చేతబట్టుకొని, రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఇంద్ర అస్త్రమును ప్రయోగించి కుంభకర్ణుని రెండవ చేతిని వృక్షముతో సహా ఖండించాడు. కుంభకర్ణుడి చేయి భుజము దాకా తెగి కిందపడింది. రెండు చేతులు లేకపోయినా, కుంభకర్ణుడు రంకెలు వేస్తూ వానర సైన్యము మీదికి పరుగెడుతున్నాడు. రాముడు రెండు అర్ధచంద్రబాణములతో కుంభ కర్ణుని రెండు కాళ్లు ఖండించాడు. మొదలు నరికిన వృక్షము వలె కుంభకర్ణుడు నేలమీద పడిపోయాడు. కుంభకర్ణుని రెండు కాళ్లు రెండు వైపులకు విసిరివేయబడ్డాయి. అయినా కుంభకర్ణుని పౌరుషము చావలేదు.పాక్కుంటూ, దేక్కుంటూ రాముని వైపుకు వెళుతున్నాడు. రాముడు వాడి అయిన బాణములను కుంభకర్ణుని ముఖం నిండా కొట్టాడు. కుంభకర్ణునికి అరవడానికి కూడా వీలులేదు. ఆ స్థితిలో కుంభకర్ణుడు మూర్ఛపోయాడు. తరువాత రాముడు ఇంద్ర అస్త్రమును తీసుకున్నాడు. అది వాయువేగము కలది. సూర్యుని వలె ప్రకాశవంతమైనది. ఆ అస్త్రమును రాముడు కుంభకర్ణుని మీద ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధమును పోలిన ఆ అస్త్రము కుంభకర్ణుని మీదికి దూసుకొని వెళ్లింది.కుంభకర్ణుని శిరస్సును ఖండించింది. చేతులు కాళ్లు తల లేని కుంభకర్ణుని మొండెము నేల మీద పడిపోయింది. కిరీటముతోనూ కుండలములతోనూ ప్రకాశిస్తున్న కుంభకర్ణుని తల ఎగిరి ప్రాకారము అవతల పడింది. ఆ శిరస్సుదెబ్బకు లంకా ప్రాకారము కూడా విరిగిపోయింది. లోకకంటకుడైన ఒక మహారాక్షసుని మరణానికి దేవతలు,
ఋషులు, గంధర్వులు, యక్షులు, ఆకాశము నుండి రాముని మీద
పుష్పములు కురిపించారు. రాముని పరాక్రమమునకు ఎంతో
సంతోషించారు. కుంభకర్ణుడు మరణించడం చూచి రాక్షసులు బిగ్గరగా అరిచారు. ఏడిచారు. భయంతో పరుగెట్టారు. వానరులందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు. బిగ్గరగా హర్షధ్వానాలు చేసారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

02 Dec, 16:56


కార్తీక పురాణము పూర్తి ఐపోయింది కాబట్టి మరళా అతి కొద్దిరోజులలో శ్రీమద్రామాయణము మళ్ళీ ప్రారంభం చేస్తాను, ఈలోపు ఎవరైనా మొదటి నుండి చూడకపోతే 15 సర్గలు వరకు పెట్టడం జరిగింది అవి వినండి,

శ్రీమద్రామాయణము బాల కాండ: https://www.youtube.com/playlist?list=PLGXw6utoH9SvfBzM2ICOGVzw335nLg_Cz

సనాతన ధర్మం

02 Dec, 16:56


ఆ మహాదేవుని అనుగ్రహము తో కార్తీక పురాణము ఏటువంటి ఆటకం లేకుండా 30 అధ్యాయాలు పూర్తి అయ్యాయి, ఇంక ఎవరైనా వినకపోతే వినండి,
కార్తీక పురాణము: https://www.youtube.com/playlist?list=PLGXw6utoH9SsC_FVjcRagbV39MdfBoSkx

సనాతన ధర్మం

02 Dec, 16:43


శ్రీదత్త పురాణము ||చతుర్ధ భాగం
పరశురామ ప్రతిజ్ఞ ||రెండవ దానిలో మొదటిది (2-1)

కృతవీర్యుడి కుమారుడు కదా ఈ కార్తవీర్యుడు. ఇతడు లొట్ట చేతులతో పుట్టి తల్లితండ్రులకి తీవ్రమనస్తాపం కలిగించాడు. ఆ పైన దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుణ్ని చేసి వెయ్యి బాహువులతో పాటు అనేక అమోఘ వరాలు పొందాడు. తనకు సమానుడో తన కన్నా అధికుడో అయిన ద్విజుడి చేతిలో మరణం ఆ వరాలలో ఒకటి. అందుకని పరశురాముని చేతిలో అలా నిహతుడయ్యాడు. దానికి హోమ ధేను హరణమనే మిష ఒకటి స్వయం కృతాపరాధమై సహకరించింది. విధి బలీయమనీ, ఏ అవతారమైనా ఉపసంహరింపబడవలసిందేననీ చెప్పుకున్నాం
కదా! అయితే కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముని మీద కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నారు. ఎదిరించే ధైర్యం లేక, శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోడానికి, పొంచి ఉన్నారు. తమ తండ్రిని సంహరించాడు కనుక అతడి తండ్రిని చంపాలని వారికసి. కొంత కాలానికి అనువైన సమయం దొరికింది.
పరశురాముడు అడవికి వెళ్ళాడు. అతడి సోదరులు ఆట పాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు.జమదగ్ని పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఋషి పత్ని రేణుకా మాత ఇంటి పనుల్లో మునిగివుంది. ఇంత కన్నా మంచి సమయం దొరకదని రాకుమారులు సాయుధులై జమదగ్ని పర్ణశాలలో ప్రవేశించారు. జమదగ్ని శిరస్సు ఖండించారు. వద్దు వద్దంటూ రేణుకాదేవి అడ్డుపడినా విలపించినా, ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. రాక్షసంగా శిరస్సు ఖండించి మెరుపువేగంతో వెళ్ళిపోయారు.
అడవిలో కంద మూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది.త్వరత్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారాచూసాడు. తండ్రిని తలుచుకొని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధ పడ్డాడు. కన్నతల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వొణికి పోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరిని ఒక్కసారిగా పట్టుకొని బావురుమన్నాడు
పరశురాముడు. అమ్మా! నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే - నేనే బాధ్యణ్ణి అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్ళు నిండుకొని విప్పారి ఒక్కక్షణంలో ప్రళయ కాలరుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను విలపించడం ఏమిటి? కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి - అని తనకు తాను ప్రబోధించుకున్నాడు.
ధనుర్భాణాలూ గండ్రగొడ్డలి ధరించాడు. సోదరులూ ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్య లేదు. ఎవరి మాటా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడి గాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందర్ని ఊచకోత కోసేసాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేట్లుగా జలదభీషణంగా
భీకర ప్రతిజ్ఞ చేసాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్కసారికాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గానీ అధర్మం గానీ లేదు - అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేసాడు. నాయనా! నీ ప్రతిజ్ఞలూ ప్రతీకారాలు తరువాత. ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపూ మీ తండ్రి శరీరం మరొక వైపూ కావిడికి ఎత్తుకుని బయలుదేరు - ఆగు - ఆగు - అనే మాట వినిపించిన చోట దింపు. సర్వ శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకూ ఉచిత సంస్కారములు జరిపించు.
రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు. పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకొని తమ కాన్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలూ, తాపసాశ్రమాలూ, వనాలూ, అరణ్యాలూ, పర్వతాలూ, నదులూ అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీతరుమండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. "ఓయీ పరశురామా! దత్తాత్రేయునితో కలిసి మంత్ర పూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ
సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు" - ఇది వినడంతోనే పరశురాముడు నాలుగువైపులకూ తేరిపార చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తామున్నట్టు గుర్తించాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్టనిపించి అటు నాలుగు అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతబట్టి కనిపించాడు. రాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు
దగ్గరుండి జరిపించమని ప్రార్ధించాడు. ఏమిటి? నేను జరిపించాలి? నాకు విధివిధానములు, ధర్మాధర్మములు తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నాడు దత్తస్వామి.స్వామిన్ ! నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను. సకల దేవతలకూ సకల మునులకూ నువ్వు పరమ గురువువి.

సనాతన ధర్మం

02 Dec, 16:43


జగత్ప్రసిద్ధుడివి. యోగీశ్వరుడివి నువ్వే సంశయం లేదు. దిగంబరస్వామి మళ్ళీ నవ్వాడు. ఈసారి పెద్దగా నవ్వాడు. నేను దిగంబరుణ్ని. మదిరా మదవతీలోలుణ్ని. ఇదిగో కనిపించడంలేదూ. మదిరాస్వాదం తప్ప మరింక ఏవిధీ నాకు తెలీదు. నేను అస్పృశ్యుణ్ని. పలకరించదగినవాడ్ని కూడా కాదు. దురాచారుణ్ని. వంశంలో చెడబుట్టిన వాణ్ని. బ్రహ్మన్! అంతిమ సంస్కారం యధావిధిగా జరపడమెలాగో నాకు తెలీదు - అంటూనే దిగంబరస్వామి దత్తుడిగా మారిపోయి వరాసనం నుంచి వచ్చి కావిడి దగ్గరకు చేరుకున్నాడు.
రేణుకాదేవిని చూశాడు. వెంటనే నమస్కరించాడు. అంజలి బంధంతో అలాగే నిలబడి స్తుతించాడు.

సశేషం
ఓం శ్రీ దత్తాయ గురవే నమః

సనాతన ధర్మం

02 Dec, 06:23


కార్తీక మాసం అభిషేకములలో
భాగంగా స్వామి వారికి ఈ రోజు  అభిషేకముతో కార్తీకమాసం అభిషేకములు పూర్తి అవుతున్నాయి

సనాతన ధర్మం

02 Dec, 03:10


ఈరోజు(2-12-2024)గునుపూడి సోమేశ్వర స్వామి వారి దర్శనం

సనాతన ధర్మం

25 Nov, 03:40


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
అరువది ఆరవ సర్గ. (66) || @సనాతన ధర్మం

