కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) @kpdstrust Channel on Telegram

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

@kpdstrust


విరాళాలు పంపాల్సిన వివరాలు.

A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ®

A/C. No : 50200059599164

IFSC Code : HDFC0001753

Branch : HDFC Bank

UPI ID : 7259859202@hdfcbank

Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (Telugu)

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) అనే టెలిగ్రామ్ ఛానల్ ఒక ధార్మిక సేవాలయంగా పరిచయం. ఈ ఛానల్ ద్వారా వివిధ సమాజ సేవా కార్యక్రమాలు, భక్తి సామగ్రిక చిత్రాలు, ధార్మిక సందేశాలు, మరియు ఉద్యోగ అవకాశాల గురించి వివరాలు అందిస్తుంది. ఇది ఉదాహరణాత్మకంగా సేవా కార్యక్రమాలను ప్రోత్సాహించే మరియు దానాల కోసం ఆహ్వానించే ప్లాట్ఫార్మ్. కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ ఛానల్ ద్వారా ధనాల చేపడాం, ఆత్మీయుల సమాచారం షేర్ చేయాం, మరియు సమాజంలో నైతికతను ప్రచారం చేయాం. అన్ని ఆదాయం నుండి కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ ఛానల్ ద్వారా సాధారణ మన సమాజానికి ఉపయోగమున్నది.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

18 Feb, 00:32


అలాంటి చిరునవ్వును నేనెన్నడూ చూడలేదు పార్ట్ 1

హిందూమతంలో అధికారపదవిలో వున్న ఒక మతాచార్యుణ్ణి కలుసుకోవాలన్న ఆరాటం నాకుంది. వారిని కలుసుకుని హిందువుల సనాతనదృష్టి యెలా వుంటుందో తెలుసుకోవాలి. కాని హిందూమతంలో లెక్కలేనన్ని శాఖలున్నాయి. క్రైస్తవ మతంలో వునటు దానికొక గురుపీఠమంటూ లేదు. కొంతవరకు క్రైస్తవుల గురుపీఠంలాంటివని చెప్పదగినవి అయిదు శంకరచార్య కేంద్రాలున్నాయని తెలిసింది. అవి ప్రముఖమైన ఒక హిందూ మత శాఖకు సంబంధించినవి. దాని అధిపతులు జగద్గురు శంకరాచార్యస్వామి నుండి పరంపరగా వస్తున్నవారు.

శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప మత సంస్కర్త వారు విగ్రహారాధానను ఖండించారు. సర్వదేవతల అభేదాన్ని చాటి చెప్పారు. సనాతనమైన హిందూ శాఖలకు ఒక ఐక్యరూపాన్నివ్వటం కోసం ప్రయత్నించార్. వారి తర్వాత వచ్చిన ఆచార్యులందరూ తమ వారసుల్ని తామే నియమించారు. ఈ తరంలో కంచికామకోటి పీఠాధిపతులకున్నంత ఆధ్యాత్మికమైన అధికారం మరే పీఠాధిపతికీ లేదు. వారు రెండు హిందూశాఖలను - అంతవరకూ ఒకదానితో విభేదించిన వాటిని - ఏకం చేయగలిగారు. ప్రస్తుతం దక్షిణభారతదేశంలో కనబడి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కేవలం వారి వల్లనే కలిగింది. వారెంతో పవిత్రులనీ జ్ఞానమార్గంలో చాలా దూరం పయనించారని విన్నాను. నేను దర్శించినప్పుడు వారి మద్రాసుకు సమీపంలోనే వున్నారు.

మా సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు ప్రొఫెసర్ రాఘవన్. వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతశాఖాధ్యక్షులు. వారు రచించిన 'భారతీయ వారసత్వం’ అనే గ్రంథాన్ని భారతదేశాధ్యక్షుల పీఠికతో ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యాసాంస్కృతిక శాఖవారు ప్రచురించారు. ఆ గ్రంథం సంస్కృత వాజ్మయానికి సంబంధించిన పరమ ప్రామాణికమైన ఆధారగ్రంథం. ఆ గ్రంథంలోని వాక్యాలను తరువాతి అధ్యాయాల్లో చాలా పర్యాయాలు ప్రమాణాలుగా ఉగ్గడించాను

రాఘవన్ ను విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. అప్పుడు వారు పాశ్చాత్యవేషంలో వున్నారు. తీరికలేని ఓ పెద్దమనిషి అతిథికి మర్యాద చేయటం కోసం ఎంత ఇబ్బంది పడతారో అంత ఇబ్బందీ నాకోసం పడ్డారు. రెండోసారి వారిని కలుసుకోవటం శంకరాచార్యులవారి దర్శనానికి వెళ్లేటప్పుడే. అప్పుడు వారు ధోవతిమాత్రం కట్టుకుని వున్నారు. చొక్కా వేసుకోలేదు. మద్రాసు వీధుల్లో ఎందరెందరో యాత్రికులూ, బిచ్చగాళ్లూ ధోవతి చుట్టుకునే కనబడతారు, కాని ఒక మధ్య వయస్కుడైన ప్రొఫెసర్ నడుందాకా దిగంబరంగా వుండి ఓ ఖరీదైన కార్లో మెత్తటి సౌకర్యాలమీద వాలి కూర్చున్న దృశ్యం నా కెందుకో అసాధారణమనిపించింది. “ఇలాటి వారే మా యిద్దరికి ఒక మిత్రులున్నారు. వారిమీదా మీ మీదా శంకరాచార్యులవారి ప్రభావం ఏమైనా పడిందా?” అని రాఘవన్ నడిగాను. “మాలో ఏదైనా గుణముంటే అది స్వామివారివల్ల సంక్రమించిందే. దోషాలన్నీ మావి” అన్నారు వారు.

మద్రాసు పరిసరాల్లో ఓ వీథిమూల చీకట్లో కారాపి, చెప్పులు వదిలి క్రిందికి దిగాము. దిగంగానే ఓ మధ్య వయస్కుడైన పెద్దమనిషి మమ్మల్ని పలకరించారు. వారు మద్రాసులో ఓ ప్రచురణకర్తట, రాఘవన్ పరిచయం చేశారు. ఆ ప్రచురణకర్త "ప్రతిసాయంకాలం ఆరు నుండి పదకొండు గంటలదాకా స్వామివారిని కనుపెట్టుకుని వుంటున్నా”నని చెప్పారు.

ఆ వీథిలో దేవాలయం ప్రక్కనవున్న ఓ పాడుబడ్డ చిన్న యింట్లో అడుగుపెట్టగానే యెదురుగా మసక చీకట్లో ఓ యిరుకు వరండా కనిపించింది. దాని కడ్డంగా పురాతనమైన ఓ పల్లకీ వుంది. పల్లకీకి తెల్లరంగువేశారు. ముందూ వెనకా బోయీలు మోసేగట్టి గుంజలకు మాత్రం నల్లరంగు. ఆ వరండాలోంచి ఓ చిన్నగదిలోకి ద్వారముంది. అది జైలుగది లాంటిది. అందులో అంతకు ముందే కొందరొక చాపమీద కూర్చున్నారు. వారితో పాటు మేమూ కూర్చున్నాము.

గుసగుసలాడినట్లేదో మాట్లాడి, కొన్ని నిమిషాలయాక ఓ యువకుడు పల్లకీ దగ్గరకు వెళ్లి వంగి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఏ ఆకారమూలేని మోపు మీద కప్పినట్లున్న యిటుక రంగు కంబళి పైకీ కిందకీ కదలి పల్లకీలోంచి స్వామివారు మెల్లగా లేచారు. లేస్తూనే కంబళి తలమీద, ఒంటినిండా కప్పుకున్నారు.

వారు పొడగరే. సన్నగా వున్నా చిక్కిపోయినట్లు లేరు. మత్తు వదలక తడబడుతూ పల్లకీ సందుగా లోపలికి వచ్చినా ముందు చాపమీద బాసికపట్టు వేసుకు కూర్చున్నారు. వెంటనే గదిలోవున్న వారందరూ బయటికి వెళ్లారు. వెళ్లినా ద్వారం పక్కనే నిలబడి అప్పుడప్పుడూ తొంగిచూస్తూ చెవులప్పగించి వింటున్నారు. మద్రాసులోని వివేకానంద కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసరొకరు మామధ్య 'దుబాసి'గా వ్యవహరించారు. ఓ అరనిమిషం సేపు స్వామివారేం మాట్లాడలేదు. ఆ అరనిమిషమూ సాయం ముఖాన్ని పరిశీలనగా గమనించాను. కఠోరమైన ఆధ్యాత్మిక సాధనమూలంగా వారి ముఖకవళికలు చాలామట్టుకు పోయి అవసరమయినవే మిగిలాయి. ఉన్నవాటిలో ప్రముఖంగా కనబడేది తెల్లని కురుచ వెంట్రుకల క్రింద ఎత్తైన అర్ధగోళంలా వున్న వారి నుదురు. రెండోది వారి కళ్లు. అవి లోతుగా మెత్తటి చీకటి నీడలు పరుస్తూ కపాలం క్రింద నుంచి గ్రుచ్చి చూస్తున్నట్లున్నాయి. వారి పెదవులు తీర్చినట్లుండి పెరిగిన గడ్డం మధ్య ఆచితూచి మాట్లాడే ప్రతి మాటకూ దృఢంగా భావబంధురంగా కదలుతున్నాయి.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

18 Feb, 00:32


వారు నిద్రావస్థలో నుండో సమాధిస్థితి నుండో మెల్లగా బయటకు వస్తున్నట్లనిపించింది. వారి చూపులు ఎదుటివారి మీద నిశ్చలంగా నిలిచివున్నాయి. వారు రోజుకు ఓ మూడుగంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోరని విన్నాను. తన విధులకూ, కర్మకాండకూ పోను అప్పుడప్పుడూ మిగిలిన కొద్దిపాటి వేళల్లో పల్లకీలో ఓ మూల చుట్టచుట్టుకుని పడుకుంటారు. వారు నిద్రలో వున్నారో సమాధిలో వున్నారో తరచు భక్తులే చెప్పలేరు. మెల్లగా వారు నేను భారతదేశం రావటానికున్న కారణమడిగారు.

“ఈ దేశాన్ని ప్రజల్ని ఊరికే చూచి పోదామనా లేక యిక్కడి ప్రజల నేదైనా మంచిదారిలో పెడదామనా?”

అంతకుముందు వచ్చిన పుస్తకాలమీద పత్రికలవారు చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకుని స్వామివారడిగిన ప్రశ్న అది. “చూడటానికీ, తెలుసుకోవటానికి మాత్రమే వచ్చాను. మరే ఉద్దేశమూ లేదు” అన్నాను.

స్వామి : స్థిరమైన ఆసక్తికి కూడా కొంత ప్రభావం వుంటుంది. ఏమీ ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. ఊరికే ఒక సమస్యపట్లగానీ, ఒక దేశంపట్లగానీ మన మేర్పరుచుకున్న దృక్పథానికి కూడా ఒక శక్తి, చైతన్యం వుండి తీరుతాయి.

“అలా వుండటం నాకు బాధగా వుంది. అయినా ఏ నీడా పడకుండా మనిషి కదల్లేడుకదా” అన్నాను.

అప్పుడు స్వామివారు "సత్యమైన సానుభూతి ఒక విధమైన తేజస్సును విరజిమ్ము తుంది” అంటూ చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు పసిబిడ్డ చిరునవ్వు. అలాటి నను నేనెన్నడూ చూడలేదు. ఆ చిరునవ్వులో అసామాన్యమైన మనోజ్ఞత వుంది. మాధుర్యముంది. వారితో మాట్లాడి తిరిగి వస్తూ దారిలో అనుకున్నాను. పాశ్చాత్య చిత్రకారులు చిత్రించిన సాధు పురుషుల ముఖాలమీద - వారు పారవశ్యంలో వున్నప్పుడుగాని, వారికి ధన్యత సిద్ధించినప్పుడుగానీ, మతంకోసం త్యాగం చేసినప్పుడుగానీ - ఆ చిరునవ్వును, ముగ్ధమోహనమైన ఆ ఎందుకు చిత్రించలేదా అని! యోగులందరూ తమ అనుభవాలు చెప్పినట్లు బహుశా ఆ చిరునవ్వుకూడా ఉలికీ, కుంచెకూ అందలేదేమో

(సశేషం)

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

17 Feb, 00:33


మీరేం చేసినా ప్రేమతో చెయ్యండి పార్ట్ 2

ఆ సంస్కృత సూక్తిని వివరిస్తూ స్వామివారు, "మానవుడు ఆకలిదప్పులు తీర్చుకోవలసిందే. ఉండటానికి ఒక ఆశ్రమం ఏర్పరుచుకోవలసిందే కాని, మనిషికి తనపట్ల, తన సమాజంపట్ల, తన జాతిపట్ల నెరవేర్చవలసిన విధులు కొన్ని వున్నాయి. సాధారణంగా ఈ విధులన్నీ భౌతికావసరాలకు సంబంధించినవి. వాటిని నెరవేర్చటంలో ఓ పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం నెరవేరిస్తే దానివల్ల మనిషికి ఆధ్యాత్మికమైన ఉన్నతి కలుగుతుంది. అదే ధర్మమంటే. ప్రతి పౌరుడికీ ఆధ్యాత్మికౌన్నత్యమూ అభ్యుదయమూ పెంపొందే అవకాశాలు కల్పించటమే ప్రభువుగానీ ప్రభుత్వంగానీ చేయవలసిన పని. అదే 'రాజా ధర్మస్య కారణమ్' అనే సూక్తి కర్థం.”

తనకు సంస్కృతం నేర్చుకోవాలని వుందనీ, పుస్తకాలవలన కాకుండా గురుముఖంగా నేర్చుకోవాలని కోరికనీ లేవెస్టిన్ అన్నారు. వారి కోరికను మెచ్చుకుంటూ స్వామివారు “భారతదేశంలో కూడా గురుముఖంగా అధ్యయనం చేసే సంప్రదాయం దాదాపు అంతరించింది. వైదుష్యం వేరు, చదవటానికీ వ్రాయటానికి అవసరమయ్యే శక్తి వేరు. పూర్వకాలంలో ఈ రెంటికీవున్న భేదం తెలిసేది. మహావిద్వాంసులైన చాలామందికి చక్కగా చదవటంగానీ వ్రాయటంగానీ రాదు” అన్నారు.

వింటున్నవారిలో ఒకరు చదవనూ, వ్రాయనూ చేతకాని రామకృష్ణ పరమహంస పేరు నుదహరించి వారికి బెంగాలీలో సరిగా సంతకం చేయటం కూడా రాదన్నారు. అప్పుడు స్వామివారు “మతాతీతులైన పండితులను గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. కణక్కారులని కొందరున్నారు. వారు గొప్ప వ్రాయసకాండ్రు. వారిదొక ప్రత్యేకమైన కళ. వారు మినహా మిగిలిన వారందరూ చదువురానివా రనుకోరాదు. సుప్రసిద్ధులైన ఆనాటి గణితశాస్త్రజ్ఞులకూ, ఖగోళశాస్త్రజ్ఞులకూ, భౌతికశాస్త్ర పండితులకూ, వేద విద్వాంసులకూ పఠన రచనాశక్తి లేదు. వారి చదువు మౌఖికమైన చదువు. అంటే గురువు నోటితో అన్నదాన్ని వల్లెవేయడంవల్ల వచ్చిన చదువు. ఆ పద్ధతికున్న అద్భుతమైన బలం ఆ పద్ధతికుంది. కాదనటానికి వీల్లేదు. కొద్ది పరిమితుల్లో దాన్ని పునరుద్ధరిస్తే లాభం వుంది” అన్నారు.

“అయితే పురాతనమైనది ఎంతవుందో అంతా పునరుద్ధరించాలని స్వామివారి ఆశయమా?” అని సర్ పాల్ డ్యూక్స్ ప్రశ్నించారు. “ఏది మంచిదో ఏది విలువైనదో దాన్ని మళ్లీ నిలబెట్టవలసిందే. ఈ పని చెయ్యటానికి ప్రచారం అవసరంలేదు. ఇది ప్రచారంతో జరిగేపని కాదు, కొందరు తాము ఈ పద్ధతి అవలంబిస్తే దానంతట అదే అల్లుకుపోతుంది. ముందు ముందు పాశ్చాత్యదేశాలు కూడా ఈ పద్ధతినే అనుసరించవచ్చు. పాశ్చాత్యులు మెచ్చుకున్నాక మావారూ కళ్లు తెరచి గతవైభవాన్ని దర్శించవచ్చు” అని స్వామివారన్నారు.

“చివరగా నాకో కోరికుంది. పాశ్చాత్య దేశాలకు మీరందించే సందేశం తీసుకు వెళ్లాలి” అని సర్ పాల్ అన్నారు. ఆ మాటవిని స్వామివారు అంతర్ముఖులై మౌనంగా వుండి పోయారు. వారి కళ్లు అర్ధనిమీలితాలయ్యాయి. వారు ధ్యానమగ్నులయ్యారు. కొంత సేపటికి మెల్లగా యిలా అన్నారు.

“మీ రేదిచేసినా ప్రేమతోనే చెయ్యండి. ఎంత చేసినా యితరుల కోసమే చెయ్యండి. ఒకపనిలో చేసేవారెంత ముఖ్యమో, దాని ఫలితం అనుభవించేవారూ అంత ముఖ్యమే. ప్రతి పని ప్రేమవల్లే జరగాలి. గాంధీగారు చెప్పిన అహింసాధర్మాన్ని గురించి కాదు నేను మాట్లాడుతున్నది! పరిస్థితులు విషమించినప్పుడు హింస అనివార్యం కావచ్చు. శిక్ష అవసరమూ కావచ్చు. యుద్ధాలుకూడా చేయవలసిరావచ్చు. చేసేపని ఏదైనా, ఎంతటిదైనా, దానిమూలం ప్రేమై వుండాలి. రాగద్వేషాలనూ, అసూయాక్రోధాలనూ పూర్తిగా విసర్జించాలి. చేసే పనిని ఏ ఉద్రేకమూ మలినపరచరాదు. ప్రతిచర్యకూ ప్రేమ అనేదే మూలసూత్రమైతే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు చాలావరకు మాయమైపోతాయి. ఈ సందేశాన్ని భారతీయ ఋషులూ, యోగులూ, ఇచ్చిన సందేశంగా మీవెంట తీసుకువెళ్లండి”.

భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతిలో సముదాత్తాలూ, సమున్నతాలూ అయిన లక్షణాల సజీవాకృతి అనదగిన ఒకమహాపురుషునితో జరిగిన చిరస్మరణీయమైన సమావేశం ఆవిధంగా పరిసమాప్తమయింది.

స్వామివారి ప్రసన్నసౌహార్ద సుగంధాన్ని అనుభవిస్తూ, భువన మోహనాలయిన వారి కళ్లల్లో వెలిగే జ్ఞానకాంతుల్ని దర్శిస్తూ అందరూ వారి మాటలు విన్నారు. వారి మాట లెంత సత్యాలో అంత మనోహరాలు.

- సర్ పాల్ డ్యూక్స్
- ఫిలిప్ లెటెస్టిన్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Feb, 14:35


ఆదిశంకర భగవత్పాదులు, దక్షిణభారత విజయ యాత్రలో, జంబుకేశ్వరమునకు విజయము చేసినప్పుడు, జనుల క్షేమమును ఉద్దేశించి, శ్రీ అమ్మవారి సన్నిధిలో తపస్సు చేసి అమ్మవారికి అభిముఖంగా శ్రీ మహాగణేశుని ప్రతిష్ఠించి, ఉగ్రరూపముగా యున్న అమ్మవారిని శాంతింప చేసి, శాంతరూపమైన శ్రీపరదేవత కళలను నవరత్నమయమైన రెండు శ్రీ చక్రాలలో ప్రతిష్ఠ చేసినారు. ఆ రెండు శ్రీచక్రాలకే “తాటంకం” (కర్ణాభరణమ్) అని పేరు. ఆ రెండు తాటంకాలను శ్రీ ఆచార్యుల వారు అమ్మవారి చెవులలో అలంకరించారు.

దానితో కూడా, తమ సౌందర్యలహరి స్తోత్రములో 28 వ శ్లోకములో అమృతాన్ని పొందుటకై దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మథించినప్పడు, వచ్చిన కటు విషాన్ని, లోకమును రక్షించుటకై త్రాగినా, శ్రీ పరమేశ్వరుడు జీవించియుండేది అమ్మవారి తాటంక మహిమ వలనే, అని శ్రీ భగవత్పాదులు కీర్తించియున్నారు. శ్రీఅఖిలాండేశ్వరి అమ్మవారి శక్తి పూర్తిగా ఆ రెండు తాటంకాలలో ప్రతిష్ఠించియున్నందున, ఈ తాటంకాలను తొడిగించి శ్రీ అమ్మవారికి ప్రతి రోజూ నిత్య పూజ, ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈ తాటంక ప్రతిష్ఠా కారణముగా శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శత అర్చన కూర్పులో "శ్రీ చక్రాత్మక తాటంక పోషితాంబా మనోరథాయ నమః” అనే నామావళి వ్యక్తమగుచున్నది. శ్రీ అమ్మవారికి అభిముఖంగా ఉన్న శ్రీ వినాయకుని సమీపములో శ్రీ ఆచార్యమూర్తి విగ్రహము తపో రూపములో నేడూ ఉన్నది.

ఇందులకు సాక్షిగా శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్య స్వాముల వారు ఇక్కడ శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసినప్పుడు శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి సన్నిధికి సమీపంలో శ్రీ శంకర మఠమును, తోటను నిర్మాణం గావించిన చరిత్రను జంబుకేశ్వర దేవస్థానము వారు సమర్పించిన పాత పత్రాలలో ఉన్నవి. దీని వలన శ్రీ కాంచీ కామకోటి పీఠం, జగద్గురు శ్రీ శంకరాచార్య స్వాములవారి శ్రీ మఠం సంస్థానం మరియు శ్రీ మఠం వారి జగద్గురు విద్యాస్థానముల పారంపర్యాన్ని తెలుసుకొనవచ్చును. ఇంతటి కీర్తి పొందిన శ్రీచక్రతాటంకాలను జీర్ణోద్ధారణము చేయవలసిన కాలాల్లో శ్రీ జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల అధిష్ఠానమైన శ్రీ కాంచీ కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠములో సింహాసనాభిషిక్తులైన శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులైన శ్రీ శంకరాచార్య స్వాముల వారే స్వయముగా జంబుకేశ్వరానికి విజయము చేసి తాటంకాలను జీర్ణోద్ధారణము గావించి సంప్రదాయవిధిగా మళ్ళీ అమ్మవారి కర్ణములకు తామే స్వయంగా ప్రతిష్ఠ చేయుట పారంపర్యంగా వస్తున్నది. శ్రీ ఆది శంకరాచార్య స్వామి మొదలుకొని వారిని అనుసరించి వచ్చిన శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులు పలుమార్లు ఆయా కాలాల్లో తాటంకాలను జీర్ణోద్ధారణము మరియు ప్రతిష్ఠయు చేసారు అనే విషయాన్ని చారిత్రాత్మక ఆధారాలు మనకు తెలుపుతున్నాయి.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Feb, 14:03


జయ జయ శంకర !! హర హర శంకర !!

32 సంవత్సరాల తరువాత జీర్ణోద్ధరణ అనంతరం తిరువానైక్కావల్ అఖిలాండేశ్వరి అమ్మవారి సువర్ణ శ్రీచక్ర తాటంకాలు

2500 సంవత్సరాలుగా ఆది శంకర భావత్పాదుల వారితో మొదలుకొని జంబుకేశ్వరంలో ఉన్న అఖిలాండేశ్వరి అమ్మవారికి కంచి కామాకోటి పీఠం పీఠాధిపతుల చేత జీర్ణోద్ధరణ పొందుతున్నాయి.

ఈ కార్యక్రమం గురించి మనకు లభ్యమవుతున్న వివరాలు

శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారు, 59వ ఆచార్య 1686
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, 62వ ఆచార్య 1757
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, 64వ ఆచార్య, శ్రీ సుదర్శన మహదేవేంద్ర సరస్వతీ స్వామివారు, 65వ ఆచార్య 1846
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు, 68వ ఆచార్య 1908
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు, 68వ ఆచార్య 1923
శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, 69వ ఆచార్య మరియు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, 70వ ఆచార్య 1992
శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, 70వ ఆచార్య 2025

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Feb, 01:08


మీరేం చేసినా ప్రేమతో చెయ్యండి పార్ట్ 1

1958, ఫిబ్రవరి 26 బుధవారంనాడు బ్రిటిష్ రచయిత సర్ పాల్ డ్యూక్స్, ఫ్రెంచి విద్వాంసుడు ఫిలిప్ లేవెస్టిన్ కలిసి కంచి కామకోటి పీఠాధిపతులు, శ్రీ చంద్రశేఖరయతీంద్ర శంకరాచార్యులవారిని దర్శించి సంభాషించారు. ఆ సంభాషణ గురించి మద్రాసు విశ్వవిద్యాలయంలోని తత్త్వశాస్త్రాచార్యులు శ్రీ టి.ఎం.పి. మహదేవన్ ఇచ్చిన వివరాలివి.

వారి సమావేశం ఆనాటి రాత్రి తొమ్మిది గంటల కేర్పాటయింది. మద్రాసులోని త్యాగరాయనగర్ లో వున్న స్వామివారి విడిదికి సర్ పాల్ డ్యూక్స్ రాత్రి ఎనిమిదిన్నారకే వచ్చేశారు. ఆరు బయట వరుసగా వున్న తాటిచెట్ల క్రింద ఏర్పాటైన సమావేశస్థలానికి సర్ పాల్ డ్యూక్స్ నెవరో తీసుకువచ్చారు. దగ్గరొక గడ్డివామి వుంది. స్వామివారు కూర్చోటానికి మధ్య ఒక పీట వేశారు. ఆ పరిసరాలు డ్యూక్సును బాగా కదిలించాయి. తానెదురు చూస్తున్న సమావేశానికి ఇంతకన్నా కాల్పనికమైన వాతావరణాన్ని ఊహించలేనన్నారు వారు.

అప్పుడే ఫ్రాన్స్ దేశస్థుడైన ఫిలిప్ లేవెస్టిన్ కూడా కొందరు భారతీయ మిత్రులతో కలసి అక్కడికి వచ్చారు. ఒక గొప్ప విద్వాంసుడూ, యోగీ అయిన మహనీయుణ్ణి కలుసుకోబోతున్నా మన్న సంభ్రమం వారిలో స్పష్టంగా కనిపించింది.

తొమ్మిది గంటలు దాటి కొంత సేపయింది. ఉన్నట్లుండి టార్చిలైట్ వెలుతురు కనబడితే అందరం అటువైపు చూచి లేచినిలబడ్డాము. స్వామివారు మెల్లగా నడిచి వస్తున్నారు. నడకలో తాను నడుస్తున్నాననే స్పృహే లేదు. ఆ వింతనడక వారిదే. వెంటనే వస్తున్న అయిదారుగురు శిష్యులూ ఆగిపోయారు. స్వామివారు పీటమీద కూర్చుని అంతవరకూ లేచి నిలబడ్డవారిని కూర్చోండని సంజ్ఞ చేశారు. వచ్చిన అతిథులిద్దరూ స్వామివారికి సమీపంలో కూర్చున్నారు. సంభాషణకు రంగం సిద్ధమైంది.

ముందుగా సర్ పాల్ డ్యూక్స్ పరిచయం జరిగింది. వారు "ది అనెండింగ్ క్వెస్ట్”, “యోగాఫర్ దివెస్టర్న్ వరల్డ్” అనే గ్రంథాలు రెండు వ్రాశారని పరిచయం చేసినవారన్నారు. "అంతంలేని అన్వేషణ” అని ఆ గ్రంథానికి పేరు పెట్టటంలో మీ ఉద్దేశ మేమి”టని స్వామివారు డ్యూక్స్ నడిగారు. "నా విషయమే చూడండి, నా అన్వేషణ యింకా పూర్తి కాలేదు. ఒకసామాన్య పాశ్చాత్యుడు చేసే అన్వేషణ ఏదో ఒక క్రైస్తవ శాఖను వరించటంతో ముగుస్తుంది. కాని అది నిజమైన అన్వేషణ కాదు” అని వారు సమాధానం చెప్పారు.

స్వామివారు “మనం చేసే అన్వేషణ బాహ్యమైనదైతే దానికి అంతం వుండదు. దిగంతాన్ని అందుకోటానికి తీసే పరుగులాంటి దది. అది వట్టి భ్రాంతి, అంతే! కాని మన అన్వేషణ ఆంతరమైనదైతే అది ఆత్మ సాక్షాత్కారంతో ముగుస్తుంది. ఒక విధంగా అంతర్ముఖత్వానికి కూడా ముగింపు అనేది లేదేమో. దాని పరమార్థం అనంతం కాబట్టి” అన్నారు.

తరువాత ఫ్రెంచిమేన్ పరిచయం జరిగింది. వారు రాచరిక వ్యవస్థను గురించి ప్రస్తుతం పరిశోధన సాగిస్తున్నారు. ఆ పరిశోధనలో భాగంగా మన దేవాలయాలూ, పురాణాలూ అధ్యయనం చేయటానికి ఈ దేశం వచ్చారు. లేవెస్టిన్ తనకున్న ముఖ్య సమస్య యేమిటో తానే చెప్పారు. “పూర్వకాలంలో రాచరికవ్యవస్థ ఆధిభౌతికానికీ, ఆధ్యాత్మికానికి ప్రతీకగా వుండేది. అందులో లౌకికానికీ అలౌకికానికీ భేదం లేదు. రెండూ కలిసే వుండేవి. ఇటీవల ఈ రెండూ విడిపోయాయి. అలా విడిపోయాకనే మనకష్టాలు మొదలయ్యాయేమో! దక్షిణ భారతదేశంలోని దేవాలయాల అధ్యయనం వల్ల లౌకిక భావనకూ, పరమార్థభావనకూ వున్న అవినాభావం మరింత రుజువెతుందేమో అని ఆశ” అన్నారు.

“రాజా ధర్మస్య కారణమ్” (రాజే ధర్మానికి బాధ్యుడు) అనే సూక్తి విన్నారా?” అని స్వామివారు లేవెస్టిన్ ని అడిగారు. స్వామివారు ఆ సూక్తికి చేసిన వ్యాఖ్యానం సముజ్జ్వలమైంది. వారు దాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు అతిథులిద్దరూ స్వామివారికి మరింత దగ్గరగా జరిగి, చెవులప్పగించి విన్నారు. స్వామి తమిళంలో మాట్లాడుతూ ఎన్నో ఆంగ్ల పదాలు ద్విభాషి సౌకర్యం కోసమూ, అతిథుల అవగాహన కోసమూ ప్రయోగించారు.

క్రింద కూర్చోటం అలవాటు లేక పాశ్చాత్యులిద్దరూ నానా అవస్థలు పడ్డారు. మాటిమాటికీ కాళ్లు మార్చుకోటం చూచి 'కాళ్లు కదిలించకండి', అన్నట్లు వారి మోకాళ్లు ద్విభాషి మెల్లగా తాకారు. అలా తాకటం స్వామివారు గమనించనే గమనించారు. “వారి నిష్టం వచ్చినట్లు కూర్చోనివ్వండి” అని ద్విభాషితో అన్నారు. “సామాన్య పాశ్చాత్యుడికి క్రింద కూర్చోటం - అందులో ఒకే పద్ధతిలో కూర్చోటం - చాలాకష్టం. వారెలా కూర్చున్నా రది కాదు ముఖ్యం. ఈ విషయంలో వారు పిల్లలు, వారికి ఆంక్ష లెందుకు?” అని కూడా అన్నారు.

(సశేషం)

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

15 Feb, 00:35


కళ్లు గట్టిగా, మరీ గట్టిగా మూసుకున్నాను. అయినా ఆ రూపం స్పష్టంగా ఎదుట కనబడుతూనే వుంది. మార్పు లేదు.

సౌహార్దంతో, కారుణ్యంతో నన్ను కనిపెట్టి వుండే అండ ఒకటి దొరికిందని తృప్తిపడ్డాను. కళ్లు తెరిచాను. కాషాయాంబరధారి కనబడ్డాడు.