కుంభకర్ణుని చూచి పారిపోతున్న వానరులలో వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలగువారు ఉన్నారు. ఆ ప్రకారంగా పారిపోతున్న వానర ప్రముఖులను చూచి అంగదుడు ఇలా అన్నాడు. “ఓ వానరవీరులారా! ఒక రాక్షసుని చూచి ఇలా పారిపోవడం ధర్మమా! మీరు ఎంతటి ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఒక నీచ రాక్షసునికి భయపడుతున్నారా! అయిన పారిపోయి ఎక్కడికి పోతారు! ఎంత దూరం పోతారు! వెనక్కురండి. ఇతడు రాక్షసుడు కాడు. మనలను భయపెట్టడానికి రాక్షసులు సృష్టించిన పెద్ద విగ్రహము. రండి. మనమందరమూ కలిసి ఈ బొమ్మను తునాతునకలు చేద్దాము.” అని ఎలుగెత్తి అరిచాడు.
అంగదుని మాటలకు వానరులకు ధైర్యము వచ్చింది. పారిపోయిన వాళ్లు తిరిగి వచ్చారు. చేతికి అందిన వృక్షములను, పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధమునకు సిద్ధం అయ్యారు. ఆ కుంభకర్ణుని చుట్టూ చేరి వాడిని వృక్షములతో పర్వతశిఖరములతో
కొట్టారు. ఆ వానరులు కొట్టే దెబ్బలు కుంభకర్ణునికి చీమకుట్టినట్టయినా లేదు. కుంభకర్ణుని మీదకు విసిరిన వృక్షములు,
పర్వతశిఖరములు కుంభకర్ణుని శరీరమునకు తగిలి తునాతునకలై పోతున్నాయి.కుంభకర్ణుడు కోపించి వానరసేనలను తన చేతులతో నలిపేస్తున్నాడు.యుద్ధభూమి అంతా వానరుల శవాలతో నిండిపోయింది. కుంభకర్ణుని చేతిలోపడకుండా తప్పించుకున్న వానరులు కొంతమంది పారిపోయారు. కొంతమంది సముద్రంలో దూకారు. మరి కొంత మంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు కుంభకర్ణుడు.కుంభకర్ణుని ధాటికి తట్టుకోలేక భల్లూకములు కొన్ని చెట్టు ఎక్కాయి. కొన్ని పర్వతముల మీదికి పారిపోయాయి.మరి కొన్ని కొండగుహలలో తలదాచుకున్నాయి . మరి కొంత మంది వానరులు, భల్లూకములు
చచ్చినట్టు నేలమీద కదలకుండా పడుకున్నారు. ఇలా ఎవరి దోవన వారు పారిపోతున్న వానరులను చూచి అంగదుడు బిగ్గరగా అరుస్తున్నాడు. “ఓ వానరవీరులారా! భయపడకండి పారిపోకండి.
యుద్ధము చేయండి. ఎక్కడికి పోయి ప్రాణాలు రక్షించుకుంటారు.
వెనక్కురండి. యుద్ధమునుండి పారిపోయి వచ్చిన మిమ్మల్ని చూచి మీ భార్యలు పరిహాసం చేస్తారు. ఆ అవమానం కంటే యుద్ధంలో చావడం మేలు కదా! మనమందరమూ ఉత్తమ కులంలో పుట్టాము. సాధారణ వానరుల వలె పారిపోవడం భావ్యమా! అది గౌరవ ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందా! యుద్ధానికి బయలుదేరేముందు మీరు అన్న మాటలు పలికిన వీరాలాపాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇప్పుడు ఆ వీరాలాపాలు అన్నీ ఎక్కడికి పోయాయి. యుద్ధము నుండి పారిపోయి, పదిమంది చేత ఛీ అనిపించుకోడం కన్నా, యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొందడం మేలు కదా!
ఓ వానరవీరులారా! మనకు ఆయుర్దాయము లేకపోతే ఎక్కడ ఉన్నా చస్తాము. ఆయుర్దాయము ఉంటే యుద్ధములో విజయం సాధిస్తాము. ఒక్కమాట! మనము యుద్ధంలో గెలిస్తే కీర్తిపొందుతాము. మరణిస్తే వీరస్వర్గము పొందుతాము. కాని
పారిపోతే దిక్కులేని చావు చస్తాము. కాబట్టి పారి పోకండి. వెనుకకు
రండి. రాముడి పరాక్రమము ముందు ఈ రాక్షసుడు ఎంత! క్షణంలో
నాశనమై పోతాడు. ఇప్పటి దాకా మనము ఎంతో మంది రాక్షస వీరులను జయించాము. ఈ ఒక్కడికి భయపడి పారిపోతే మనము ఇప్పటిదాకా గడించిన కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రండి. వెనుదిరగండి. యుద్ధము చేయండి" అని అరుస్తున్నాడు కానీ ఎవరూ అతని అరుపులు పట్టించుకోవడం లేదు.
కాని కొంతమంది వానర వీరులు అంగదునితో ఇలా అన్నాడు. “అంగదా! ఇప్పటిదాకా చేసిన యుద్ధము చాలు. మాకు ఈ యుద్ధము అక్కరలేదు. మా ప్రాణాలే మాకు తీపి. నీవుకావలిస్తే ఆ భయంకరాకారుడితో యుద్ధం చెయ్యి" అని పలికి పారిపోయారు.
కాని అంగదుడు తన ప్రయత్నము మానుకోలేదు. పోయిన
వారు పోగా మిగిలిన వారిని బతిమాలి వెనుకకు తీసుకొని వస్తున్నాడు. వెనకకు వచ్చినవారంతా అంగదుని ఆజ్ఞల కొరకు ఎదురుచూస్తున్నారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

25 Nov, 02:45


కార్తీక మాసం 30 రోజుల అభిషేకములలో
భాగంగా స్వామి వారికి ఇరవై నాలుగవ రోజు  అభిషేకం

సనాతన ధర్మం

24 Nov, 06:04


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
అరువది ఐదవ సర్గ. (65) || సనాతన ధర్మం,

మహోదరుని మాటలు విన్న కుంభకర్ణునికి మిక్కుటంగా కోపం వచ్చింది. మహోదరుని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు. తన
అన్న రావణుని చూచి ఇలా అన్నాడు. “రాక్షసేంద్రా! నీవు నిశ్చింతగా
ఉండు. నేను యుద్ధభూమికి పోయి ఆ రామలక్ష్మణులను చంపి నీ
భయాన్ని పోగొడతాను. నావంటి శూరులు నీరులేని మేఘముల వలె
ఊరికే గర్జించరు. నేను నా పరాక్రమము యుద్ధభూమిలో చూపిస్తాను కానీ మాటలలో చూపించను. నా వంటి శూరుడు తనను తాను పొగుడుకోడు. తనకు శక్యము కాని పనులను కూడా చేసి చూపిస్తాడు. ఓ మహోదరా! నీ వంటి వారు పలికే మాటలు తమను
తాము గొప్పవారము అనుకొనే రాజులు వింటారు కానీ రావణుడు
కాదు. మీరు పిరికి పందలు. మీకు యుద్ధము అంటే భయము.
కుయుక్తులు, కుతంత్రములతో పని కానిద్దామంటారు. రాజు దగ్గర
ప్రగల్భాలు పలుకుతూ రాజు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజును అపకీర్తిపాలు చేస్తుంటారు. రావణుని హితం కోరేవారు, రామునికి మంచి సలహాలు చెప్పేవారు ఈ లంకలో లేనట్టుంది. పాపము రావణుడు ఒంటరివాడయ్యాడు. ఇప్పటి దాకా మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను. ఇప్పుడే యుద్ధమునకు
బయలుదేరుతున్నాను.” అని అన్నాడు కుంభకర్ణుడు.కుంభకర్ణుని మాటలు విని రావణుడు నవ్వాడు. “సహోదరా కుంభకర్ణా! నీవు చెప్పినది సత్యము. ఈ మహోదరుడు రామునికి భయపడుతున్నాడు. అందుకే రామునితో యుద్ధమునకు ఇష్టపడుటలేదు. రామునితో యుద్ధము చేయుటకు నీవే సమర్థుడివి.
శత్రువులను సంహరించి విజయుడవై తిరిగిరా! నాకు వేరు గత్యంతరము లేకనే కదా నిన్ను అర్థాంతరంగా నిద్రలేపాను. ఆ
రాజకుమారులను, వానరులను తనివితీరా భక్షించు. నీవు యుద్ధము
చేయనక్కరలేదు. యుద్ధభూమిలో నిన్ను చూడగానే వానరులంతా
పారిపోతారు. రామలక్ష్మణులకు గుండెలు పగులుతాయి. సునాయాసంగా యుద్ధము ముగిసిపోతుంది. నీకు విజయం
సిద్ధిస్తుంది.” అని పలికాడు రావణుడు. తన అన్న రావణుడు పలికిన పలుకులకు కుంభకర్ణుడు మహదానందభరితుడయ్యాడు. యుద్ధమునకు పోవడానికి సన్నద్ధుడయ్యాడు. ఇనుముతో చేయబడిన తన ఆయుధము అయిన శూలమును తీసుకున్నాడు. రావణునితో ఇలా అన్నాడు. "రాక్షసేంద్రా! నాకు ఎవరి సాయమూ అక్కరలేదు. ఎలాంటి సైన్యసాయమూ అవసరము లేదు. నేను ఒంటరిగానే యుద్ధము చేయగలను. వానరులనందరినీ భక్షిస్తాను." అని అన్నాడు. దానికి రావణుడు ఇలా అన్నాడు. “అలాకాదు.
యుద్ధమునకు పోవడానికి సైనిక బలము అత్యావశ్యకము. నీ వెంట
శూలములు, ముద్గరలు ధరించిన సైనికులు వస్తారు. వారు వానరులను కొరికి చంపుతారు. నీకు సాయంగా ఉంటారు. కాబట్టి
నీవు రాక్షస సైన్యముతో కలిసి వెళ్లి రామలక్ష్మణులతో యుద్ధము
చెయ్యి.” అని అన్నాడు రావణుడు.తరువాత రావణుడు తన ఆసనము నుండి లేచాడు.మణులతో తయారు చేయబడిన ఒక కంకణమును కుంభకర్ణుని చేతికి కట్టాడు. కుంభకర్ణుడికి సకల అలంకారములు చేయించాడు. నిలబడి ఉన్న కుంభకర్ణుడు పాలసముద్రములో నిలబెట్టబడిన మంథర పర్వతము మాదిరి ఉన్నాడు. సర్వాలంకార భూషితుడైన కుంభకర్ణుడు అన్న రావణునికి ప్రదక్షిణము చేసి నమస్కరించాడు. రావణుడు కుంభకర్ణుని విజయోస్తు అని దీవించాడు. రణదుందుభులు, భేరీలు మోగుతుండగా, శంఖధ్వానములు మిన్నుముట్టగా, గజబలము,
ఆశ్వికబలము, కాల్బలములతో కుంభకర్ణుడు యుద్ధమునకు
బయలుదేరాడు. చేత శూలము ధరించిన కుంభకర్ణుడు సేనలకు ముందు నడుస్తున్నాడు. ఆ రాక్షసుల చేతుల్లో శూలములు, కత్తులు, గండ్ర గొడ్డళ్లు, పరిఘలు, గదలు, ముసలములు, పెద్ద పెద్ద తాటి చెట్లు
ఆయుధములుగా ఉన్నాయి. కుంభకర్ణుడు చూచేవారికి భయం
కలిగించే ఆకారంలో ప్రకాశిస్తున్నాడు. కుంభకర్ణుని శరీరము
చుట్టుకొలత నూరు ధనుస్సుల పొడుగు అనగా రెండువందల గజాల
పొడుగు, ఆరువందల ధనుస్సుల ఎత్తు, 1200 గజాల ఎత్తు, కలిగి
మహాపర్వతము మాదిరి ఉంది. అటువంటి భయంకరాకారము
కలిగిన కుంభకర్ణుడు రాక్షసులతో ఇలా అన్నాడు. “ఇప్పుడు మనము
వానరులతో యుద్ధం చేయబోతున్నాము. నేను వానరులను చిన్న చిన్న భాగములుగా చేసి కాల్చి తింటాను. ఈ వానరులు అడవులలో,
ఉద్యానవనములతో తిరిగేవారు. నిజానికి వారు నాకు ఏ అపకారమూ చేయలేదు. ఆ వానరులను చంపడం వృధా. దీని కంతటికీ రాముడు మూలము. కాబట్టి ముందు రాముని చంపుతాను. రాముని చంపితే అందరినీ చంపినట్టే. అందుకని మన దృష్టి అంతా రాముని మీద ఉండాలి.” అని పలికాడు కుంభకర్ణుడు. ఆమాటలకు రాక్షసులు పెద్దగా హర్షధ్వానాలు చేసారు. కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరగానే, ఇదివరకు మాదిరిగానే ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. ఉల్కాపాతం జరిగింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. తీవ్రమైన గాలులు వీచాయి. పిడుగులు పడ్డాయి. నక్కలు వికృతంగా అరుస్తున్నాయి. ఆకాశంలో పక్షులు అపసవ్యంగా తిరుగుతున్నాయి. కుంభకర్ణుని శూలము మీద ఒక గద్ద వాలింది. అతని ఎడమ కన్ను ఎడమ భుజము అదిరింది. సూర్యుడు మబ్బులచాటుకు పోయాడు. అమిత బలపరాక్రమములు కలిగిన కుంభకర్ణుడు ఈ దుర్నిమిత్తములను ఏ మాత్రమూ లెక్క చెయ్యలేదు.పెద్ద పర్వతము మాదిరి నడుస్తున్న కుంభకర్ణుడు లంకా

సనాతన ధర్మం

24 Nov, 06:04


నగర ప్రాకారమును, చిన్న బండరాయిని దాటినట్టు తన పాదములతో దాటాడు. పాకారము వెలుపల మోహరించి ఉన్న వానరసైన్యము ముందు నిలబడ్డాడు. పెద్ద పర్వతము తమ ముందు నిలబడి ఉందా అని భ్రమపడ్డ వానరులు కుంభకర్ణుని చూడగానే దిక్కులు పట్టిపారిపోయారు. తనను చూచి పారిపోతున్న వానరులను చూచి కుంభకర్ణుడు పెద్దగా వికటాట్టహాసము చేసాడు. మేఘము ఉరిమినట్టు గర్జించాడు. కుంభకర్ణుని వికటాట్టహాసము, గర్జన వల్ల పుట్టిన విపరీతమైన ధ్వనికి వానరులు ఎక్కడి వాళ్లు అక్కడ కూలిపోయారు. చేత శూలము ధరించిన కుంభకర్ణుడు గద
ధరించిన యమధర్మరాజు మాదిరి యుద్ధభూమిలో నిలబడ్డాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరువది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

24 Nov, 05:32


శ్రీ సాంబ సదా శివాయ నమః

కార్తీక మాసం 30 రోజుల అభిషేకములలో భాగంగా
29-11-24 న
మాస శివరాత్రి సందర్భంగా
మహా లింగార్చన(365 లింగములతో) ఏకాదశ
రుద్రాభిషేకం జరుగుతుంది
ఎవరైనా వారి పేరు గోత్రములతో చేయించుకోవాలి అనుకున్న వారు సంప్రదించండి
అలాగే ఆరోజు వీలు అయిన వారు స్వయం గా వచ్చి అభిషేకం చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు, వచ్చే వారు ముందుగా తెలియపరచగలరు

తంగిరాల దత్తాత్రేయ శర్మ
8639672644
తంగిరాల చంద్ర శేఖర శర్మ
7989784772

సనాతన ధర్మం

24 Nov, 04:58


కార్తీక మాసం 30 రోజుల అభిషేకములలో
భాగంగా స్వామి వారికి ఇరవై మూడవ రోజు  అభిషేకం

సనాతన ధర్మం

21 Nov, 16:40


పరమేశ్వరుని అనుగ్రహముతో 20 రోజులు పూర్తి అయ్యాయి ఇంక కార్తీక మాసం పది రోజులు మాత్రమే ఉన్నాయి, ఈ పదిరోజులు ఇంకా ఎవరైనా తమ గోత్ర నామాలతో చేయించుకోవాలి అనుకుంటే వివరాలకు సంప్రదించండి,

తంగిరాల దత్తాత్రేయ శర్మ కపిలేశ్వరపురం, 8639672644

సనాతన ధర్మం

21 Nov, 16:18


కార్తీక మాసం 30 రోజుల అభిషేకములలో
భాగంగా స్వామి వారికి ఇరవైయవ రోజు  అభిషేకం

సనాతన ధర్మం

21 Nov, 15:06


శ్రీదత్త పురాణము ||తృతీయభాగం
వృద్ధ రాక్షసుడి పూర్వజన్మ || ఇరవై నాలుగులో రెండు (24-2)

కార్తవీర్యార్జునా! ఈ కాంచన మాలినీ వృత్తాంతం చదివినవారూ విన్నవారూ సాంసారిక సకలబంధ నివృత్తి పొందుతారు. ధర్మ పరాయణులవుతారు. శ్రద్ధగా విన్నావుగదా, మాఘస్నాన మహాత్యం ఎంతటిదో, క్లేశ నివారణ జరగాలన్నా స్వర్గం లభించాలన్నా మోక్షమే కావాలన్నా సకాములకూ నిష్కాములకూ సర్వ శ్రేయస్కరం మాఘస్నాన మహావ్రతం, అర్జునా! నువ్వు నా మిత్రుడివి. స్నేహితుడివి. భృత్యుడివి. భక్తుడివి. నువ్వంటే నాకెంతో ఇష్టం. అంచేత నువ్వు ఏది అడిగినా కాదనను. అడుగు. ఇంకా ఏది వినాలని అనుకుంటున్నావో ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నావో,
అడుగు చెబుతాను అని దత్తదేవుడు ఒక్క నిమిషం విరమించాడు.
గురుదేవా! సాక్షాత్తు శ్రీ నికేతనుడవైన నువ్వు ప్రసన్నుడవై యుండగా నాకింక అలభ్యమేముంటుంది? ఈ లోకంలో అత్యంత శ్రేయస్కరమైనవన్నీ నాకు దయతో ప్రసాదించావు. దృశ్యమానమైన
ఈ మిధ్యా ప్రపంచంలో వస్తురూపంగా నీ నుంచి నేను అభ్యర్థించవలసింది ఏదీ లేదు. భవభాగ్యనిధివి, భగవంతుడవు నువ్వు ఇలా ఎప్పుడూ నా పట్ల ప్రసన్నుడుగా ఉంటే చాలు. నాకు ఇంకేమి అవసరము లేదు. నీ అనుగ్రహం కన్నా నేను కోరవలసింది ఏదీ లేదు. నీ ఉపదేశాలతో నన్ను కృతార్ధుణ్ని చేశావు. నన్నిప్పుడు ఏమి చెయ్యమంటావు? నీ పాదసేవ చేస్తూ ఇక్కడనే ఇలా
ఉండిపోనా? లేక ఇంటికి పోనా ? ఏమి ఆజ్ఞ ? నీ కార్తవీర్యార్జునుడి ఆర్ద్ర వాక్కుల్లోని హృదయాన్ని అందుకున్నాడు దత్తస్వామి. అర్జునా ! నువ్వు రాజువి. రాజ్యపాలన చెయ్యడం నీ కర్తవ్యం. కనక వెంటనే బయలుదేరు. మహిష్మతీపురం చేరుకో. పరిపాలన సాగించు. అని అనుమతించాడు. కార్తవీర్యుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ముని మండలికి అంజలి ఘటించి ఆశీస్సులందుకుని బయలుదేరాడు. దత్తనామస్మరణ చేస్తూ మహిష్మతీపురం చేరుకున్నాడు. నాయనా! దీపకా! కార్యవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చెప్పిన ధర్మోపదేశాలూ యోగ సారమూ మాఘమహాత్మ్యమూ
అన్నీ నీకూ తెలియపరిచాను. ఒకప్పుడు ఇదే మాఘమహిమను వశిష్ఠుడు తన శిష్యుడైన దిలీపుడికి చెప్పాడు. ఇంకా నువ్వు ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను. నువ్వు నాకు సేవలు చేసి సంతృప్తి పరిచావు కనుక మహారోగ నివారణకు తోడ్పడ్డావు గనక ఆ ప్రేమను పురస్కరించుకుని మరొక రహస్యం నీకు చెబుతున్నాను విను. ఒకప్పుడు పార్వతీదేవికి ప్రేమగా శివుడు ఉపదేశించిన పద్నాలుగు దత్తనామాలు నీకు ఉపదేశిస్తాను. వీటిని జపిస్తే సహస్ర నామజప ఫలం దక్కుతుంది అని శివుడి ఆజ్ఞ. పార్వతి వీటిని జపించి అంతటి పుణ్యఫలం పొందింది.

వరదః కార్తవీర్యాదిరాజ రాజ్య ప్రదో౭ నఘః
విశ్వశ్లాఘ్యోఃమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః
పరాశక్తి పదాశ్రిష్ణో యోగానంద స్సదోన్మదః
సమస్త వైరి తేజోహృత్పరమామృత సాగరః ॥
అనసూయాగర్భ రత్నం భోగమోక్షసుఖ ప్రదః ।
నామాన్యేతాని దేవస్య చతుర్ధశ జగద్గురోః ॥
హరేర్ధత్తాభిధానస్య జప్త వ్యాని దినేదినే ।
సహస్ర నామ జాప్యస్య యదిచ్ఛసి ఫలమ్ శుభమ్ ।।

1. వరదుడు 2. కార్యవీర్యాది రాజులకు రాజ్య ప్రదుడు 3. అనఘుడు 4. విశ్వశ్లాఘ్యుడు 5. అమితాచారుడు 6.దత్తా త్రేయుడు 7. మునీశ్వరుడు 8. పరాశక్తి పదాశిష్టుడు 9. యోగానందుడు 10. సదోన్మదుడు 11. సమస్త వైరితేజో హరుడు 12. పరమామృత సాగరుడు 13. అనసూయా గర్భరత్నం 14. భోగ మోక్ష సుఖప్రదుడు.

జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాల్గు నామాలివి. సహస్రనామ జప ఫలం కావాలనుకుంటే వీటిని రోజూ జపించాలి. వత్సా! శుభ
ప్రదాలైన ఈ చతుర్ధశ నామాలను నువ్వు కూడా త్రిసంధ్యల్లోనూ జపించు. ఇంకేమి వినాలి అనుకుంటున్నావో సందేహించక
అడుగు అని వేదధర్ముడు ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ వృత్తాంతాన్ని
నేను మీకు చెబుతున్నాను. శ్రద్ధగా వింటున్నారు గదా అని సూతుడు శౌనకాది మహర్షులను హెచ్చరించాడు.

హరిః ఓం తత్సత్
శ్రీ దత్తాయగురవే నమః
తృతీయ భాగము సమాప్తము

సనాతన ధర్మం

21 Nov, 03:52


*కార్తీక పురాణం - 20*
*వ అధ్యాయము*

*పురంజయుడు దురాచారుడగుట*

జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో "గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు"డనెను. అ మాటలకు వశిష్టుల వారు మందహాసముతో "ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి, అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు"మని అ కథా విధానమును యిట్లు వివరించిరి.

పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి, "ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము.

త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతును, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామాలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై - నవారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రుసైన్యములుపై బడెను.

*ఇట్లు స్కాంద పురాణాతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.*

🕉🕉సనాతన ధర్మం🕉🕉

సనాతన ధర్మం

21 Nov, 03:49


శ్రీమద్రామాయణము ||యుద్ధకాండము
అరవైరెండవ సర్గ.(62) || సనాతన ధర్మం

కుంభకర్ణుడు లంకా నగర రాజమార్గములో నడుస్తున్నాడు.
రావణుని మందిరము చేరుకున్నాడు. కుంభకర్ణుని దూరం నుండి
చూచాడు రావణుడు. సింహాసనము మీది నుండి లేచి కుంభకర్ణునికి
ఎదురుపోయి ప్రేమతో కౌగలించుకున్నాడు. కుంభకర్ణుడు రావణునికి
పాదాభివందనము చేసాడు. “అన్నా రావణా! నన్ను ఎందుకునిద్ర
లేపారు? నేను ఏమి చెయ్యాలి?” అని సూటిగా అడిగాడు.
అప్పుడు రావణుడు ఇలా అన్నాడు.“తమ్ముడా కుంభకర్ణా! నీవు
చాలా కాలము కిందట నిద్రకు ఉపక్రమించావు. ఈ లోపల చాలా
విషయాలు జరిగాయి. ఇటీవల నాకు రాముడు అనే నరుని వలన
కలిగిన భయం గురించి నీకు తెలియదు. ఈ రాముడు అయోధ్య
రాజైన దశరథుని కుమారుడు. ఇతని స్నేహితుడు సుగ్రీవుడు అనే
వానరుడు. రాముడు, సుగ్రీవుని సాయంతో సముద్రమును దాటి
లంకలో ప్రవేశించాడు. లంకానగరాన్ని ముట్టడించాడు. లంకను
ఆక్రమించాడు. ఎక్కడ చూచినా వానరులే. ఈ వానరయోధులు
మన రాక్షస వీరులను ప్రముఖులను ఎంతోమందిని చంపారు.
వానరులకు కలిగిన నష్టం కంటే మనకు జరిగిన నష్టం అపారము. ఈ
వానరులు ఎప్పుడూ యుద్ధం చేసినట్టు గానీ అందులో ఓడిపోయినట్టు గానీ కనపడదు. ఈ విధంగా నాకు నరులతో, వానరులతో భయం కలిగింది. నీవు యుద్ధంలో ఈ నరులను వానరులను చంపి నాకు మనశ్శాంతి కలిగించు. ఈ యుద్ధముతో మన కోశాగారము అంతా వ్యయము అయిపోయింది. లంకా నగరంలో స్త్రీలు, బాలురు, వృద్ధులు తప్ప ఎవరూ మిగలలేదు. కాబట్టి నా కోసం ఈ యుద్ధం చెయ్యి. నన్ను, లంకను, రక్షించు. ఇప్పటిదాకా నేను అందరినీ శాసించాను కానీ ఈ ప్రకారంగా ఎవరినీ కోరలేదు. కాబట్టి నా మాటలు మన్నించి యుద్ధం చెయ్యి. ఓ తమ్ముడా! నీకు యుద్ధము కొత్త కాదు. దేవాసుర యుద్ధంలో నీవు రాక్షసుల పక్షాన పోరాడి వారికి విజయం సంపాదించి పెట్టావు. ఈ సమయంలో కూడా నీ పరాక్రమమును చూపించి నాకు విజయం చేకూర్చు. నీవు ఎలా యుద్ధం చేస్తావో నీ ఇష్టం. కానీ శత్రునాశనం మాత్రం జరగాలి. అదే నా ధ్యేయము." అని పలికాడు రావణుడు.