ముఖంలో మార్పుంది. పెదవులమీద చిరునవ్వు. నన్ను చూచి "అణకువగా వుండు. అలా వున్నావా, నీవు కోరింది దొరుకుతుంది” అన్నట్లనిపించింది.

ఓ వ్యక్తి, సజీవంగా వున్న వ్యక్తి! నాతో అన్నారని యెందుకనుకోవాలి? కనీసం, ఓదయ్యమో, భూతమో నా కలా చెప్పిందని యెందుకనుకోకూడదు?

ఆ దర్శనం ఎలా కలిగిందో రెప్పపాటులో మాయమయింది. నాకు మాత్రం, ఓ అనిర్వచనీయమైన ఔన్నత్యం, ఆనందం, తృప్తి మిగిలాయి. ఆ సంఘటనకు సంబంధించిన అలౌకికత్వాన్ని పట్టించుకోలేదు. కల అని కొట్టేసినా ఒరిగేదేముంది? జరిగింది జరిగిపోయింది.

ఆ రాత్రి మరి నిద్రపోలేదు, పగలు జరిగింది తలపోస్తూ, మేలుకునే వున్నాను. ఆ సమావేశం, ఆ సంభాషణ దక్షిణ భారతంలోని సామాన్యజనం దేవుడి వారసుడుగా కొలిచే ఆ నిరాడంబరవ్యక్తి, కళ్లల్లో కదులుతూనే వున్నారు.

--- పాల్ బ్రంటన్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

15 Feb, 00:35


తొందరలేదు మీరు కోరింది దొరుకుతుంది పార్ట్ 3

స్వామివారు చలించలేదు. నిశ్చలంగా మౌనంగా వుండిపోయారు. చాలా సేపయాక “అలాగే పంపుతాను. భారతదేశంలోని యోగసిద్దుల్లో ఇద్దరినే నే నెరుగుదును. వారిలో యెవరైనా మీ కోరిక తీర్చగలరు. వారిలో ఒకరు వారణాసిలో వున్నారు. విశాలమైన మైదానంలోని విశాలమైన యింట్లో ఎక్కడో దాగినట్లుంటారు. వారిని కలుసుకోటం చాలా కష్టం. ఏ కొందరికో అనుమతి దొరుకుతుంది. ఏ పాశ్చాత్యుడూ ఇంతవరకు వారి సమక్షంలోకి వెళ్లలేకపోయాడనేది మాత్రం నిజం. మిమ్ము వారి దగ్గరకు పంపవచ్చు. కాని, వారు పాశ్చాత్యునికి దర్శన మివ్వరేమో అని నా భయం” అన్నారు.

“రెండోవారు?” రెట్టింపు కుతూహలంతో అడిగాను.

“దక్షిణాదిన దూరానెక్కడో వున్నారు. వారు ఉత్తమ గురువులని నే నెరుగుదును. వారి దగ్గరకు వెళ్లండి” అన్నారు. “వారిని 'మహర్షి' అంటారు. అరుణాచలంలో వారి నివాసం. అరుణాచల మంటే పొడుపుమల అని అర్థం. ఉత్తరార్కాటుజిల్లాలో వుంది. వారిని కలుసుకోటానికి కావలసిన వివరాలన్నీ యిచ్చేదా”? అని అడిగారు.

నా మనోనేత్రాల ముందు ఒకమూర్తి ఆకస్మికంగా కదిలింది.

కాషాయవస్త్రాలు కట్టిన సన్న్యాసి ఒకడు తన గురువు దగ్గరకు రమ్మని వృథాగా నాకు నచ్చచెప్పబోవటమూ, ఆ కొండ పేరు అరుణాచలమనటమూ గుర్తొచ్చాయి. “మీ కెంతో కృతజ్ఞుణ్ణి. నన్నక్కడకు తీసుకువెళ్లే వారున్నారు. వారిది ఆ ఆశ్రమమే” అన్నాను.

"అయితే మీ రక్కడికి వెళతారా?” అని స్వామి వారడిగారు.

నేను అజ్జాయించాను. “నేను దక్షిణ భారతంనుండి వెళిపోవటానికి ప్రయాణ సన్నాహాలన్నీ పూర్తిచేసుకు కూర్చున్నా”నని మాత్రం అన్నాను, ఏం చెప్పటానికీ పాలుపోక.

"అయితే, నాకొక మాటివ్వండి” అన్నారు వారు.

"తప్పకుండా” అనేశాను భరోసాగా.

“మహర్పుల వారిని సందర్శించకుండా దక్షిణాన్ని వదలి వెళ్లనని మాటివ్వండి అన్నారు.

ఎలాగైనా ఆధ్యాత్మిక మార్గంలో నాకు సాయపడాలనే కృతనిశ్చయం వారి కళ్లల్లో కనబడింది.

అలాగే వాగ్దానం చేశాను.

దయార్ద్రమైన హాసరేఖ వారి ముఖంలో తారాడింది.. “తొందరలేదు. మీరు కోరింది దొరుకుతుంది” అభయకంఠంతో అన్నారు.

వీథిలో ఏదో, సందడి వినబడింది.

“విలువైన మీ కాలం చాలా సేపు వాడుకున్నాను. మన్నించండి” అన్నాను.

గంభీరమైన వారి పెదవులు విచ్చుకున్నాయి. వెనుకగదిలోకి నాతోబాటు వచ్చి, నా సహచరుడికేదో రహస్యంగా చెప్పారు. అందులో నా పేరు వినబడింది.

తలుపు దగ్గర వారికి వీడ్కోలుగా నమస్కరించి వెనుదిరిగాను. స్వామివారు మళ్లీ పిలిచి -.

“నన్నెప్పుడూ గుర్తుంచుకోండి. మిమ్మూ నేను గుర్తుంచుకుంటాను” అన్నారు.

గూఢమైన యీ మాట లెంతో దిగ్ర్భాంతి కలిగించాయి నాకు. పసితనంనుండి జీవితాన్ని భగవంతునికే అంకితం చేసిన ఆ వింతవ్యక్తిని అయిష్టంగానే వదలి బయటికి వచ్చాను.

వారు పరమాచార్యులు. ప్రాపంచికమైన అధికారాలు లక్ష్యపెట్టనివారు. అన్నీ రోశారు. అన్నీ రోశారు. అన్నీ వదిలేశారు. మనం ఏ వస్తువు లిచ్చినా వాటిని అవసరమున్న వారికి తక్షణం ఇచ్చేస్తారు. వారి సౌమ్యసుందరమైన మూర్తిని నేను మరిచిపోను, మరచిపోలేను.

నేను విడిదికి వచ్చేసరికి దాదాపు అర్ధరాత్రయింది. తలెత్తి పైకి చూచాను. లెక్కలేనన్ని నక్షత్రాలు - వినువీథిలో క్రిక్కిరిసి కనిపించాయి. యూరప్ లో ఎక్కడా యిన్ని నక్షత్రాలు కనిపించవు. చరచరా మెట్లెక్కి వరండాలోకి వెళ్లాను. చేతిలో టార్చి వెలుగుతోంది. ఎవరో, ఆ చీకటో ఓమూర్తి నన్ను చూచి నమస్కరించింది. “సుబ్రహ్మణ్యా”! అని ఆశ్చర్యపడి పిలిచాను. కాషాయాంబరధారియైన ఆ యోగి చిరునవ్వు నవ్వారు.

“నేను మళ్లా వస్తానని చెప్పానుగా” అని మందలింపుగా గుర్తుచేశారు.

నిజమే.

పెద్దగదిలోకి వచ్చాక అడిగాను. “మీ గురువుగారిని 'మహర్షి' అంటారా”? అని.

ఆశ్చర్యపడి ఒక్కడుగు వెనక్కి వేశారు వారు.

“మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు?” అన్నారు.

“ఎవరోలెండి. రేపు మనిద్దరం వారి దగ్గరకు వెళుతున్నాం. నా ప్రయాణం మారింది” అన్నాను.

“ఎంత మంచిమాట చెప్పారు!” అన్నారు.

“ఎక్కువరోజు లుండనక్కడ, బహుశా కొన్నాళ్లు” అంటూనే ప్రశ్నలు గుప్పించాను, ఓ అరగంట దాకా. అలసిపోయి పడుకున్నాను.

సుబ్రహ్మణ్యం ఓ కొబ్బరాకు చాప మీద క్రిందే పడుకున్నారు. ఓ పలచటిగుడ్డ పరుచుకుని దాన్నే కప్పుకున్నారు. పక్కబట్ట లిస్తానంటే ఒప్పుకోలేదు.

తరువాత నాకు తెలిసిందల్లా ఎవరో తట్టితే, ఉలిక్కిపడి లేచి కూర్చోటం. చుట్టూ కటిక చీకటి. నరాలు హఠాత్తుగా బిగుసుకున్నట్లు, గాలిలో విద్యుత్తు నిండినట్లూ అనిపించి దిండు క్రిందున్న 'వాచ్' తీసి చూచాను. దానిది రేడియం డయల్. రెండూ నలభై అయిదయింది.

ఇంతలో కాళ్లవైపున ఓ మనిషి! మనిషిని చుట్టుకుని వెలుగు, మళ్ళీ ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాను. ఎదురుగా శంకరాచార్యస్వామివారు. నిశ్చయంగా స్పష్టంగా స్వామివారే! వారు లౌకికమైన అతీంద్రియమూర్తిగా లేరు. పాంచభౌతికమైన స్థూలదేహంతోనే వున్నారు. చుట్టూ దురవగాహమైన వెలుగు. ఆ రూపాన్ని నుండి వేరుచేస్తున్న వెలుగు.

ఆ దృశ్యం నిజంగా అసాధారణమైన దృశ్యం. అసంభావ్యమైన దృశ్యం అయినా కళ్ల యెదుట నిజంగా కనబడుతున్న దృశ్యం. అయితే, మరి, వారిని చెంగల్పట్టులో వదిలిరాలేదా?

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Feb, 00:32


స్వామివారు నావంక దయగా చూచారు. వారి ముఖంలోని ప్రశాంతినీ నైర్మల్యాన్ని చూచి అసూయ కలిగింది. జీవితంలో నాకు కలిగినన్ని దారుణమైన అనుభవాలు వారికి కలిగివుండవు.

“ఎవరూ నాకు నచ్చని పక్షంలో మిమ్ములను ఆశ్రయించవచ్చా?” ఆలోచించకుండా ఆ క్షణంలో అడిగేశాను.

స్వామివారు సౌమ్యంగా తల అడ్డంగా తిప్పారు.

“నేనొక పీఠానికి అధిపతిని, నా కాలం నాదికాదు. నా బాధ్యతలు నిర్వహించటానికే దాదాపు రోజంతా పడుతుంది. కొన్నేళ్లుగా రోజుకి మూడుగంటలే నా నిద్ర. వ్యక్తిగతంగా మీకోసం కొంతకాలం వెచ్చించగల గురువును చేరండి" అన్నారు.

“నిజమైన గురువులు అరుదనీ, వారు పాశ్చాత్యులను దగ్గరకు తీయరనీ విన్నాను” అన్నాను.
అంగీకరించినట్లు తల ఆడించి, వెంటనే, “సత్యం వుంది. దాన్ని కనుక్కోవచ్చు” నన్నారు.
“అయితే, సమున్నతమైన యోగమార్గాన్ని చూపగల గురువని మీరెరిగినవాణ దగ్గరకు నన్ను పంపండి” అని వేడుకున్నాను.

(సశేషం)

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Feb, 00:32


తొందరలేదు మీరు కోరింది దొరుకుతుంది పార్ట్ 2

మా పాశ్చాత్య నగరాల్లో కొందరు దుర్మార్గులున్నారు. వారి ప్రవర్తన చూస్తే వారిలో భగవంతుడున్నట్లనిపించదు. రాక్షసులున్నారనిపిస్తుంది” అన్నాను, అక్కడ యిప్పుడున్న దొంగల్ని దృష్టిలో పెట్టుకుని.

"వారు పెరిగిన వాతావారణాన్ని తిట్టండి. కాని వారిని తిట్టకండి. పరిస్థితులూ, పరిసరాలూ వారిని దిగజార్చాయి. పాశ్చాత్య దేశాల్లోనే కాదు, ప్రాచ్యదేశాల్లోనూ అలాటి వారున్నారు.

“సమాజాన్ని ఇంతకన్నా పైస్థాయికి తీసుకుపోవాలి. భౌతికవాదానికీ ఆదర్శ వాదానికి సామరస్యం కలిగించాలి. సమాజరుగ్మత నయం చెయ్యటానికి ఇది తప్ప మరొక మందు లేదు.”

“దేశాలు, ఎక్కడ చూచినా, కష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. వాటి వేదనే ఈ పరిస్థితుల్లో మార్పు తెస్తుంది. తెచ్చి తీరుతుంది. వైఫల్యమనేది విజయ పథానికి సూచికా చిహ్నమని సామెత” అన్నారు వారు.

“అయితే, ప్రాపంచిక విషయాలకు పారమార్థిక సూత్రాలన్వయించమంటారా?” అని అడిగాను.

"అవును, అలా అన్వయించటం కుదరదనకండి. కుదురుతుంది. అందరూ ఆమోదించే ఫలితాలు చివరికి దానివల్లనే కలుగుతాయి. ఎందుకంటే ఆ ఫలితాలు మాసిపోక చిరకాలం నిలుస్తాయి కాబట్టి.

“ఆధ్యాత్మికమైన తేజోదర్శనం కలిగిన వారెక్కువైన కొలదీ ఈ భావం ఇంకా తొందరగా లోకంలో వ్యాపిస్తుంది. భారతదేశంలో పరమార్థ జీవనులకు గౌరవం వుంది. మునుపింకా యెక్కువగా వుండేది. ప్రపంచంలోని అన్ని దేశాలు భారతదేశం లాగా వారి వారి ఆధ్యాత్మిక పురుషుల మాటలు అనుసరించి నడుచుకునే పక్షంలో ప్రపంచబాధలన్నీ తొలగిపోతాయి. శాంతి నెలకొంటుంది. జనం అభ్యుదయ పథంలో సాగిపోతారు" అన్నారు వారు.

మా సంభాషణ ఆలాగే సాగిపోతోంది. ప్రాచ్య సంస్కృతిని అభినందించటానికి పాశ్చాత్య సంస్కృతిని విమర్శించే గుణం స్వామివారిలో లేదని గమనించాను. ఆ గుణం ఇక్కడ చాలామందిలో వుంది.

“పాశ్చాత్య దేశాల్లో అభినందింపదగిన గుణాలెన్నో వున్నాయి. విమర్శింపదగిన దోషాలూ వున్నాయి ప్రాచ్యదేశాల్లోనూ అంతే, కొన్ని సుగుణాలూ కొన్ని దుర్గుణాలూ. గుణదోష విషయంలో రెండు ఖండాలూ సమానమే” అని వారి అభిప్రాయం.

ముందు ముందు మనకన్నా విజ్ఞత గలవారు ప్రాచ్యపాశ్చాత్య సంస్కృతులలోని మెలిగుణాలు గ్రహించి సమన్వయ పరిచి, యింతకన్నా సమున్నతమైన సామాజిక వ్యవస్థను రూపొందిస్తారని స్వామివారి ఆశ.

ఆ చర్చ అంతటితో ముగించి వ్యక్తిగతమైన ప్రశ్నలడగటానికి అనుమతి తీసుకున్నాను.

“మీరీ పదవిని అధిష్ఠించి ఎంతకాలమైంది?”

"1907లో, అప్పుడు నాకు పన్నెండేళ్లు. నన్ను నియోగించిన నాలుగేళ్లకు కావేరీ తీరంలోని ఓ కుగ్రామానికి వెళ్లాను. మూడేళ్లపాటు అక్కడే ధ్యానసాధన చేశాను. నా అధ్యయనం కొనసాగించాను. అప్పుడు గాని నేను పీఠానికి నిజమైన ఆధిపత్యం వహించలేదు” అని సమాధానం చెప్పారు. -

“యోగ సాధన చేసిన సిద్ధపురుషుల నొకరిని కలుసుకోవాలనుంది. అయితే వారు చేసిన సాధన ఏమాత్రమో నాకు చూపాలి. యోగిబ్రువులను చాలామందిని భారతదేశంలో చూచాను. కాని వారు చేసిన సాధనకు రుజువుగా యోగాన్ని గురించి మరో ఉపన్యాస మిచ్చారే గాని యెవరూ వారి యోగశక్తిని ప్రదర్శించి చూపలేదు. నా కోరిక గొంతెమ్మ కోరికా?” అని అడిగాను.

వారు నిశ్చలంగా నా కళ్లల్లోకి చూచారు.

ఓ నిమిషం మౌనం.

స్వామివారు గడ్డాన్ని తడుముకుంటూ “ఉన్నతమైన యోగమార్గంలో ప్రవేశించాలనే మీకుంటే, మీ కోరిక గొంతెమ్మ కోరిక కాదు. మీ శ్రద్ధే మీకు సాయపడితుంది. మీ పట్టుదలకున్న బలం ఎంతటిదో నాకు తెలుసు. చైతన్యరూపంతో మీలో ఓ వెలుగు మేలుకుంటున్నది. అదే మిమ్ములను గమ్యంవైపు నడిపిస్తుంది. నిజం” అని సెలవిచ్చారు వారు.

వారిని సరిగ్గా అర్థం చేసుకున్నానో, లేదో, నా కనుమానమే.

“ఇంతవరకూ నాకు నేనే మార్గదర్శిని., బయటేక్కడో దేవుడు లేడనీ, మనలోనే ఉన్నాడనీ మీ సనాతన ఋషులు కూడా ప్రవచించారు” అని ధైర్యంగానే అన్నాను.

వెంటనే సమాధానం వచ్చింది. “భగవంతుడంతటా వ్యాపించివున్నాడు. ఏ ఒక్కరిలో మాత్రమే లేడు. సమస్త విశ్వానికి ఆయన సంరక్షకుడు”.

లోతు తెలియని నీళ్లలో దిగుతున్నానేమో అనిపించి వెంటనే విషయం మార్చాను.

“అయితే, ఇప్పుడు నన్నేం చేయమంటారు?

“చేస్తున్న ప్రయాణాలు కొనసాగించండి. ప్రయాణాలన్నీ ముగిశాక మీరు కలుసుకున్న యోగులనూ, సాధుపుంగవులనూ మళ్లా ఒకసారి గుర్తుచేసుకోండి. ఆలోచించి అందులో మీకు నచ్చినవారి నొకరిని ఎంపికచేసుకోండి. వారి దగ్గరకు వెళ్లి అర్ధించండి. వారు తప్పక మిమ్ము యోగమార్గంలో ప్రవేశపెడతారు.”

వారి ముఖంలోని నిర్మమకారమైన అనుగ్రహాన్ని గమనిస్తూ వుండిపోయాను. “ఒకవేళ వారిలో ఎవరూ నాకు నచ్చలేదనుకోండి. అప్పుడేం చేయమంటారు?”

“అప్పుడు మీదారి మీదే, భగవంతుడే సాయపడి మీ కోదారి ఏర్పరుస్తాడు. రోజూ ధ్యానంలో కూర్చోండి ఉన్నతమైన విషయాలమీద మనస్సును కేంద్రీకరించండి. మీ మనస్సులో అనురాగం తప్ప మరేదీ వుండరాదు. తరచు ఆత్మవిచారణ చేస్తూ వుండండి. అలా కొంతకాలం చేస్తే ఆత్మస్వరూపం మీకు గోచరిస్తుంది. సాధన చెయ్యటానికి ఉత్తమమైన వేళ ప్రాతఃకాలం. ఆ తరువాత సాయంకాలం. ఆ సమయాల్లో లోకం ప్రశాంతంగా వుంటుంది. మీ ఏకాగ్రతను భంగపరిచే అంతరాయాలూ ఆ వేళల్లో తక్కువ.”

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Feb, 00:29


“ఓర్పు కలవారు లోతుగా ఆలోచిస్తారు. సమయం వచ్చినప్పుడు భగవంతుడు మానవోపకరణా లుపయోగించి పరిస్థితులు చక్కదిద్దుతాడు. జాతుల మధ్య యేర్పడిన సంక్షోభం చూచి, కొందరిలో కనబడుతున్న భయంకర నైతిక పతనం చూచి, ప్రజలనుభవిస్తున్న దారుణ బాధలు చూచి, యెవరో ఒకరు దైవోత్తేజితులై స్పందిస్తారు. తప్పదు. ఈ లోకాన్ని కాపాడటానికే వారు పుడతారు. ఈ దృష్టితో చూడండి, ప్రతి శతాబ్దంలోనూ ఒక సంరక్షకుడు కనబడతాడు. ఇది పదార్థ విజ్ఞానశాస్త్రంలోని సూత్రమంత అనివార్యం. ఆధ్యాత్మిక మౌఢ్యంవల్ల యేర్పడే క్షుద్రత్వం ఎక్కువైన కొలదీ దాన్ని రూపుమాపటానికి మరింత శక్తిమంతుడైన కారణజన్ముడవతరిస్తాడు” అన్నారు వారు.

“అయితే మనకాలంలోనే అలాటివారొకరు సముద్భవిస్తారా? అని అడిగాను. తప్పకుండా! మనకాలంలోనే కాకపోవచ్చు. ఈ శతాబ్దంలో ఉద్భవిస్తారు. అలా ఉద్భవించవలసిన అవసరం ఎంతో వుంది. చుట్టూ క్రమ్ముకున్న పారమార్థికమైన అంధకారం అంతదట్టంగా వుంది ప్రస్తుతం!" అన్నారువారు.

“మరి మనుష్యులు భ్రష్టులైపోతున్నారనా మీ అభిప్రాయం?" అని మళ్లీ అడిగాను.

"కాదు, నా కలా అనిపించదు. ప్రతివారిలో భగవదంశ వుంటుంది. అది ప్రతివారినీ చివరకు భగవంతుని చెంతకు చేరుస్తుంది” అని సమాధానం చెప్పారు.

(సశేషం)

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Feb, 00:29


తొందరలేదు మీరు కోరింది దొరుకుతుంది పార్ట్ 1

రహదారి కిరువైపులా బారులు బారులుగా నిలిచిన తాటిచెట్ల మధ్య ప్రయాణించి చెంగల్పట్టు చేరుకున్నాము.

వెల్ల వేసిన తెల్లటి యిళ్లు చిక్కుబడ్డట్లు గుట్టగా పడివున్నాయి. పై కప్పులు ఎర్రగా అబందరగా కనిపించాయి. కారు దిగి యిరుకు సందుల గుండా నడిచి ఊరి మధ్యకు వచ్చాము. అక్కడ చాలామంది జనం గుంపులు గుంపులుగా వున్నారు.

ఆ యింటి గుమ్మం గుండా లోపలికి గదిలోకి ప్రవేశించాము. దూరాన మసక వెలుతురులో నీడన ఓ కురచ వ్యక్తి నిలబడి వున్నారు. వారి దగ్గరకు వెళ్లి చిన్న కానుకొకటి సమర్పించి, వంగి నమస్కరించాను.

అలా వంగి నమస్కరించటంలో వున్న మర్యాద, గౌరవం అలా వుంచి ఆపని చాలా కళాత్మకంగా కనబడుతుంది నాకు. అలా నమస్కరించటం నా కెంతో యిష్టం.

శంకరాచార్యులవారు "పోప్” లాంటివారు కారని నాకు తెలుసు. హిందూమతంలో “పోప్” లుండరు. కాని వారు హిందూమతంలోని ఓ శాఖకు ఆధ్యాత్మిక గురువులు. వారివల్ల అసంఖ్యాకులు ఉత్తేజం పొందుతున్నారు. దక్షిణభారతమంతా వారి పారమార్థిక సంరక్షణలో వుంది.

సడి చేయకుండా వారి వంకే చూస్తున్నాను. కురచగా వున్న ఆవ్యక్తి యతిలా కాషాయాంబరాలు ధరించి వున్నారు. చేతిలోని సన్న్యాసదండం మీద కొంచెం ఒరిగి వున్నారు. నేను విన్నది, వారికి నలభైయేళ్లకు తక్కువే అని. జుట్టు అప్పుడే నెరిసినందు కాశ్చర్యపోయాను.

నా స్మృతి మందిరంలోని కుడ్యాలకు వ్రేలాడే అనేకానేక వర్ణచిత్రాల్లో పలిత శ్యామశబలమైన వారి సముదాత్త ముఖచిత్రానికి ఓ ప్రత్యేకమైన గౌరవస్థానం వుంది. ఫ్రెంచివారు "ఆధ్యాత్మికత" అని పేర్కొనే ఓ అనిర్వచనీయమైన లక్షణం వారి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. అందులో ప్రసన్నత వుంది. అమాయికత వుంది. వారి విశాలమైన నేత్రాలు నిశ్చలంగా, అందంగా, ఆకర్షకంగా వున్నాయి. వారి ముక్కు పొట్టిగా, నిటారుగా, కోటేరువేసినట్లుంది. గడ్డం చిందరవందరగా పెరిగినా పెదవులు మాత్రం గంభీరంగా వున్నాయి. అలాంటి ముఖకవళికలు వారి బుద్ధిబలం మినహా - మధ్యయుగాల క్రైస్తవమతాచారుల కుండేవేమో మరి!

లౌకిక దృష్టితో చూచే పాశ్చాత్యులకు వారి నేత్రాలు స్వాప్నిక నేత్రాలనిపించవచ్చు కాని వారి బరువైన కనురెప్పల క్రింద వట్టి స్వప్నాలు మాత్రమే వున్నాయని నా కనిపించలేదు. ఎందు కనిపించలేదో నిర్ధారణగా చెప్పలేను.

మా సంభాషణలో ఉపోద్ఘాతభాగాన్ని చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. అది నన్ను గురించి. హైందవమతాచార్యుల విషయమందులో లేదు.

భారత పర్యటనలో వ్యక్తిగతంగా నాకు కలిగిన అనుభవాలను గురించి అడిగారు. ఒక విదేశీయునికి ఇక్కడి ప్రజలనూ, సంస్థలనూ గమనించినప్పుడెలా అనిపిసుందో తెలుసుకోవాలని వారి కభిలాష. నా అభిప్రాయాలు మాత్రం నిర్మొహమాటంగా, మెప్పుతో విమర్శను జోడించి, చాలా ధారాళంగా చెప్పేశాను.

మా సంభాషణ సాగిసాగి విశాలమైన పరిధిలోకి వెళ్లిపోయింది. అప్పుడుగాని నాకు తెలియలేదు, స్వామివారు ప్రతిదినమూ ఇంగ్లీషు పత్రికలు చదువుతారనీ, ప్రపంచంలో ఏమూల ఏం జరుగుతోందో గమనిస్తారనీ. వెస్ట్ మిన్ట్సర్‌లో ఇటీవల జరిగిన గొడవలన్నీ వారికి తెలుసు. యూరప్ ఖండంలో బాలారిష్టాలు గడవటానికి ప్రజాస్వామ్యం ఎలా విలవిల్లాడి పోతోందో కూడా వారికి తెలుసు.

శంకరాచార్యస్వాములకు భవిష్యదర్శనం వుందని వేంకటరమణి చెప్పటం గుర్తొచ్చింది. ప్రపంచ భవితవ్యాన్ని గురించి స్వామి నడిగాను.

"అంతటా ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎప్పుడు మెరుగౌతాయని తోస్తుంది మీకు?” అని ప్రశ్నించాను.

“ఇప్పుడప్పుడే మెరుగుకావటం సాధ్యం కాదు. పరిస్థితులు మారటానికి కొంతకాలం పడుతుంది. దేశాలన్నీ మారణాయుధాల ఉత్పత్తిలో నిమగ్నమై వుంటే ప్రపంచ మెలా బాగుపడుతుంది?" అన్నారు వారు.

“నిరాయుధీకరణ గురించిన మాట లిటీవల వినబడుతున్నాయి. అది జరుగుతుందంటారా?” అని, అడిగాను.

“యుద్ధనౌకలు రద్దు చేయటంవల్లా, తుపాకులు మూల పడేయటం వల్లా యుద్ధాలాగవు. కర్రలతోనైనా మనుష్యులు కొట్టుకొంటూనే వుంటారు” అన్నారు వారు.

“అయితే మరేం చెయ్యాలి?” అని అడిగాను.

"జాతికీ జాతికీ మధ్య, ఉన్నవారికీ లేనివారికీ మధ్య, ఆధ్యాత్మికమైన అవసరం ఏర్పడితేతప్ప, సౌహార్దం, శాంతి, అభ్యుదయం సాధ్యం కావు" అని సమాధానం చెప్పారు.

“ఇది అయేపనిగా కనబడటం లేదు. కాబట్టి ఆశారేఖ శూన్యమున్నమాట” అన్నాను.

తన సన్న్యాసదండం మీద మరింత ఒరిగి “అయితే భగవంతుడొక డింకావున్నా” డన్నారు.

“ఉంటే ఆయన కివేం పట్టినట్లు లేదు” అన్నాను ధైర్యంగా,

“ఆయన కరుణామయుడు, మానవజాతిపట్ల కరుణ తప్ప ఆయనకు మరే భావం లేదు.”

"ప్రపంచంలో ప్రస్తుతం వున్న అధ్వాన్న పరిస్థితినీ, ప్రజల దీనదారుణ జీవితాన్ని బట్టి చూస్తే భగవంతుడికి మానవుల పట్ల క్రూరమైన నిర్లక్ష్య వైఖరే తప్ప ఉదారమైన కరుణావైఖరి వున్నట్లు నాకు తోచడం లేదు” అనేశాను. నా గొంతులో వున్న కరకుదనం, కసి, చేదు, నన్నే ఆశ్చర్యపరిచాయి. వారు నావంక వింతగా చూచారు. నా తొందరపాటుకు నేనే సిగ్గుపడ్డాను.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

12 Feb, 01:28


ప్రస్తావన పార్ట్ 2

దేశమంతటా పర్యటిస్తూ పండిత పామరుల నాకర్షిస్తూ, హిందువుల్లోని అనేక సిద్ధాంతాల వారినేగాక అన్యమతస్థులనూ తన అమేయప్రతిభాపాటవంతో ప్రభావితుల్ని చేస్తున్నారు వారు. పీఠాధిపతిగా తమ విధులను గాని, సన్న్యాసిగా తమ ఆశ్రమధర్మాలను గానీ పాటించటంలో వారికున్న నిష్ఠ పరమకఠినమైంది. కాని ఆధ్యాత్మిక విషయ ప్రబోధంలో సిద్ధాంతాల కతీతమైన వారి దృష్టి ఎంత ఉదారమైందో చెప్పలేము! అది యెంత ఉదారమైందో, అది ఈ దేశపుటెల్లలుకూడా ఎలా ఎంతగా దాటిపోయిందో ఈ గ్రంథం చదవండి మీకే తెలుస్తుంది.

క్రిందటి సంవత్సరం స్వామివారి డెబ్బైఒకటో జన్మదినోత్సవం సందర్భంగా అప్పుడప్పుడూ వారి సంచార కార్యక్రమాల్లో అందిన సంస్కృత తమిళ పద్యగద్యాత్మక పురస్కారపత్రా లన్నిటినీ గ్రంథరూపంగా భక్తులచ్చు వేయించారు. ఈ సంవత్సరం, వారి డెబ్భైరెండో జన్మదినోత్సవం సందర్భంగా, వారి వారసులూ భవిష్యకామకోటి కంచి పీఠాధిపతులూ అయిన జయేంద్ర సరస్వతీ స్వామివారి కొక ఆలోచన కలిగింది. శ్రీ చంద్రశేఖరులతో యూరప్, అమెరికా, జపాన్ దేశాల పండితులు జిజ్ఞాసువులూ, ప్రముఖవ్యక్తులూ అప్పుడప్పుడూ జరుపుతూ వచ్చిన సంభాషణలన్నీ సంపాదించి గ్రంథరూపంగా స్వామివారికి సమర్పించాలనీ, అనేక వ్యక్తులు స్వామివారితో చర్చలు జరిపినప్పుడు నేనక్కడ వుండే భాగ్యం కలగటం మూలాన ఆపని నేనే చేయాలనీ వారి కోరిక. అది వారి దయ, నా అదృష్టం.