శ్రీమద్రామాయణము
అరవై రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

21 Nov, 03:43


కార్తీక పురాణం 20 వ అధ్యాయము పురంజయుడి కథ
https://youtu.be/yA5vV965joE

సనాతన ధర్మం

20 Nov, 16:31


🚩దత్తనామస్మరణ సర్వపాపహరణ.👏                             
🚩దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా.🌺🙏🌺               🚩దిగంబరా దిగంబరా అవధూతచింతన దిగంబరా.🌺🙏🌺
🚩జైగురుదత్త...🌺🙏🌺
🚩జైజై గురుదత్త...🌺🙏🌺

సనాతన ధర్మం

20 Nov, 16:21


కార్తీక పురాణము 19 వ అధ్యాయము ||
చాతుర్మాస్య వ్రత విశేషములు

https://youtu.be/4x6PzkOrP_w

సనాతన ధర్మం

20 Nov, 14:48


శ్రీ పార్వతీ సమేత ఉమా కోటి లింగేశ్వర స్వామి క్షేత్రం ,🙏రాజమహేంద్రవరం

సనాతన ధర్మం

20 Nov, 12:13


శ్రీదత్త పురాణము ||తృతీయభాగం
వృద్ధ రాక్షసుడి పూర్వజన్మ || ఇరవై నాలుగులో ఒకటి (24-1)

పూర్వ జన్మలో నేను కాశీ నివాసిని. ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేదపారం ముట్టాను. కానీ రేవులో కాకినై నానాదానాలు పట్టాను. రాజుల నుంచి పుల్కసులదాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకరదానం ఇచ్చినా విధినిషేధాలు లేకుండా చెయ్యిజాపాను. వారి పాపాలన్నీ మీద వేసుకున్నాను. అప్రతిగ్రహంగా జీవించవలసిన వేదవేత్తను ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను. పరహితం కోసం దానాలు పట్టినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా? లేదు. పోనీ అంటే నేనెవరికైనా ఏదానమైనా ఇచ్చానా? లేదు. అర్ధ లోభంతో నేను చెయ్యని దుష్కృత్యం లేదంటే
నమ్ము. ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగా స్నానంతో తొలగిపోతాయి. కానీ అవి- ముక్త క్షేత్రమైన కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాల్లా పేరుకుపోతాయే తప్ప ఏ పుణ్యకార్యానికీ కరగవు. అసలు నేను ఏ పుణ్యకార్యమైన చేస్తే గదా! రోజులూ వారాలూ నెలలూ సంవత్సరాలూ గడిచిపోయాయి. ముసలితనం వచ్చిపడింది. శరీరమన్నాక నేడో రేపో రాలిపోవలిసిందేగా. మరణించాను. అయితే అవి ముక్తక్షేత్ర మహిమవల్ల నేను నరకానికి పోలేదు. కాశీకి యమదూతలు రారు. ఎంతటి మహాఘోరపాపిష్టి అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు, గర్భవాస క్లేశంలేని ముక్తిని పొందుతాడు. కానీ నేను చేసిన పాపాలన్నీ అవి ముక్తంలోనే కనక అవి నన్ను ముక్తిని పొందనివ్వలేదు. వజ్రలేపాలై తగిలి నిలిచాయే తప్ప విడిచిపెట్టలేదు. ఆ కారణంగా నీచ జన్మలు ఎన్నో ఎత్తాను. అయితే కాశీ క్షేత్ర
మహిమవల్ల గర్భవాస క్లేశంలేని అయోనిజ జన్మలే లభించాయి. ఇది కాశీలో మరణించిన నావంటి పాపిష్టులకు శ్రీ భైరవానుజ్ఞ (పదమంజరీ వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి:) హిమాలయాల్లో గ్రద్దగా రెండు జన్మలు, వ్యాఘ్రంగా మూడు జన్మలు, సరీనృపంగా గుడ్లగూబగా మలభక్షక క్రిమిగా పందిగా ఒక్కొక్క జన్మ అయ్యి ఇదిప్పుడు ఈ రాక్షసరూపం
పదవజన్మ. ఈ జన్మ ఎత్తి ఇప్పటికి డబ్భై అయిదువేల సంవత్సరాలయ్యింది. అయినా అతీగతీ లేదు. నాకు నిష్కృతి
లభిస్తుందనిగానీ ఈ దుఃఖసాగరం నుండి విముక్తి పొందుతానని గానీ ఆశ కూడా లేదు. భద్రే! ఈ ముప్పాతిక వేల సంవత్సరాలలో ఏ పాపమూ ఎరగని ఎన్ని ప్రాణుల్ని భక్షించానో. మూడు యోజనాల మేర జంతు వేదైనా కనిపిస్తే ఒట్టు. పూర్తిగా నిర్ణంతుకమైపోయింది. ఈ మహా పాపాలన్నీ అనుక్షణమూ నా హృదయాన్ని దహించివేస్తుంటే మనశ్శాంతి కరువై అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృత సేచనంగా లభించింది. కొనకొంగు నుంచి జారిపడిన నీటి బిందువు
హృదయశల్యాన్ని తొలగించింది. తీర్ధయాత్రలూ, తీర్ధస్నానాలూ ఎప్పటికో ఫలిస్తాయట. సజ్జన సాంగత్యం మాత్రం
తక్షణమే ఫలిస్తుందట. అందుకే మహాత్ములు ఈ సత్సంగతిని బహుధా కొనియాడుతుంటారు.నీ తల్లిగా ! నా దుఃఖాలా దుష్కృతాలూ అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను. ఎదుటి వారి కష్టాలను కనీసం ఓపికగా వినిపించుకునే సజ్జనులు మరీ అరుదైపోతున్న రోజులివి. నువ్వు విన్నావు. అంతే చాలు. ఇక నేను చెప్పవలసింది ఏమిలేదు. ఈ దుఃఖసముద్రానికి ఆవలి తీరం ఎక్కడో జన్మపరంపరలకు ముగింపు ఎప్పుడో - తెలిస్తే పుణ్యం కట్టుకో, సజ్జనుల సంపద ఏదైనా అది పరులకోసమే అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు. క్షీర సముద్రంలోని పాలు హంసలన్నింటికీ సమానంగా ఉపజీవనాలు కావడం లేదూ. అలాగేనటమరి. వృద్ధరాక్షసుడి ఆవేదన కాంచన మాలినిని కరుణారసార్ధను చేసింది. ఒకప్పటి తన ఆవేదన తన పశ్చాత్తాపం
గుర్తుకు వచ్చాయి. పుణ్యదానం చెయ్యాలనిపించింది. రాక్షసోత్తమా! ఇప్పుడే నీకు నిష్కృతి కలిగిస్తాను. దుఃఖించకు. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏటేటా మాఘస్నానాలు చేశాను. ఎన్నో ఏళ్ళ తరబడి చేస్తున్నాను. అదీ శ్రద్ధగా చేస్తున్నాను. త్రివేణీ సంగమంలో చేస్తున్నాను. కనుక ఎంతో కొంత పుణ్యం రాశిపడి ఉంటుంది సందేహం లేదు - అది నీకు కొంత ధారపోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే దానమని వేదవిదులు ప్రశంసిస్తున్నారు. సముద్రంలో కురిసిన
మేఘుడు ఏ ఫలం మూటగట్టుకుంటున్నట్టు? మిత్రమా! త్రివేణీ సంగమంలో చేసిన ఒక మాఘ స్నాన వ్రత ఫలం నీకు సమర్పిస్తున్నాను. దీనితో నీకు దేవతాకారమూ స్వర్గతీ లభిస్తాయి. ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేనింతకు ముందు అనుభవించాను కనక సద్య స్సర్వపాప వినాశకంగా అమరత్వ ప్రదాయకంగా దాన్ని నీకు దానం చేస్తున్నాను. అని చెప్పి కాంచన
మాలిని నీళ్ళోడుతున్న తన చీర చెంగును చేతిలోకి పిండుకుని ఆ వృద్ధరాక్షసుడి దోసిట్లోకి - ఇదమేకం మాఘజం పుణ్యం తుభ్యమహం సంప్రదదేనమమ - అని ధారపోసింది. ఆ ధార దోసిట్లో పడటమేమిటి రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి ఒక్కసారిగా జరిగిపోయాయి. అతడి దివ్యతేజస్సు దశదిశలనూ ధగద్ధగాయమానం చేస్తోంది. అంతలోకి దేవతా విమానం వచ్చి అతడి చెంత నిలిచింది. హర్షిత్ఫుల్లలోచనుడై అధిరోహించాడు.

సనాతన ధర్మం

20 Nov, 12:13


కళ్యాణీ! నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావు. సదసత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలనూ ప్రసాదించుగాక! కారుణ్యమయీ! మరికాస్త అనుగ్రహించి నాకు - సర్వనీతిమయమైన మార్గం ఉపదేశించు. నువ్వు నాకు గురుస్థానీయవు. నీ మాట నాకు శిరోధార్యం. జీవితంలో నేనింక ఏ పాపమూ చెయ్యకుండా తగిన ఉపదేశం ఇయ్యి. అది విన్నాక నిన్ను స్తుతించి ధన్యుణ్ని అవుతాను. అటు పైని సురలోకం చేరుకుంటాను. ఆకాశమార్గాన విమానంలో తన చెంత నిలబడి అభ్యర్ధించాడు ఆ నూతన త్రిదశుడు. కాంచన మాలికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారడమే ఒక ఆనందమైతే, అలా మారినవాడూ విమానమెక్కి తుర్రుమనక తన ఉపదేశం అర్ధించడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ప్రేమగా ధర్మోపదేశం చేసింది. మిత్రమా! ఏనాడూ ధర్మం తప్పకు. ప్రాణి హింసకు పాల్పడకు. సాధు పురుషులను సేవించు. కామక్రోధాధుల్ని పరిత్యజించు. ఇతరుల దోషాలనో, గుణాలతో కీర్తిస్తూ కాలయాపన చెయ్యక నిత్యమూ సదాశివుణ్ణి ధ్యానించు.
అంతర్భహిరింద్రియాలన్నింటినీ (స్వర్ణభాన్ని) జయించు. అస్థిమాంస రుధిరాలతోనూ మలమూత్రాలతోనూ నిండిన ఈ శరీరం చివరికి క్రిమికీటకాలకు ఆహారమవుతుంది. పురుగులు పడుతుంది. దీని మీదా దీనితో ముడిపడిన భార్యాపుత్రుల విూదా మమకారం విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో. ఒక వైరాగ్యభావం అలవరచుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు. నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను. మనస్సులో పెట్టుకో. ప్రధానంగా శీల సంపన్నుడవై మెలుగు. జ్యోతిర్మయదేహుడవై వెలుగు. ఇక బయలు దేరు.సుఖంగా నాకలోకం చేరుకో. అమ్మా! కాంచనమాలినీ! అద్భుతమైన ధర్మోపదేశం చేశావు. నాకే కాదు అన్ని లోకాల వారికీ ఆచరణీయమైన
నీతి మార్గం ఉపదేశించావు. ధన్యుణ్ణి. కృతజ్ఞుణ్ణి. పావనీ! నువ్వు కూడా ఇలాగే ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవించు. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపు. సాధ్వీ! నీకు సర్వదా శుభమగుగాక! కైలాసంలో శివ సన్నిధిలో ఆచంద్రతారకంగా నివశించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధిల్లుగాక. తల్లీ! ధర్మనిష్టా తపోనిష్టలతో నీ జీవితం చరితార్ధమగుగాక. శరీర వ్యామోహం మరింకెన్నడూ నీకు కలుగకుండు గాక. ఇలాగే ఎల్లవేళలా ఆ పన్నుల ఆర్తిని హరింతువుగాక - సెలవు తల్లీ ! సెలవు - అంటూ శిరస్సున అంజలి ఘటించి విమానంతో సహా ముమ్మారు ప్రదక్షిణం చేసి నాకలోకానికి దూసుకు వెళ్ళిపోయాడు.