1931 నుండి 1964 వరకూ జరిగిన సంభాషణలన్నీ యిందులో వున్నాయి. ఈ కాలంలో స్వామివారిని దర్శించినవారిలో ప్రముఖులైన రచయితలున్నారు. విద్వాంసులైన ఆచార్యులున్నారు. అధ్యాత్మపరులైన జిజ్ఞాసువులున్నారు. వారడిగిన ప్రశ్నలు పరిశోధనకు సంబంధించినవీ, సామాజిక మానవపరిణామ శాస్త్రానికి సంబంధించినవీ, వలసపోయిన సంస్కృతులకు సంబంధించినవీ, ఎన్నెన్నో! వారిచ్చిన సమాధానాలు వారి మనోవైపుల్యానికీ, కచ్చితమైన బహు విషయ పరిజ్ఞానానికి, నిదర్శనాలు. మత విషయాల్లో, మతానికీ మతానికీ మధ్యవుండే విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో వారి అభిప్రాయాలు పరిశీలించండి. ఒకవైపు వారి తివ్రబుద్ధి, నిర్మలమైన ఆధ్యాత్మికాన్వేషణమూ, చరిత్రతోపాటు వచ్చిన జీవనవేగం వల్ల పాశ్చాత్యులు ఏం పోగొట్టుకున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమూ కనబడతాయి. మరొకవైపు - వారికి వేదాంత సంప్రదాయంలో వున్న లోతైన అవగాహన, ఆధ్యాత్మిక మూల్యాలకు వారిచ్చే పారమ్యమూ, అన్నిటినీ మించి, వారు మహోన్నతులై వుండి కూడా తమ సాన్నిధ్యంలో మనకు కలిగించే నిర్భయమైన చనవూ కనబడతాయి. ఒకవేళ తన ప్రశ్నకు ఆశించిన సమాధానం రాకపోయినా ఎదుటివాడు ఏమీ అనలేడు. స్వామివారి ఎనలేని చిరునవ్వు, మధురమైన ఆకర్షణ అటువంటివి. వారి చూపుల్లో కనబడే నైశిత్యం, దయ, నెనరు, అంతటివి.

ఈ సంభాషణలు సేకరించి ముద్రింపించటం నాకొక అపూర్వమైన అనుభూతిని కలిగించింది. వచ్చినవారు ప్రశ్నలడిగినప్పుడు మళ్లీ నేను స్వామిసన్నిధిలోనే వున్నట్లు, వారి సమాధానాల్లో వుండే ప్రసన్నమైన విరామాలనూ, మౌనమైన ఆలోచనలనూ మళ్లీ గమనిస్తున్నట్లు అనిపించింది.

వారాసమయాల్లో జలపూర్ణమైన నిశ్చలంగా వుండే మేఘంలా కనబడేవారు. నిశ్శబ్దవక్త అయిన భగవంతునిలా తోచేవారు. మౌన వ్యాఖ్యానంలా వుండేవారు. కేవలం దక్షిణామూర్తిలా దర్శన మిచ్చేవారు.

ఈ గ్రంథంలోని కొన్ని సంభాషణలు సంభాషించినవారి దగ్గరనుండి సేకరించటం జరిగింది. వాటిని పదిలపరచినందుకూ, పంపినందుకూ వారిని స్వామివారు ఆశీర్వదిస్తారు.

1966, మద్రాసు
డా|| వి. రాఘవన్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

11 Feb, 01:04


ప్రస్తావన పార్ట్ 1

"వేయి సంవత్సరాలకు పైగా భారతదేశంలో వర్ధిల్లుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయం మీద మీకున్న భక్తిని ప్రదర్శించటానికి వచ్చారు” అని యిటీవల తన్ను దర్శించటానికి వచ్చిన అమెరికా ప్రతినిధితో శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్యస్వామి వారన్నారు.

చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమతమహాసభ నుద్దేశించి ప్రసంగించడానికి లేచిన తాను ప్రపంచంలోని అత్యంతసనాతమైన యతి సంప్రదాయం పక్షాన ప్రసంగిస్తున్నానని స్వామి వివేకానందులు చెప్పారు.

రెండు వేల సంవత్సరాలకు పైగా భారతదేశంలో ఆర్షసంప్రదాయం కొనసాగుతున్నది. ప్రభువులతోనూ, తాత్త్వికులతోనూ, పాశ్చాత్య వండితులతోనూ అతిప్రాచీన కాలంనుండి ఋషులు చర్చలు జరుపుతున్నారు.

అలెగ్జాండరనే గ్రీకు సార్వభౌముణ్ణి కలుసుకుని ఒక భారతీయ తత్త్వవేత్త సంపదల మీద వ్యామోహం అనుభవించిన కొద్దీ పెరుగుతుందే కాని తరగదని బోధించారు. తాను మానవవ్యవహారాల వాస్తవతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని సోక్రటీస్ మహాశయుడు కొందరు భారతీయ తత్త్వవేత్తలతో అన్నప్పుడు, వారు ఆధ్యాత్మికమూ, పారమార్థికమూ అయిన సత్యాన్ని గ్రహించనిదే లౌకిక విషయాలమీద అవగాహన ఎలా కలుగుతుందని యెదురుప్రశ్న వేశారు. ఆర్ఫియన్ చెప్పిన దురవగాహవేదాంత విషయాల మీద, పైథాగరస్ ప్రతిపాదించిన తాత్త్వికగణిత శాస్త్రీయ భావాలమీద, 'రిపబ్లిక్' అనే గ్రంథంలో ప్లేటో ప్రవచించిన ఆదర్శ రాజ్యాంగ భావనమీద, క్రీస్తుకు పూర్వం ఆరవ శతాబ్దంలో ‘ఈలియా’ అనే గ్రీకు నగర తత్త్వవేత్తలు స్థాపించిన నూతన ‘ప్లెటోనిక్' సిద్ధాంతాలమీద, భారతీయ-గ్రీక్ తాత్త్వికచర్చల ముద్ర స్పష్టంగా కనబడుతుంది. దురపబోధమైన వేదాంత విచారం ఈనాడు సార్వజనీనమైన ప్రపంచవారసత్వమైంది.

ఈ వారసత్వంలోని మౌలికమైన పారమార్థిక సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో మేధావులూ, విద్వాంసులూ, తాత్త్వికులూ, మతవేత్తలూ ఇతోధికంగా గ్రహిస్తున్నారు. నన్ను చూడటానికి వచ్చిన ఒక అమెరికన్ మతాచార్యుడు వీరిని క్రిస్టియన్ వేదాంతులని అభివర్ణించారు. వేదాంతలోకపరిధి మరింత విశాలమవుతున్న దనటానికి ఈ గ్రంథమే ప్రబల సాక్ష్యం .

ప్రాచీనకాలంలో కంచి దక్షిణభారతంలోని ముఖ్యనగరాలన్నిటికీ ముఖ్యనగరంగా వుండేది. అప్పుడు కంచిలో ఎక్కడ చూచినా, ఎక్కడ విన్నా సాహిత్య మత తాత్త్విక గోష్ఠులే. జైనం, బౌద్ధం వంటి అవైదికమతాలకది ఆనాడు పట్టుకొమ్మ. ఆదిశంకరులవారు తన మేధాబలంతో అవైదికమతాలను పూర్వపక్షం చేసి అద్వైత సిద్ధాంతాన్ని మొదటగా యిక్కడే స్థాపించారు. అద్భుతమైన వారి మేధాబలం సాధించిన విజయానికి ప్రతీకగా ఇక్కడే వారు మొదటి అద్వైత పీఠాన్ని నెలకొల్పారు.

ఈనాడు దేశమంతటా - ముఖ్యంగా దక్షిణభారత మంతటా - ప్రబలుతున్న సిద్ధాంత సంఘర్షణలూ, నాస్తికవాదధోరణులూ, వీటి మూలంగా ఉత్పన్నమైన అయోమయ పరిస్థితులూ గమనిస్తే, ఆదిశంకరుల కాలానికీ నేటి కాలానికీ, చాలా పోలికలున్నట్లనిపిస్తుంది. చరిత్ర పునరావృత మవుతుందని సామెత. ఈనాడు మళ్లీ కంచిలో శంకరాచార్య స్వాములుగా, కామకోటి పీఠాధిపతులుగా అద్వైత బ్రహ్మనిష్ఠులుగా శ్రీ చంద్రశేఖర యతీంద్ర సరస్వతులవారు ప్రజల హృదయాలలో ఆధ్యాత్మిక భావననూ మతధర్మానురక్తినీ రేకెత్తిస్తున్నారు. ఐదు దశాబ్దులుగా వారీ అవిరళ కృషిలో నిమగ్నులై వున్నారు.

(సశేషం)

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

10 Feb, 00:28


ప్రవేశిక పార్ట్ 2

హంగేరీ దేశంలో పుట్టి బ్రిటన్ కు వలసపోయిన 'ఆర్థర్ కోస్లర్' అనే రచయిత స్వామివారి ముఖం మీద లీలగా కదలాడిన చిరునవ్వును చూచి ముగ్ధుడై "ఓ హాసరేఖ చటుక్కున వారి ముఖాన్ని పసిబిడ్డ ముఖంగా మార్చింది. ఆ హాసరేఖలో నిండిన భావంతో పోల్చదగిన భావాన్ని నేనెన్నడూ చూడలేదు. ఆ చిరునవ్వులో అసాధారణమైన మనోజ్ఞత వుంది. మాధుర్యముంది. విడిదికి తిరిగివస్తూ - పాశ్చాత్యుల వర్ణచిత్రాల్లో కనబడే సాధుపురుషుల ముఖాలమీద వారు పారవశ్యంలో వున్నప్పుడుగానీ, వారికి ధన్యత సిద్ధించినప్పుడుగానీ, వారు తమ మతం కోసం ప్రాణాలు బలిచేసినప్పుడుగానీ అలాంటి ముగ్ధమోహనమైన చిరునవ్వును ఎందుకు చిత్రించలేదా అని ఆశ్చర్యపడ్డాను. యోగులందరూ తమ అనుభవాలు, మాటలకందవని చెప్పినట్లు వారి భావాలు కూడా ఉలికీ, కుంచెకూ అందవేమో!” అని వ్రాశారు.

స్వామివారు సాధారణంగా అతిథులను సహజ ప్రశాంతమైన నిర్మల వాతావరణంలోనే కలుసుకునేవారు. విదేశీయులకు ఆ వాతావరణం అపూర్వ మనిపించేది, ఒక వైదేశికుడు దాన్నిలా అభివర్ణించాడుకూడా.

“చుట్టూ ప్రశాంతమైన ప్రకృతి. సమ్మోహకరమైన దాక్షిణాత్య నిశీథి పలచబడిన చలివేళ. వేసవి అడుగిడుతున్న తొలివేళ. చుట్టూ కొబ్బరిచెట్లు, నిశ్శబ్దంగా అటూయిటూ పరిగెడుతున్న కీచురాళ్లు. తెరలు తెరలుగా వీస్తున్న చల్లనిగాలి. కురుస్తున్న పండువెన్నెల. అప్పుడప్పుడూ గుడ్లగూబలు కీచుమన్న సవ్వడి దూరాన ఎక్కడో ఓకుక్కో నక్కో అరుపు. మరుపురాని రాత్రి”.

అతిథులడిగిన ప్రశ్నలకు ఆ అతిథులనే అబ్బురపరచేంత ఆధునికమైన, వాదసహమైన సమాధానాలిచ్చారు.

“మంచికో చెడ్డకో నామార్గం స్వతంత్రమైన ఆలోచనామార్గం. నమ్మకాన్ని నేను నమ్మను. నాస్వభావంలో కేవలం విశ్వాసానికి చోటు లేదు అని ఆర్థర్ ఐసెన్ బెర్గ్ అన్నప్పుడు వెంటనే స్వామివారు -

“ఆలోచనామార్గం ఉత్తమమైన మార్గం కావటమే కాదు. ఏకైక మార్గం కూడా. భక్తిగానీ, విశ్వాసంగానీ ఆలోచనకు - అంటే జ్ఞానానికి ప్రాతిపదికలూ, సాధనలూ. అంతర్దశలు మాత్రమే జ్ఞానంగా పర్యవసిస్తే తప్ప వాటికి విలువలేదు” అని అందరితో బాటు ఐసెన్ బెర్గ్ ను కూడా ఆశ్చర్యంలో ముంచారు.

ఇనుపతెర వెనకనుంచి వచ్చిన రష్యాదేశ విద్వాంసులు డాక్టర్ తులయేవ్ గారికి మతం మానవులకవసరం అనిగానీ, మతంవల్ల మానవులు బాగుపడతారనిగానీ, బొత్తిగా నమ్మకం లేదు. స్వామివారిని దర్శించినప్పుడు ఆ ప్రశ్నే అడిగారు వారు. “ఒక మనిషికి మతం మీద నమ్మకం లేదనుకోండి. చర్చికిగానీ, దేవాలయానికిగానీ వెళ్లడనుకోండి, ఏ ఆచారకాండనూ పాటించడనుకోండి! ఏ విధమైన మత సిద్ధాంతాలను లక్ష్యపెట్టడనుకోండి! అయినా జీవితమంతా మంచినిగురించే ఆలోచిస్తూ, మంచిపనులే చేసూపోతే అతడికి ముక్తికలుగుతుందా?” అని.

అప్పుడు స్వామివారు కొన్ని నిముషాలు కళ్లు మూసుకొని వ్యానస్థితిలో వుండిపోయారు. వారు ధ్యానంలో వున్నంతసేపూ పరిసరాలు అతిలోకమైన ప్రశాంతితో మునిగిపోయాయి. స్వామివారు మెల్లగా దృఢంగా "కలుగుతుంది”! అన్నారు.

ఈ మాటను చరిత్రలో ఎంతమంది మతాచార్యులు అన్నారో వెదకి చూడండి! ప్రపంచంలోని ఎంతమంది మతాచార్యులు అనగలరో కూడా ఆలోచించి చూడండి! అన్ని మతాలకూ మౌలికమైన ఈ మాట, అన్ని మతాలకూ అతీతమైన ఈ మాట, అన్ని మతాలనూ కౌగలించుకోగల ఈ మాట, ఎంత మానవీయమో అనుభవంలోకి తెచ్చుకు చూడండి!

మౌలికంగా మానవత్వాన్ని మించిన మతం లేదని వారికి తెలుసు. అందుకే వారి అస్తిత్వం పరమ కరుణాపూర్ణం అయిపోయింది. ఒక ఆంగ్లేయుడు వారితో “మా పాశ్చాత్య నగరాల్లో కొందరు దుర్మార్గులున్నారు, వారి ప్రవర్తన చూస్తే వారిలో భగవంతుడున్నట్లనిపించదు. రాక్షసులున్నారనిపిస్తుంది.” అన్నప్పుడు, స్వామివారు -

“వారు పెరిగిన వాతావరణాన్ని తిట్టండికాని, వారిని తిట్టకండి. పరిస్థితులూ, పరిసరాలూ వారిని దిగజార్చాయి. పాశ్చాత్య దేశాల్లోనే కాదు. ప్రాచ్యదేశాల్లోనూ అలాంటివారున్నారు” అన్నారు. మానవులందరూ తన వారే అనుకోగలవారే. మానవులందరినీ తన హృదయానికి హత్తుకోగల వారే, మానవులందరితోనూ తాదాత్మ్యం అనుభవించగలవారే, అంతటి దయామయులే, కారుణ్యమూర్తులే, మానవోత్తములే ఆ మాటలనగలరు.

ఇది వారి శతవార్షిక జయంత్యుత్సవ శుభవేళ. ఈ శుభవేళలో ఈ గ్రంథం ప్రచురించే భాగ్యం కలిగినందుకెంతో ఆనందంగా వుంది. ఆంగ్లమాతృకను తెలుగుచేసిన “ఆంగీరస” గారినీ, వారితో సహకరించిన మిత్రులు పేరయ్యశాస్త్రిని ఈ సందర్భంలో అభినందిస్తున్నాము.

ముఖపత్ర శిల్పి బాలిగారికీ, ముద్రణ చేపట్టిన వారికి ధన్యవాదాలు.

కావలి
తేదీ 5-10-1997

సంచాలకులు
మానస ప్రచురణలు

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

09 Feb, 00:23


ప్రవేశిక పార్ట్ 1

"కథ కంచికి మనం ఇంటికి"

అని కథ ముగించడం వెనుకటితరాలవారి ఆచారం. ఆకాలంలో కథ చెప్పడం ఒక కళ. కథ చెప్పించుకోవటం ఒక వేడుక. పురాతనమైన బృహత్కథ మొదలు ఇటీవలి కాశీమజిలీ కథలవరకూ ఇదే ఆనవాయితీ.

కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర శ్రీ చరణులను దర్శించి, వారి ఉపదేశం విని తరించాలని ఎందరెందరో వైదేశికులు కంచిని వెతుక్కుంటూ భారతదేశానికి వచ్చారు. వారిలో ధ్యానపరులున్నారు, భక్తులున్నారు, వేదాంతులున్నారు. వారెన్నో ప్రశ్నలు స్వామివారినడిగారు.

అడిగిన ప్రశ్నలన్నింటికీ స్వామివారు సమాధానం చెప్పారు. ధ్యానపరులకు ధ్యానిగా సమాధానం చెప్పారు. భక్తులకు పరమ భాగవతులుగా సమాధానం చెప్పారు. వేదాంతులకు శంకరాద్వైతులుగా సమాధానం చెప్పారు.

అడిగినవారి అనుమానాలు తీరాయి. సందేహాలు నివృత్తి చెందాయి. కంచి పరమాచార్య శ్రీపాదులను కలుసుకున్నాక, అనేకానేక జిజ్ఞాసల కథ ముగిసింది. అందుకే “కథ కంచికి”.

ఇందులోని సంభాషణలన్నీ కంచిలో జరిగినవి కావు. నంబల్ లో, చెంగల్పట్టులో, మధురలో, మచిలీపట్టణంలో, శ్రీకాళహస్తిలో, మద్రాసులో, సుంకుపారి సత్రంలో - వారెక్కడ విడిదిచేసివుంటే, అక్కడికి వెళ్లి దూరాగతులైన వైదేశికులు వారితో సంభాషించారు. ఈ సంభాషణలు 1931-1969 మధ్యకాలంలో జరిగాయి. ముప్పెయెనిమిదేళ్లలో స్వామివారి చిత్తస్పందనల్లో, ఆలోచనల్లో, అనుభవాల్లో మనం గుర్తించగలిగినవీ, గుర్తించ లేనివీ ఎన్నో మార్పులు వచ్చాయి. కాని వారి పారమార్థికతలోగానీ, అద్వైత భావనలోగానీ, జన శ్రేయదృష్టిలో గానీ ఏమార్పూ రాలేదు.

వారిని దర్శించినవారిలో విశ్వవిద్యాలయాచార్యులున్నారు, కేవల జిజ్ఞాసువులైన పర్యాటకులున్నారు. సత్యాన్వేషులైన దౌత్యవేత్తలున్నారు.

వారు స్వామివారితో జరిపిన సంభాషణల్లో ఉపాసనావిధానం మెట్టసేద్యందాకా, కుమారిలభట్టు మొదలు భంగు సేవించే బైరాగి దాకా, శివాద్వైతం మొదలు కల్తీవ్యాపారందాకా ఎన్నో, ఎన్నెన్నో విషయాలు, అత్యుదాత్తమైనవీ, అతి సామాన్యమైనవీ, అతీంద్రియమైనావీ, అత్యల్పమైనవి ప్రస్తావించబడ్డాయి. స్వామివారి అమేయ వైదుష్యమూ, బహుముఖీనమైన పరిశీలనమూ, సులభ సుందరమైన విషయ వివరణమూ ఈ చర్చల్లో అభివ్యక్తమయ్యాయి.

స్వామివారు ఒక హైందవమత శాఖకు అధిష్టానదేవతాపదవిలో ఉన్నారు. నియమనిష్ఠలు పాటిస్తూ - వ్రతోపవాసాలు చేస్తూ సామాన్యుల ఆహారం తీసుకుంటూ నిరాడంబరంగా జీవిస్తున్నారు. వారికి రోజూ మూడు గంటలే నిద్ర. అదీ వ్యవధి దొరికినప్పుడు కొసరికొసరి కళ్లు మూసుకు తెచ్చుకున్న నిద్ర.

సహజమైన అలౌకిక ప్రశాంతి వారిచుట్టూ ఎప్పుడూ ఆవరించుకుని వుంటుంది. దానికున్న వ్యాపనగుణానికి మితిలేదు. ఎదుట కూర్చున్న వారందరూ అందులో ఓలలాడుతారు. అందుకే వారిని దర్శించటమూ, వారితో కొంచెంసేపైనా సంభాషించటమూ ఒక మహనీయానుభవంగా పెక్కుమంది అభివర్ణించారు.

గ్రీసుదేశపు మహారాణి ఫ్రెడరికా స్వామివారి సన్నిధిలో తమకు కలిగిన ఉద్వేగ వివశతను తామే ఈ క్రింది మాటల్లో వ్యక్తం చేశారు.

"సంతతధారాపాతంగా కన్నీరు కారింది. అది సామాన్యమైన కన్నీరు కాదు. తీరిన కోరికల కన్నీరు. తృప్తి! ఆనందం కార్చిన కన్నీరు! మనస్సు కడిగి శుభ్రపరచిన కన్నీరు! మనస్సును కరిగించిన కన్నీరు! వారు ప్రతీకగా నిలిచి పరమసత్యంతో మనస్సును ఏకంచేసిన కన్నీరు!”

కళ్లార్పకుండా వారి ముఖంలోకి చూచిచూచి 'పాల్ బ్రంటన్' అనే ఆంగ్లేయుడు “నా స్మృతిమందిరంలోని కుడ్యాలకు వ్రేలాడే అనేకానేక వర్ణచిత్రాలలో పలిత శ్యామశబలమైన వారి సముదాత్త ముఖచిత్రానికి ఒక ప్రత్యేకమైన గౌరవస్థానముంది. ఫ్రెంచివారు 'ఆధ్యాత్మికత' అని పేర్కొనే అనిర్వచనీయమైన లక్షణం వారిముఖంలో స్పష్టంగా కనపడుతుంది. అందులో ప్రసన్నత ఉంది. అమాయికత ఉంది. వారి ముక్కు పొట్టిగా, నిటారుగా కోటేరు వేసినట్లుంది. గడ్డం చిందరవందరగా పెరిగినా పెదవులు మాత్రం గంభీరంగా తీర్చినట్లున్నాయి. అలాంటి ముఖకవళికలు - వారి బుద్ధిబలాన్ని మినహాయిస్తే, మధ్యయుగాల క్రైస్తవ మతాచార్యులకుండేవేమో మరి!” అని తన “అజ్ఞాత భారతంలో అన్వేషణ" అనే గ్రంథంలో వ్రాశారు.

ఆ గ్రంథంలోనే మరొకచోట “మా సంభాషణ సాగిసాగి విశాలమైన పరిధిలోకి వెళ్లిపోయింది. అప్పుడుగాని నాకు తెలియలేదు. స్వామివారు ప్రతిదినమూ ఇంగ్లీషు పత్రికలు చదువుతారనీ, ప్రపంచంలో ఏమూల ఏం జరుగుతున్నదో గమనిస్తూనే వుంటారనీ. 'వెస్టెమిస్టర్'లో ఇటీవల జరిగిన గొడవలన్నీ వారికి తెలుసు. యూరప్ ఖండంలో ప్రజాస్వామ్యం బాలారిష్టాలు గడవటానికి ఎలా విలవిల్లాడిపోతున్నదో కూడా వారికి తెలుసు” అని స్వామి వారి వివిధ విషయ పరిజ్ఞానానికి బ్రంటన్ అబ్బురపడ్డాడు.

(సశేషం)

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

31 Jan, 00:33


పూర్వీకుల ఆస్తి

పరమాచార్య స్వామివారు భక్తులతో సాధారణ విషయాల గురించి మాట్లాడుతున్నారు. వారు భక్తులతో, “మన పూర్వీకులు భూమి, డబ్బు, బంగారం, తోటలు, ఇళ్ళు మొదలైనవి ముందుతరాల వారు మంచిపనుల కోసం, ధర్మాచరణ చేయడం కోసం మనకు ఇచ్చి వెళ్ళారు. ఇది వారు మనకిచ్చిన పెట్టుబడి.

వారి పిల్లలు సంతోషంగా ఉండాలి అని వారు ఇలా చేసారు. ముందుతరాల వారు కూడా మంచి పనులు చెయ్యాలని వారు ఆశించారు. వాటి నుండి వచ్చే లాభాలతో ధర్మకార్యాలు, పదిమందికి ఉపయోగపడే పనులు చెయ్యాలని వారు ఇంత చేసారు.

కాని చాలా చోట్ల అలా జరగడం లేదు. వారు చెయ్యాలనుకున్న ధర్మకార్యాలు లేదా వారి వీలునామాలో చెయ్యాలని చెప్పినవి కూడా జరగడం లేదు. వీటికోసం కేటాయించిన సొమ్ముని కూడా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు.

ఇది అధర్మం. ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పు. ఎన్నో కుటుంబాలు ఇలాంటి డబ్బుని అన్యాయంగా అనుభవిస్తున్న వారు చాలా బాధలు పడుతున్నారు. అది ప్రయాగ నుండి గంగను తెచ్చి రోడ్డు పక్కన పారబోయడం వంటిది” అని చెప్పారు.

మహాస్వామి వారు ఇలా చెప్పగానే ఒక భక్తుడు నిలబడి ఏడుస్తూ, “మా పూర్వీకులు చెప్పినట్టు నేను అన్ని ధర్మకార్యాలు చేస్తాను. ఇకనుండి ధర్మమార్గంలో బ్రతుకుతాను. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని తప్పులను మాహాస్వామి వారు మన్నించాలి” అని వేడుకున్నాడు.

అవ్యాజ కరుణతో మహాస్వామి వారు ఆ భక్తుడితో, “ఇది నీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పినది కాదు. చాలా కుటుంబాల్లో ధర్మకార్యాల కోసం ఉంచిన సొమ్ముని వేరే వాటికి వినియోగిస్తున్నారు” అని అన్నారు.

బాధపడిన ఆ భక్తుడు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి భారంగా నిలబడ్డాడు.

పరమాచార్య స్వామివారు అతణ్ణి దగ్గరకు పిలిచి, “పశ్చాత్తాపానికి మించినది లేదు. ఇకనుండి ధర్మంగా సంపాదించి ధార్మికంగా ఖర్చుపెట్టి, మీ పూర్వీకులు చెప్పినట్టుగా నడుచుకో” అని ప్రసాదం ఇచ్చి పంపారు.

--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ అనుభవాల సంగ్రహం 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

30 Jan, 00:17


తొలి - మలి అనుభవం

ఈరోజు నేను కలకత్తాలో శ్రీ బాలసుబ్రమణియన్ (వేదభవన్ బాలుగా ప్రసిద్ధులు) ను కలిశాను. లేక్ గార్డెన్స్ లోని మురుగన్ దేవాలయంలో కలిశాము. పరమాచార్య స్వామివారితో తనకున్న అనుభవాన్ని నాతో పంచుకున్నారు. కాని రికార్డు చెయ్యడానికి వారు అంగీకరించలేదు.

నాకు గుర్తున్నంత వరకు వారు చెప్పిన విషయాలను మీకు చెబుతాను.

“1978లో సికిందరాబాద్ లో కంచి మఠం భిక్షావందనం జరుగుతున్న సమయం. అప్పుడు కర్నూలులో ఉన్న మహాస్వామి వారిని కలవడానికి నేను, వామన్ కుమార్ చటోపాధ్యాయ వెళ్ళాము. ఆరోజు ఏకాదశి అవునో కాదో నాకు గుర్తులేదు కాని స్వామివారి దర్శనం తరువాతనే ఆహారం తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. మరుసటిరోజు మేము అక్కడకు చేరుకొని మా అనుష్టానాలను ముగించుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళాము. మొదట మమల్ని చూడగానే స్వామివారు సైగలతో అడిగిన విషయం భోజనం చేశారా అని. సేవకులొకర్ని పిలిచి మా ఇద్దరికీ ఆహారం ఇవ్వమని ఆదేశించారు. లోపల ఉన్న వ్యక్తీ వామన్ కుమార్ చటోపాధ్యాయకు ఆహారం ఇవ్వడానికి నిరాకరించాడు. అయితే నేను కూడా తిననని వచ్చేశాను. మరలా స్వామివారిని కలవడానికి వెళ్ళగా, భోజనం చేశారా అని అడిగారు. మేము లేదని చెప్పాము. అప్పుడు స్వామివారు అతణ్ణి పిలిచి, వామన్ కుమార్ చటోపాధ్యాయ సామవేది, బెంగాలీయుడు అని చెప్పి ఆహారం ఇవ్వమని చెప్పారు. భోజనం ముగించి మరలా స్వామివారి వద్దకు వచ్చాము. ఈసారి అడుగగా, భోజనం చేశామని చెప్పాము. మేము ఎక్కడనుండి వస్తున్నామని అడిగారు. వేద భవన్ కార్యక్రమాల గురించి అడిగి, వేద భవన్ ఎలా నడుస్తోందని పూర్తీ వివరాలు అడిగారు. భిక్షావందనానికి ఎంత మొత్తం పోగుచేశారు అని, నా సహకారం కూడా ఉందా అండి అడిగారు. నేను అవునని చెప్పాను. తరువాత నేను మహాస్వామివారిని ఇక్కడ రెండు రోజులు ఉండవచ్చా అని అడుగగా వారు సరేనన్నారు.

సాయంత్రం కోనేరిరాజపురం నుండి వచ్చిన ఒకామె మాత్రం అక్కడ ఉంది. అప్పుడు స్వామివారు ఆ కలకత్తా అతణ్ణి పిలవమని శిష్యులకు చెప్పారు. మేము ఇద్దరమూ అక్కడకు రాగానే స్వామివారు ఆమెతో వామన్ కుమార్ చటోపాధ్యాయను చూపిస్తూ ఇతనే అని చెప్పారు. ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసి, కళ్ళ నీరు పెట్టుకుంది. తరువాత మాకు తెలిసింది, ఆమె మహాస్వామివారి కోసం చతుర్వేదా పారాయణం చేయించాలనుకుందని, కాని తనకు సామవేద పండితులు దొరకలేదని. అప్పుడు స్వామివారు ఆమెతో సామం రేపు వస్తుందని చెప్పారుట. అలా స్వామివారి సంకల్పానుసారం మరుసటిరోజు మేము అక్కడకు చేరుకున్నాము.

మరుసటిరోజు స్వామివారు అసాధారణ భంగిమలో కూర్చుని ఉండడం చూసి అక్కడివారిని అడుగగా, స్వామివారు ఒరుమణి జపం(ఒక గంట జపం)లో ఉన్నారని చెప్పారు. మేము అక్కడకు వెళ్లి కూర్చున్నాము. అప్పటికే సాయింత్రం నాలుగున్నర కావడంతో బయలుదేరాము. కొద్ది దూరం వెళ్ళగానే, హఠాత్తుగా స్వామివారు లేచి మావైపు వచ్చారు. అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి, కాని స్వామివారి దేహం నుండి వస్తున్నా కాంతి చాలా శక్తివంతంగా ఉంది. దాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను.

మేము వెళ్తున్నామని స్వామివారికి చెప్పగా, వారు ఇలా అన్నారు. . .

‘నీ క్షేమమా ఇరుప్పే’ (నువ్వు క్షేమంగా ఉంటావు)

మహాస్వామివారితో ఇదే నా మొదటి మరియు చివరి అనుభవం. తరువాత నేను వారిని ఎన్నోసార్లు కలిసినా, మాట్లాడడం కుదరలేదు”

శ్రీ వేదభవన్ బాలు మామ చెప్పిన మాటలు. ఈరోజు వారిని కలకత్తాలో కలవడం నా అదృష్టం

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

29 Jan, 01:24


జయ జయ శంకర !! హర హర శంకర !!

పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో 'కంచి పరమాచార్య వైభవం' పేరున ఫేస్బుక్ లో ప్రచురిస్తున్న స్వామి వారి విశేషాలు ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. మొత్తం 4 భాగాలలో ఇది మొదటి భాగం.