సశేషం
శ్రీ దత్తాయగురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

09 Nov, 09:55


కార్తీక మాసం 30 రోజుల అభిషేకములలో
భాగంగా స్వామి వారికి ఎనిమిదవ రోజు  అభిషేకం

సనాతన ధర్మం

09 Nov, 03:44


ఈరోజు మందపల్లి లోని మందేశ్వర స్వామి వారు 🙏🏻

సనాతన ధర్మం

08 Nov, 16:22


ఈరోజు శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారి దివ్య దర్శనం, కుండలేశ్వరం

సనాతన ధర్మం

08 Nov, 12:53


శ్రీదత్త పురాణము || తృతీయభాగం
ప్రయాగ మహిమ || ఇరవై ఒకటి(21)

కార్తవీర్యా ! గంగా యమునా సంగమస్థలాన్ని ప్రయాగ అంటారు. ఇది మహా పాప సమూహాలకు దహన వాటికగా, పాపరూప పశువులకు విశసన స్థలిగా (గబేళా) బ్రహ్మ దేవుడు ఈ ప్రయాగను సృష్టించాడు. ఇది తెలుపూ (గంగ) నలుపూ (యమున) జలాల కూడలి. దీని గర్భంలో సరస్వతీ నది కూడా వుంది. అయితే అది అదృశ్యరూప.
ఇలా ఇది త్రివేణీ సంగమం. బ్రహ్మలోకానికి ఇది మార్గం. ఈ సంగమస్థలంలో మకర రవివేళ మాఘ స్నానం చేసిన భాగ్యశాలికి మరెప్పుడూ ఏ గర్భకోశంలోనూ మునుగవలసిన అవసరం ఏర్పడదు. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. దేవతలకు సైతం దురాసదమైన వైష్ణవ మాయ కూడా మాఘంలో ఇక్కడ దగ్ధమవుతుంది. అంతటి శక్తి అంతటి పవిత్రతా ఉన్న తీర్ధ మిదొక్కటే. రకరకాల పుణ్యకార్యాలకు ఫలాలుగా దక్కిన ఆయా తేజోమయ లోకాలలో విహరించి భోగాలను అనుభవించిన పుణ్యజీవులు ఈ సంగమ తీర్ధంలో మాఘస్నానం చేసి శ్రీ మన్నారాయణుడిలో లీన మవుతారు. మకర రవివేళ ఈ సితాసిత జల సంధిలో స్నానం చేసినందువల్ల వచ్చే పుణ్యాన్ని గానీ, ఆ పుణ్యానికి తగిన
స్థానాన్నిగానీ చిత్ర గుప్తుడైనా లెక్కకట్టి చెప్పలేడు. నూరేళ్ళ నిరాహార వ్రతానీకీ, మూడు వందల ఏళ్ళ యోగాభ్యాసానికి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయాన నూరు బారువుల బంగారం దానంచేసిన దానికీ వెయ్యి రాజసూయ యాగాలు నిర్వహించిన దానికీ లభించే పుణ్యఫలం ఇక్కడ ఈ త్రివేణిలో మూడు మాఘస్నానాలు చేస్తే చాలు వచ్చి ఒడిలో పడుతుంది. మరొక రహస్యం విను ఈ భూగోళం మీద వున్న సకల తీర్థాలూ, సమస్త పుణ్య క్షేత్రాలూ ఈ త్రివేణిలో శ్రుభుతువును ముమ్మును మాఘ స్నానానికి వేంచేస్తాయి. అప్పటి దాకా తమలో మునిగిన పాపాత్ముల కిల్బషాలతో నల్లబడ్డ ఈ తీర్ధాలు త్రివేణీ మాఘ స్నానంతో కిల్బషాలను పూర్తిగా వదిలించుకొని తెల్లబడతాయి. జీవుడి ఆవిర్భావం నుండీ జన్మ జన్మాంతరాల్లో మనోవాక్కాయ కర్మలతో కూడబెట్టుకున్న మహాపాపరాశి అంతా
ఇక్కడ మాఘ స్నానంతో పిడికెడు బూడిదయై నీళ్ళల్లో కరిగిపోతుంది. ఇక్కడ మూడు మాఘ స్నానాలు చేస్తే చాలు
ఎంతటి నరాధముడైనా కుబుసంలా పాపాలను వదిలేసి పవిత్రుడై అమరధామం చేరుకుంటాడు. కురుక్షేత్రంలో ఎక్కడ గంగా స్నానంచేసినా ఇదే ఫలితం. ఇంతకన్నా వింధ్యాగంగా సంగమంలో నైతే పదిరెట్లూ, ఉత్తర వాహినిగా గంగ ప్రవహిస్తున్న కాశీలోనైతే వంద రెట్లూ, గంగా యమునా సంగమంలోనైతే అంతకన్నా నూరురెట్లూ. పశ్చిమ వాహినిగా గంగ ప్రవహిస్తున్నచోటనైతే వెయ్యిరెట్లూ అధికంగా స్నాన పుణ్యఫలం లభిస్తుంది. అర్జునా! పశ్చిమ వాహినిగా ప్రవహిస్తున్న గంగానదిని దర్శిస్తే చాలు బ్రహ్మహత్యా మహాపాతకం కూడా తొలగిపోతుంది. పశ్చిమంగా ప్రవహించే గంగానది కాళిందిలో సంగమించినచోట మాఘ స్నానం చేస్తే కల్పకల్పాంతర సంప్రాప్తాలైన నిఖిల దోషాలూ అస్తమిస్తాయి. అందుకనే ఈ త్రివేణీ సంగమాన్ని “అమృతము” అని కల్పకల్పాంతరాల నుండీ కీర్తిస్తున్నారు మహర్షులు. ఇక్కడ మాఘ స్నానముహుర్తం దేవతలకు సైతం కష్టసాధ్యం. అణిమాది గుణసిద్ధులైన యోగీశ్వరాలు బ్రహ్మజ్ఞానులూ, సతీసమేతులై - హరి హర విరంచి పురందరులూ ఆదిత్యులూ మరుత్తులూ గంధర్వులూ, లోకపాలకులూ, యక్షులూ, గుహ్యకులూ, కిన్నెరులూ, నాగులూ అలాగే ఘృతాచీ మేనకా, రంభా, ఊర్వశీ, తిలోత్తమా, ప్రభృతి అప్సరో బృందమూ, పితృదేవతా గణమూ అందరూ ఈ త్రివేణీ సంగమంలో మాఘస్నానం చేయడానికి
వస్తారు. కృత యుగంలోనైతే స్వస్వరూపాల తోనూ కలియుగంలోనైతే ప్రచ్ఛన్న రూపాలతోనూ వచ్చి స్నానాలు చేసి వెడతారు. ఈ ప్రయాగలో ముమ్మారు మాఘస్నానం చేసిన వారు వెయ్యి అశ్వమేధాలకన్నా అధికపుణ్య ఫలం పొందుతారు. వెనకటికి కాంచన మాలిని ఇలాగే త్రివేణిలో మూడు నాళ్ళు మాఘ స్నానాలు చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని ఒక రాక్షసుడికి ధారపోసింది. దానితో ఆ పాపాత్ముడు కలికల్మష విముక్తుడయ్యాడు. దత్తాత్రేయుడినోట ప్రసంగవశాత్తూ ఈ మాట వచ్చింది. అంతే కార్తవీర్యార్జునుడు పట్టుకున్నాడు. స్వామి! స్వామి ! ఎవరీకాంచన మాలిని? ఎవడా రాక్షసుడు? వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఆవిడ తన పుణ్యాన్ని ఎందుకు ధారపోసింది? తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. అత్రి సంతతి భాస్కరా! అది పుణ్య ప్రదమైనదని నువ్వు భావిస్తే దయచేసి నా కుతూహలం దీర్చు.
అర్జునా! అసలే నేను శిష్య పరాధీనుణ్ని నువ్వానన్ను గెలుచుకున్న వాడివి. నువ్వు అడగడమూ నేను కాదనడమూనా. తప్పకుండా చెబుతాను. ఇదీ పుణ్య ప్రదమైన కథ. అత్యంత పురాతనమైన ఇతి హాసం. దీన్ని చెప్పడమో వినడమో కాదు. తలుచుకుంటే చాలు అశ్వమేధ ఫలం లభిస్తుంది. శ్రద్ధగా విను.

ఓం శ్రీ దత్తాయగురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

08 Nov, 09:19


కార్తీక మాసము కాబట్టి అందరూ ప్రతీరోజూ కచ్చితంగా భస్మ ధారణ చేయండి, ఓం నమశ్శివాయ 🙏
భస్మ ప్రభావము,
చంద్రశేఖర పాహిమాం

సనాతన ధర్మం

08 Nov, 09:08


కార్తీక పురాణము 7 వ అధ్యాయము || ఈరోజు వినాల్సిన కార్తీక పురాణము

Please like share subscribe||


https://youtu.be/5Y9pjku_jnE

సనాతన ధర్మం

08 Nov, 08:32


ఇంకా ఎవరైనా తమ గోత్ర నామాలతో చేయించుకోవాలి అనుకుంటే వివరాలకు సంప్రదించండి,
తంగిరాల దత్తాత్రేయ శర్మ కపిలేశ్వరపురం, 8639672644

సనాతన ధర్మం

08 Nov, 08:30


తమిళనాడు ప్రాంతంలో వైభవంగా జరుగుతున్న స్కంద షష్టి వేడుకలలో భాగంగా అమ్మవారి దగ్గర నుండి వేల్ ఆయుధాన్ని సుబ్రహ్మణ్య స్వామి వారు పొందే ఘట్టాన్ని వైభవంగా నిర్వహించిన పాండిచ్చేరిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం...

సనాతన ధర్మం

05 Nov, 15:22


కార్తీక మాసం లో దీపారాధన దీపదాన మహిమ కార్తీక పురాణము 4 వ అధ్యాయము ఈరోజు వినవాల్సిన కార్తీక పురాణము ||
https://youtu.be/GfeJu00uqhQ

సనాతన ధర్మం

05 Nov, 13:32


**కార్తీకమాస పర్వాన్ని పురస్కరించుకుని పెనుగొండ శ్రీ వాసవి శాంతి ధామ్ క్షేత్రమునందు ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర మందిరంలో పారిజాత పుష్పములుతో అలంకరణ*

సనాతన ధర్మం

05 Nov, 08:41


కార్తీక మాసం 30 రోజుల అభిషేకములలో
భాగంగా స్వామి వారికి నాలుగవ రోజు అభిషేకం

సనాతన ధర్మం

05 Nov, 06:37


కార్తీక మాసం నెల రోజుల అభిషేకం లో ఈరోజు 4 వ రోజు నాగుల చవితి పర్వదినం కూడా , ఈరోజు స్వామి వారికి రుద్రాభిషేకము live చూడాలి అనుకున్న వారు చూడండి,

https://www.facebook.com/share/v/1w7tsExTF9j1nVpe/

సనాతన ధర్మం

05 Nov, 06:31


శ్రీకార్తీక_పురాణము 4వ అధ్యాయము

కార్తీక మాసంలో సర్వసత్కార్యములనూ చేయవచ్చును. కార్తీకమాసంలో_దీపారాధన అతి_ముఖ్యము. దీని వల్ల మిగుల ఫలము పొందవచ్చు. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమందుగాని ,విష్ణ్వాలయమందుగాని దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమందు అనగా సంధ్య చీకటి పడు సమయాన శివకేశవుల సన్నిధిన గాని, ప్రాకారమందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠప్రాప్తి పొందుతారు. కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిదిలో ఆవునేయ్యితోగాని, కొబ్బరి నూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏది దొరకన్నప్పుడు ఆముదముతో గాని దీపమును వెలిగించాలి. దీపారధన ఏ నూనెతో చేసిన మిగుల పుణ్యాత్ములుగా, భక్తిపరులుగా అవ్వటమే కాక అష్టైశ్వర్యములూ కలిగి శివసన్నిదికి వెళ్తారు.