ఈ పుస్తకం కావాల్సిన వారు 7259859202 కి మీ చిరునామా వాట్సాప్ చెయ్యగలరు. వెల 175/- మాత్రమే

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

28 Jan, 00:27


మువ్వురు మానవులకు రథోత్సవాలు

దాదాపు ముప్పైయేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యు ఇనస్పెక్టర్ గా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు తహసీల్దారు గారు పిలుస్తున్నారని నా సహాయకుడు చెప్పడంతో వెళ్లాను.

“సుబ్రహ్మణ్యన్ ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమీషనరు కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టరుకు కూడా స్నేహితులు కనుక కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చెయ్యి” అని ఆదేశించారు.

తరువాత నేను కంచి మఠానికి విషయం తెలిపి, కావాల్సిన ఏర్పాట్లను చేశాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమీషనరు మఠానికి వచ్చి, పరమాచార్య స్వామివారికి నమస్కరించి, స్వామి ఎదురుగా కూర్చున్నారు.
దివ్యతేజస్సు ఉట్టిపడుతుండగా మహాస్వామి వారు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చెయ్యాల్సిన కుంబాభిషేకాల దాకా వెళ్ళింది.

శ్రీ శంకరాచార్య స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడున్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో ఉన్నప్పుడు స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తారు. అలా శ్రోతలను ప్రశ్నలను అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా అవి మరుగునపడక బాగా జ్ఞాపకం ఉంటాయని స్వామివారి ఆలోచన.

ఆరోజు కూడా కంచి స్వామివారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమీషనరుకే. “ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన మువ్వురు వ్యక్తులకు తీర్థ్-తిరువిళ (రథోత్సవం) జరుపుతారు ఇప్పటికి. ఆ మువ్వురు ఎవరు?” అని అడిగారు.

అది అడిగినది కమీషనరుకే ఆయినే అక్కడున్న మేమందరమూ మా బుద్ధికి పనిపెట్టాము. సాధారణంగా రథోత్సవం దేవుళ్ళకు మాత్రమే చేస్తాము. కానీ పరమాచార్య స్వామివారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని!
మా పరిస్థితిని గమనించిన స్వామివారు “మరొక్క ఐదు నిముషాల సమయం ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు” అని అన్నారు.

ఐదు నిముషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి స్వామివారు, “పర్లేదు. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి. నేనే సమాధానాలు చెబుతాను” అని చెప్పనారంభించారు.

“’చూడికొడుత్త నాచ్చియార్’ గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కు శ్రీవిల్లిపుత్తూర్ లో రథోత్సవం; శ్రీవైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజులకి శ్రీపెరుంబదూర్ లో రథోత్సవం; శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుందురైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం వీరు మువ్వురికి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు కూడా మీకు తెలిసిఉంటే మంచిది, అందుకనే అడిగాను” అని చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.
ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది.

--- ఏరాసు, చెన్నై - 61. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

27 Jan, 00:23


అన్నవిక్రయం మహాపాపం

చెన్నైకు చెందిన ఒక పెద్ద రెస్టారెంట్ యజమాని చాలా ప్రముఖ వ్యక్తి. ఆయన పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో, చాలా ధనం సంపాదించాడు. అతడు మంచి భక్తితత్పరుడు, దానగుణం కలవాడు కూడా. 1958 - 1960లలో పరమాచార్య స్వామివారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు, పాదపూజ చేసి, భిక్షావందనం చెయ్యాలని ఆశపడ్డారు.

“సరే చూద్దాంలే” అన్నారు స్వామివారు. కాని ఎన్నిసార్లు ఆయన తన కోరికను తెలిపినా, పరమాచార్య స్వామివారు అంగీకరించలేదు. అలా అని తిరస్కరించనూ లేదు. కాని ఇది తిరస్కారమే అని శిష్యులు అర్థం చేసుకున్నారు. శ్రీమఠంతో మంచి సంబంధాలు ఉన్న కొంతమంది పెద్దలు ఆయన తరుపున పరమాచార్య స్వామివారిని వేడుకున్నారు.

“అతను మంచి వ్యక్తీ, గొప్ప దానగుణం ఉన్నవాడు. మఠానికి ఎన్నో రకాలుగా సేవ చెయ్యగల సమర్థుడు. అతనికి సంతానం కూడా లేదు” అని చెప్పసాగారు.

మహాస్వామివారు అంతా మౌనంగా విన్నారు. “అతను మంచి వ్యక్తి అని నాకు కూడా తెలుసు. భక్తీ ప్రపత్తులు దానగుణం కలిగినవాడు కూడా. అతని గురించి తప్పుగా నేను ఏనాడైనా మాట్లాడానా?” అని అడిగారు.

“లేదు లేదు పెరియవ. కేవలం శ్రీమఠానికి ఎదోరకంగా సేవచేసుకోవాలి అనే ఆశ అతనిది”

“అదే నేను కూడా అడుగుతున్నా. అతను మంచివ్యక్తి అంటున్నారు కదా. ఆయన సేవచేయాలనుకుంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదా! అతను మఠానికి డబ్బు ఇచ్చినా మరలా మనం చేసేది అదే కదా. మరి అతనే చెయ్యవచ్చు కదా!” అని అన్నారు స్వామివారు.

అందరూ మౌనం వహించారు.

“పుట్టుక చేత అతను వేదాధ్యయనం చెయ్యాలి. అన్నం అమ్ముకోకూడదు. అది పెద్ద పాపం. అతని సంపద అంతా అన్నం అమ్ముకోవడం వల్ల సమకూరినదే. మరి ఆ డబ్బు చంద్రమౌళీశ్వరునికి అవసరమా? చెప్పండి”

అందరూ మిన్నకుండిపోయారు. ఇక మాట్లాడడానికి వారికి అనకాశం లేదు. కాని ఆయన మాత్రం పదే పదే తన కోరికను తెలుపుతూనే ఉన్నాడు.

పరమాచార్య స్వామివారు పరమ దయాళువు. చెన్నై నగరం నుండి వెళ్ళిపోయే తేదీ నిశ్చయం అయ్యింది. సమష్టి భిక్షావందనం ఏర్పాటు చేశారు. సమష్టి అంటే అందరూ కలిసి. ఇటువంటి భిక్షావందనంలో భక్తులందరి సమర్పణని అంగీకరిస్తారు. చిన్నదా పెద్దదా ఎవరు ఎంత ఇచ్చారు అనే పట్టించుకోరు. అందరూ కలిసి గురువుగారికి భిక్ష సమర్పిస్తారు. అతణ్ణి కూడా ఇందులో పాల్గొనమని చెప్పారు. అదే భాగ్యంగా తలచి ఆయన కూడా పాల్గొన్నారు. వారికి చెట్ పేట్ లో కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది. “నేను నా భార్య మరణించిన తరువాత ఈ ఇంటిని శ్రీమఠానికి ఇవ్వాలని, ఒకవేళ దాన్ని అమ్మిన పక్షంలో ఆ డబ్బును మఠానికి ఇవ్వాలని” విల్లు వ్రాశారు.

కాని మఠాన్ని పరమాచార్య స్వామివారు నిర్వహించినంతవరకూ ఆ రాజభవనాన్ని స్వాధీనపరుచుకోలేదు.

ధర్మం అంటే ధర్మమే! పరమాచార్య స్వామివారు అంటే పరమాచార్య స్వామివారే!

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 3

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

26 Jan, 00:26


దర్శన అనుగ్రహం

శివాస్థానంలో మకాం. పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళాను. తంజావూరు శరవణ భవన్ భోజనశాల యజమాని వేంకటాచలం అయ్యర్ కూడా నాతోపాటు వచ్చాడు.

దర్శనం అయిన తరువాత అలా పక్కకు నిలబడ్డాను. “ఉత్తరం వీడిలో ఉన్న శంకర మఠంలో ఎవరైనా వేదాంత పాఠం చెబుతున్నారా? ఇప్పుడు మేలత్తూర్ శాస్త్రి గారు లేరు కదా?” అని అడిగారు.

“మేలత్తూర్ శాస్త్రిగారు పోయిన తరువాత ఇక ఎవరూ రాలేదు”

“శాస్త్రం చదివిన ఎవరినైనా అక్కడ నియమించడం మంచిది. శాస్త్రాధ్యయనం చేసిన దవే లేదంటే మరెవరినైనా? ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు?”

“అతను ఇప్పుడు తిరుక్కోయిలూర్ వెళ్లిపోయాడు. సన్యాస ఆశ్రమం తీసుకున్నాడని విన్నాను” అని చెప్పాను.

“ఆశ్రమమో కాదో, పిలుచుకుని రండి, మఠంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసి, నేను చెప్పానని పాఠం చెప్పమని చెప్పండి”

నా పక్కనే ఉన్న నా స్నేహితుడు, “పెరియవా చెబుతున్నది ఎవరి గురించి?” అని చిన్నగా అడిగాడు.

“దవే అని పడమటి వీధి, దవే లేన్ లో ఉంటాడు. అతను ఇప్పుడు తిరుక్కొయిలూర్ కి వెళ్లిపోయాడు. అతడి గురించే నేను స్వామివారికి చెప్పాను”
వెంటనే అతడు, “అతనా? అతను నాకు బాగా తెలుసు. మా భోజనశాల కాఫీ అంటే అతనికి చాలా ఇష్టం. భోజనశాల తెరవడానికి ముందే, ఉదయాన్నే వచ్చి అయిదింటికి కాఫీ తాగిన తరువాతనే వెళ్తాడు”. నాలో నేనే నవ్వుకున్నాను.

మేము మాట్లాడినదంతా స్వామివారు విన్నారు. “ఎవరితను? ఏమంటున్నాడు?” అని అడిగారు.

“తంజావూరులో నాకు ఒక భోజనశాల ఉంది. మహాస్వామి వారు చెబుతున్న వ్యక్తి, దవేకు మా అంగట్లో అమ్మే కాఫీ అంటే తగని మక్కువ. కప్పు కాఫీ కోసం ఉదయం అయిదు గంటలకు రావడం ఎట్టి పరిస్థితుల్లోనూ మానడు. అదే నేను ఇతనికి చెప్పాను”

వెంటనే స్వామివారు, “ఇకనేం. ఇతణ్ణి నీ వెనకాలే తీసుకునివెళ్లు, దవే ఇతడిని చూడగానే నీతోపాటు వచ్చేస్తాడు. ఇది ఇప్పుడు నీకు సుల్భం అయ్యింది” అన్నారు.

ఈ సంభాషణ విన్నవారందరూ చక్కగా నవ్వుకున్నారు. మహాస్వామి వారి లీల అటువంటిది.

*******

1980లో ఊగార్ ఖుర్దులో మకాం. నా భార్యతోపాటు దర్శనానికి వెళ్ళాను. పైకప్పు లేని ఒక భవనంలో గోడకు ఆనుకుని ఒక్కరే కూర్చున్నారు స్వామివారు. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో. దగ్గర్లో ఎవరూ లేరు. కైంకర్యం చేసే సేవకులు కూడా కొద్ది దూరంలో వాళ్ళ పనులు చేసుకుంటూ వున్నారు.
స్వామివారు నాతో చాలాసేపు, వేదాంత, శాస్త్ర సంబంధ విషయాలు మాట్లాడారు. నా ఉద్యోగం గురించి, నా గురించి కూడా మాట్లాడారు. కొద్దిసేపు మౌనంగా వున్నారు.

మరలా నాతో, “మాకు ఒక బాధ్యత ఉంది, తెలుసా నీకు? మాకు వయసైపోతోంది. అందుకే లోకక్షేమం కొనసాగడానికి ఒక దీపం నుండి మరొక్క దీపం వెలిగిస్తాము” అని అన్నారు.

“నువ్వు మాకు అభిమానపాత్రుడివి అయ్యావు. నేనేమైనా డబ్బులు తీసుకునిరమ్మని అడుగుతానా? మాతో ఉండమని మాత్రమే కదా”
కారుణ్య పూరితమైన మాటలతో స్వామివారు ఇలా అన్నప్పుడు, నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెంటనే స్వామివారికి సాష్టాంగం చేసి, “స్వామివారు ఏమి చెబితే అది చెయ్యడానికి నేను సిద్ధం” అన్నాను. చిన్న చిరునవ్వుతో నన్ను అనుగ్రహించారు స్వామివారు.

**********

1981లో షోలాపూర్ లో మకాం. ఉదయం ఆరుగంటలకే దర్శనానికి వెళ్ళాను. నాతోపాటు తెచ్చిన ప్రసాదాన్ని స్వామివారు స్వీకరించారు. బంగారు కామాక్షి అమ్మవారి ఆలయంలో రోజూ జరిగే సేవలు, పూజాలు, కైంకర్యాల గురించి అడిగారు. ‘దర్శనానికి ఎంతమంది వస్తారు? నైవేద్యం ఏమి పెడతారు?’ అలా ఒకటి తరువాత ఒకటి ఎన్నో ప్రశ్నలు వేశారు. మధ్యరాత్రి వరకూ జరిగే కైంకర్యాలన్నిటి గురించి నన్ను అడిగారు.

“ఇవన్నీ నువ్వు బాధ్యతలను తీసుకున్న తరువాత ఏర్పాటు చేశావా?”
“ఇవన్నీ పాతకాలం నుండి వున్నాయి. అవి ఎప్పటి నుండో వున్నాయి” అన్నాను. నేను అబద్ధం ఆడలేదని స్వామివారికి తెలుసన్నట్టుగా చిన్నగా నవ్వారు స్వామివారు. తరువాత స్వామివారు అమ్మవారికి చేసే ఆభరణాల అలంకారం గురించి అడిగారు. ప్రతి ఆభరణం యొక్క సూక్ష్మ బేధాలను స్వామివారు తెలిపారు.

కాసుల మాల గురించి చాలాసేపు చెప్పారు. చివర్లో స్వామివారు చెప్పిన మాటలను విని పారవశ్యంతో నా రోమాలు నిక్కబొడుచుకునాయి.

“అమ్మవారి మెడ చాలా సౌమ్యమైనది. అవన్నీ ఆమె మెడలో వేస్తే, అమ్మవారి మెడకు నొప్పి కలుగుతుంది” అన్నారు.

అన్ని నగలు వేసుకుని మెడనొప్పితో బాధపడుతున్న అమ్మవారు స్వామివారి ముందు కనిపించినట్టుగా నాకు అనిపించింది. అది నేను మరవలేను. ఆ దృశ్యాన్ని చూసి, ముకుళిత హస్తాలతో స్వామివారు ఈ మాటల అనగానే నాకు పారవశ్యం కలిగింది.

“పంచ బాణాల గురించి తెలుసా?” అని అడిగారు.

స్వామివారి ముఖమండలం నుండి వచ్చే మాటలు ఎంతో భావంతో సంపూర్ణంగా ఉంటాయి. అందుకనే నేను మిన్నకుండిపోయాను.

కొద్దిసేపటి తరువాత సౌందర్యలహరిలోని శ్లోకంతో అనుసంధానం చేస్తూ పంచ బాణాల గురించి ఉపన్యసించారు స్వామివారు.

తరువాత, “ఇప్పుడు సమయం ఎంత అయ్యింది?” అని అడిగారు.

“ఇప్పుడు సమయం పదిన్నర”

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

26 Jan, 00:26


“నేను చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాను. నువ్వు ఇక్కడకు వచ్చినప్పుడు ఆరు అయ్యుంటుందేమో? నేను అమ్మవారి గురించి మాట్లాడాను కదా, సమయం అలా గడిచిపోయింది. ఇక వెళ్ళిరా!” అని నేను వెళ్లడానికి అనుమతిచ్చారు.

--- తంజావూరు సంతానరామన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

25 Jan, 01:19


అధికారం అనే అహంకారం

శ్రీ తంజావూరు బంగారు కామాక్షి అమ్మవారి ఆలయం శ్రీమఠం ఆధీనంలో ఉంది. అది 1980వ సంవత్సరం. శ్రీమఠం ప్రతినిధి నన్ను కలిసి, “మిమ్మల్ని శ్రీ బంగారు కామాక్షి అమ్మవారి ఆలయ శ్రీకార్యంగా నియమించారు. నాతోపాటు ఆలయానికి వచ్చి, బాధ్యతలు తీసుకోండి” అని చెప్పాడు.

నేను బాధ్యతలు తీసుకున్న రెండు నెలలోపే జయేంద్ర స్వామివారి అహ్మదాబాద్ మకాం నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. “వెంటనే ఇక్కడకు రా; నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు”. అహ్మదాబాద్ చేరుకున్నాను. నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడంతో పాటు దాన్ని రిజిష్టర్ చేశారు. అప్పడు నాతో శ్రీ జానకిరామయ్య గారు కూడా వున్నారు. నేను బయలుదేరేటప్పుడు జయేంద్ర స్వామివారు నాతో, “శ్రీ మహాస్వామి వారు షోలాపూరులో వున్నారు. వెళ్ళేటప్పుడు వారి దర్శనం చేసుకో” అని అన్నారు. షోలాపూరులో స్వామివారి దర్శనం చేసుకుని, పవర్ ఆఫ్ అటార్నీ దస్త్రాలను సమర్పించి, సాష్టాంగం చేశాను. లెన్స్ తో ఆ దస్త్రాన్ని చదివారు స్వామివారు.

“వారు నీకు ‘ఎక్కువ అధికారం’ ఇచ్చారు” అన్నారు. మౌనంగా అవునన్నట్టు తాలూపాను.

“వారు నిన్ను మాత్రమే నియమించారా?”

“వారు నన్ను అడిగారు, ‘తంజావూరులో శ్రీకార్యాన్ని నియమించాలి. సరైనవారి పేర్లు పంపండి. నేను నాలుగురైదుగురు పేర్లను పంపాను. శ్రీమఠం అధికారి అందరినీ ఇంటర్వ్యూ చేశారు. హఠాత్తుగా ఒకరోజు అధికారి తంజావూరు వచ్చి, ‘మిమ్మల్నే నియమించారు, వచ్చి బాధ్యతలను తీసుకోండి.’ అని చెప్పాడు. నా సమస్యలను అతనికి తెలిపాను. ‘ఇప్పటికీ మీరు ఉండండి. తరువాత చూద్దాం’ అన్నాడు’” అని చెప్పాను.

కొద్దిసేపు మౌనం. నా పక్కనున్న వ్యక్తితో, “ఇతణ్ణి నియమించమని చెప్పింది నేనే. నీకు తెలుసా?” అని చిన్నగా నవ్వారు. నేను మిన్నకుండిపోయాను.
“ఇందులో నీకు ఉన్న కష్టమేమిటి?”

“దేవాలయ వ్యక్తులతో నేను చాలా దగ్గరగా మసలుకున్నాను. ఈ అధికారం వల్ల వారితో నేను కఠినంగా ప్రవర్తించలేను. అదే నాకు కష్టంగా ఉంది”

“ఒక విషయం అర్థం చేసుకో. నువ్వు ఆజ్ఞ ఇవ్వు. దాని గురించి ఎవరైనా నావద్దకు వస్తే, నీకు ఇబ్బంది కలిగేటట్టు నేను ఏమీ చెయ్యను. ఇది చాలు కదా!” అన్నారు.
నా కళ్ళు వర్షించాయి. స్వామివారికి సాష్టాంగం చేశాను. నన్ను ఆశీర్వదించారు. అనుమతి తీసుకుని బయలుదేరాను. ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి, ఒక మనిషి పరిగెత్తుకుని వచ్చి, “రమ్మన్నారు” అని చెప్పాడు. మరలా లోపలకు వెళ్ళాను.

“వారు నీకు ఎక్కువ అధికారం ఇచ్చారు. కానీ నువ్వు అక్కడ ఉండడం పుదు పెరియవాకు చాలా సంతోషం” అన్నారు స్వామివారు.

“సరే పెరియవా” అని తలూపాను. దగ్గరే ఉన్న వ్యక్తిని, “ఏమంటున్నాడు?” అని అడిగారు. “అతను సరే అంటున్నాడు” అన్నాడావ్యక్తి. “ఏమి అర్థం అయ్యిందో అడుగు” అన్నారు స్వామివారు. ఆ వ్యక్తి నవైపు చూశాడు.

వెంటనే నేను, “పెరియవా నన్ను వదిలెయ్యమని చెప్పిన క్షణమే, మారు పలకకుండా వెళ్లిపోవాలి” అని బదులిచ్చాను. స్వామివారు పెద్దగా నవ్వి, రెండు చేతులూ పైకెత్తి నను ఆశీర్వదించి పంపారు.

ఎంతటి సౌలభ్యమో! అదే సమయంలో అంతటి కఠినమైన క్రమశిక్షణ కూడా!

--- తంజావూరు సంతానరామన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

24 Jan, 00:48


గోవు వెనక వెళ్ళడమెందుకు?

పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.

భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవాలి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.

ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.
ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.

కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.

చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.

ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.

స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.

స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.

తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.

స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.

స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?

--- “కడవులిన్ కురల్” - తిరువారూర్ దివాకరన్. ‘కుముదం’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

23 Jan, 00:35


రాముడు - దయా రాముడు

పొలాల్లో పనిచేసే ఒక మహిళ గర్భవతియైన తన కుమార్తెను వెంటబెట్టుకుని పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చింది. కడుపుతో ఉన్న తన కుమార్తెకు మంచి పౌష్టిక ఆహారం పెట్టలేకపోతున్నామని స్వామివారికి చెప్పుకుంది. అప్పుడే ఒక భక్తుడు పెద్ద పాత్రనిండా గట్టి పెరుగుతో స్వామివారి వద్దకు వచ్చాడు.
వెంటనే స్వామివారు “అది ఆమెకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

అది చేతులు మారింది. మరొక్క భక్తుడు రెండు పెద్ద పాత్రల నిండా మధుర పదార్థాలు, తినుబండారాలతో వచ్చాడు. అది కూడా చేతులు మారింది. ఇంకొక భక్తుడు రాగానే స్వామివారు, “ఆమెకు కొంత ధనం ఇవ్వు” అని చెప్పారు. ఆ భక్తుడు ఆమెకు డబ్బు ఇచ్చాడు.

“ఎంత డబ్బు ఇచ్చావు?” అని అడిగారు స్వామివారు. ఆ భక్తుడు చెప్పడానికి ఇష్టపడలేదు. స్వామివారు కేవలం కనుసైగ ద్వారా ఆజ్ఞాపిస్తే లక్షలు, కోట్లు ఇచ్చే భక్తులు ఉన్నారని అతనికి తెలుసు.

కాని స్వామివారు సమాధానం చెప్పాల్సిందే అన్నట్టు అతనివైపు చూస్తున్నారు. స్వరం తగ్గించి, “నావద్ద నాలుగు వేలా చిల్లర మాత్రమె ఉంది పెరియవ. దాన్ని మొత్తం ఆమెకు ఇచ్చాను” అని బదులిచ్చాడు.

వెంటనే స్వామివారు, “కాని నేను అంత ధనం ఇవ్వమని నేను అడగలేదు కదా” అని అన్నారు.

అప్పుడు ఆ భాక్స్తుడు స్వామివారితో, “ఈరోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రసవానికి నాలుగువేలు అవుతుంది పెరియవ” అని అన్నాడు.
స్వామివారు కొద్దిసేపు అతనివంక చూసి, “నువ్వు సాధారణ రాముడివి కాదు. దయా రాముడివి” అని ప్రశంసించారు.

అతను కళ్ళ నీరు పెట్టుకుని అత్యంత ఆనందంతో, “చాలు. ఈ దీవెన చాలు నా తరతరాలకు” అని స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయాడు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

22 Jan, 00:22


ఎక్కడ నేర్చుకున్నావు?

ఇది 1956-57లలో జరిగిన సంఘటన. కంచి పరమాచార్య స్వామి వారు మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు.

ఒక సాయింత్రం పరమాచార్య స్వామి వారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది. ఆ సభలో రాజాజి లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొ. శంకరనారాయణ అయ్యర్ ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో రెండు పాదాలు చెప్పి, మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేసారు.

ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికి దీని గురించి తెలిసింది. ఈ వ్యాసం వ్రాసిన డా. సి.ఆర్. స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు. ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి, వెంటనే శంకరనారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన రెండు పాదాలు చెప్పారు.

అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్ళి మహాస్వామి వారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు.

స్వామివారు ఆయనతో, “నీకు ఈ శ్లోకం తెలియదన్నావు. మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నవు?” అని అడిగారు.

“సభికులలో ఒకరు గుర్తుతెచ్చుకుని నాకు చెప్పారు పెరియవ” అని బదులిచ్చారు.

మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని, డా. స్వామినాథన్ ను వేదిక పైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు. ఆయన వేదిక పైకి రాగానే, అతని పేరు, వృత్తి మొదలైన వివరములు అడిగి, “ఎక్కడ చదివావు?” అని అడిగారు.

అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకుని స్వామినాథన్ మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో అని చెప్పారు. అందుకు స్వామివారు ”అది కాదు. ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగారు.

తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదులిచ్చారు. మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం, వారి తాతగారి పేరు, వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం సంభాషణ అంతా మైకు ముందు జరగడం వల్ల అక్కడున్నవారు మొత్తం విన్నారు. ఆ శ్లోకం ఇదే:

అర్థాతురాణాం న గురుర్ న బంధుః
క్షుధాతురాణాం న రుచికి న పక్వం
విద్యాతురాణాం న సుఖం న నిద్ర
కామాతురాణాం న భయం న లజ్జ

ధనార్జన చేయువానికి గురువులు, బంధువులు అన్నది ఉండదు. ఆకలిగొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి(చదువుకోవాలి) అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతమయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు.

తరువాత పరమాచార్య స్వామివారి అనుగ్రహ భాషణంలో కేనోపనిషత్తు గురించి చెబుతూ, పార్వతీ దేవి గురు స్వరూపిణియై దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విశదపరచిందో చెప్పారు. ఉపన్యాసం ముగిస్తూ చివర్లో ఇలా అన్నారు.

”ఉపన్యాసం మొదలుపెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు. కాని ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీకందరికి తెలియాలి అది ఏదో పాఠశాలలోనో, కళాశాలలోనో నేర్చుకున్నది కాదు. బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది. పిల్లలకు మంచి విషయాలు, విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప ఆధునిక పాఠశాలలోనో, కళాశాలలోనో కాదు”

ఇంకా స్వామినాథన్ చివరలో ఇలా వ్రాసారు:

నాలాంటి అల్పుడు, సిగ్గు, భయం కలవాడిని కొన్ని వేలమంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామివారు అందరికి ఏమి చెప్పలనుకుంటున్నారు అంటే

> పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము, విలువలు నేర్పడం పెద్దలు(నాన్నమ్మలు తాతయ్యలు) ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యం.
> పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్ల్లకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు.
> ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

--- డా. సి.ఆర్. స్వామినాథన్, భారత ప్రభుత్వ మాజీ సహాయ విద్యా సలహాదారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

21 Jan, 00:37


జయ జయ శంకర !! హర హర శంకర !!

ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా !! వేదోఖిలో ధర్మ మూలం !!

అపౌరుషేయమైన అనంతమైన వేదరాశిని వేదవ్యాసుల వారు ఋగ్, యజు, సామ, అథర్వణ వేదములుగా విభజించారు. కలియుగారంభములో ఋగ్వేదము - 21 శాఖలు, యజుర్వేదము - 101 శాఖలు, సామవేదము - 1000 శాఖలు, అథర్వణ వేదము - 9 శాఖలుగా భాసిల్లింది. వేద ధర్మంతో పాటు అఖిల ధర్మాలకు మూలమైన వేదము కూడా క్రమంగా మరుగున పడుతూ ప్రస్తుతం ఋగ్వేదము - 2 శాఖలు, యజుర్వేదము - 5 శాఖలు, సామవేదము - 3 శాఖలు, అథర్వణ వేదము - 2 శాఖలు మిగిలాయి. ఈ మాత్రమైనా మిగిలివుండడానికి కారణం పరమాచార్య స్వామివారు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఎక్కడో ఒక్కరో ఇద్దరో మాత్రమే అధ్యయనం చేస్తున్న వేద శాఖలను ఉద్ధరించడానికి వేద విద్యార్థులను వారివద్దకు పంపి ఆ శాఖలు అంతరించిపోకుండా చేశారు. వేదసభలు నిర్వహించి వేదపండితులకు భృతి ఏర్పాటు చేశారు. వేదవిద్యాభివృద్ధికై ఎన్నో సంస్థలను స్థాపించారు. స్వామివారి ఆదేశానుగ్రహాలతో ఎన్నో వేదపాఠశాలలు వెలిశాయి. శ్రోత్రియ కుటుంబాలు కూడా వేదవిద్యకు దూరమవుతున్న వేళ కేవలం స్వామివారి ఆదేశం చేత మరలా వారి ఇళ్లల్లో వేదపండితులు తయారయ్యారు.

స్వామివారి ఆశీస్సులతో ప్రారంభమైన మన ట్రస్ట్ కూడా వేదరక్షణ ముఖ్య లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ట్రస్ట్ ప్రారంభం అయ్యి 4 సంవత్సరాల కాలం పూర్తైన సందర్బంగా వేదానికి ఇతోధిక సేవ చేస్తున్న గాయత్రీ వేద పారాయణ చారిటబుల్ ట్రస్ట్, బెంగళూరు వారి సహకారంతో, ఇరు సంస్థల సంయుక్త ఆధ్వర్యవంలో వేద సప్తాహం ఏర్పాటు చేయడమైనది.

లోకకళ్యాణార్థం, దేశ ధర్మాల రక్షణార్థం, ధర్మానికి హాని చేసే శక్తులు శాశ్వతంగా దూరమవ్వడం కోసం, ప్రజలు ధర్మమార్గాన చరించడం కోసం వారం రోజులపాటు కృష్ణ యజుర్వేద సంపూర్ణ క్రమ పారాయణం నిర్వహించడమైనది

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

20 Jan, 01:09


వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానము ఉంది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆచార్యకాండ యందు విపరీతమైన అభిమానం మక్కువ. కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తరువాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితి పొందిన వాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చెయ్యరాదు. కాని అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు. నారదమహర్షి వచ్చి అతనికి అతనికి జ్ఞానోదయం కలిగించాడు. అప్పటినుండి అతను యజ్ఞయాగాదులు మానేసాడు.

కాబట్టి, “ఏది హింస, ఏది కాదు, ఎవరు ఏమి చెయ్యాలి?, ఏమి చెయ్యకూడదు” అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే నువ్వు నేను కాదు. మనకు వేదమే ప్రమాణం. చట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికి తెలుసు. విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే. కాయగూరలు, ఆకుకూరలు కూడా జీవహింస కదా. అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బ్రతికేవారు అని శాస్త్రాలు చెప్తున్నాయి.

కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసేదేమంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే హింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు.

--- థిల్లైనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4

#KanchiParamacharyaVaibhavam #Paramacharya

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

20 Jan, 01:09


వైదిక యజ్ఞం - జీవ హింస

1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. కారణమేదైనప్పటికి జంతువులను చంపడం పాపం అని తీర్మానించారు. కాబట్టి మాంసాహారాన్ని వదలి అందరూ శాఖాహారులుగా మారాలి అని చెప్పారు. అహింస, శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు.

ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులని పరమాచార్య స్వామి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చారు. స్వామి వారిని కలవాలని ఆ ప్రతినుధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

శంకర మీనన్ అందరిని పేరు ఊరుతో సహా స్వామి వారికి పరిచయం చేసారు. వారిని పరిచయం చేసిన తరువాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామి వారు వారించి, “నా గురించి నువ్వు ఏమి చెప్పనవసరం లేదు. నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు.

కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?”

అందుకు మహాస్వామి వారు “అవును అది చేయతగినదే. అది పాపం కాదు” అని బదులిచ్చారు. ఇది వినగానె వారందరూ ఫక్కున నవ్వారు. స్వామి వారిని అవమానపరిచారు అని మీనన్ గారికి కోపం వచ్చింది. వారివైపు తిరిగి ఆవేశంతో, “నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది స్వామి వారి ఆశీస్సులకోసం. మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అని తెలిసుంటె నేను ఈ పనికి పూనుకునేవాణ్ణి కాదు” అని అరిచారు.

స్వామివారు మీనన్ ను శాంతపరిచారు. “వాళ్ళపై కోపం పడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు. జీవహింస పాపం అని అది ఏ కారణానికి అమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు. నన్ను అవమాన పరచలాని వాళ్ళకు ఆలోచన లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి” అని శాంతంగా చెప్పారు.

మీనన్ కోపం తగ్గిన తరువాత మళ్ళా స్వామి వారు ఇలా చెప్పారు “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా? మరి న్యాయమూర్తి చెసినది పాపం కాదా?”

స్వామి వారి మాటలు వారిని అలోచనల్లో పడేసాయి. వారు చాలా విద్యావంతులు. సత్యప్రమాణములైన మాటలు స్వామి వారు చెప్తున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు.

మరలా మహాస్వామి వారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం. అప్పుడు ముందు అగ్నిమాకప యంత్రాన్ని పంపిస్తాం. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాం. కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది. కాబట్టి అలాంటి సందర్భంలో దేశరక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్కచెయ్యము.

రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను అమోదిస్తాం. ఇలాంటి నియమాలణ్ణి మనం ఏర్పరుచుకున్నవే. అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.

వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు భేదం లేదు. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘శాస్త్రాయ చ సుఖాయ చ’. వేదాలు, శాస్త్రాలు మంచినే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు.

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ

మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే, దేవతలు మనకు సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తారు. కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరిఅయినదే. దాని వల్ల పాపము లేదు. అంతేకాదు. సనాతన ధర్మంలో యజ్ఞము చేయిట హింస, పాపము అని కూడా చెప్పబడింది కాబట్టి చేయకూడదు. కాని ఎవరు చేయుకూడదు అనే విషయం మనం తెలుసుకొని ఉండాలి.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Jan, 01:50


సప్త పవిత్రాలు ఏవి?

ఆచార వ్యవహారాలు బాగా తెలిసిన, కర్మలు/అకర్మాలు చేయించే వైదికులు ఉన్న సభలో, ఒక పండితుడు తల్లి తండ్రులు మరణించిన పిదప చేయు పితృ శ్రాద్ధము/కర్మల యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి చెబుతున్నాడు.

“సప్త పవిత్రః అంటే అర్థం ఏమ”ని సభనుద్దేశించి ప్రశ్నించారు మహాస్వామివారు.

ఒక వైదికుడు శాస్త్రం చెప్పిన ఏడు పవిత్ర వస్తువుల గురించి ఇలా చెప్పాడు. “ఆవుపాలు, శివ నిర్మాల్యము లేదా గంగ, తేనె, తెల్లని పట్టు, కుమార్తె కొడుకు, సరైన సమయం(పితృ కార్యం చెయ్యడానికి) మరియు నువ్వులు అని చెబుతారు”

తరువాత పరమాచార్య స్వామివారు దాని గురించి ఇలా వివరణ ఇచ్చారు.

“అందులో ఉన్న ‘సవపర్పతమ్’ అంటే పట్టు పురుగులను చంపి దానినుండి సేకరించిన పట్టుతో తయారుచేసిన వస్త్రం అని అర్థం తీసుకోరాదు. ‘సవం’ అంటే సహజంగా చనిపోయిన పట్టుపురుగు. అంటే అలా సహజంగా చనిపోయిన పట్టుపురుగుల యొక్క దారంతో చేసిన పట్టు పంచె. అందుకే నేటికి కేరళలో శ్రాద్ధ కర్మలకు వచ్చిన వైదికులకు తెల్లని పట్టు పంచెలు ఇస్తారు. తరువాతి పదం ‘దౌహిత్యం’. ‘దౌహిత్రః’ అంటే కుమార్తె కుమారుడు అనే పదం నుండి ఉద్భవించింది. శ్రాద్దంలో కుమార్తె కొడుకు భోజనం చేయాలని తరచుగా చెప్పే అన్వయం. ‘దౌహిత్యం’ అంటే ఖడ్గమృగం కొమ్ముతో తయారుచేసిన పాత్ర. కొమ్ములున్న జంతువులన్నీ రెండేసి కొమ్ములతో ఉంటాయి. కాని ఖడ్గమృగానికి మాత్రం ఒక్క కొమ్ము ఉంటుంది. అందుకే దాన్ని ‘ఏక శృంగి’ అంటారు. దాని భాష్యం ‘దౌహిత్యం ఏకశృంగి పాత్ర విశేషః’ అని ఉంటుంది. అంటే ‘ఒక్క కొమ్ము పాత్ర ఉత్తమమైనది’ అని అర్థం”

పరమాచార్య స్వామివారు ఇటువంటి విషయాలను ఎంతో విపులంగా, సరళంగా విషదపరచేవారు.

--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహా పెరియవళ్ దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

18 Jan, 00:40


నా గురువు – నేను

ఊగార్ యతి మహరాజులు, బ్రాహ్మీభూతులు శ్రీ నారాయణానంద సరస్వతీ “నడయాడే దైవం” గురించి నాకు చెప్పారు. శ్రీ డి. బాలగోపాలన్, నేను, నా భార్యతో కలిసి వారిని చూడడానికి తుంగభద్రకు వెళ్ళాము. 83 సంవత్సరాల పరమాచార్య స్వామివారు అక్కడ మకాం చేశారు. నా వర్కారీ (పండరీపురం భక్తుల దుస్తులు) వేషం చూసి, “పండరి పండరీనాథుడు నన్ను పిలుస్తున్నాడు; నేను పంఢరీపురం వెళ్ళాలి” అని ప్రకటించారు స్వామివారు. ఈ సంవత్సరం చాతుర్మాస్యం బెల్గాంలో చేయాల్సిందిగా స్వామివారిని అర్థించాను. జూన్ 17, 1979 నాడు బెల్గాం లోని గురుదేవ్ మందిరంలో స్వామివారి స్వాగతం సమారోహణం అద్భుతంగా జరిగింది. ఆ ట్రస్టుకు నేను అప్పుడు కార్యదర్శిగా ఉండేవాణ్ణి.

“నువ్వు నీ వ్రతాన్ని నిర్వహించడానికి పంఢరీపురం వెళ్ళు, నేను చాతుర్మాస్యానికి ఇక్కడే ఉంటాను” అని అనుగ్రహించారు స్వామివారు. నేను ద్వాదశి నాడు తిరిగొచ్చాను. చాతుర్మాస్యం నిర్వహించడానికి తగిన సూచనలు ఇవ్వవలసిందిగా స్వామివారిని కోరాను. “ప్రతిరోజూ ఉదయం జ్ఞానేశ్వరి (300 ఒవీలు) చదవడం, సాయంత్రం హిందీలో వాటి గురించి వివరించడం” చేయాలన్న స్వామివారి ఆదేశం నాకు కలిగిన భాగ్యం. సంత జ్ఞానేశ్వర్ దేవులు భగవద్గీతను 9000 ఒవీలుగా రచించారు. 700 ఏళ్ల క్రితం కేవలం పదిహేనేళ్ళ వయస్సులో!

సాయంత్రంపూట స్వామివారి శిష్యులైన శ్రీ విద్యార్థి గారు నేను చెప్పే వివరణను పుస్తకంలో వ్రాసుకునేవారు. తరువాత స్వామివారు కొన్ని ప్రశ్నలు వేసేవారు. అది నేను వివారిస్తున్న జ్ఞానేశ్వరిని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి నాకు స్వామివారు కలిగించిన అనుగ్రహం. ప్రతిరోజూ ఈ పారాయణను ఒక కీర్తన పాడి ముగించేవాణ్ణి.

వినాయక చతుర్థి సమయంలో గురుదేవ్ మందిరంలో ప్రతిరోజూ ఒక మట్టి వినాయక ప్రతిమకు పూజలు జరిగేవి. ఒకరోజు రామేశ్వరం నుండి కొంతమంది పురోహితులు కొన్ని కళశాలలో మంత్రజలాన్ని తీసుకునివచ్చారు. నన్ను కాస్త బయటి ప్రదేశంలో నిలబడమని చెప్పి ఆ కలశ జలాలను నాపై ప్రోక్షణ చేయవలసిందిగా వారిని స్వామివారు ఆదేశించారు. నా ఆనందానికి అవధులు లేవు. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇది అనంతమైన చేతులతో భగవంతుడు నాకిచ్చిన ఆశీస్సులు. రెండు చేతులు ఉన్న నేను ఎంతని పుచ్చుకోగలను?

మరలా ఒక పర్వదినాన కపిలేశ్వర మందిరంలో ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా కళశాభిషేకం నిర్వహించమని స్వామివారు ఆదేశించారు. ఈ శివలింగం చాలా పాతది. చాలామంది భక్తులు తమ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రను ఈ మందిరంలో ఉన్న శివలింగ దర్శనంతో పూర్తిచేస్తారు. స్వామివారు ఈ దేవాలయంలో ఉన్న కుండంలోనే స్నానమాచరించేవారు. ఈ కుండం నుండి 108 కలశాల నీటితో గర్భాలయంలో ఉన్న స్వామివారిని అభిషేకించడం నా ఒక్కడివల్ల జరిగే పని కాదు. స్వామివారి ఆదేశం మేరకు 25 మంది మానవహారంగా ఏర్పడి, నేను ఒక చివర్న గర్భగృహంలో ఉండి స్వామివారి అభిషేకం పూర్తిచేశాము. చాతుర్మాస్య సభలలో భాగంగా వేద శాస్త్ర పండితుల సన్మానం జరిగింది. కలకత్తా మరియు ఇతర స్థలాల నుండి సామవేద పండితులు వచ్చారు. వేదపాఠశాల విద్యార్థుల పరీక్షలు జరిగాయి. శ్రీ విద్యార్థి గారు మరియు ఇతర పండితులు పరీక్షాధికారులు, అయినా స్వామివారు కూడా మొత్తం పరీక్షా సమయం అత్యంత శ్రద్ధగా అన్నీ గమనిస్తూ అక్కడే ఉన్నారు. శిష్యులకు స్వామివారి చేతులమీదుగా సన్మానాలు, ధృవీకరణ పత్రాలు ఇచ్చారు.

బెల్గాంలో స్వామివారి దర్శనం, ఆశీస్సుల కోసం చాలా మంది భక్తులు వచ్చేవారు. బహుశా వారు ప్రతీ ససంవత్సరం చాతుర్మాస్యం సమయంలో వస్తారు అనుకుంటా. జస్టిస్ రంగనాథ మిశ్రా, వేదాంత ట్రస్ట్ శ్రీ దొరైస్వామి, జి. డి. బిర్లా, ఎం. యస్. సుబ్బలక్ష్మి, మహారాణి సోఫియా అందులో కొంతమంది. ప్రముఖ విద్వాంసులు డా. టి. ఎం. పి. మహదేవన్ మరియు మహారాణి, వారి పరివారంతో సహా ప్రత్యేక రైల్లో వచ్చారు. విదేశీ భక్తులు ఎందరో బెల్గాంలో ఉంటూ స్వామివారి దర్శనానికి వచ్చేవారు. విశ్వ హిందూ పరిషత్తు స్థాపకుల్లో ఒకరైన దాదాసాహెబ్ ఆప్టే, కార్యదర్శి అమరేంద్ర గాడ్గిల్ స్వామివారితో కాసేపు సంస్కృత సంభాషణ చేశారు.

భాద్రపద కృష్ణ షష్టి రోజు నన్ను స్వామివారు పిలిచారు. ఆనాటి ప్రాముఖ్యత స్వామివారికి తెలుసన్న విషయం తెలుసుకుని నేను చాలా ఆనందపడ్డాను. 700 సంవత్సరాల క్రితం మరాఠీ వారైనా సంత జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వరి (భావార్థ దీపిక) ని రచించారు. కానీ అప్పటి పద్ధతుల దృష్ట్యా విజ్ఞానం అంతా మౌఖికంగానే ఉండేది. వ్రాతప్రతులు కొన్ని మాత్రమే లభ్యమయ్యేవి. దాంతో మూలప్రతి తరచూ మార్పులకు గురయ్యేది. 500 ఏళ్ల క్రితం ఏకనాథ్ అనే మరొక సాధువు కలలో జ్ఞానేశ్వర్ దర్శనం పొందారు. ఆలండీలో నిరాదరణకు గురైన జ్ఞానేశ్వర్ సమాధిని కనుగొని, నిజమైన జ్ఞానేశ్వరి మూలప్రతిని సంపాదించారు. జ్ఞానేశ్వరిని మరలా చక్కగా రాశారు. మరలా దాన్ని రాయడం ముగించిన రోజు భాద్రపద కృష్ణ షష్టి అని అందులో చివర్లో వ్రాసుకున్నారు. ఆరోజు కపిల షష్టి యోగము కూడా.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

18 Jan, 00:40


ఆరోజు స్వామివారు నాకు ఒక గొప్ప సేవను అనుగ్రహించారు. దక్కను ప్రావిన్స్ లోని మౌర్య నుండి కొందరు నాకు పాతది, కాస్త చినిగిన తమిళ జ్ఞానేశ్వరి ప్రతిని నాకు ఇచ్చారు. దాన్ని నాకు చదవడం రాకపోవడంతో ఊరికే పెట్టుకున్నాను. దాన్ని నేను పరమాచార్య స్వామివారికి సమర్పించాను. స్వామివారు దాన్ని చదవడమే కాకుండా తమిళం తెలిసినవారు కూడా దాన్ని చదవాలని భావించారెమో, 2000 ప్రతులు తయారుచేసి తమకు ఇవ్వమని చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు అది కాస్త పెద్ద విషయమే. ఆ ప్రాంతంలో తమిళ్ ముద్రణాలయం లేదు. స్వామివారి అనుగ్రహంతో ఆ కార్యం “రాజన్ & కొ” వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తరువాతి రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ముద్రణాలయం పెద్ద యజమాని కాలం చేశారు. పుస్తకానికి పురుగుల తాకిడి వల్ల కొన్ని అక్షరాలు పోయాయి. కానీ వాటినన్నిటినీ స్వామివారు సరిచేశారు.

స్వామివారి 95వ జన్మదినాన్ని పురస్కరించుకుని నేను, నా భార్య, మా అమ్మాయి, నా బంధువు వి. యస్. పజే, యస్. సి. సుబ్రమణియం మరియు భారతీయ విద్యా భవన్ రామకృష్ణన్ మరికొంతమంది సమక్షంలో కంచి మఠంలో స్వామివారికి పుస్తక సమర్పణ చేశాము. సాయంత్రం చెన్నైలో భారతీయ విద్యా భవన్ వారు ఒక సభ ఏర్పాటు చేశారు.

ప్రతీ సంవత్సరం మేమందరం ఒక బృందంగా ఏర్పడి కంచి మఠంలో జ్ఞానేశ్వరి పారాయణ చేస్తాము. రోజూ స్వామివారి ఆశీస్సులు, దర్శనం లభించేవి. మాకు తగిన భోజన, వసతి ఏర్పాట్లను స్వామివారు చక్కగా చేయించేవారు. అది వారి అవ్యాజమైన ప్రేమ!

--- దిగంబర్ పరులేకర్, “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

17 Jan, 00:32


నా అనుభవాలు

1971లో పరమాచార్య స్వామివారు కార్వేటినగరం ట్యాంక్ స్క్వేర్ లో మకాం చేస్తున్నారు. ఇరవై రోజుల తరువాత స్వామివారు పల్లిపుట్ కొబ్బరి తోటకు మకాం మార్చి ఉదయం దాకా పూజలు చేశారు. తరువాత స్వామివారు కార్వేటినగరం వెళ్లారు కానీ ట్యాంక్ స్క్వేర్ కు వెళ్ళకుండా ఆరోజు రాత్రి 10 గంటలప్పుడు వేణుగోపాలస్వామి మండపానికి వచ్చారు. తరువాత ఆ రాత్రి కుండపోత వర్షం కురిసింది. మరుసటిరోజు ఉదయం శిష్యులతో కలసి స్వామివారు ట్యాంక్ స్క్వేర్ కు వెళ్ళి చూడగా, అక్కడ ఏర్పాటు చేసిన కుటీరం పెద్ద గాలులకు వర్షానికి ధ్వంసం అయ్యింది. ఈ పరిస్థితి స్వామివారికీ ముందుగానే తెలుసు కాబట్టి వేణుగోపాల స్వామి మండపానికి మార్చారు. స్వామివారి దూరదృష్టి అసామాన్యం. స్వామివారితో ఉన్నవారు కూడా రక్షణ పొందుతారు.

మహాస్వామి వారు నవరాత్రులప్పుడు, అక్టోబరు 10, 1971 రోజు కాష్టమౌనంలో ఉన్నారు. నేను తిరుపతి వెళ్ళడానికి స్వామివారి అనుమతి కోరగా కొన్ని సైగలు చేశారు స్వామివారు. నాకు అది అర్థంకాక నేను బయలుదేరాను. అంతలోనే స్వామివారి రక్షకుడు సుబ్బయ్య బస్టాండుకు పరుగున వచ్చి స్వామివారు నన్ను వెంటనే రమ్మన్నారని చెప్పాడు. స్వామివారి దర్భాసనం, చెక్కపీట, టార్చిలైటు మొదలైనవి తీసుకొమ్మని చెప్పి, నన్ను వారివెంట రమ్మన్నట్టు సైగ చేశారు. మేము కార్వేటినగరం వెలుపల ఉన్న అష్టకోణం, బ్రహ్మసరస్సును చేరుకున్నాము. మకాం అక్కడే. స్వామివారు నన్ను ఏమైనా తిన్నానా అని కనుక్కుని, విష్ణు సహస్రం చదవమన్నారు. మరుసటిరోజు ఉదయాన్నే నన్ను నిద్రలేపారు స్వామివారు. కార్వేటినగరం నుండి పుత్తూరుకు అడవిమార్గం గుండా దగ్గరి త్రోవ ఉంది. అది అక్కడివారికి కూడా ఎవరికీ తెలియదు. స్వామివారికి ఎలా తెలుసో నాకు ఆశ్చర్యమే.

కార్వేటినగరంలో అయిదు బ్రాహ్మణ ఇళ్ళు ఉన్నాయి. వినాయక చవితి సమయంలో, ఒక వెండి పళ్ళెంలో “కార్వేటినగర్ బ్రాహ్మణ పూజ” అని రాయించమని జయేంద్ర సరస్వతీ స్వామివారిని ఆదేశించారు. 500 రూపాయల (ఇంటికి 100 రూపాయలు) నామమాత్రం రుసుము కట్టమని చెప్పి, వినాయక పూజ చేసి మోదకాలను నివేదన చేయమని ఆదేశించారు. ఎంతైనా సమర్పించేవారు ఎందరో ఉన్నా స్వామివారు మా సమర్పణను అంగీకరించారు. ఈనాటికీ ఈ పూజ జరుగుతోంది.

1971లో స్వామివారి సురుట్టుపల్లి యాత్రలో నేను కూడా పాల్గొన్నాను. స్వామివారు పది రోజులపాటు పళ్ళికొండేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నారు. నన్ను పిలిచి పళ్ళికొండేశ్వర స్వామివారిపై పంచరత్నం రాయమని చెప్పారు. అది ఇలా సాగుతుంది, “దేవ్యురు శయనం దేవం శ్రీపన శాంత విగ్రహం” “శేసేహె ఇవ శేశే పురుషోత్తమాంజలి సుపూజ్యం”. స్వామివారు ఆశుకవి అని ఈ సంఘటన నిరూపిస్తుంది.

1972లో కుమార్తె వివాహం కోసం ఒక పేదతల్లి స్వామివారి వద్దకు వచ్చింది. స్వామివారు పూజకు ఉపక్రమిస్తుండడంతో శివాస్థానం వద్ద వేచివుండమని చెప్పారు. స్వామివారు పూజ చేస్తూ ఉండగా, మరొక భక్తుడు తన బంగారు గొలుసును లకెట్టును సమర్పించాడు. అతన్ని ఆ తల్లివద్దకు పంపారు స్వామివారు.

మహాస్వామి వారు నడయాడే దైవం, శాస్త్రవేత్త, కవి, జ్యోతిష్కులు, సంగీతకారులు ఇంకా ఎన్నో అయినా ఒక్కరే. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా కావాల్సినది అంటే, అది స్వామివారి ఆశీస్సులు మాత్రమే.

--- మాధవన్, తిరుచానూరు. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Jan, 00:49


దవనం - దొంగ

పరమాచార్యస్వామి వారు ఎక్కడ బసచేసినా అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భక్తులు తరచుగా మహాస్వామి వారిని దర్శిస్తుంటారు. మహాస్వామి వారికి కూడా వారు తెలుసు. ఒక రోజు తరచుగా మహాస్వామి వారిని దర్శించే ఒక ముసలావిడ శ్రీమఠానికి వచ్చింది. తన వంతు రాగానే మహాస్వామి వారికి నమస్కారంచేసి వారిని దర్శించుకుంది. పరమాచార్యస్వామి వారు ఆ ముసలావిడని అశీర్వదించి, ఒక పళ్ళెంలో కొన్ని పళ్ళు ఉంచి ప్రసాదంగా తీసుకొమ్మన్నారు. ఆవిడ ఆ పళ్ళెంతీసుకుని పళ్ళుతీసుకుంటూ ఒక చిన్న దవనం తీగని చూసింది. ఆవిడ ఆ దవనాన్ని పక్కకి విసిరివేసి పళ్లను తీసుకోబోయింది.

మహాస్వామి వారు దీన్ని చూసి,”ఎందుకు ఆ దవనాన్ని పారవేసావు? అది నీకు ఉపయోగపడుతుంది తీసుకో” అని అన్నారు.

ఎందుకు మహాస్వామి వారు ఇలా అంటున్నారో అని ఆవిడ ఒక్క నిముషం ఆశ్చర్యపోయి మరు మాట్లాడకుండా వెంటనే ఆ దవనాన్ని తీసుకుని జాగ్రత్తగా తన వద్ద దాచుకుంది. దర్శనానంతరం ఆవిడ మఠాన్ని వదిలి తన ఊరు చేరుకోవడానికి బస్టాండుకు వెళ్ళింది. తను ఎక్కవలసిన బస్సు దొరకగానే ఎక్కి కూర్చుంది. అలా కూర్చోగానే ఆవిడకు కొద్దిగా నీరసంగా అనిపించి, నిద్రలోకి జారుకుంది.

ఈ ముసలావిడ పక్కన కూర్చున్న ఆవిడ మంచిది కాదు. నిద్రపోతున్న ఆ ముసలావిడ సంచీ నుండి పర్సును దొంగిలించింది. కండక్టరు టికెట్టు ఇవ్వడం కోసం వచ్చినప్పుడు ఆ ముసలావిడ నిద్రలేచి డబ్బు ఇవ్వడంకోసం పర్సు వెతకగా అది కనిపించలేదు. పక్కన కూర్చున్న ఆవిడ చేతిలో తన పర్సు చూసి కోపంతో ఆ పర్సు నాది నువ్వు దొంగిలించావు అని గొడవపెట్టుకోసాగింది. కాని ఆవిడ ఆ ముసలావిడ్ని గదమాయిస్తూ ఆ పర్సు తనది అని అందులో ఎంత డబ్బు ఉందో కూడా సరిగ్గా చెప్పింది.

ఇప్పుడు కండక్టరు ఇబ్బందిలో పడ్డాడు. అది ఎవరి పర్సో తేల్చుకోలేకపోతున్నాడు. అకస్మాత్తుగా ముసలావిడకి ఏదో స్ఫురించినట్టు కండక్టరుతో “అందులో డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని అది ఏంటో ఆవిడని చెప్పమని” అడిగింది.

ముసలావిడ చెప్పిన మాటలు విని ఆ పర్సు దొంగిలించినావిడ నోట మాట రాక బేల మొహం వేసింది. అప్పుడు ముసలావిడ కండక్టరుతో అందులో చిన్న దవనం తీగ ఉన్నది అని కావాలంటే చూసుకొమ్మని చెప్పింది. కండక్టరు పర్సుతీసి చూడగా అందులో చిన్న దవనం ముక్క కనిపించింది. అప్పుడు ఆ పర్సు దొంగిలించినావిడ తన తప్పును ఒప్పుకుంది. ఆ ముసలావిడ ప్రార్థన మేరకు ఆవిడను క్షమించారు.

పరమాచార్య స్వామి వారు ఆ చిన్న దవనం ముక్కని పారవేయొద్దని ఎందుకు అన్నారో అప్పుడు అర్థం అయింది. మనస్సులోనే మహాస్వామి వారికి నమస్కరించుకుని క్షేమంగా తన ఊరు చేరుకుంది.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

15 Jan, 14:59


జయ శంకర !! హర శంకర !!

కనుమ సందర్బంగా ఇవాళ అద్వైత గోశాలలో సంపూర్ణ భగవద్గీతా పారాయణ, గో పూజ, వృషభ పూజ,

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

15 Jan, 00:18


పొంగల్ - మాట్టు పొంగల్

పరమాచార్య స్వామి దర్శనానికి న్యాయవాది చంద్రశేఖర్ ప్రతి భోగి రోజు వచ్చేవారు. అలాగే 1989లో మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, శ్రీమఠం గోశాల నిర్వాహకుడు చిన్న కాళీయన్ కూడా స్వామిదగ్గర నిలబడి ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. “అతనికి ఏమి కావాలో కనుక్కో?” అని శిష్యులను అడిగారు.

”ఎల్లుండి మాట్టు పొంగల్(కనుమ) పెరియవ. గోవుల కొమ్ములకు రంగులు వెయ్యాలి. వాటిని పూలదండలతో అలంకరించాలి. . .” అంటూ కాస్త నసుగుతూ ఇంకా చెప్పబోతుండగా, మహాస్వామివారే “ఓహ్ అలాగా అలాగైతే. అతని వద్ద ద్రవ్యం లేదా?” అని అడిగారు. కాళీయన్ అవునని తలూపాడు.

”ఎవరు వచ్చారు?” అని శిష్యులను అడిగారు స్వామివారు.

”తిరువారూర్ వచ్చారు” అని చెప్పారు.

న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూర్ నుండి బయలుదేరుతున్నప్పుడు, అతని క్లైయింట్ ఒకరు స్టాంపు, కోర్టు ఖర్చులకు గాను ఇచ్చిన 4000 రూపాయలను అతని చేతిసంచిలో ఉంచుకొని కాంచీపురం బయలుదేరాడు. కేవలం తిరుగు ప్రాయాణానికి బస్సు చార్జీలకు సరిపడు డబ్బు ఉంచుకొని తక్కిన సొమ్ము మొత్తం కాళీయన్ కు ఇవ్వమని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. ఆ డబ్బు తీసుకుని కాళీయన్ ను వెళ్లమన్నారు.

తరువాత స్వామివారు ఆ న్యాయవాదితో, “ప్రతి మాట్టు పొంగల్ కి శ్రీమఠానికి నీకు ఇవ్వగలిగినంత సొమ్ము తీసుకునిరా. అలాగే బెల్లం పొంగలి చేసుకొని వచ్చి మీ చేతులతోనే గోవులకు పెట్టండి” అని చెప్పారు. అతను అలాగే అని స్వామి వారి వద్దనుండి ప్రసాదం స్వీకరించి వెల్లిపోబోతుండగా, “తిరువారూర్ వెళ్ళిపొయాడా?” అని అడీగారు.

స్వామివారు మరలా వారిని పిలిపించి “బెల్లం పొంగలి ఎలా తయారు చేస్తారో తిరువారూర్ భార్యని అడగండి” అని శిష్యులను ఆదేశించారు. ఆమె తయారు చేసే విధానాన్ని చెబుతుండాగా, స్వామివారు అందుకొని “లేదు. లేదు. ఆవులకు పెట్టడం కోసం తయారు చేసేప్పుడు గోవుల నుండి వచ్చిన పదార్థాలను అందులో కలపకూడదు. అలా చేస్తే పాలిచ్చే ఆవు వట్టిపోతుంది” అని చెప్పారు.

ఇంకా ఇలా చెప్పారు, “అన్నాన్ని ఉడికించి, బెల్లం కరిగించి అవక్షేపాలు తొలగించాలి. ఆ అన్నాన్ని బెల్లాన్ని బాగా కలిపి గోవులకు తినిపించాలి”. పాలు, పెరుగు, నేయి, వెన్న - ఇవి ఏవి దానికి కలపకూడదు. వాటిని కలిపి పెడితే ఆవులు పాలు ఇవ్వవు. ”క్షేమంగా ఉండండి” అని స్వామివారు ఆ దంపతులను ఆశీర్వదించారు. ముగ్గురు అన్నదమ్ముల ఆ తిరువారూర్ కుటుంబం 1990 నుండి ప్రతి సంవత్సరము మాట్టు పొంగల్ రోజు పరమాచార్య స్వామివారు విధంగా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

11 Jan, 01:28


అసమర్థత - సమర్థత

తమిళనాడులో సోమసుందరం ఆచారి ఒక ప్రఖ్యాత స్థపతి ఉండేవారు. అతనికి చదవడం, రాయడం, నలుగురిలో మాట్లాడడం కూడా చేతకాదు. కానీ అతనికి రథాల నిర్మాణం గురించిన సమస్త విషయాలు తెలుసు. దాదాపు 25 దేవాలయాలకు రథాలను తయారుచేసి రథ నిర్మాణంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కానీ వాటి గురించిన సమాచారం ప్రసంగం రూపంలో చెప్పలేడు. 1962లో తమిళనాడులో జరిగిన ఆగమ శిల్ప సదస్సుకు ఆహ్వానం అందింది.

ఆ సదస్సును పర్యవేక్షిస్తున్నది స. గణేశన్. వారికి కూడా రథ నిర్మాణంపై కొంచం అవగాహన ఉంది. ఆచారి సభలో మాట్లాడడానికి సాహసం చెయ్యడు కాబట్టి, ఆచారికి రథ నిర్మాణంపై ఉన్న జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవడం కోసం పరమాచార్య స్వామివారు గణేశన్ తో “రథ నిర్మాణం గురించి నీకు కాస్త అవగాహన ఉంది కావున, స్థపతిని నువ్వు దాని విషయమై ప్రశ్నలను అడుగు. మొత్తం తనకు తెలిసిన విజ్ఞానాన్ని అంతా స్థపతి పంచుకుంటాడు” అని చెప్పారు.

అలాగే గణేశన్ అడిగిన అన్నీ ప్రశ్నలకు స్థాపతి చాలా చక్కని వివరణతో కూడిన సమాధానాలు ఇవ్వసాగాడు. సదస్సుకు వచ్చిన వారందరికీ గణేశన్ – స్థపతిల పరిప్రశ్నలతో ఈ విషయంపై ఎంతో సమాచారం లభించింది. స్థాపతికి బంగారు స్వర్ణమాల మరియు “రథ చక్రవర్తి” అన్న బిరుదును సోమసుందరం ఆచారికి ఇవ్వాలని సదస్సు నిర్ణయించింది.

--- బి. ఎం. ఎన్. మూర్తి, బెంగళూరు. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

10 Jan, 00:31


చాలా చిరాకుగా ఉన్నా, దాన్ని పైకి కనబడనివ్వలేదు. చివరకు రాత్రి 9:30 కు స్వామివారి నుండి కబురు వచ్చింది. ఏకాంతంగా మాట్లాడాలని సహాయకులని పంపించేశారు.

“ఇది అమావాస్య చీకటి, నా పూజా సామాగ్రి కాంచీపురానికి తీసుకునివెళ్ళాలి. మీ కారులో వాటిని తీసుకుని వెళ్ళి, మఠంలో అప్పగించి తిరిగి మీరు మద్రాసుకు వెళ్ళండి” అని ఆదేశించారు స్వామివారు. వెంటనే సేవకులను సామాగ్రిని కారులో పెట్టమని చెప్పి తోడుగా ఇద్దరు సేవకులను కూడా పురామాయించారు. పది దాటిన తరువాత కాంచీపురం చేరుకుని వాటిని అప్పగించి, మధ్యరాత్రిలో ఇంటికి చేరుకున్నారు. అప్పుడే వారికి అర్థమైంది వారు చేర్చిన స్వామివారి పూజాసామాగ్రి విలువ ఏమిటో.