శత్రుజిత్కథ

పూర్వము పాంచాలదేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ణయాగాదులు చేసి విసుగుచెంది చివరికి గోదావరి తీరంలో నిష్ఠతో తపమాచరిస్తుండగా అక్కడికి పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి " పాంచాల రాజా! నీవెందుకింత తపమాచరిస్తున్నవు? నీ కోరిక యేమి?" అని ప్రశ్నించగా " ఋషిపుంగవా! నాకు అష్టైశ్వర్యలు,రాజ్యము, సంపదలు వున్న నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, క్రుంగి కృశించి యీ తీర్థస్థలమున తపమాచరిస్తున్నాను" అని చెప్పాడు. అప్పుడు ముని పుంగవుడు " ఓయీ! కార్తీకమాసంలో శివదేవుని ప్రీతికొరకు దీపారాధన చేసినయెడల నీ కోరిక నెరవెరగలదు" అని చెప్పి వెళ్ళాడు.
వెంటనే ఆ రాజు తన దేశాని కిపోయి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపారధన చేసి, దానధర్మములతో నియమానుసరంగా వ్రతమ్ చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నెలదినములు అలా చేసెను. తత్పుణ్యకార్యమువలన ఆ రాజు భార్య గర్బవతియై క్రమంగా నవమాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తన కుమారున్ని కన్నది. రాజుకుటుంబీకులు ఆనందంతో తమ దేశమంతట పుత్రోత్సవమును చేయించి, బ్రాహ్మణులకు దానధర్మలు చేసి, ఆ బాలునికి " శత్రుజిత్తు" అని నామకరణం చేయించి అమిత గారాబంతో పెంచుతుండెవారు. కార్తీకమాస దీపారధన వల్ల పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు,దీపారధన చేయమని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్థమానుడుఅవుతూ, సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నెర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్థుల సహవాసము చేత, తల్లిదండ్రుల గారాబం చేత తన కంటికింపగు స్త్రీలను బలాత్కరిస్తూ, ఎదురించిన వారిని దండిస్తు తన కామవాంఛ తీర్చుకొంటుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు, వినీవిననట్లు వుందడిరి. శత్రుజిత్తు అ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పెవారిని నరుకుతానని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేస్తుండెను. అలా తిరుగుతూం డగా ఒకరోజు ఒక బ్రాహ్మణపడుచును చూసెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మంచి రూపవతి. ఆమె అందచందములను వర్ణించడం మన్మథునికైన శక్యముగాదు. అలాంటి స్త్రీ కంటపడగానే రాకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసేను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్దురాలై కులము, శీలము, సిగ్గు విడచి అతని చేయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపోయి భోగములను అనుభవించెను. ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము అర్థరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొంటువుండేవారు. ఇలా కొంత కాలం అయ్యక ఎలాగో ఈ విషయం ఆమె భర్తకి తెలిసి, పసిగట్టి భార్యను, రాజకుమారున్ని ఒకేసారిగా చంపాలని నిర్ణయించి ఒక ఖడ్గన్ని వుంచుకుని సమయం కోసం వేచిచుస్తూన్నాడు. ఇట్లుండగా కార్తీకపౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకొని, యెవరికివారు రహస్యంమార్గంలో బయలుదెరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా వెళ్ళి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరూ కలుసుకొని గాడ ఆలింగనము చేసుకున్న సమయంలో "చీకటిగా వుంది , దీపముండిన బాగుండును కదా" అని రాకుమారుడనగా ఆమె తన పైటచెంగును చించి అక్కడున్న ఆముద ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వత వారిద్దరు మహానందంతో రతిక్రీడలు సలుపుటకు సిద్దమవుతుండగా అదే అదునుగా ఆమె భర్త తన వద్ద వున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యనూ, ఆ రాకుమారున్ని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యంకొద్ది ఆరోజు కార్తీకశుద్ద పౌర్ణమి సోమవారం అవుటచే ఆరోజు ముగ్గురూ చనిపోవుటవలన శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకుపోడానికి, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవడానికి అక్కడికి వచ్చరు. ఆ యమదూతలను చూసి బ్రాహ్మణుడు " ఓ దూతలారా! నన్ను తీసుకుపోవడానికి మీరెల వచ్చారు? కామాంధకారంతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకొరకు శివదూతలు విమానములో రావడమేమిటి? చిత్రంగా వుంది" అని ప్రశ్నించెను.

సనాతన ధర్మం

05 Nov, 06:31


దానికి యమకింకరులు " ఓ బాపడా! వారెంతటి నీచులైనా ఈ పవిత్రదినమైన కార్తీక పౌర్ణమీ సోమవారపు దినము తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించటం వలన అప్పటివరకూ వారు చేసిన పాపములన్నీ కూడా నశించిపోయినవి. కావున వారిని కైలాసానికి తీసుకొనిపోవడానికి శివదూతలు వచ్చారు" అని చెప్పగా ఈ సంభాషణం అంతావిన్న రాజ కుమారుడు " అలా ఎన్నటికి జరగనివ్వను, తప్పొప్పులు ఎలావున్నపటికి ముగ్గురమూ ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించాల్సిందే" అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసెను. వేంటనే అతన్ని కూడా పుష్పకవిమానము ఎక్కించి శివసాన్నిధ్యానికి చేర్చారు.
కావున కార్తీకమాసంలో నక్షత్రమాలయందు దీపముంచినవారు జన్మరాహిత్యము పొందుతారు.

నాల్గవరోజు పారాయణము సమాప్తము.

◆◆◆◆◆◆◆◆◆◆◆

కార్తీక మాస నాల్గవరోజు దానధర్మ జపతపాది విధులు - ఫలితాలు

పూజించాల్సిన దైవము → విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము → ఓం గం గణపతయే స్వాహా
దానములు → నూనె, పెసరపప్పు
నిషిద్ధములు → వంకాయ, ఉసిరి
ఫలితము → సద్బుద్ధి, కార్యసిద్ధి

ॐ సర్వం శివమయం జగత్ ॐ
ॐ ఓం నమఃశివా

సనాతన ధర్మం

04 Nov, 13:54


శ్రీకార్తీక_పురాణము 3వ అధ్యాయము

కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగజేయటమే కాక మరణానంతరము వారు శివసాన్నిథ్యమును చేరుతారు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానము చేయక, అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి చివరికి క్షుద్రజన్మలు అనగా కుక్క, కోడి, పిల్లిగా జన్మిస్తారు.
అధమము కార్తీక శుక్లపౌర్ణమి రోజునైన స్నానదాన జపతపాదులుచేయకపోవటం వలన అనేక చండాలది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుడతారు.

బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట

ఈ భరతఖండలో దక్షిణప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్ఠుడు' అనే బ్రాహ్మణుడొకడొకడు వుండెవాడు.
ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదెరెను. ఆ తీర్థసమీపాన ఒక మహావట వృక్షంపై భయంకర ముఖము. దీర్గకేశములతో, బలిష్టమైన కోరలతో, నల్లని పొట్టతో చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారినబోవు వారిని బెదిరిస్తూ వారిని చంపి భక్షిస్తూ ఆ ప్రాంతమంతయూ భయకంపితంగా చేస్తుండేవారు. తీర్థ యాత్రకై బయలుదెరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరెసరికి యథప్రకారంగా బ్రహ్మ రాక్షసులు క్రిందకుదిగి అతనిని చంపబోవు సమయన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణూకుతూ ఏమి తోచక నారయణస్తోత్రము బిగ్గరగా పఠిస్తూ " ప్రభో! ఆర్తత్రాణ పరాయణా! అనాధ రక్షకా! ఆపదలో వున్న నన్ను ఈ పిశాచముల నుండి రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న రాక్షసులకు జ్ఞానోదయం కలిగి " మహానుభావ! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది. మమ్ము రక్షింపుము అని ప్రాదేయపడిరి. వారి మాటలకు విప్రుడు దైర్యం తెచ్చుకొని " ఓయీ! మీరెవరు? ఎందుకు మీకు ఈ రాక్షస రూపం కలిగింది? మీవృత్తాంతము తెలపండి అని పలుకగా వారి లో ఒకరు " విప్ర పుంగవా! నాది ద్రవిడ దేశము నేను బ్రాహ్మణుడను. నేను మహాపండితున్ని గర్వము గలవాడినై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తించి, బాటసారులవద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జ్యన్యంగా ధనము లాగుకొనుచు, దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక, పండితులను అవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంటకునిగా ఉండెవాన్ని.
ఇలా వుండగా ఒకనొక పండతుడు కార్తీక వ్రతమును యథావిథిగా ఆచరించి భూతతృప్తికొరకు బ్రాహ్మణ సమారాధన చేయటంకోసం పదార్ధ సంపాదన నిమిత్తమ బయలుదెరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అథిదిగా వచ్చెను. వచ్చిన పండితున్నినేను దూషించి , కొట్టి అతని వద్దవున్న ధనాన్ని, వస్తువులని తీసుకొని ఇంటినుండి గెంటివెసాను. అందుకు ఆ విప్రునకు కోపంవచ్చి " ఓరి నీచుడా! అన్యాక్రంతముగా డబ్బుకూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటిబ్రహ్మణుడను కూడా ఆలోచింపక నన్ను దోచుకుంటివి కావున నీవు రాక్షసుడవై నరభక్షునుగా నిర్మానుష్య ప్రదేశంలో వుందువుగాక" అని శపించుటచేత నాకు ఈ రాక్షస రూపము కలిగినది.బ్రహ్మాస్త్రమునైన తప్పించుకొనవచ్చును కాని బ్రాహ్మణ శాపము తప్పించుకోలేము కదా ! కావున నా అపరాధము క్షమింపుము అని పార్థించాను అందుకు అయన దయ తలచి ' ఓయీ! గోదావరి క్షేత్రమున ఒకవటవృక్షం కలదు నీవందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమును ఆచరించి పుణ్యఫలము సంపాదించి యుండునో ఆ బ్రహ్మణుని వలన పునర్జన్మ పొందుదువుగాక అని వెల్లిపోయాడు కావున ఓ విప్రోత్తమా నన్నూ నా కుటుంబము వారిని రక్షింపుము అని రక్షాసుడు తన వృత్తాంతమును చెప్పాడు.
రెండవ రాక్షాసుడు " ఓ ద్విజోత్తమ! నేనూ కూడా పుర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండిపెట్టక మాడ్చి అన్నమోరామచంద్రా అనేటట్లు చేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్యపరమాన్నములతో భూజించెవాడిని. నేను ఎలాంటి దానధర్మలు చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించాను. కాబట్టి నాకు ఈ రాక్షసత్వం కలిగింది. నన్నీ పాపపంకిలమునలనుండి ఉద్ధరింపుము" అని బ్రాహ్మణుని పాదలపై పడి వేడుకొనెను.
మూడవ రాక్షసుడు " మహాశయ! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైన చేయక, కట్టుబట్టలతో దేవాలయంలో తిరిగెవాడిని. భగవంతునికి ధూపదీప నైవెద్యములను కూడా అర్పించక, భక్తులు తెచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేస్తూ మద్యమాంసములను సేవించుచూ పాపకార్యములు చేసినందుకు నా మరణాంతరమున ఈ రూపమును ధరించాను. కావున నాకు పాపవిముక్తిని కలిగించండి" అని ప్రార్థించాడు.
అప్పుడు ఆ విప్రుడు " ఓ బ్రహ్మరాక్షసులారా! బయపడకండి, నా వెంట రండి మీకు విముక్తి ని కలిగిస్తాను అని.

సనాతన ధర్మం

04 Nov, 13:54


వారిని తనతో తీసుకెల్లి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పం చెప్పుకొని గోదవరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారివారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠముకి చేరారు..
కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తిచెంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదిస్తారు. అందువలన ప్రయత్నించయినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి.

మూడవరోజు పారాయణము సమాప్తము.