తిరుపతికి వెళ్ళేదారిలో బుగ్గ అని ఒక ఊరు వుంది. స్వామివారు అక్కడ మకాం చేస్తున్నప్పుడు వీరికి పిలుపు వచ్చింది. కొంతమంది స్నేహితులతో కలిసి వెంటనే వెళ్లారు. వారికోసమే ఎదురుచూస్తున్నట్టుగా స్వామివారు వారిని ఆహ్వానించారు. దగ్గరలోనే ఉన్న ఒక శివాలయాన్ని దర్శించి, దగ్గరలో ఉన్న జలపాతంలో స్నానం చేసి తిరిగొచ్చి తమకు చెప్పమన్నారు. జలపాతం ప్రత్యేకత ఏమిటని స్వామివారు అడుగగా, ఆ జలధార దేవాలయ మాళిగలో నుండి వస్తోందని, వంద అడుగుల కింద సువర్ణముఖి నది ఉందని తెలిపారు. “అదే ప్రకృతి మాయ మరియు భగవంతుని సృష్టి” అని చిన్నగా నవ్వారు స్వామివారు. అప్పుడు వారి స్నేహితుల్లో ఒకరు స్వామివారి మందహాసపు ముఖాన్ని కెమరా బంధించాలని ఫోటో తీశాడు. స్వామివారితో పాటు అక్కడున్నవారంతా వద్దని వారించారు. కొన్ని క్షణాల తరువాత ఉత్సుకతతో మరొక ఫోటో తీశాడు. స్వామివారు మౌనంగా తల అడ్డంగా ఊపారు. మారికొద్దిసేపటికి స్వామివారు గమనించడంలేదని మరలా ఒక ఫోటో తీశాడు. కానీ స్వామివారు గమనించి, “సమయాన్ని ఫిల్మ్ ని వృధా చేసుకోవలదు. ఏమీ దొరకదు” అని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తరువాత ఫిల్మ్ ని ఫోటోలు చేయగా ఆ మూడు తప్ప మిగిలిన అన్నీ ఫోటోలు చక్కగా వచ్చాయి. అవి మూడు మాత్రం ఖాళీగా ఉన్నాయి.

ఒకసారి స్వామివారు దక్షిణాపథానా ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తున్నారు. హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్న ఒక గ్రామం గుండా స్వామి మరియు పరివారం ప్రయాణించాల్సివుంది. ఒకటి రెండు రోజులు ఆగి వెళ్దామని పరివారంలోని వారు భయపడ్డారు. ఏమీ జరగదు ముందుకు నడవండని స్వామివారు నడక అప్పకుండా ముందుకుసాగారు. అందరూ భయంతో వణుకుతున్నారు. ఊరికి దగ్గరలో ఒక పెద్ద గుంపు కత్తులు, కట్టెలతో స్వామివారితో పాటు వస్తున్న ఈ సమూహంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి నాయకత్వం వహిస్తున్నవాడు చెయ్యెత్తి ఆగమన్నట్టు మందను శాంతపరిచాడు. జరగబోయే ఘోరాన్ని తలచుకుని అందరూ రెండు క్షణాల పాటు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. “ఓ స్వామినాథ ! మీరు ఏమి చెబితే మేము అది ఆచారిస్తాము” అని ఆ దౌర్జన్యకారుల నాయకుడు స్వామివారికి సాష్టాంగం చేసి గట్టిగా అరిచాడు. అందరూ అయోమయంతో చేతిలో ఆయుధాలను పడవేశారు. వెంటనే ఆ నాయకుడు ఆ మందవైపు తిరిగి స్వామివారికి రక్షణగా ఉంటూ క్షేమంగా తదుపరి గ్రామం దాకా వెంటఉండాలని ఆదేశించాడు. చుట్టూ అయోమయంతో ఉన్న భక్తులతో “ఇతను పాఠశాలలో నా సహాధ్యాయి” అని నవ్వుతూ చల్లగా చెప్పారు స్వామివారు. వెంటనే ఆ ఊరి ఇమామ్ ను కలవాలని తమ సన్నిధికి పిలిపించుకున్నారు. వెంటనే ఆ ఇమామ్ తో సౌభ్రాతత్వమూ, సహనము, ప్రేమ మొదలైనవి ఆచరించిన వారికి మాత్రమే లభించే దైవసాన్నిధ్యం గురించి తెలిపే ఖురాన్ సూక్తులను గుర్తు చేశారు స్వామివారు. గ్రామస్తులందరూ కలిసి స్వామివారిని ఉత్సవంగా తదుపరి గ్రామానికి చేర్చారు.

ఈ సందర్భంలో పరమాచార్య స్వామివారి కారుణ్యాన్ని, సకల జీవరాసులను ఒక్కటిగా చూసే దృష్టిని తెలిపే ఒక సంఘటన గురించి చెబుతాను. మద్రాసులో లోని సంస్కృత కళాశాలలో పరమాచార్య స్వామివారు ఉపయోగించడం కోసం తాత్కాలికంగా ఒక బావిని తవ్వాలని నిర్ణయించారు. అందుకు అనువైన స్థలాన్ని స్వామివారే చూపించి కింద నీటి ప్రవాహం ఉందని తెలిపారు. ఆరు నుండి ఎనిమిది అడుగులు తవ్వగానే, మంచి నీరు లభించింది. ఒక వారం తరువాత అందులో నాచు పెరిగింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో బాటనీ విభాగాధిపతిగా ఉన్న మావారు దాన్ని నివారించడానికి ఆల్గేసైడ్ ఉపయోగించాలని సూచించారు. అది చనిపోతుందని అడిగి తెలుసుకున్న వెంటనే “శివ! శివా! అలా చేయకండి. చిన్న అణువును చంపడానికి కూడా మనకు అధికారం లేదు” అని స్వామివారు అన్నారు.

--- శ్రీమతి రాధా సదాశివం, ‘kamakoti.org’ నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

10 Jan, 00:31


మహాస్వామి – మాయాస్వామి

పరమాచార్య స్వామివారు 1930లో మద్రాస్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మా ఇంటి ఎదురు వీధిలో ఉన్న శ్రీ ఎ. కె. రంగనాథ అయ్యర్ ఇంటిలో ఇతిహాసాలపై, శాస్త్ర విషయాలపై చర్చలు జరుగుతూ ఉండేవి. ఆచార్య స్వామివారిని క్షణకాలమైనా చూడాలని మా మామగారు డా. సీతాపతి అయ్యర్ గారు కారు షెడ్డులో చిన్న ద్వారం తెరిచి స్వామివారు ఎదురుగా ఉన్న రోడ్డులో ఉన్న ఇంటికి వెళ్ళడానికి మార్గం సుగమం చేశారు. ప్రతిరోజూ స్వామివారు మా ఇంటి వరండా నుండి అటువైపు రోడ్డుకు వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగేవారు. ఆ సమయంలో మా ఆయన మరియు అతని తమ్ముడు కలిసి అలా వెళ్తున్న స్వామివారిపై ఒక బుట్టెడు పూలతో పూల వర్షం కురిపించేవారు. కానీ స్వామివారు ప్రతీసారీ ఒక అడుగు వెనక్కు లేదా ముందుకు నిలిచేవారు. వారి ఆకర్షణీయమైన చిరునవ్వుతో మమ్మల్ని కట్టిపడేసేవారు. కొన్ని సంవత్సరాల తరువాత మావారు తిరుచ్చిలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. “నీవే కదా నాపై పుష్ప వర్షం కురిపించేవాడివి” అని అడిగి మావారిని ఆశ్చర్యపరిచారు స్వామివారు. శ్రీవారి ధారణా శక్తి అమోఘం! అలాగే నా మేనకోడాలి జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలే జరిగాయి. పెళ్ళయిన ఇరవై సంవత్సరాల తరువాత తన డాక్టరు భర్తతో కలసి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు తనని డా. సీతాపతి అయ్యర్ మనవరాలిగా పరిచయం చేశారు. స్వామివారు చిరునవ్వుతో, “నాపై పూల వాన కురిపించడానికి పూల బుట్టని వొంపడానికి ప్రయత్నించిన చిన్న పిల్లవు నువ్వే కదూ!” అని అడిగారు. ఆమె ఆశ్చర్యపోయింది.

తను నాతో పంచుకున్న కొన్ని సంఘటనలను మీకు తెలియయపరుస్తాను.

ఒకసారి తన భర్తతో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనం కోసం మద్రాసు దగ్గరలోని సింగపెరుమాళ్ కోయిల్ కు వెళ్ళింది. అప్పుడు వారు నాగర్ కోయిల్ లో ఉండేవారు. అక్కడ వారు స్వామివారికి చెక్క పాదుకలు చేయించడానికి ఒక ప్రత్యేక కలపను కనుగొన్నారు. కలపవాడు రెండు జతల పాదుకలు తయారుచేయగా, వాటిని తీసుకెళ్లాడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారు. స్వామివారి సన్నిధి చేరుకోగానే కొంత మంది భక్తులతో కూడి స్వామివారు ఆశీనులై ఉండడం గమనించారు. వీరు వచ్చినట్టుగా ఎవరో చెప్పడంతో వెంటనే రమ్మని పిలిచారు. వారు సాష్టాంగం నమస్కారం చేయగానే, “నా పాదుకలు తెచ్చారా?” అని అడిగారు స్వామివారు. అవునని చెప్పి స్వామివారి ముందు ఒక జత పాదుకలను ఉంచారు. వెనటనే స్వామివారు లేచి నిలబడి వాటిని ధరించి, “సరిగ్గా సరిపోయాయి, నా పాదముల కొలత నీకు ఎలా తెలుసు?” అని అడిగారు.

“నేను ఎప్పుడు మీకు సాష్టాంగ సనమస్కారం చేసినా, మీ పాదముల యందే నా దృష్టిని లగ్నం చేస్తాను” అని బాదులిచ్చారు. స్వామివారు నవ్వుతూ, “నాకు తత్వబోధ చేస్తున్నావు! మరొక జత నేను చెప్పే దాకా మీవద్దనే ఉంచండి. ప్రయాణంలో అవి మాయమవ్వచ్చు” అని అన్నారు. వారు పాదుకలు చేయించారని, అందునా రెండు జతలని, వాటిని ఇవాళ తన వద్దకు తెచ్చారని స్వామివారికి ఎలా తెలిసిందో మరి?

మరొక సందర్భంలో వారిరువురు కంచికి దగ్గరలోని కీళంబిలో మకాం చేస్తున్న స్వామివారి వద్దకు వెళ్లారు. క్షేమసమాచారాలు, కుశల ప్రశ్నలు అయిన తరువాత ప్రశాంతమైన చిరునవ్వుతో, “వీరు కర్మయోగులు, వీరిని ఎక్కువసేపు వేచివుండమని చెప్పారాదు” అన్నారు. ప్రసాదాలు ఇచ్చి బయలుదేరాడానికి అనుమతిచ్చారు. ఒక పెద్దవయసు వ్యక్తిని పిలిచి వారిని తమతో పాటు కారులో తీసుకునివెళ్ళవలసిందిగా ఆదేశించారు. ఆయన మరెవరో కాదు మహామహోపాధ్యాయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మరుసటి రోజు వారు మహామహోపాధ్యాయ సత్కారాన్ని తీసుకోవడానికి డిల్లీకి వెళ్లాల్సివుంది. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే అకారణంగా స్వామివారు ఆయన్ని పదే పదే వేచివుండమని చెప్పారు కాని మరుసటి రోజు ట్రైనుకు వెళ్లాల్సి ఉన్నందున వారు కాస్త ఆతృతతో ఉన్నారు. కాని స్వామివారు వీరి తిరుగు ప్రయాణాన్ని క్షేమంగా సిద్ధం చేసి వుంచారన్న విషయం వారికి తెలియదు. వారు మద్రాసుకు వెళ్ళే దారిలో ఒక బస్సుకు అపఘాతం జరిగి ప్రయాణీకులందరూ నిస్సహాయులై రోడ్డుపై నిలబడి ఉండడం గమనించారు. అప్పుడు సమయం రాత్రి 7:00 గంటలు. ఎవరికీ ఏమీ ప్రమాదం జరగలేదని నిర్ధారించుకుని ముదుకు సాగిపోయారు. అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు, “స్వామివారు నన్ను ఎందుకు అంతసేపు వేచి ఉండేలా చేసారో, నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. నేను కూడా సరైన సమాయనికి మద్రాసుకు చేరుకోలేక, ఢిల్లీ ట్రైను అందుకోలేక ఇలా నిస్సహాయుడనై రోడ్డుపై నిలబడి ఉండాల్సి వచ్చేది” అన్నారు.

మద్రాసు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వామివారు పర్యటిస్తున్నప్పుడు దర్శనానికి రమ్మని వీరికి కబురు వెళ్ళేది. ఈసారి కాంచీపురం రమ్మన్నారు, సాయంత్రం ఆరు గంటలకు. స్వామివారి ఆదేశాన్ని పాటించడం వారికి అలవాటు కనుక కంచికి 20 25 మైళ్ళ దూరంలో స్వామివారు ఉన్న చోటుకు చెరుకున్నారు. దాదాపు మూడు నాలుగు గంటల పాటు వేచిచూసినా ఏ కారణమూ, వివరణా తెలియరాలేదు. బాగా ఆలస్యమైపోతోంది, ఆ అమావాస్య చీకట్లో మద్రాసుకు తరిగి వెళ్ళడానికి దాదాపు 2 గంటల పైనే ప్రయాణించాల్సివస్తుంది.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

09 Jan, 04:21


కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) pinned «జయ జయ శంకర !! హర హర శంకర !! 2024 డిసెంబర్ నెలలో మనం ట్రస్ట్ తరుపున పూర్తిచేసిన కార్యక్రమాల వివరాలు * హైదరాబాదులో ఉన్న మన అభీష్టం గోశాలలోని గోవులకు గోగ్రాసం మరియు పౌష్టిక ఆహారం కొనుగోలు * కల్పతరు గోశాల, అద్వైత గోశాలల నిర్వహణ, పనివారి జీతాలు, ఎండు గడ్డి…»

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

09 Jan, 00:59


జయ జయ శంకర !! హర హర శంకర !!

2024 డిసెంబర్ నెలలో మనం ట్రస్ట్ తరుపున పూర్తిచేసిన కార్యక్రమాల వివరాలు

* హైదరాబాదులో ఉన్న మన అభీష్టం గోశాలలోని గోవులకు గోగ్రాసం మరియు పౌష్టిక ఆహారం కొనుగోలు

* కల్పతరు గోశాల, అద్వైత గోశాలల నిర్వహణ, పనివారి జీతాలు, ఎండు గడ్డి కొనుగోలు

* వారణాసి క్షేత్రంలో సాధు సంతులకు నిత్య నారాయణ సేవ.

* పరమాచార్య స్వామివారి జన్మ నక్షత్రం నాడు అనుషం మాస వేద పారాయణ

* తీవ్రమైన చలికాలం కావున సాధుసంతులకు, బీదసాదలకు రగ్గులు పంపిణీ.

* కంచి పరమాచార్య వైభవం పుస్తకాల బట్వాడా.

* ట్రస్ట్ తరుపున పరమాచార్య స్వామివారి 31వ ఆరాధనా మహోత్సవం నిర్వహణ

విరాళాలు పంపదలచినవారు Google Pay / Phone Pay / BHIM / Paytm ద్వారా UPI ID : 7259859202@hdfcbank ఉపయగించి చెయ్యవచ్చు.

ట్రస్టు బ్యాంకు అకౌంటు వివరాలు

A/C Name: Kanchi Paramacharya Dharmika Seva Trust
A/C. Num: 50200059599164
IFSC Code: HDFC0001753
A/C Branch: Kanakapura Road, Bengaluru

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Jan, 01:01


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Jan, 01:01


జనవరి 8 1994, మధ్యాహ్నం 2:58

కుమరేశన్ మామ మనల్ని కాలచక్రంలో ఆరోజుకు తీసుకునివెళ్తున్నాడు.

“జనవరి 7 ఏకాదశి కావడంతో పరమాచార్య స్వామివారు పూర్ణ ఉపవాసం ఉన్నారు. కాని, మేము బలవంతం చేసి కొద్దిగా గంజి ఇచ్చాము. అప్పటికే కొద్ది కాలంగా మహాస్వామివారి ఆరోగ్యం క్షీణించడంతో అ రాత్రంతా స్వామివారికి డ్రిప్స్ ఇచ్చారు. స్వామి వారు డ్రిప్స్ పై ఉండడంతో రాత్రంతా వారి చెయ్యి పట్టుకునే ఉన్నాను. డాక్టర్ శ్రీధర్ మరియు భాస్కర్ కూడా అక్కడే ఉన్నారు.

మరుసటిరోజు ద్వాదశి, అనుషం(స్వామివారి జన్మ నక్షత్రం). ఉదయం మూడు గంటలకు లేచారు స్వామివారు. ఎన్నడూ లేని విధంగా బలంగా, పెద్ద స్వరంతో ఉన్నారు. అందరినీ పేరుపేరునా గుర్తిస్తున్నారు. ఆకలిగా ఉందని చెప్పడంతో కొద్దిగా గంజి ఇచ్చాము. మహాస్వామివారికి నమస్కరించడానికి జయేంద్ర స్వామి, బెంగళూరు హరి వచ్చారు. పూజ పూర్తయ్యిందా అని జయేంద్ర స్వామిని అడిగారు స్వామివారు.

చెయ్యడానికి వెళ్తున్నానని బదులిచ్చారు జయేంద్ర స్వామివారు. పూజ చేస్తూ ఉండమని, ఆపవద్దని ఆదేశించారు. బెంగళూరు హరి వెండి పాదుకలను, పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లితండ్రుల చిత్రపటాన్ని తెచ్చాడు. శ్రీ చంద్ర పాదుకలను స్వామివారి పాదాలకు ఉంచి, పటాన్ని స్వామివారికి ఇచ్చాడు. కాని స్వామివారు దాన్ని గుర్తించలేదు. అప్పుడు నేను చదువ కళ్ళజోడుని తీసి మామూలు కళ్ళజోడు పెట్టుకోవడానికి సహాయం చేశాను. స్వామివారు చిత్రపటాన్ని చూసు దగ్గరగా పెట్టుకున్నారు.

తరువాత పాదుకల గురించి అడుగగా, స్వామివారి పాదాలకే ఉన్నాయని చెప్పాను. అప్పటిదాకా వదులుగా ఉన్న స్వామివారు పాదాలు, పాదుకలు కాళ్ళకు ఉన్నాయని తెలియగానే పాదాలను బిగించారు. ఎంత గట్టిగా బిగించారు అంటే, స్వామివారే వదిలేదాకా మేమెవ్వరమూ తీయడానికి కాలేదు.

బెంగళూరు హరి వెళ్ళవలసి ఉండడంతో పాదుకలను వదిలారు. పాదుకలను, చిత్రపటాన్ని హరికి ఇచ్చారు. తరువాత వీటిని ఎచ్చంగుడిలో(పరమాచార్య స్వామివారి తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి గ్రామం) ఉంచారు.

జయేంద్ర స్వామి పూజ పూర్తిచేసి పరమాచార్య స్వామి వద్దకు వచ్చారు. శంకర విజయేంద్ర స్వామితో కలిసి చెన్నైలో హిందూ మిషన్ సమావేశానికి వెళ్ళాల్సి ఉంది. స్వామివారు ఆరోగ్యంగా ఉండడంతో, సెలవు తీసుకుని ఇద్దరో వెళ్ళిపోయారు.

తరువాత మేము స్వామివారికి స్నానం చేయించి, భక్తుల దర్శనానికి వీలుగా ఈజీ చయిర్ లో కూర్చోబెట్టాము. ఆరోజు అనుషం కావడంతో, ప్రదోషం మామ, వారి భార్య, మెచేరి పట్టు శాస్త్రి వచ్చారు అనుషం ప్రసాదంతో. మహాస్వామి వారే తీర్థాన్ని తలపై చల్లుకుని, రక్షను నుదుటిపై ఉంచుకున్నారు. పట్టు శాస్త్రిని శంకర జయంతి ఏర్పాట్లు, మరికొన్ని విషయాలను అడిగి, వాళ్ళను ఆశీర్వదించి పంపారు. వారు సంతోషంతో మఠం నుండి వెళ్ళిపోయారు.

ఆరోజు ద్వాదశి కావడంతో స్వామివారు మంచిగా ఆహారం స్వీకరించారు. నేను, శ్రీ కంఠన్ తయారుచేసిన వంటకాల్ని(పాయసం, బాదాం హల్వా, పచ్చి అరటి ఇడ్లి) ఒక్కొక్కటి అడిగి మరీ స్వీకరించారు. భిక్ష ముగించగానే, లఘుశంకకు వెళ్ళాలని చెప్పారు. మేము స్వామివారిని మోసుకునివెళ్ళడానికి సిద్ధమయ్యాము. వైతా మామ, అరక్కోణం బాలు స్వామివారి కాళ్ళు పట్టుకోగా, బాలు జబ్బ పట్టుకున్నారు. స్వామివారిని కూర్చోపెట్టబోతుండగా స్వామివారు కాలు విదిలించడంతో, ముగ్గురూ కింద పడిపోయారు.

అప్పుడే స్వామివారి ఆత్మ దేహం నుండి విడివడింది. డాక్టర్ భాస్కర్ స్వామివారిని పడుకోబెట్టమన్నారు. ఇతర వైద్యులు వచ్చి, స్వామివారిని పరీక్షించి, పరమాచార్య స్వామివారు సిద్ధి పొందినట్టు ధ్రువీకరించారు.
మేము తట్టుకోలేకపోయాము. కాని మమ్మల్ని ఏడవద్దని అందరూ వారించారు ఎందుకంటే స్వామివారు పరమేశ్వరులు కాబట్టి.

వార్త తెలిసిన వెంటనే జయేంద్ర స్వామి, విజయేంద్ర స్వామి వచ్చారు. జయేంద్ర స్వామి అస్సలు తట్టుకోలేకపోయారు. మహాస్వామి వారి పాదాలపై పడి ఏడ్చారు. వారిని సముదాయించడం ఎవరివల్లా కాలేదు. అందుకే దాదాపు అరగంట పాటు వారిని అలాగే స్వామి వారి వద్దనే వదిలేసాము. తరువాత విజయేంద్ర స్వామి వచ్చి వారిని స్థిమితపరచి వారి గదిలోనికి తీసుకునివెళ్ళారు.

పట్టు శాస్త్రి చెన్నై చేరుకోగానే, ఈ విషయాన్ని ఒక ఆటో డ్రైవరు తెలిపాడు. అప్పుడే స్వామివారిని దర్శించి ఉండడంతో వెంటనే ఆగ్రహోదగ్ధుడై అతణ్ణి కొట్టారు. కాని ఇంటికి వెళ్ళగానే, నిజం తెలిసింది. వెంటనే కుటుంబంతో సహా కాంచీపురానికి ప్రయాణమయ్యారు.

పరమాచార్య స్వామివారి చివరి దర్శనం కోసం ప్రజలు ఉప్పెనలా కాంచీపురానికి వచ్చారు. జాతి, కుల, మతాలకు అతీతంగా విచ్చేశారు.
శ్రీవారు పరమేశ్వరుడే అనడానికి నిదర్శనాలు అవసరం లేదు. ప్రదోషం, ద్వాదశి, అనుషం, కృష్ణపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరి సంస్కారాలు జరిగాయి”

--- కుమరేశన్ మామ తమిళ ఇంటర్వ్యూ నుండి

https://youtu.be/Fn8sEIlsVo0

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

07 Jan, 00:55


పండరీపురంలో పరమాచార్య

కంచి కామకోటి పీఠం పీఠాదిపతులు జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మకాం చేస్తున్న పండరీపురానికి వెళ్ళాకనే తెలిసింది ఆధునిక నాగరికతకు విషపు కోరల్లో పడకుండా పల్లెటూళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో. కురుద్వాడి నుండి పండరీపురానికి వెళ్ళే ట్రైను చాలా పాతకాలం నాటిది. చిన్న బోగీల్తో, చిన్న చిన్న సీట్లతో ఉంది. ప్రయాణీకులు అందరూ పల్లెటూరివారు మరియు యాత్రికులు. చాలామంది కిందనే కూర్చున్నారు. పచ్చని పొలాల మధ్య రెండున్నర గంటల పాటు ఎంతో ఆహ్లాదంగా జరిగింది. అంత పాతకాలం నాటి ట్రైను కూడా ఖచ్చితంగా సమయానికి చేరుకుంది.

నాకు హిందీ సరిగ్గా రాకపోయినా నాకు కావాల్సిన సమాచారం తెలుసుకున్నాను. ట్రైనులో ఒక ప్రయాణికుడు నాతో, “శ్రీ శంకారాచార్య మహారాజ్ విఠల ఆలయానికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్నారు” అని చెప్పాడు. అందరూ నా రాక గురించి మరాఠిలో అడగడం మొదలుపెట్టారు. స్టేషనులో మనకు లభించే ఒకేఒక్క ప్రయాణ సాధనం టాంగా. ఒక టాంగా వాడు మొత్తం సామాన్లతో సహా ప్రయాణికులను కూడా కుక్కేశాడు. ప్రయాణం మొత్తం ఏవేవో విషయాలు చెబుతూనే ఉన్నాడు. బస్సు ప్రయాణాల వల్ల కలిగే ఇబ్బందుల నుండి విఠలుని గొప్పదనం దాకా! నన్ను ఒక హోటలు వద్ద దింపి చక్కాపోయాడు.

ఒక గంట తరువాత మరొక టాంగావాలాను చూసుకుని శంకరాచార్య మహారాజ్ వద్దకు తీసుకుని వెళ్లి తిరిగి నా బసకు తిసుకునిరావడానికి మాట్లాడుకుని బయలుదేరాను. చాలా దూరం అని, కష్టతరమైన ప్రయాణం అని కూడా చెప్పాడు. కాని తరువాత నాకు తెలిసింది అతని చెప్పినంత దూరం, కష్టం ఏమి కాదు.

ఆ టాంగావాలా చెప్పినట్టు పండరీపురంలో నది చంద్రవంక లాగా ఉన్నందున దాన్ని చంద్రభాగ నది అంటారని చెప్పాడు. ఆ నది చాలా చూడముచ్చటగా ఉంది. విఠలాలయం నుండి వస్తున్నా భక్తులను శంకరాచార్యుల దర్శనం కోసం ఒకవైపు నుండి మరొక్క వైపుకు తీసుకువెళ్తున్న పడవలు కనిపించాయి. అప్పుడే తెలవారుతుండగా దర్శనం కోసమని స్వామి సన్నిధికి నడిచాను. దేశం నలుదిక్కుల నుండి వచ్చిన భక్తులు అక్కడ ఉన్నారు. లోపల ఉన్న పెద్ద హాలులో తెల్లవారుఝాము నుండే పరమాచార్య స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆశ్రమ సహాయకులొకారు భక్తుల ప్రార్థనలను స్వామివారికి చేరవేస్తున్నారు. “స్వామివారు ఎప్పుడు బయటకు వస్తారు?, దర్శన సమయం ఎప్పుడు?” లాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.

కొద్దిసేపటి తరువాత భక్తుల సంఖ్య ఎక్కువవడంతో ముందున్న మరొక్క హాలులోకి పంపారు. భక్తులందరిని ఒక వరుసలో నిలబెట్టి, రెండు చెక్కబల్లలను భక్తులను నియంత్రించడానికి పెట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్ళు అక్కడున్నవారిని వరుసగా నిలబెడుతున్నారు. ధృడకాయుడైన ఒక చౌకిదారు వంటి వ్యక్తీ భక్తులకు సూచనలు ఇస్తున్నాడు.

ఒక యువతి “హర హర శంకర, కాలడి శంకర” అని భజనలు మొదలుపెట్టింది. ఒక్కసారిగా మొత్తం హాలంతా భక్తితో నిండిపోయింది. ఒక యువకుడు అందరికంటే బిగ్గరగా భజనలు పాడడం మొదలుపెట్టాడు. అక్కడ పరమాచార్య స్వామివారు రావడానికి మూడు ద్వారాలు ఉన్నాయి. బహుశా వారు ముందున్న ద్వారంగుండా వస్తారేమో, అక్కడ కొందరు ఆడవారు, మగవారు పూలు, పళ్ళు, హారతి పళ్ళాలు పట్టుకుని ఉన్నారు. వారి వెనుక ఒక మధ్యవయస్కుడైన వ్యక్తీ వరుసలో ముందు నిలుచున్నందుకు చాలా సంతోషంతో కనిపిస్తున్నాడు. కొద్ది దూరంలో నిలబడియున్న భార్య, కుమార్తెలను వచ్చి తన వెనకాతల నిలబడమని చెబుతున్నాడు. క్షణాలు గడుస్తున్నాయి. అనదరి కళ్ళూ ముందున్న ద్వారం పైనే ఉన్నాయి.

అప్పుడే కొంతమంది మాటలు విన్నాము. మహాస్వామివారు శిష్యునితో కలిసి మరొక్క ద్వారం గుండా వచ్చారు. అందరూ “జయ జయ శంకర!” అంటూ అటువేపు తిరిగారు. అందరిని కూర్చోవలసిందిగా చేతితో సైగ చేశారు స్వామివారు. ఆ చౌకిదారు స్వామివారికి సాష్టాంగం చేశాడు. అతణ్ణి గుర్తుపట్టి పేరు పిలిచి, మాట్లాడడంతో తనకు కలిగిన గౌరవానికి మహదానందపడ్డాడు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- ఎ. ప్రసన్న కుమార్, “ఎ సేజ అట్ పంధర్ పూర్” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

06 Jan, 00:51


ధర్మానుష్టాన మహత్యం

మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యము వహించిన ప్రాత:స్మరణీయులు ‘నడిచే దైవం’ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్యని దగ్గరగా చూడాలి అని కోరిక. రెండు రోజులు ఆయన విడిది చేసిన చోటుకి వెళ్ళాడు. విపరీతమైన జనము వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. దూరమునుండి చూసి ఆయన దగ్గరకి ఎలా వెడతాను ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు. వెళ్ళడము అనవసరము అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడనుండే ఒక నమస్కారము అని పడుకున్నాడు.

పరమాచార్యస్వామి తెల్లవారుఝామున రెండు గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలు దేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాల వేది ఆయనకి తెలియనిది ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటిముందు వెళ్ళి నించున్నారు. ఆయన ఇల్లాలు కళ్ళాపి చల్లడానికి బయటికి వచ్చింది. కళ్ళాపి చల్లి పక్కకు చూస్తే చలికాలము అవడము వలన మహాస్వామి ముడుచుకుని కూర్చుని జపము చేసుకుంటున్నారు. ఆమె హడలిపోయింది. నడిచే దేవుడని పేరుగాచిన వ్యక్తి, ప్రపంచములో కొన్ని కోట్లమంది ఆయన తన పాదములను తలచుకుని నమస్కరిస్తారు. అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు.

పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్ర మంచము మీద నుండి దూకి బయటికి వచ్చి నేలమీద పడి నమస్కరించి ఏడుస్తూ మహానుభావా మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు. ఆయన అతణ్ణి చూసి “రెండు రోజులుగా నా దగ్గరకి వస్తున్నావుగా. ఈయన దగ్గరకు వెళ్ళగలనా మనని పలకరిస్తారా అనుకున్నావు. ధర్మానుష్ఠానము చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు అందుకే నేనే వచ్చాను” అన్నారు. తణుకు వద్ద జరిగినది ఈ సంఘటన.

మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు. పటాటోపములకు వారి ఆకర్శితులు కారు. ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానము చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. సత్పురుషుల దృష్టిలో పడటము జీవితములో గొప్ప అదృష్టము. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టము ఇంకోటి లేదు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి ప్రవచనం నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

05 Jan, 00:49


అనుష్టానం మానరాదు

1963లో పరమాచార్య స్వామివారు కుంబకోణం దగ్గర్లోని మరుదనల్లూర్ లో మకాం చేస్తున్నారు. అప్పుడు కుంబకోణంలోని కుంబేశ్వర ఆలయంలో ‘తిరుప్పావై - తిరువెంబావై’ సదస్సులు వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం మరియు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి తిరుప్పణి (ఆలయ సంబంధిత పనులు) చేసిన పి.టి. రాజన్ ఆ సదస్సుకు వచ్చారు.

అప్పుడు సాయం సంధ్యా సమయం. మహాస్వామి వారి ఉపన్యాసం వినాలని వారి వద్దనే కూర్చుని ఉన్నాను. స్వామివారు ఉపన్యాసం మొదలుపెట్టబోతూ నావైపు తిరిగి, చేతులతో ఆచమనం చేస్తున్నట్టుగా చూపిస్తూ వెళ్ళి సంధ్యావందనం చెయ్యమని ఆజ్ఞాపించారు. స్వామి ఉపన్యాసం వినాలనే కోరికతో నేను సంధ్యావందనం మాని అక్కడ కూర్చున్నానని స్వామివారు అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులలోను అనుష్టానం మానవద్దు అని నన్ను హెచ్చరించటం. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సంధ్య వార్చడానికి నేను కొలను వద్దకు వెళ్ళాను.

ఆ రోజు రాత్రి పదిగంటలప్పుడు మేము ఆహ్వానించకుండానే స్వామివారు మేలకావేరిలోని మా ఇంటికి విచ్చేశారు. దాదాపు ఒక గంట పాటు అనుగ్రహ భాషణం చేశారు. మేము పరమానంద భరితులమయ్యాము. అలా స్వామివారు బ్రాహ్మణుడికి సంధ్యావందనం వంటి నిత్యకర్మల కంటే మేలైనది విలువైనది వేరొక్కటి లేదని సెలవిచ్చారు. అలా ధర్మానుష్టానం చేసిన వారి వద్దకు స్వామివారే వచ్చి అనుగ్రహం ఇస్తారు. అలా ఆచరించని వారు మాత్రమే స్వామిని వెతుక్కుంటూ వెళ్ళాలి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- యస్. పంచపకేశ శాస్తిగళ్, కుంబకోణం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Jan, 16:40


ఎడమ వైపున 66 వ ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ 7

కుడి వైపున 67వ ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ మహాదేవేంద్ర సరస్వతీ 6

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Jan, 16:37


పరమాచార్య స్వామివారికి సన్యాసం ఇవ్వబడిన కలవైలోని శంకర మఠంలో ఉన్న బృందావనాలు

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Jan, 16:26


64 వ ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ 6

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Jan, 16:25


63 వ ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ మహాదేవేంద్ర సరస్వతీ - 5

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Jan, 16:23


62 వ ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ - 5

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Jan, 16:22


62 63 64 ఆచార్యుల బృందావనాలు ఈ మఠంలోనే ఉన్నాయి

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Jan, 16:17


దాదాపు 200 సంవత్సరాల (1760 - 1960) పాటు కంచి కామకోటి పీఠం ప్రధాన పరిపాలన సాగిన కుంభకోణ మఠం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

03 Jan, 01:27


ఈ నిమ్మకాయలు తీసుకో

‘నడిచే దైవం’ పరమాచార్య స్వామివారి దర్శనంకోసం ఒక ముసలావిడ వరుసలో నిలబడి ఉంది. ఆమె తెల్ల చీర కట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు ధరించింది. నుదుటన విభూతి రేఖలు పెట్టుకుని తన వంతు రాగానే అత్యంత భక్తి వినమ్రతతో మహాస్వామి వారికి నమస్కరించింది.

స్వామివారు ఆవిడని చూసిన తరువాత అక్కడ ఉన్న పరిచారకుడిని పిలిచి వెంటనే మఠం వంటగదిలోకి వెళ్ళి వంద నిమ్మకాయలు తీసుకుని రా అని చెప్పగా అతను వెళ్ళి తీసుకుని వచ్చాడు.

“వీటిని ఆ ముసలావిడకు ఇవ్వు” అని ఆదేశించారు స్వామివారు.

ఆమెకు అంతా అయోమయంగా ఉంది. మామూలుగా స్వామివారు ప్రసాదం ఇవ్వదలచుకుంటే ఒకటి లేదా రెండు నిమ్మకాయలు ఇస్తారు. ఇలా వంద నిమ్మకాయలను ఇవ్వరు. ఆమె స్వామివారి వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది.

”క్షుద్ర శక్తులను ప్రవేశపెట్టడానికని బజారులో నిమ్మకాయలు కొనడానికి చాలా ఖర్చు పెడుతున్నావు. అలా ఆభిచారిక ప్రయోగాలు చేసి ఎంతోమంది అమాయకులని కష్టాలకు గురి చేసి డబ్బు సంపాదిస్తున్నావు. అందుకే ఈ నిమ్మకాయలను తీసుకో. ఇవి నీ పిశాచ పనులకు పనికివస్తాయి” అని కొంచం ధృడమైన స్వరంతో అన్నారు స్వామివారు.

ఆ ముసలావిడ చాలా కలవరపడుతోంది. తను రహస్యంగా చేసే పనులు స్వామివారికి ఎలా తెలిసాయో అర్థం కాక, చేసిన తప్పుకు పశ్చాతాప్పడుతూ కళ్ళ నీరు పెట్టుకుంటోంది. స్వామివారి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించింది. తను ఈ ఇక ఈ ప్రయోగాలు చెయ్యనని కర్తవ్యం సెలవివమని వేడుకుంది.

”ఒక గోవు చెవిలో ఈ మంత్రములన్నిటిని చెప్పి ఇక వాటిని శాశ్వతంగా మరచిపో. మళ్ళా జీవితంలో ఎప్పుడూ ఈ చేతబడి ప్రయోగాలు చెయ్యలని అనుకోవద్దు. ఇది ధన సంపాదనకు ఒక మార్గంగా భావించకు. మిగిలిన జీవితం భగవన్నామాన్ని జపిస్తూ గడుపు. అది చాలు నిన్ను ఉద్ధరిస్తుంది” అని ఆదేశించారు. ఆమెని ఆశీర్వదించి విభూతి ప్రసాదం ఇచ్చి పంపించారు.

“ఇకనుండి నేను ఇటువంటి పనులు చెయ్యను. నా జీవితాన్ని మార్చుకుంటాను” అని జీవిత పర్యంతం నిరంతరం రామ నామాన్ని జపిస్తూ గడిపింది.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

02 Jan, 00:52


కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ దబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్తబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు.

అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.”

మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.

మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

02 Jan, 00:52


ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు

అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు.

”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”

వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”

“సరే. నీ పేరు ఏంటి?”

“హరిహర సుబ్రమణియన్”

“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”

అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.

”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు.

”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”

అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”

“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”

“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”

“నీకు వివాహం అయ్యిందా?”

“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”

“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”

అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”

“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”

అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. కాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”

“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది”
పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”

“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”

మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు.

ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

01 Jan, 00:52


ఆంజనేయ స్వామివారి తోక

చెన్నైలోని నంగనల్లూర్ శ్రీ ఆరుళ్ మిగు ఆది వ్యాధి హర భక్త ఆంజనేయ దేవాలయం, ముప్పైరెండు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రసిద్ధి. నంగనల్లూర్ వాసులైన శ్రీ రమణి అన్న ఈ దేవాయలం కట్టాలని సంకల్పించారు. కంచి మఠానికి వెళ్లి పరమాచార్య స్వామివారి అనుమతి, ఆశీస్సులు పొందారు. చాలా వ్యప్రయాసలకోర్చి ఒక పెద్ద ఏకశిలను వెదికి పట్టుకుని, శిల్పి తన పనిని మొదలుపెట్టాడు. పని మొత్తం పూర్తయిన తరువాత ఒకరోజు ఉదయంవేళ ఆ బృహత్ ఆంజనేయ విగ్రహాన్ని నంగనల్లూర్ కి తెచ్చి దేవాలయం వద్ద ఉంచారు. ప్రతిష్ట పూర్వక అధివాసాలను (ధాన్యాధివాసం, జలాధివాసం. . .) సిద్ధం చేశారు.

ఈలోగా రమణి అన్న కంచికి వెళ్లి ఆంజనేయ స్వామివారు నంగనల్లూరుకు విచ్చేశారు అనే విషయాన్ని తెలిపి, తరువాత జరుగవలసిన కార్యక్రమములను గురించి పరమాచార్య స్వామి వారిని అడగదలిచాడు. వినాయకుని వలె హనుమంతులవారు అంటే కూడా మహాస్వామివారికి ఎక్కువ మక్కువ. స్వామివారు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతి అణువు గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామివారికి సంతృప్తి కలిగే విధంగా రమణి అన్న కూడా అన్నింటికీ సంపూర్ణ సమాచారం ఇచ్చారు. చివరగా ఆంజనేయ స్వామివారి తోక గురించి అడిగారు. “స్వామి వారి వాలము గుండ్రని ఆకృతితో తలపై నుండి పక్కలకు ఉంటుంది పెరియవ” అని స్వామివారి ప్రశంసల కోసం చూశాడు. స్వామివారి కాసేపు మౌనంగా ఉండిపోయారు. రమణి అన్న కాస్త దిగులు పడ్డాడు. చివరకు స్వామివారు “ఆంజనేయ స్వామివారి మూర్తి ఎదురుగా శ్రీరాముల వారిని కూడా ప్రతిష్ట చేయ్యదలచుకున్నామని చెప్పావు. కాని రాములవారి ముందు హనుమంతుడు ఎప్పుడూ అలా తోక ఎత్తుకుని నిలబడి ఉండడు” అని చెప్పారు. రమణి అన్న ఆందోళన ఎక్కువ కాసాగింది. “పెరియవ! ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? విగ్రహం మొత్తం తయారయ్యింది. అధివాసాలు కూడా మొదలుపెట్టాము. ప్రతిష్టాపన తేది, ముహూర్తం కూడా నిర్ణయం అయ్యింది. ఇప్పుడు ఆ తోకను మారిస్తే అధివాసాలు, కుంబాభిషేకం మరలా చెయ్యాలి. మరి నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్ట చెయ్యడం కుదరదు కదా! మిరే నాకు ఒక దారి చూపించాలి” అని వేడుకున్నాడు.

మహాస్వామివారు ప్రశాంతంగా ఉన్నారు. రమణి అన్నతో, “నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. అంతా సర్దుకుంటుంది. ఆంజనేయ స్వామివారే మనల్ని కాపాడుతారు” అని ప్రసాదం ఇచ్చి పంపారు. రమణి అన్న నంగనల్లూరుకు తిరిగొచ్చారు. ఆలోచనలన్నీ తోక చుట్టూనే తిరుగుతున్నాయి. అధివాసాలు ముగిసిన తరువాత, హోమములు, క్రతువులు పూర్తిచేసి, ముహూర్త సమయానికి పీఠంపై స్వామి విగ్రహాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద క్రేన్ తీసుకుని వచ్చారు. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆంజనేయ స్వామి వారి తోక సరైనచోట తెగి ఉండడం గమనించారు. ఎటువంటి మచ్చాలేకుండా ఎవరో శిల్పి చేసినట్టుగా అగుపిస్తోంది.

రమణి అన్న మరియు ఇతర సంఘ సభ్యుల ఆనందం వర్ణించడానికి కుదురుతుందా? కళ్ళ నిరు వర్షిస్తుండగా అందరూ చేతులు పైకెత్తి కంచి వైపు తిరిగి నమస్కారం చేశారు.

--- శ్రీ రమణి అన్న

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

31 Dec, 00:39


ఇంటి దైవాన్ని మరచిపోతే?

ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ, తూలుతూ తడబడతూ క్రింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్న వారు పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులను చేరింది.

వారు ఒక పరిచారికుని వంక చూసి “ఎందుకు అంత అలజడి అక్కడ?” అని అడిగారు.

మఠం మేనేజరు మహాస్వామి వారితో “ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు” అని చెప్పాడు.

మహాస్వామి వారు మేనేజరుతో “అతనిదేవూరు? ఇప్పుడు ఎక్కడినుండి వస్తున్నాడు” కనుక్కోమన్నారు.

ఆ భక్తుడు తిరుచ్చి దగ్గర్లోని ఒక పల్లెటూరినుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషిని దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కున్నాడు అని విన్న వెంటనే డాక్టరుగారు హెమొరేజ్ (రక్తస్రావం) వాల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించమని సలహా ఇచ్చారు.

ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేసారు.

”ఇది హెమొరేజ్ కాదు. మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్దమనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మదుర కాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కాని వీళ్ల ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు. కాని ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా? అంతే కాకుండా కాళి దేవి వారి ఇంటి ఆరాధ్యదైవం. మరి అటువంటప్పుడు కాళి దేవిని భక్తితో కొలవాలి కదా? సరే”

“అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.” ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేసారు.

కాంచీపురం కాళి అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్దమనిషి నుదుటిపైన రాసారు. అతన్ని శ్రీమఠం లోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచం కొంచం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజరు గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజరు గారికి ఉత్తరం రాసాడు. ఇంకా

“నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కాని నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోలేదని?” అది మనకి కూడా అంతుచిక్కని విషయం.

మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికి మరువరాదు. తల్లితండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి. కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

30 Dec, 00:21


ఇల్లు - ఇల్లాలు

1952లో మా తల్లిగారు శ్రీమతి యం.యస్. చిదంబరం మా అమ్మమ్మతో కలిసి మాంబళంలోని శివాలయంలో పరమాచార్య స్వామివారిని కలవడానికి వెళ్ళారు. మా నాన్నగారు , ప్రముఖ పారిశ్రామికవేత్త యం.ఎ. చిదంబరం. ఈయన చెట్టినాడు రాజు, మద్రాసు మేయర్ అన్నామలై చెట్టియార్ గారి కుమారుడు.

చెన్నైలోని కొట్టూర్ పురంలో అడయార్ నిలయం నిర్మించడానికి ముందు స్వామివారి అనుమతిని, ఆశిస్సులను తీసుకోవడం కోసం శ్రీవారిని కలిశారు. విషయాన్ని మహాస్వామి వారికి విన్నవించగానే చాలా సంతోషంతో తమ అంగీకారం తెలిపారు. చేట్టినాడ్ లోని కోనాపేట్ లో మా తాతయ్య (అమ్మ వాళ్ళ నాన్న గారు) ఇంట్లో మహాస్వామివారు మకాం చెయ్యడం, అప్పుడు చిన్న బిడ్డగా ఉన్న మా అమ్మగారిని ఎత్తుకుని లాలించడం గురించి గుర్తుతెచ్చుకున్నారు.

ఈ సమావేశం అప్పుడు మహాస్వామివారు ఒక ఉసిరికాయ చెట్టు క్రిందన కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా ఒక ఉసిరికాయ నేలపై పడింది. అది చాలా తియ్యగా ఉంటుంది తినమని మహాస్వామి వారు మా అమ్మగారిని ఆదేశించారు.

తరువాత ఆమెను ఆశీర్వదించి ఆమె కోరికను అనుగ్రహించారు. కొట్టూర్ పురంలో నిర్మించబోయే ఇంటిలో సుఖశాంతులతో మాకు భోగభాగ్యాలు కలుగుతాయని స్వామివారు ఆశీర్వదించారు. ఆ ప్రాంతమంతా గొప్పగా అభివృద్ధి చెంది, మంచి నివాస ప్రాంతంగా రూపాంతరం చెందుతుందని స్వామివారు ఆనాడే సెలవిచ్చారు. పరమాచార్య స్వామివారు ఈ మాటలు చెప్పే సమయంలో కొట్టూర్ పురం చెన్నైకి చాలా దూరంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతం. పాములు మొదలగు విషకీటకాలకు నిలయం.

కాని ఈనాడు ఎవరైనా కొట్టూర్ పురంను సందర్షిస్తే, అభివృద్ధి చెందిన ఆ ప్రాంతం, చుట్టూ ఒక పద్ధతిలో ప్రణాలికాబద్ధంగా నిర్మించిన సుందరమైన ఇళ్ళతో, మంచి జన సంచారంతో చాలా అద్భుతంగా ఉంటుంది. పరమాచార్య స్వామివారి మాటలు పోల్లుపోవు. శ్రీవారి ఆశిర్వాదంతో మా అమ్మగారి కుటుంబం ఆనదంగా ఉండేది. ఈనాటికీ ఈ సంఘటనను అచ్చంగా ఆరోజు జరిగిన విధంగానే మా అమ్మగారు చెబుతుంటారు. ఆ స్వామివారి అనుగ్రహం మనల్ని ఎప్పుడూ రక్షించుగాక!

--- శ్రీమతి సీతా చిదంబరం, ‘kamakoti.org’ నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

29 Dec, 00:50


శ్రీశైల యాత్ర

దక్షిణ కైలాసం అని ఖ్యాతి పొందిన మల్లికార్జునుడు వెలసిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. చాలా మహిమాన్వితమైన పుణ్యస్థలం. సంకల్పం చెప్పేటప్పుడు మనం శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నామో చెప్తాము అంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు కూడా శ్రీశైలాన్ని సందర్శించారు. వారు రచించిన శివానందలహరి లో దీనికి సాక్ష్యం కూడా ఉంది. వారు రచించిన ద్వాదశ లింగ స్తోత్రంలో ఇక్కడి క్షేత్ర దైవం మల్లికార్జునుడు ఉంటంకించబడ్డాడు. భ్రమరాంబికా దేవి కొలువైన ఒక శక్తి పీఠం. భ్రమరము అంటె తుమ్మెద తుమ్మెదలు మల్లెపూల చుట్టూ తిరిగినట్టు ఇక్కడ అమ్మవారు కూడా మల్లికార్జునుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్జున వృక్షము ఇక్కడి స్థల వృక్షం.

పరమాచార్య స్వామి వారు కర్నూలులో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం వస్తోందని తెలుసుకుని మహాస్వామి వారు ఆరోజున శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగలో గ్రహణ స్నానం చేసి మల్లికార్జునుణ్ణి దర్శించుకోవాలని సంకల్పించారు. కాని ఆరోజులలో రవాణా వ్యవస్థ లేదు. సాధారణంగా ప్రజలు శివరాత్రికి శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళు. కాని మహాస్వామి వారు వారణాసికి తొందరగా వెళ్ళవలసి ఉన్నందున వారు వేచియుండుటకు ఇష్టపడలేదు.

పడవలో కడప కాలువ ద్వారా శ్రీశైలం వెళ్ళొచ్చని తెలుసుకుని చంద్రమౌళీశ్వరుణ్ణి, కొంతమంది పరివారమును వెంట తీసుకుని జనవరి 24 1934న పడవలో కర్నూలు నుండి బయలుదేరారు. పగిడ్యాల, ఆత్మకూరు, నాగులూటి మీదుగా 28న పెతసరివు చేరుకున్నారు. రోజూ చెయ్యవలసిన చంద్రమౌళీశ్వర ఆరాధన పూజ కోసం ఈ ఊర్లలో ఆగుతూ పెతసరివు చేరారు. అక్కడి పాదాచారియై నుండి శుక్ల పర్వతాన్ని ఎక్కి మళ్ళా అక్కడినుండి నిటారుగా ఉన్న పర్వతాన్ని అధిరోహించి మల్లికార్జునుడి దర్శనం కోసం శ్రీశైలం చేరుకున్నారు. వారు ఎక్కిన పర్వతం నిటారుగా రాళ్ళు పొదలతో నిండి ఉన్నది. కాని వారు వెరవక అంతటి చెలిని కూడా లెక్కచెయ్యకుండా శ్రీశైలం చేరుకున్నారు. పరమాచార్య స్వామి వారు వస్తున్నారని దేవస్థానం అధికారులు ముందే తెలుసుకుని వారిని ఆహ్వానించటానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మహాస్వామి వారికి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం లభించింది.

వారు సన్నిధిలో చాలా సేపు ఉండి, ధ్యానమగ్నులై శివానందలహరి సౌందర్యలహరి నుండి ఎన్నో శ్లోకాలను వారు పాడారు. మరుసటి రోజు మహాస్వామి వారు 900 మెట్లను దిగి పాతాళగంగకు చేరుకున్నారు గ్రహణ స్నానం కొరకు. వారు ఉండడానికి వీలుగా అక్కడ ఒక తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసారు. గ్రహణం వీడిన తరువాత అక్కడ ఉన్న ఎండుకర్రలతో దీవిటీలు వెలిగించగా మహాస్వామి వారు చంద్రమౌళీశ్వర పూజ చేసారు. మరునాడు ఉదయం మళ్ళా మెట్లు ఎక్కి పాతాళగంగ నుండి శ్రీశైలం చేరుకున్నారు. మల్లికార్జునుణ్ణి దర్శించుకుని అక్కడే రెండు రోజులు గడిపి తిరిగి పడవలో కర్నూలు చేరుకున్నారు.

వారి శ్రీశైల యాత్రలో అక్కడ ఉన్న చెంచులు పరమాచార్య స్వామి వారిని నాగులేటి లో దర్శించుకున్నారు. ఎటువంటి సహాయం చెయ్యడానికైనా తాము సిధ్ధమని మహాస్వామి వారికి మాటిచ్చారు. మఠానికి సంబంధించిన వాటన్నిటిని కొండ పైకి వారే మోసుకొచ్చారు. అడవి జంతువుల బారి నుండి రక్షణ కల్పించారు. వారి అమాయకత్వానికి, పరులకు సహాయం చేసే గుణాన్ని చూసి మహాస్వామి వారు చాలా సంతోషపడ్డారు. మఠం వారితో చెప్పి వారికి డబ్బులివ్వబోయారు. కాని ఆ చెంచులు దాన్ని స్వీకరించక, పరమాచార్య స్వామి వారి ముందు వారి సాంప్రదాయక గిరిజన నృత్యం చేస్తామని ఒక చిన్న కోరిక కోరారు. మఠం అధికారులకు ఇది నచ్చకపోయినా, పరమ దయాళువు ఐన పరమాచార్య స్వామి వారు దానికి అనుమతినిచ్చారు. వారు చాలా సంతోషపడి స్వామి వారి ముందు నృత్యంచేసి ఆనందపడ్డారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

28 Dec, 12:29


కాశీలోని మానససరోవర్ ఘాట్ లో మన ట్రస్ట్ సహాయ సహకారాలతో జరిగే నిత్య నారాయణ సేవ

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

28 Dec, 12:25


అనుషం (అనూరాధ నక్షత్రం) సందర్బంగా మహాస్వామి వారి ప్రీతిగా వేద పారాయణ

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

28 Dec, 05:33


https://youtu.be/YmZJdW9Rsac?si=v5OswlMl_F0IVbZo

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

28 Dec, 00:29


చేసిన పుణ్యం – గుర్తొచ్చిన పాపం

నాలుగు దశాబ్ధాల క్రితం నేను కళ్ళారా చూసిన సంఘటన. పరమాచార్య స్వామి వారి జయంతి మహోత్సవాల కోసం నేను కలవై వెళ్ళాను. ఊహించినట్టుగానే చాలా రద్దీగా ఉంది. నేను నా భార్య వారి దర్శనంకోసం వేచియున్నాము. పరమాచార్య స్వామి వారు మమరొక వైపు నుండి రావడం చూసి గుంపు మొత్తం వారి వద్దకు పోసాగింది. అక్కడ ఒక యాభై సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయన ఉన్నాడు. గొంతు నిండా బంగారు సరాలు వేసుకుని డాంబికంగా ఉన్నాడు. అతను అతని భార్య మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు చేసి నమస్కరించి నిలబడ్డారు. స్వామి వారు అప్పుడు మౌన వ్రతంలో ఉన్నారు. వారు ఆ స్థితిమంతుడైన వ్యాపాస్తుణ్ణి చూసారు.

"ఎలా ఉన్నవు?” అని మౌనంగా అడిగారు. అతను తన భార్య కలిసి మహాస్వామి వారి చేస్తికి ఒక కరపత్రాన్ని ఇచ్చారు. అది అతను చేయించిన “సమిష్టి ఉపనయనాల” గురించి తెలిపే పత్రము. కె కె నగర్ లో పేద బ్రాహ్మణ పిల్లలకోసం నాలుగు రోజుల పాటు మొత్తం తన ఖర్చుతో చేసిన ఉపనయనాల గురించిన కరపత్రము స్వామి వారికి ఇచ్చారు. కొద్దిసేపు నిశబ్దం అంతా.

మహాస్వామి వారు “ఎంత ఖర్చు చేసావు దీనికోసం” అని మౌనంగా అడిగారు. ”కొన్ని లక్షలు.” అని సమాధానమిచ్చాడు అతను. మరికొద్దిసేపు నిశ్శబ్ధం అక్కడంతా. మహాస్వామి వారు మౌనంగా “తిరునల్వేలి లోని దక్షిణామూర్తి” అనే అబ్బాయి గురించి అడిగారు. అక్కడున్న ఎవరికి అర్థం కాలేదు కాని అతను మాత్రం స్థాణువు లా నిలబడిపోయాడు. మొహంలో నెత్తుటి చుక్క లేదు. పరమాచార్య స్వామి వారు ముందుకు సాగి పోయారు. అతను తట్టుకోలేనంతగా ఏడ్చేసాడు. గట్టిగా రోదిస్తున్నాడు.

అతని భార్య అతణ్ణి సముదాయించాలని ప్రయత్నిస్తోంది కాని అతడు చిన్నపిల్లడిలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న విలేఖరులు అడిగారు “సార్ ఏమి జరిగింది ? ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని?”

అతను పిచ్చి పట్టినవాడిలాగా పదే పదే “నేను దుర్మార్గుణ్ణి నేను నేరస్తుణ్ణి” అని ఇంకా గట్టిగా రోదిస్తున్నాడు. కొద్దిసేపటి తరువాత ఇలా చెప్పాడు. ”కొద్ది సంవత్సరాల క్రితం విధవరాలైన నా చెల్లెలు నా దగ్గరే ఉండేది. తనకు ఒక అబ్బాయి కూడా ఉండేవాడు. నా మేనల్లుడి పేరే దక్షిణామూర్తి. నేనే వారి మంచి చెడ్దలు చూసుకునేవాణ్ణి. కొద్ది కాలం తరువాత నా చెల్లెలు కూడా పరమపదించింది. వాళ్ల అబ్బాయిని ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. అతణ్ణి ఇంటి నుండి వెళ్ళగొట్టాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు.

పెరియవ ఈరోజు పరోక్షంగా “లక్షలు ఖర్చు పెట్టి ఎవరెవరికో సమిష్టి ఉపనయనం చేసావు. పుత్ర సమానుడైన నీ చెల్లెలి కొడుకుని మరచిపోయావు” అని అడిగినట్టు అనిపించింది. ఏమైనాసరే నేను వెంటనే నా అల్లుణ్ణి వెతికి పట్టుకోవాలి. వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలి.” అని వెళ్ళిపోయాడు.

--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

27 Dec, 14:32


https://youtu.be/PQAXcwT452o?si=hFc4FHD5CfE8nsQ-

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

27 Dec, 05:26


బెంగళూరు కళ్యాణ్ నగర్ లో మహాస్వామి వారి ఆరాధన మహోత్సవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

27 Dec, 05:13


https://www.youtube.com/live/U4CwimmFN7U?si=H1GBn9dWiV94vtHw

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Dec, 00:28


మృత్యువు - మృత్యుంజయ హోమం

“మృత్యుంజయ హోమం ఏమి చెయ్యాల్సిన పనిలేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు” మహాస్వామివారు నోటి నుండి వచ్చిన మాటలు. అవును ఖచ్చితంగా ఇంకో వందేళ్ళు బ్రతుకుతాడు అతను.

పరమాచార్య స్వామివారు నేరూర్ సదాశివ బ్రహ్మేంద్రుల అధిష్టానం దర్శనానికి వెళ్ళారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారంటే మహాస్వామి వారికి చాలా భక్తి, గౌరవం. కేవలం వారి పేరు వింటేనే చాలు స్వామివారు పొంగిపోయేవారు. వారి కళ్ళు ఆర్ద్రతతో నిండిపోయేవి.

మహాస్వామివారు అధిష్టానం ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు, స్వామివారి సేవకులు మహాస్వామి వారికి కొద్ది దూరంలో నిలబడ్డారు. శ్రీమఠం సాంప్రదాయం ప్రకారం, స్వామివారు అధిష్టానం ముందు జపం చేసుకుంటుండగా ఎవరూ చూడరాదు. అది మహాస్వామి వారు మనవాతీతమైన విశ్వంలోని శక్తిని సర్వ మానవాళి క్షేమం కొరకు ధ్యానించే సమయం. అది కూడా మనలాంటి వారి మంచి కోసమే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వంద వ్యాట్ల శక్తిని చూసే మన నేత్రాలు లక్ష వ్యాట్ల శక్తిని చూసి తట్టుకోగలవా?

అప్పుడే పరమాచార్య స్వామివారి భక్తుడు రంగస్వామి అక్కడకు వచ్చారు. “నేను వెంటనే పరమాచార్య స్వామివారిని దర్శించుకొని, ప్రసాదం తీసుకోవాలి” అని అక్కడున్న సేవకులతో చెప్పారు. వారు వెంటనే, “స్వామీ, మహాస్వామి వారు అధిష్టానం లోపల కూర్చొని తలుపులు మూసి ఉండగా ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరూ స్వామివారిని దర్శించకూడదు. స్వామివారి ధ్యానం ముగిసిన తరువాత మొదట మిరే దర్శనం చేసుకుందురు గాని. ఇప్పుడు కాదు” అని నిలువరించారు.

రంగస్వామి మామూలుగా ఇలా చెప్తే వినేరకం కాదు. చాలా మొండి వాడు. కాని వారి సమాధాంనంతో కాస్త మెత్తపడినట్టే కనిపించాడు. ఇంతలో సేవకులందరూ మాటల్లో పడ్డారు. ఇదే అదనుగా భావించి, రంగస్వామి క్షణాల్లో అధిష్టానం లోపలికి వెళ్ళాడు. అక్కడున్న వారందరూ అతని చర్యకు కలవరపడ్డారు.

సరిగ్గా అప్పుడే అధిష్టానం నుండి ఎప్పుడూ వినని మహాస్వామివారి స్వరం వినబడింది. “మృత్యుంజయ జప హోమం ఏమి చెయ్యాల్సిన పనిలేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు” అని.

రంగస్వామి వెంటనే అధిష్టానం బయటకు వచ్చేసాడు. శిష్యులందరూ అతణ్ణి చుట్టుముట్టారు. జరిగిన విషయం అంతా చెప్పాడు. “రంగస్వామి దగ్గరి బంధువులొకరికి ఎక్కువగా ఛాతినొప్పి రావడంతో నలభై ఎనిమిది గంటలు గడిచే దాకా ఏమి చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. వెంటనే మృత్యుంజయ హోమం చెయ్యాల్సిందిగా జ్యోతిష్కులు చెప్పారు.
రంగస్వామి మిత్రులొకరు వెంటనే పరమాచార్య స్వామీ వారిని దర్శించి ప్రసాదం తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. మరొక ముసలావిడ స్వామివారు నేరూర్ దగ్గర ఉన్నారని, తాము దర్శనం చేసుకుని వచ్చామని, స్వామివారు అన్నీ చూసుకుంటారని చెప్పడంతో, పరుగుపరుగున మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు రంగస్వామి”

అతని అదృష్టానికి స్వామివారే అతనితో స్వయంగా మాట్లాడి ఆశీర్వదించి పంపారు. రంగస్వామి ఇంటికి చేరగానే అతని బంధువు మంచంపై కూర్చొని చక్కగా నవ్వుతున్నాడు.

“అవును. అతను ఖచ్చితంగా ఇంకొక వందేళ్ళు బ్రతుకుతాడు”

--- రాయవరం శ్రీ బాలు, శ్రీమఠం. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

07 Dec, 00:21


అంబాసిడర్ కారు - ఫియట్ కారు

గోవిందపురం శ్రీ నటరాజ అయ్యర్ పరమాచార్య స్వామివారి అనుగ్రహానికి, కరుణకు పాత్రులు. జి ఆర్ ఎన్ బిల్డర్స్ పేరుతో జనాలకు నిర్మాణ సేవలను అందించేవారు. మహాస్వామి వారిపై అచంచలమైన భక్తితో శ్రీమఠానికి ఎంతగానో సేవ చేశారు. స్వామివారు శ్రీశైలంలో ఉన్నప్పుడు తన స్నేహితునితో కలిసి ఒక అంబాసిడర్ కారులో దర్శనానికి వెళ్లారు.