◆◆◆◆◆◆◆◆◆◆◆

కార్తీక మాస మూడవరోజు దానధర్మ జపతపాది విధులు - ఫలితాలు

పూజించాల్సిన దైవము → పార్వతి
జపించాల్సిన మంత్రము → ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వహ
దానములు → ఉప్పు
నిషిద్ధములు → ఉప్పు కలిసినవి, ఉసిరి
ఫలితము → శక్తి, సౌభాగ్యములు

ॐ సర్వం శివమయం జగత్ ॐ
ॐ ఓం నమఃశివాయ ॐ

సనాతన ధర్మం

04 Nov, 11:23


ఈరోజు కార్తీకమాసం లో మూడవ రోజు శ్రవణము చేయవలసిన కార్తీక పురాణము ||
Like share and subscribe

ప్రతీరోజూ కార్తీక పురాణం వినే అందరూ ఓం నమశ్శివాయ, అని కామెంట్ చేయండి,
ఓం నమశ్శివాయ||చంద్రశేఖర పాహిమాం

https://youtu.be/05ROgXK0rgs

సనాతన ధర్మం

01 Nov, 12:27


కార్తీక మాస వ్రతము || రేపటి నుండి కార్తీక పురాణము ఏరోజు అధ్యాయము ఆరోజు,
https://youtu.be/f9PLblRizsY

సనాతన ధర్మం

01 Nov, 10:33


కార్తీక మాసం లో ఎవరైనా అభిషేకాలు చేయించుకోవాలి అనుకుంటే సంప్రదించగలరు, మీ గృహములో రుద్రాభిషేకాలు, రుద్ర హోమము , పత్రి పూజ, మహా లింగార్చన, సహస్ర లింగార్చన చేయించుకోవాలి అనుకున్న వీరిని సంప్రదించగలరు

సనాతన ధర్మం

01 Nov, 05:28


https://youtube.com/shorts/P-qBfX74AoE?si=q6AvvTB89kvhZOwC

సనాతన ధర్మం

31 Oct, 17:38


శ్రీ లలితా దేవి ధ్యానము
https://youtube.com/shorts/fBoKK7le0lE?feature=share

సనాతన ధర్మం

31 Oct, 04:01


శ్రీమద్రామాయణము బాలకాండ 12వ సర్గ ||

Please like share and subscribe

https://youtu.be/67kmoYA1UxM

సనాతన ధర్మం

30 Oct, 10:13


శ్లో" అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః||
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః ||
*చంద్రశేఖర పాహిమాం*

సనాతన ధర్మం

30 Oct, 02:57


పిఠాపురం లో శ్రీపాద శ్రీ వల్లభ దర్శనం.(29-10-2024)

సనాతన ధర్మం

30 Oct, 02:38


శ్రీమద్రామాయణము బాలకాండ 12వ సర్గ ||

Please like share and subscribe

https://youtu.be/67kmoYA1UxM

సనాతన ధర్మం

29 Oct, 12:56


ప్రతీ ఒక్కరూ ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు ఎంతో విషయ జ్ఞానం కలగటమే కాకుండా, ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది,

సనాతన ధర్మం

29 Oct, 12:56


మా తాత గారు భక్తి టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ,

https://www.facebook.com/share/v/fy5qoz7tGD65K2CQ/

సనాతన ధర్మం

29 Oct, 12:36


శ్రీదత్త పురాణము || తృతీయభాగం
ధర్మ మహిమ ||
పద్దెనిమిది (18)

మిత్రమా ! నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తంగా చెబుతాను పనిలో పనిగా వినేసేయ్. త్రికరణ శుద్ధిగా జీవించడం - అంటే మనోవాక్కాయకర్మతో ఏ ప్రాణికీ ద్రోహం చెయ్యకపోవడం, ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవాపరాయణత్వం వర్ణాశ్రమ ధర్మాలను తు.చ. తప్పకుండా పాటించడం - ఇవి కచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక్క సంగతి - చేసిన తపస్సుగానీ, చేసిన దానాన్ని గానీ, చేసిన ఉపకారాన్ని గానీ పదిమందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గార్ధి ఈ పని చెయ్యడు. శక్తివంచన లేకుండా యవలు - వస్త్రాలు - ఛత్రాలు - కందమూల ఫలాలు - అన్న పానీయాలు మొదలైన వాటిని పది మందికీ పంచిపెడితే కలిగే హితం అంతా ఇంతా కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చెయ్యగలడు కదా! అలా ఏదో ఒకటి
దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతిరోజునూ గొడ్డుబోకుండా చూసుకోవాలి. వైశ్యపుత్రా! ఒకరికి పెట్టనిది తనకు మిగలదు - ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం దీన్ని పాటించే దాతలు మాలోకం వైపుకి రారు. ఇహంలో దీర్ఘాయుష్మంతులై ధనాఢ్యులై సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై అటు పైన స్వర్గ లోకంలో ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం గుమ్మం తొక్క వలసిన అవసరం వీరికి ఏర్పడదు. మిత్రమా! వెయ్యి మాటలెందుకు. ధర్మం సుగతికీ అధర్మం దుర్గతికీ దారి తీస్తాయి. అంచేత బాల్యం నుండే ధర్మాచరణను అలవరచుకోవాలి. ఇదీ సారాంశం. ఇంతకీ వికుండలా! నువ్వు తెలియక చేసినా మాఘస్నాన ఫలం నిన్ను ఉద్ధరిస్తోంది. నరక యాతనల నుండి తప్పించి స్వర్గ సుఖాలకు పంపుతోంది. అంతటి మహిమగలది మాఘస్నానం. సరే ప్రసక్తాను ప్రసక్తంగా చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. శ్రేయోదాయకమైన మరింకేదయినా విషయాన్ని శ్రుతి స్మృతి పురాణేతిహాసాల నుంచి తెలుసుకోదలుచుకుంటే బిడియ పడకుండా అడుగు. నాకు తెలిసింది చెబుతాను. మనం ఆప్తమిత్రులం అయ్యాం
కదా! - అని ముగించాడు యమదూత. వికుండలుడు కృతజ్ఞతా భావంతో నమస్కరించాడు. మహానుభావా! పేరుకు నువ్వు యమ దూతవేకానీ ఎంత సౌమ్యుడివి. ఎంతదయాయముడివి. నీ ప్రసంగంతో నా హృదయం ప్రసన్నమయ్యింది. నీ వంటి ఉత్తమ సజ్జనులతో సాంగత్యం గంగానదిలాగా వెంటనే సర్వ పాపాలను
పోగొడుతుంది. ఉపకారం చెయ్యడం, ప్రియం చెప్పడం అనేవి సజ్జనులకి సహజగుణాలు. అమృత కిరణుడైన చందమామను ఒకరు చల్లబరచాలా! దేవదూతా! నాదొక విన్నపం కారుణ్య మూర్తివి నువ్వే ఆలించి దారి చూపించాలి. మా అన్నగారిని నరకం నుండి
తప్పించడమెలాగ? నా పుణ్యం నుండి అవసరమైనంతా ధారపోస్తాను. నాకు ఎంత పుణ్యం ఉంది? నా పూర్వ జన్మలు ఏమిటి? వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్యకార్యమైనా చేసానా? ఎంత పుణ్యం ధారపొయ్యగలను? ఇవి కాస్త తెలియజెప్పి పుణ్యం కట్టుకో. నీ మేలు మరిచిపోలేను - అంటూ దీనంగా చేతులు పట్టుకున్నాడు.

ఓం శ్రీ దత్తాయ గురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

29 Oct, 06:54


శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభైరెండవ సర్గ.(52)

ధూమ్రాక్షుడు యుద్ధానికి రావడం చూచి వానరులు సంతోషించారు. మరొక రాక్షసుడు బలి కాబోతున్నాడు అని ఆనంద పడ్డారు.
వానరులు రాక్షసులు తలపడ్డారు. వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను,
మహావృక్షములను ఆయుధములుగా ధరించి యుద్ధం చేస్తుంటే,
రాక్షసులు పట్టిసములు, శూలములు, ముద్గరలు ధరించారు. ఇరుపక్షముల వారు సమానంగా చస్తున్నారు. కాకపోతే రాక్షసుల చేతిలో బాణాలున్నాయి. వానరుల చేతిలో వృక్షములు బండరాళ్లు ఉన్నాయి. రాక్షసులు తమ వద్ద ఉన్న బల్లెములు, పట్టిసములు, బల్లెములతో వానరులను చీలుస్తున్నారు.కాని వానరులు ఏ మాత్రం భయపడక ముందుకు చొచ్చుకువస్తున్నారు. వానరులు విసిరే బండరాళ్లకింద వృక్షముల కింద పడి ఎంతోమంది రాక్షసులు మరణిస్తున్నారు. వానరులు రాక్షసులను తమ పేర్లు చెప్పి మరీ
చంపుతున్నారు రాక్షసులను. బండరాళ్ల కింద, వృక్షముల కింద పడ్డ
రాక్షసులు రక్తం కక్కుకొని చస్తున్నారు. వేలకొలది రాక్షసులు మహా
వృక్షముల కిందపడి నుగ్గు నుగ్గు అవుతున్నారు. రాక్షసులే కాదు, వానరులు విసిరిన బండరాళ్ల వృక్షముల కిందపడి హయములు, ఏనుగులు కూడా ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వాటి మీద ఎక్కిన రాక్షస వీరులు కూడా వాటి కాళ్ల కింపడి నుగ్గు నుగ్గు అవుతున్నారు. ఆ ప్రదేశము అంతా ఏనుగులు, గుర్రములు, రాక్షసులు, వానరుల మృతకళేబరములతో నిండి పోయింది. వానరులు రాక్షసుల మీదికి ఎగిరి తమ వాడి అయిన గోళ్లతో వారిని రక్కి, చీలుస్తున్నారు. దానికి కోపించిన రాక్షసులు వానరులను తమ అరిచేతులతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రాక్షసులు తమను కొట్టకముందే వానరులు మహావేగంతో ఆ రాక్షసులను పిడికిళ్లతో పొడుస్తూ, పాదముల కింద పడేసి తొక్కుతూ, దంతములతో చీలుస్తున్నారు. వానరుల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము పారిపోతూ ఉంది. ఇది చూచాడు ధూమ్రాక్షుడు. కోపోద్రేకంతో వానరులను ఊచకోత కోస్తున్నాడు. వానరులు ధూమ్రాక్షుడి దెబ్బకు తట్టకోలేక గుట్టలుగా పడి మరణిస్తున్నారు. రాక్షసులు కొట్టిన దెబ్బలకు వానరుల శరీరాలు
రక్తసిక్తం అయ్యాయి. రాక్షసులు తాము ధరించిన త్రిశూలములతో
చీలుస్తుంటే వానరుల శరీరంలోని పేగులు బయటకు వస్తున్నాయి.
వానరులు రాక్షసుల మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది.
యుద్ధంలో ముందు నిలబడ్డ ధూమ్రాక్షుడు నవ్వుతూ తన ధనుస్సు
ఎక్కుబెట్టి వానరుల మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ధూమ్రాక్షుని
పరాక్రమానికి తట్టుకోలేక వానరులు పారిపోసాగారు. ఇదంతా చూచిన హనుమంతుడు కోపోద్రేకంతో ఒక పెద్ద బండరాయిని తీసుకొని ధూమ్రాక్షుని వంకకు దూకాడు. ఆ రాయిని ధూమ్రాక్షుని రథంమీద బలంగా విసిరాడు. తన మీదికి వస్తున్న పెద్ద
బండరాయిని చూచిన ధూమ్రాక్షుడు తన గద తీసుకొని రథము నుండి కిందికి దూకాడు. నేల మీద నిలబడ్డాడు. రథము మీద పడ్డ బండరాయి,ధూమ్రాక్షుని రథమును తుత్తునియలు చేసింది. తరువాత హనుమంతుడు చేతికందిన బండరాళ్లను, చెట్లను రాక్షసుల మీదికి విసురుతూ వారిని చంపుతున్నాడు. ఆ రాళ్ల దెబ్బకు రాక్షసుల తలలు బద్దలవుతున్నాయి. వృక్షముల కిందపడి రాక్షసులు మరణిస్తున్నారు. ఆది చూచి రాక్షస సైన్యము పారిపోతూఉంది.
హనుమంతుడు ఒక పెద్ద బండ రాయి తీసుకొని ధూమ్రాక్షుని
వంకకు పరుగెత్తాడు. ధూమ్రాక్షుడు కూడా తన గద ఎత్తి పెద్దగా గర్జిస్తూ హనుమంతుని వంకకు పరుగెత్తాడు. ముళ్లతో నిండిన తన గదను ధూమ్రాక్షుడు హనుమంతుని పైకి విసిరాడు. ఆ దెబ్బను తప్పించుకొన్న హనుమంతుడు తాను తెచ్చిన బండశిలతో ధూమ్రాక్షుని తలపై మోదాడు.ఆ దెబ్బకు తట్టుకోలేక ధూమ్రాక్షుడు నేల మీద వెల్లకిలా పడ్డాడు. రక్తం కక్కుకొని మరణించాడు. ధూమ్రాక్షుని మరణం చూచిన రాక్షస సేనలు లంక వైపుకు పారిపోయారు. వారిని వానరులు తరిమి తరిమి కొట్టి చంపారు. ఆ ప్రకారంగా హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు దారుణంగా
మరణించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఏబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

29 Oct, 06:02


దశరథ మహారాజు చేత యాగము చేయించటానికి అయోధ్యకు వచ్చిన ఋష్యశృంగ మహర్షి,|| రామాయణము బాలకాండ 11 వసర్గ తెలుగు లో
https://youtu.be/e666dGUAPwk

సనాతన ధర్మం

28 Oct, 09:18


ఈ youtube channel చూడండి, ఇందులో రామాయణము, శ్రీ గురుచరిత్ర, ఇంకా మరెన్నో స్తోత్రాలు ఉన్నాయ్,
నచ్చితే subscribe చేయండి

https://youtube.com/@sanatanadharmam01?si=bJzTS5JCLV2E2GOn

సనాతన ధర్మం

27 Oct, 04:54


ఈ ప్రశ్నకు సమాధానం:- అగస్త్యుడు - శ్రీరామునికి

సనాతన ధర్మం

27 Oct, 04:04


శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభైఒకటవ సర్గ. (51)

వానరులు చేసే సింహానాదాలు, విజయ దుందుభుల మోతలు
రాక్షసులు చెవిని బడ్డాయి. రావణుడి చెవులకు కూడా సోకాయి. వెంటనే రావణుడు మంత్రులను పిలిపించాడు. అత్యవసర సమావేశము నిర్వహించాడు. “విన్నారుగా ఆ వానరుల జయజయధ్వానాలు. వారికేదో గొప్ప సంతోషము కలిగే సంఘటన జరిగినట్టు ఉంది. సందేహము లేదు. ఆ వానరుల కేకలకు సముద్రము కూడా దద్దరిల్లుతూ ఉంది. మన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను సర్పబాణములతో శరబంధనము చేసినాడు కదా! దీనవదనములతో శోకించక ఈ వానరులు చేసే జయజయధ్వానాలు నాలో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.”అని పలికిన రావణుడు పక్కనే నిలబడి ఉన్న రాక్షస వీరులను చూచి ఇలా అన్నాడు.“రామలక్ష్మణుల మృతికి శోకించవలసిన సమయములో వానరులు ఈ ప్రకారంగా సంతోషంగా కేరింతలు కొట్టడానికి గల కారణం తెలుసుకొని రండు.” అని ఆదేశించాడు. వెంటనే ఆ రాక్షస వీరులు లంకా నగర ప్రాకారముల మీదికి ఎక్కారు. వానర సైన్యమును జాగ్రత్తగా
పరిశీలించారు. శరబంధనంతో నిర్జీవులుగా ఉండవలసిన రాముడు
లక్ష్మణుడు సలక్షణంగా ఉండటం చూచారు. రామలక్ష్మణులు ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రకాశిస్తున్నారు. రాక్షసుల గుండెల్లో గుబులు రేగింది. వారందరూ ప్రాకారములు దిగి వడి వడిగా రావణుని వద్దకు వెళ్లారు. దిగాలు పడిన మొహాలతో రావణుని ముందు నిలబడ్డారు. తాము చూచింది చూచినట్టు రావణునికి విన్నవించుకున్నారు. “రాక్షసేంద్రా! జయము జయము. ఇంద్రజిత్తుల వారి చేతిలో సర్పబాణబంధీకృతులై మరణించిన రామలక్ష్మణులు తమ బంధనాలు వీడి పునర్జీవితులై ఉదయభానుడి వలె ప్రకాశిస్తున్నారు. కట్లు తెంచుకున్న ఏనుగుల వలె ఉత్సాహంగా ఉన్నారు. ఆ మాటలు విన్న రావణుడికి కోపము భయము ఒకేసారి ముంచుకొచ్చాయి. రావణుడు వివర్ణవదనుడయ్యాడు. “ఏమిటీ! ఇది నిజమా! యుద్ధములో ఇంద్రజిత్తు రామ లక్ష్మణులను ఓడించాడు కదా! తన సర్పబాణములతో బంధించాడు కదా! వారు మృతప్రాయులయ్యారని నాకు చెప్పాడు కదా! మరలా ఇదేమి?
అస్త్రబంధములో చిక్కుకున్న రామలక్ష్మణులు బంధవిముక్తులు కావడాన్ని బట్టి చూస్తే మన రాక్షస బలగముల బలపరాక్రమములు సందేహాస్పదములుగా ఉన్నాయి. మేము పూర్వము చేసిన యుద్ధములలో ఏ అస్త్రశస్త్రములు మాకు విజయాన్ని సంపాదించి పెట్టాయో అవే అస్త్ర శస్త్రములు ఇప్పుడు రామలక్ష్మణుల ముందు వ్యర్థమైపోయాయి. పలికి ధూమ్రాక్షుడు అనే రాక్షసవీరుని పిలిచాడు.
"అని"ధూమ్రాక్షా! నీవు నీ సైన్యముతో యుద్ధరంగమునకు వెళ్లు.
రాముడిని లక్ష్మణుని వానర సేనలనుసర్వనాశనం చెయ్యి." అని
ఆదేశించాడు. వెంటనే ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాధ్యక్షుడిని చూచి "నేను రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి వెళ్లాలి. సేనలను సిద్ధం చేయండి" అని అన్నాడు. సైన్యాధ్యక్షుడు ధూమ్రాక్షుడికి సేనలను సమకూర్చాడు. తన అపార సేనావాహినితో వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు ధూమ్రాక్షుడు. నల్లని మేఘాల వలె ఉన్న రాక్షస వీరులు, పెద్దగా గర్జిస్తూ, శూలములు, ముద్గరములు, గదలు, పట్టిసములు, ఇనుప ఆయుధములు, పరిఘలు, బల్లెములు, గొడ్డళ్లు తీసుకొని ధూమ్రాక్షుని వెంటయుద్ధానికి బయలు దేరారు. మరి కొందరు రాక్షస వీరులు గాడిదలు లాగుతున్న రథముల మీద యుద్ధానికి బయలుదేరారు. మరికొందరు రాక్షస వీరులు వాయు
వేగముతో పరుగెత్తే గుర్రముల మీద, ఏనుగుల మీద బయలుదేరారు.
ధూమ్రాక్షుడు కూడా గాడిదలు కట్టిన రథము మీద బయలుదేరాడు.
వారందరూ పశ్చిమ ద్వారము వద్దకు చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు వానరసేనలతో మోహరించి ఉన్నాడు.
గాడిదలుకట్టిన రథము మీద వెళుతున్న ధూమ్రాక్షునికి అనేక
అపశకునములు గోచరించాయి. ఒక భయంకరమైన గ్రద్ద ధూమ్రాక్షుని
రథమునకు కట్టిన ధ్వజము మీద వాలింది. తలలేని మొండెము ఒకటి ధూమ్రాక్షుని రథము ముందు పడింది. వాయువు ప్రతికూల దిశలో వీచింది. ఈ దుశ్శకునములు చూచి ధూమ్రాక్షుని మనసు
కలతచెందింది. అయినా ధైర్యంతో ముందుకు సాగాడు. వానర సేనను అంతా ఒక్కసారి పరిశీలించి చూచాడు.

Post:- సనాతన ధర్మం,
తంగిరాల చంద్రశేఖర అవధాని,
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభైఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

సనాతన ధర్మం

26 Oct, 12:25


శ్రీదత్త పురాణము ||తృతీయ భాగం
ఏకాదశి మహిమ || పదిహేడు (17)


వికుండలా ! మా ప్రభువు యమధర్మరాజుల వారు చెప్పిన మరొక విశేషం నీ చెవిన వేస్తాను. గ్రహించు. ఏకాదశి అంటే పద్మనాభుడికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలిసో తెలియకో కావాలని కానీ తప్పనిసరియై కానీ, ఉపవాసం ఉన్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడూ రాడట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాల్లో మరొకటి లేదని ఘంటా పధంగా చెప్పారు. ఈ పద్మనాభైకాదశి నాడు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి శరీరంలో బందీగా వుండడం. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే. మిత్రమా! దీన్నే హరివాసరం అంటారు. వెయ్యి అశ్వమేధాలు, నూరు రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసంలో పదహారోవంతుకైనా సాటి రావంటే అతిశయోక్తికాదు. ఏకాదశేయింద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశ్యుపవాసంతో హరించుకుపోతాయి. అంచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరొకటి లేదంటే లేదు. కావాలని చెయ్యకపోయినా, ఏ వ్యాజంతో చేసినా ఇది పుణ్యప్రదమే. ఇది స్వర్గదాయిని, మోక్ష కారిణి. శరీరారోగ్యప్రదాయిని. సుకళత్రదాయిని. జీవత్పుత్ర ప్రదాయిని. ఈ
హరివాసరానికి గంగా, గయా, కాశీ పుష్కర కురుక్షేత్రాది పుణ్యతీర్దాలు ఏవీ సాటి రావు. ఆయాచోట్ల చేసే పుణ్య కార్యాలకన్నా అధికపుణ్య ప్రదం ఈ హరివాసరోపవాస వ్రతం. పగలంతా ఉపవశించి రాత్రి జాగరణం చేస్తే చాలు అనాయాసంగా వైకుంఠం దక్కుతుంది ఈ వ్రతంలో. అంతే కాదు ఇది చేసిన వ్యక్తి - తల్లి వైపున పది తరాలునూ
తండ్రి వైపున పది తరాలనూ తన వాళ్ళు పది మందినీ ఉద్దరించిన వాడవుతాడు. తరింపజేసిన వాడవుతాడు. అలా ఉద్దరించపబడ్డ వారంతా గరుడ కేతనులై వనమాలికా భూషితులై పీతాంబర ధారులై వైకుంఠం చేరుకుంటారు. బాల్య, యౌవన, కౌమారాల్లో వార్ధక్యదశల్లో ఎప్పుడైనా ఒక్క ఏకాదశ్యుపవాసం ఉంటే చాలు ఇటూ అటూ పాపాలన్నీ హుష్కాకి అయిపోతాయి. ఉపవాసం ఉండటంతో పాటు హరి వాసరాన పుణ్యతీర్ధ స్నానం చేసి హేమ -భూ-గో-వస్త్ర-తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా - ఇక చెప్పేది ఏముంది స్వర్గలోక సుఖాలు ఇహలోకంలోనే అనుభవిస్తాడు. అంటే ఆశ్చర్యంలేదు. ఆయువు ముగిశాక వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికీ తధ్యం. ఇవి చెయ్యని వారు - అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం తీర్ధస్నానమూ ఏదో ఒక దానమూ కాశింతధ్యానమూ
చెయ్యనివారు కచ్చితంగా ఇహపరాలకు చెడతారు. దుఃఖభాగులవుతారు.

ఓం శ్రీ దత్తాయగురవే నమః
హరిః ఓం తత్సత్

సనాతన ధర్మం

26 Oct, 04:27


ఈ ప్రశ్నకు సమాధానం :- సూర్యుని తల్లి తండ్రులు అదితి కశ్యపులు

2,055

subscribers

1,391

photos

86

videos