స్వామివారిని దర్శించుకుని, తిరిగివెళ్లడానికి అనుమతి తీసుకుని చెన్నైకు వస్తుండగా; కారు ఫ్యాను బెల్టు తెగిపోయి కారు ఆగిపోయింది. తెలియని ప్రదేశంలో ఇలా జరగడంతో కాస్త కంగారు పడ్డారు. ఏమి చెయ్యాలో తోచక నిదానంగా దగ్గర్లోనే ఉన్న పెట్రోలు బాంకు దాకా వచ్చి కారును ఆపారు.

మహాస్వామి వారి వద్ద నుండి ప్రసాదం తీసుకుని స్వామివారి అనుమతితోనే బయలుదేరినా ఈ అర్ధరాత్రిలో ఎందుకు ఇలా జరిగిందా అని ఇద్దరూ ఆలోచిస్తున్నారు. ఇలా జరిగేలాగా ఉంటే ఎందుకు స్వామివారు మేము వెళ్లడానికి అనుమతిచ్చారు? భక్తితో స్వామివారిని ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఆ పెట్రోలు బంకుకి ఒక ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్నవారు పెట్రోలు పొయ్యమని బాంకు సిబ్బందిని అడిగారు. ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉన్నారని వీరిని అడిగారు. కారు బెల్టు తెగిపోవడంతో కారు నడపడానికి కుదరక ఇక్కడున్నామని నటరాజ అయ్యర్ చెప్పాడు.

దాంతో ఆ ఫియట్ కారు వ్యక్తి తను ఎప్పుడు కారులో బయటకు వెళ్ళినా ముందుజాగ్రత్తగా అవసరమైన కొన్ని కారు వీడిభాగాలను వెంట తెచ్చుకుంటానని, తనవద్ద ఉన్న బెల్టును తీసుకుని క్షేమంగా ఇంటికి చేరమని చెప్పాడు. నటరాజ అయ్యర్ కు ఆశ్చర్యం కలిగింది. అంత రాత్రిలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి, కారు ఫ్యాను బెల్టు ఇచ్చి సహాయం చెయ్యడం కేవలం పరమాచార్య స్వామివారి కృప అని హృదయం ద్రవించింది. మనస్సులోనే స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

ఇందులో మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆ అజ్ఞాత వ్యక్తి ఫియట్ కారులో వచ్చాడు. దూరప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తన కారుకు సంబంధించిన విడిభాగాలనే పెట్టుకుంటాడు. కానీ ఆ ఫ్యాను బెల్టు మాత్రం తన ఫియట్ కారుది కాకుండా అంబాసిడర్ కారుది తెచ్చుకున్నాడు. ఎందుకు ఆ తప్పు చేశాడు? అతను తప్పు చేయలేదు. నటరాజ అయ్యర్ ని కాపాడడానికి మహాస్వామి వారు చేసిన దివ్యలీల ఇది. ఇలాంటి లీలలు చేసి భక్తులను కాపాడడం మహాస్వామి వారి సిద్ధులకు తార్కాణం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

06 Dec, 00:40


ధర్మాన్ని ఎందుకని ఆచరించాలి ?

వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే,
వేదః ప్రాచేతసా దాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా.

వేదవేద్యే-వేదంచేత తెలిసికోదగినవాడెవడూ? పరేపుంసి-పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు. వేదవేద్యుడైన నారాయణుడు దశరథాత్మజుడైన వెంటనే వేదాలు వాల్మీకి శిశువుగా, రామాయణంగా అవతరించినవి. ఆ రామాయణం ఏమి చెపుతూంది? వేదాలు ధర్మమును చెపుతై. ఆలాటి ధర్మస్వరూపుడే రాముడు అని రాముని తల్లి కౌసల్య, అడవులకు పోయే రామచంద్రుడితో చెప్పిన మాటలవల్ల రాముడు 'ధర్మస్వరూపుడు'. అని గోచరిస్తుంది.

పొరుగూరు పోయే బిడ్డకు తల్లి తినుబండారాలు కట్టి యివ్వడం వాడుక. రామునికి కౌసల్య యిచ్చిన తినుబండం ఏమిటి? ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే.

'యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ
స వై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు'

రాఘవా! నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతో నియమంతో ఆచరిస్తావో, ఆ ధర్మమే నిన్ను కాపాడేది'

ధృతి అంటే ధైర్యం. ఒకడు పరిహసిస్తాడని లెక్కచేయక ఎవరేమన్నా ధైర్యంతో ఉండడమే ధృతి. 'ఎవరేమన్నా సరే' అని కొందరు కొన్నాళ్ళు ధైర్యంతో ఉంటారు. పిదప పిదప మెల మెలగా దాన్ని వదిలివేస్తారు. దానికి ఒక కట్టుబాటో నియమమో ఉండదు. దానివల్ల ప్రయోజనం శూన్యం.

రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక పూటయినా వదలక కాపాడుకొంటూ వచ్చాడు. మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూవచ్చాడు. ఎవరు నవ్వేది, మరి ఎవరడ్డు పెట్టేది మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు. ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు. అందుచేతనే అడవికి పోతూవున్నపుడు కౌసల్య కుమారుడికి 'ధర్మంగా వర్తించుకో' అని మాత్రమే చెప్పక, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో, ఆధర్మమే నిన్ను కాపాడుతుందని ఆ ఆపదల నన్నిటినీ నివృత్తి చేసే ఆశీర్వాదం చేస్తూంది.

ఒక కుక్క దొంగలబారినుండి మనలను కాపాడవలెనంటే దానిని మనం చక్కగా కాపాడాలి. మనం దేనిని కాపాడతామో అది మనలను కాపాడుతుంది- ''నీవు ధర్మాన్ని రక్షించుకొంటూ వచ్చావు, ఇకముందు గూడా రక్షించుకొంటూ వస్తావు. అదే. ఆధర్మమే నిన్ను రక్షించుకొంటుంది' అని ఇతరులు చెప్పటం అటుంచి సొంత తల్లి 'తన బిడ్డ అడవులపాలయిపోతున్నాడే' అని దుఃఖించక ఇట్లా చెబుతూంది. కూడా పుట్టిన సోదరుడే 'అన్నా! ధర్మం. ధర్మం' అంటూ ధర్మానికి కట్టుబడి ఉండడముచేతనే నీకు ఇంత శ్రమ ఇంత కష్టమూ సంభివిస్తూంది. దాన్ని వదలివేశావా నీకీబాధ ఉండదు' అని ఎన్నోసారులు చెప్పాడు. 'ఎవరు నవ్వినా, నాయనా! రాఘవా! ఏధర్మాన్ని నీవుధైర్యంతో నియమంతో వదలక అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది.' అని తల్లి ఆశీర్వదిస్తున్నది.

'ధర్మం తలకాస్తుంది' అని ఒకసామెత ఉంది. ఆడవిలో రాఘవుని తల కాచింది ధర్మమే. రావణునికి పది తలలున్నప్పటికి తాను చేసిన ఆధర్మం ఒక తలనయినా కాచలేక పోయింది.

'వేదోఽఖిలో ధర్మమూలమ్‌' వేదమే ధర్మమును చెపుతూంది. వేదాలలో వర్ణింపబడిన పరమపురుషుడు దశరథునకు కొడుకుగా అవతరించా డనీ, 'వేదవేద్యే పరే పుంసి' అనే శ్లోకం చెపుతూంది. కౌసల్యాదేవి వాక్యంవల్ల 'ధర్మ స్వరూపుడే రాముడు' అని తెలియవస్తూంది. ఇంకో చోట 'రామో విగ్రహవాన్‌ ధర్మః' అని ఉన్నది. ధర్మం అనేది మనోభావం. అది ఒక రూపం ధరిస్తే ఎలావుంటుంది అని అంటే రాముడై కూచుంటుంది అని అర్థం. ఆపత్కాలంలో కూడా ఒక అడుగయినా వెనుకాడకుండా ధైర్యంతో నియమంతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మ స్వరూపమే రామావతారం. వేదాలవలన తెలియదగిన వస్తువే అందరకూ కంటికి కనబడే వస్తువుగా అవతరించింది. అపుడే వేదం సైతం రామాయణంగా అవతరించింది.

సాక్షాద్రామ చంద్రమూర్తినే లక్ష్యంగా పెట్టుకొన్న రామమంత్ర జపపరాయణులకు కామం, మోహం మొదలయిన మకిల యేదీ మనస్సు కంటదు. అట్టివారు ధర్మమార్గం వదలిపోరు.

'వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మవా'

వేదాలవల్ల తెలుసుకోదగిన పరమపురుషుడు దశరథునికి కొడుకుగా అవతరించినందున రామాయణరూపం ఎత్తిన వేదాలయొక్క సారం రామనామంలో ఇమిడి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యం పోగొట్టి వేరొకదానిమీద ఆశ కలుగనీయక సదా ఆనందంగా ఉండేటటుల చేస్తుంది.

--- “జగద్గురుబోధలు”, http://jagadguru-vaibhavam.blogspot.in నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

05 Dec, 00:39


1963లో మావారు వెల్లూరుకు వెళ్తూండగా గుండెపోటు రావడంతో దాదాపు పూర్తిగా మాట పడిపోయింది. వెంటనే వెల్లూరు సి.యమ్.సి ఆసుపత్రికి చేర్పించి, అత్యుత్తమ వైద్యం అందించారు. ఆయన కోలుకున్నా కానీ, మాట మాత్రం సరిగ్గా వచ్చేది కాదు. అప్పుడు పరమాచార్య స్వామివారు మధురైలోని అళగర్ దేవాలయంలో మకాం చేస్తున్నారని తెలుసుకుని మా అత్తగారితో పాటు వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అరక్కోణం తిరిగొచ్చాము.

ఎంతటి ఆశ్చర్యం! నేను ఇంటికి తిరిగొచ్చేటప్పటికి మావారు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఎంతటి అద్భుతం!

1984లో అరక్కోణంలో ఎన్నికల వేడి చాలా ఎక్కువగా ఉండి పరిస్థితులు అంత అనుకూలంగా లేదు. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొన్ని అసాంఘిక శక్తులు మా దుకాణంలోకి ప్రవేశించి మావారి తమ్ముడు మహాలింగం పైన దాడి చేశారు. తక్షణమే మహాలింగం మనస్సులో మహాస్వామివారిని ప్రార్థించడంతో ఎక్కువ హాని చేయకుండా వచ్చినవారు వచ్చినట్టుగా వెళ్ళిపోయారు. మహాస్వామివారి కేవల స్మరణ వల్ల రాక్షసులు కూడా మంచివారుగా మారిపోతారనడానికి ఇదే నిదర్శనం. ఈ విషయం మేము స్వామివారితో చెప్పినప్పుడు, స్వామివారు పెద్దగా నవ్వి, మా మరిదిని “కత్తికుట్టు మహాలింగం” (కత్తిపోటు మహాలింగం) అని పిలిచి శాలువా కప్పారు.

మూడు సంవత్సరాల క్రితం నా కుడిచేతికి పుండు పడి వాపుని, బాధని, వేదనని కలిగించింది. చెయ్యిని ఎత్తడానికి గానీ, తినడానికి గానీ కుదరని పరిస్థితి. మావారు నన్ను మద్రాసులోని ఎందరో వైద్యులకు చూపించినా వైద్యం చెయ్యడమటుంచి కనీసం ఏదేమిటో కూడా కనుక్కోలేకపోయారు. పరమాచార్య స్వామివారి దర్శనం కోసం నన్ను కంచికి తీసుకునివెళ్లారు. స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి విశ్రాంతిలోకి వెళ్తున్నారు. మేముకూడా దర్శనం చేసుకుని భారమైన హృదయంతో తిరిగివెళ్తుండగా, కంచిమఠంలో ఉండే పద్మనాభన్ అనేవారితో మాకు కబురుపెట్టారు స్వామివారు. మేము లోపలకు వెళ్ళగానే నన్ను వారి పాదాలకు నమస్కరించమన్నారు. అత్యంత భక్తితో స్వామివారికి నమస్కారం చేశాను. తరువాత మేము అరక్కోణం తిరిగొచ్చాము. ఆశ్చర్యంగా ఆరోజు రాత్రే నా చేతిపుండు పూర్తిగా నయమైపోయింది.

--- కళ్యాణి రాజగోపాలన్, kamakoti.org నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

05 Dec, 00:39


మా కుటుంబ అనుభవాలు

పరమాచార్య స్వామివారి యొక్క దయను మరియు అనుగ్రహాన్ని పొందగలిగే అదృష్టం, 1964 నుండి మా కుటుంబానికి కలిగింది. యుక్తవయస్సులో కూడా ఎన్నోసార్లు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నాము.

1964లో ఒకరోజు స్వామివారు కాంచీపురంలోని సర్వతీర్థం కొలనులో స్నానం చేసి బయటకు వస్తుండగా, నా భర్త శ్రీ వి. రాజగోపాలన్, నా ఆడపడుచు సౌ. వసంత మరియు నేను స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నాము. అప్పటికింకా స్వామివారికి మేము అంతగా పరిచయం లేదు. స్వామివారిని చూడగానే మా ఆయన స్వామివారిని అరక్కోణం వచ్చి అనుగ్రహించాల్సిందిగా కోరారు. అరక్కోణంలో ఉన్న శ్రీ దురైస్వామి అయ్యర్, అడ్వకేట్ శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. అరక్కోణం దగ్గర్లో ఏదైనా తటాకం, సరస్సు లేదా నది వంటి నీటి వసతి ఏమైనా ఉన్నదా అని స్వామివారు అడగగా అవునని సమాధానం ఇచ్చారు మావారు. భగవంతుని ఆదేశం అదే అయితే మీ కోరిక తప్పక తీరుతుంది అని చెప్పారు మహాస్వామి. తరువాత స్వామివారు పాదయాత్రగా బుగ్గ తీర్థం మీదుగా మధ్యలో వచ్చే తక్కోలం చేరుకున్నారు. తక్కోలం చేరుకోగానే స్వామివారి రాక గురించిన సమాచారాన్ని మాకు తెలిపారు. వెంటనే మేము తక్కోలం బయలుదేరి అరక్కోణంలో మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా స్వామివారికి వేడుకున్నాము.

స్వామివారు మా ఆహ్వానాన్ని మన్నించి అరక్కోణం వచ్చారు. అప్పటికే సందర్శకులతో ఉన్న మా ఇంటికి స్వామివారు రాగానే, సాంప్రదాయానుసారం పూర్ణకుంభంతో స్వాగతం పలికాము. పరమాచార్య స్వామివారు టెంకాయను తీసుకుని పైకి విసరడంతో అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరుస్తూ, అది సరిగ్గా స్వామివారి తలపై నిలబడింది. తరువాత, పరివారానికి భోజన ఏర్పాట్లు చెయ్యమని ఆదేశించారు స్వామివారు.

బుగ్గ తీర్థంలో స్వామివారు మకాం చేసినప్పుడు, రోజూ కారులో బుగ్గకు ఆహారం తీసుకునివెళ్ళేవాళ్లం. కానీ ఒకరోజు బుగ్గకు వెళ్లడానికి ఏ వాహనమూ కనీసం ఒక టాక్సీ కూడా దొరకలేదు. అప్పటికే మధ్యాహ్నం ఒకటిన్నర, మాకు ఆతృత ఎక్కువవుతోంది. అప్పుడు బుగ్గలో ఉన్న శ్రీ సింప్సన్ జయరామన్ దంపతులు మాకోసం కారు పంపడంతో, ఆహారం తీసుకునివేళ్లాము. స్వామివారికి మా పరిస్థితి తెలుసుకాబట్టి కారును పంపారు.

తరువాత చాలా సంవత్సరాలకి, స్వామివారు పాదాచారియై బుగ్గకి వెళ్తుండగా, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో మహాస్వామి వారిని దర్శిచుకున్నాము. బుగ్గలో ఉన్నన్నిరోజులూ తన పరివారానికి ఆహారం ఏర్పాటు చేయడానికి మాకు కుదురుతుందేమో అని విచారించారు. స్వామివారు అనుగ్రహిస్తే ఏర్పాటు చెయ్యడం మాకేమీ కష్టం కాదని మేము ఆనందంతో చెప్పాము. కొండ దిగగానే స్వామివారు మాతో, “నన్ను కనిపెట్టుకునివుండు, నేను మిమ్మల్ని కనిపెట్టుకునివుంటాను” అని అన్నారు. ఈ మాటలు ఇప్పటికీ మా చెవుల్లో మొగుతున్నాయి. ప్రత్యక్షంగా విన్నవారు ఇంకా మఠంలో ఉన్నారు. స్వామివారి పరివారానికి భోజన ఏర్పాట్లు చెయ్యమని స్వామివారే స్వయంగా మాకు ఆజ్ఞాపించడం మా అదృష్టం అని ఎందరో మాతో చెప్పారు. సాయంత్రం మావారు మా మరిది మహాలింగాన్ని, అతని భార్య వసంతను, మా అత్తగారిని స్వామివారి దర్శనానికి తిరుత్తణికి పంపారు. మహాలింగం పేరుని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు స్వామివారు. మహాలింగం పిల్లల్ని మా పిల్లలనుకున్నారు స్వామివారు. కేవలం పరమాచార్య స్వామివారి ఆనుగ్రహం వల్లనే మేము ఎన్నో కష్టాలను ఏదుర్కోగలిగాము.

1974లో మా పెద్దమ్మాయి వివాహం మద్రాసులో నిశ్చయించినప్పుడు, కాంచీపురం వెళ్ళి అమ్మవారిని ఆరాధించి, మహాస్వామి వారి ఆశీస్సుల కోసం తేనంబాక్కం చేరుకున్నాము. స్వామివారు అప్పుడు మౌనంలో ఉన్నారు. కానీ మేము అక్కడకు చేరుకోగానే, మా అదృష్టం స్వామివారి మాటలు వినబడ్డాయి. ఒక పళ్ళెంలో ప్రధానం చీర, మాంగల్యం పెట్టి స్వామివారి ఆశీస్సులను అర్థించాము. స్వామివారు తమ దివ్య హస్తాలతో వాటిని తాకి, మా కుటుంబం మొత్తం క్షేమంగా సుఖంగా ఉంటారని ఆశీర్వదించారు. భారత రాష్ట్రపతి శ్రీ ఆర్. వేంకటరామన్, భార్య శ్రీమతి జానకి అమ్మాళ్ తో సహా మద్రాసులో మా అమ్మాయి పెళ్ళికి వచ్చి మహాస్వామివారి ఆశీస్సులను గుర్తుచేస్తూ తన వైవాహిక జీవితం సుఖసంతోషాలమయంగా ఉంటుందని దీవించారు.

ఇతర కుమార్తెల పెళ్లి గురించి కూడా చెప్తే ఇది చాలా పెద్ద వ్యాసం అవుతుంది. కానీ మా నాల్గవ కుమార్తె సౌ. లలిత వివాహం గురించి చెప్పవలసిందే. మేము తిరుచ్చి వెళ్ళి తనకు ఒక మంచి సంబంధం చూసి వచ్చాము. అబ్బాయి తల్లితండ్రులు కూడా ఇష్టంగా ఉండడంతో, మా అమ్మాయిని చూడడానికి అరక్కోణం రమ్మని ఆహ్వానించాము. మేము అరక్కోణం తిరిగొచ్చేటప్పటికి ఈ సంబంధం ఎంతమాత్రమూ ఇష్టం లేదని లలిత భీష్మించుకూర్చుంది. కానీ లలితకు పరమాచార్య స్వామివారిపై అపారమైన భక్తి ఉండడంతో లలితను స్వామివారి దర్శనం కోసం కాంచీపురం వెళ్లాము. స్వామివారి వద్ద సెలవు తీసుకుని అరక్కోణం తిరిగొచ్చాము. ఇంతలో లలిత ఆలోచనల్లో గొప్ప మార్పు వచ్చి ఈ సంబంధం ఒప్పుకుంది. ఇది కేవలం మహాస్వామివారి అనుగ్రహం మాత్రమే.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Dec, 00:55


ఉత్తర చిదంబర దర్శనం

ఒక శనివారం, పరమాచార్య స్వామివారు చచాడి అనే ఊళ్ళో ఉన్నప్పుడు, మేము బెల్గాం నుండి దివ్యనామ సంకీర్తన చెయ్యడానికి వెళ్ళాము. స్వామివారు బయట కూర్చుని ఉన్నారు. మేము దీప ప్రదక్షిణం చెయ్యబోయే నేలను చూస్తే అంతా కంకర రాళ్ళతో నిండి ఉంది. అక్కడ భజన చెయ్యడం ఎలాగా అని ఆలోచిస్తున్నాము. మా ఆలోచనను గమనించిన స్వామివారు భజన కొనసాగించమని చెప్పారు. దాదాపు అయిదు గంటలపాటు భజన చేశాము. చివరలో హారతి జరిగేదాకా, భజన చేస్తున్నంతసేపు స్వామివారు అక్కడే కూర్చున్నారు. మా పాదాలపై చిన్న గీతకూడా పడకుండా భజన కార్యక్రమం జరగడం చూసి మేమందరం స్వామివారి కరుణను తలచుకుని ఏడ్చేశాము.

ఒకసారి పరమాచార్య స్వామివారు బెన్నహట్టి అనే ప్రాంతంలో మకాం చేస్తున్నప్పుడు స్వామివారి వద్దకు నా స్నేహితుణ్ణి, అతని చెల్లెల్ని తీసుకునివెళ్లాను. అప్పుడు సాయంత్రం ఆరుగంటల సమయం. మేము సంధ్యావందనాన్ని ముగించుకుని, శ్రీ సుబ్బరామ దీక్షితర్ శంకరాభారణ రాగంలో రచించిన “శంకరాచార్యం స్మరామ్యహం” కృతిలో ఉన్న సందేహాన్ని అడగడానికి మహాస్వామి వారి వద్దకు వెళ్లాను. నేను వారికి దగ్గరగా నిలబడి ఉన్నాను. శ్రీ ఉగార్ స్వామి పరమాచార్య స్వామివారితో సంస్కృతంలో సంభాషిస్తున్నారు. నేను ఇబ్బంది పడడం గమనించిన స్వామివారు కింద కూర్చోమని చెప్పి, నా సందేహం ఏమిటో తెలపమని అడిగారు. కాని అప్పటిదాకా నా సందేహం ఎవరికీ తెలియదు.

తరువాత మూడు గంటలపాటు ఆ కృతిలోని ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ, ఉపన్యసించారు. మధ్యలో స్వామివారితో పాటు నేను కూడా గట్టిగా పాడాను. అ సుదీర్ఘమైన ఉపన్యాసంలో నటరాజ స్వామి నర్తన, పాణిని వ్యాకరణం, సూత్రాల ఉత్పత్తి మొదలైనవి ఉన్నాయి. అప్పుడు రాత్రి తొమ్మిదిన్నర కావడంతో, సాంబ్రకి వెళ్ళకుండా ఆ రాత్రికి అక్కడే ఉండిపొమ్మని ఆజ్ఞాపించారు. మేము విశ్రాంతికి వెళ్ళినతరువాత, మహాస్వామి వారు శ్రీ రాజగోపాలన్ (మెట్టూర్ స్వామిగళ్) తో ప్రపంచ యుద్ధం గురించి, యూరోపు పరిస్థితి గురించి మాట్లాడారు. అంతటి లోతైన విషయదృష్టితో స్వామివారు చెబుతుండగా వినడం మా అదృష్టం.

ఒకసారి నేను అహ్మాదాబాద్ నుండి మహాగావ్ వెళ్లాను. స్వామివారి చుట్టూ చాలామంది భక్తులు ఉండడంతో, నేను శ్రీ ముత్తుస్వామి అయ్యర్ తో కలిసి కొద్ది దూరంలో నిలబడి ఉన్నాను. హఠాత్తుగా స్వామివారు నన్ను దగ్గరకు పిలిచి, అందరిని కూర్చుండచేశారు. విఘ్నేశ్వరునిపై కీర్తనలు పాడమన్నారు. తరువాత గంటపాటు అందరు దేవతలపై కీర్తనలు పాడించారు. తరువాత శ్రీ ముత్తుస్వామి అయ్యర్ ఒప్పుకునేవారు. ఆ సందర్భంలో వారిని కలవడం నా కుమార్తె పెళ్లి వారి మనవడితో జరిపించడానికి మార్గం సుగమం చెయ్యడానికే.

మహాస్వామివారు మహారాష్ట్రలోని సతారాలో మకాం చేస్తున్నప్పుడు స్వామివారి దర్శనం కోసం బెల్గాం నుండి వెళ్ళాము. చిదంబరంలోని నటరాజ దేవాలయం మాదిరి దేవాలయం నిర్మించడానికి పరమాచార్య స్వామివారితో చర్చలు జరుగుతున్నాయి. శ్రీ శామణ్ణ శాన్ బాగ్ అనే భక్తుడు, ఖర్చు భరించడానికి ముందుకురాగా, మహాస్వామివారి ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధం అవుతూ ఉంది. అప్పుడు మహాస్వామివారు నావైపు తిరిగి ఉత్తర చిదంబరం అనుపేర నటరాజ స్వామి దేవాలయం రాబోతోందని, పూర్తైన తరువాత వచ్చి దర్శనం చేసుకొమ్మని స్వామివారు చెప్పారు. అప్పుడు నేను అహ్మదాబాదుకు బదిలీపై ఉండడంతో, ఇంకో రెండు మూడేళ్ళకు గాని పూర్తయ్యే దేవాలయాన్ని దర్శించుకోవడం ఎలాగా అన్న ఆలోచనలో పడ్డాను.

చివరకు పంతొమ్మిదేళ్ళ విరామం తరువాత మార్చి 27 1999న పరమాచార్య స్వామివారు చెప్పినట్టు జరిగింది. మహారాష్ట్ర యాత్రకు వెళ్ళిన మేము ఉత్తర నటరాజ దేవాలయానికి వెళ్ళే అవకాశం కలిగింది. అక్కడి మూలమూర్తి ముందు నిలబడగానే, పరమాచార్య స్వామివారు అక్కడ కూర్చున్న ఊహ కలిగింది. అప్పటికే శ్రీ శాన్ బాగ్ గారు కాలం చెయ్యడంతో, చాలా ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనను శ్రీ శామణ్ణ శాన్ బాగ్ గారి కోడలితో చెప్పాము. వారి ఆశ్చర్యానందాలకు లోనయ్యి, కళ్ళ నీరు పెట్టుకుంటూ, మహాస్వామివారి దూరదృష్టిని, కరుణను నెమరువేసుకున్నారు.

--- సాంబ్ర కృష్ణమూర్తి. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

03 Dec, 00:34


స్వామికి మొక్కిన మొక్కు

ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యుల అభిప్రాయం వెంటనే ఒక పెద్ద శస్త్రచికిత్స చెయ్యాలి. తిరుచ్చిలోని ఒక ప్రముఖ ఆసుపత్రులో తనని చేర్చాను. మరుసటిరోజు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాము. ఆమెను శస్త్రచికిత్సకు తీసుకునివెళ్లారు. బాధతో, ఆందోళనలతో మనస్సు కకావికలమైపోయింది. మా ఇంటి దైవమైన ఏడుకొండలస్వామిని ప్రార్థించాను. కానీ మన్సు కుదురుగా ఉండడంలేదు. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు గుర్తుకొచ్చారు. స్వామివారే తనని కాపాడాలని, శస్త్రచికిత్స విజయవంతమైన తరువాత ఇద్దరమూ వచ్చి, 1,008 రూ. కానుకగా సమర్పిస్తామని ప్రార్థించాను. ఒకటిన్నరగంట తరువాత శాస్త్రచికిత్స ముగియగానే, సాధారణ వార్డుకు మార్చారు.

“మేము ఏదేదో అనుకుణామూ కానీ, కానీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు. శస్త్రచికిత్స విజయవంతమైంది” అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవాడికి, పరమాచార్య స్వామివారికి మనస్సులోనే సాష్టాంగం చేశాను. మూడు రోజుల తరువాత ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాము.

తరువాత గోకులాష్టమి పండగ వచ్చింది. మనం కాంచీపురం వెళ్ళి, అక్కడి సేవకులకి మురుకులు, వెన్న గుళ్ళు ఇచ్చి, స్వామివారిని దర్శించుకుందామని నా భార్యకు చెప్పాను. అన్నిటినీ తీసుకుని శివాస్థానం చేరుకున్నాము. ఉదయం దర్శనం తరువాత ఏడుగంటలకి అనుష్టానానికి కూర్చున్నారు స్వామివారు. స్వామివారు అనుష్టానం కోసం శివాస్థానంలో ఒక పాకలోకి వెళ్ళడం మేము బయటినుండే చూశాము. నా విన్నపాన్ని స్వామివారికి ఎలా తెలియజేయాలో నాకు పాలుపోలేదు. అక్కడే ఉన్న ఒక సేవకుడిని పిలిచాను.

“స్వామివారికి చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. నేను స్వామివారికి కానుక మొక్కుకునాను. నా భార్యను కాపాడారు. నేను కానుకను సమర్పించాలి; ఎలా చెయ్యాలో నాకు తెలియదు. మంచి సమయం చూసుకుని నువ్వు స్వామివారితో చెప్పి వారి ఆదేశాన్ని నాకు తెలుపు” అని చెప్పాను.

స్వామివారి అనుష్టానం పూర్తవగానే, ఆ సేవకుడు గట్టిగా, “తంజావూరు సంతానం వచ్చాడు. స్వామివారికి విజ్ఞాపన చెయ్యడానికి సిగ్గు పడుతున్నాడు. అతని భార్యకు పెద్ద శస్త్రచికిత్స జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో ఆమెను కాపాడమని స్వామివారికి కానుక మొక్కుకున్నాడు. దంపతులిరువురూ బయట నించున్నారు” అని చెప్పాడు.

మహాస్వామి వారు నవ్వుతూ, ఛాతీని ముట్టుకుని “నాకు మొక్కుకున్నాడా? ఎంత మొత్తమో అడుగు?” అన్నారు. “1,008 రూ. కానుక మొక్కుకున్నాను” అని చెప్పాను.

“ఆ ధనం తీసుకునివచ్చాడేమో అడుగు?”

“వెంటతెచ్చాను”

ఈ సంభాషణ అంతా విని నా భార్య నావైపు అయోమయంగా చూసింది. నా మొక్కు గురించి ఆమెకు తెలియదు.

మేము అక్కడ ఉంచిన పళ్ళు, టెంకాయలు మరియు ఇతర పదార్థాలను రెండు పెద్ద పెద్ద పళ్లాలలో సర్దమని చెప్పారు స్వామివారు. “ఇక్కడ ఋగ్వేద పారాయణం చేసే శాస్త్రిగారిని పిలవండి” అని ఆదేశించారు. శాస్త్రి గారు రాగానే, మమ్మల్ని జంటగా నిలబడి 504 రూ. ఒక పల్లంలో ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు.

శ్రీమద్భాగవతం పారాయణం పూర్తిచేసిన మరొక శాస్త్రి గారిని పిలిపించి, మరొక్క పళ్ళెంలో 504 రూ. ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు.
తరువాత మందహాసంతో , అక్కడున్నవారికి వినబడేటట్లుగా “ఇది విన్నారా! ఇతను చెబుతున్నాడు ఇతని భార్యకు ఒక పెద్ద శాస్త్రచికిత్స జరిగింది. అందుకోసమని నాకు మొక్కుకుని 1,008 రూ. కానుకగా నాకు సమర్పించడానికి తెచ్చాడు. అందరూ దేవునికి, దేవాలయానికి మొక్కు చెల్లిస్తారు. చూడండి ఇతను నాకు మొక్కుకున్నాడు అంట!” అని గట్టిగా నవ్వగానే, అక్కడునవారందరూ స్వామివారితో శృతి కలిపారు.

స్వామివారు మాకు పూర్ణ అనుగ్రహాని ఇచ్చి, “వెళ్లిరండి” అని ఆశీర్వదించారు. ఎప్పటికీ నా కళ్లెదుటన ఉండే ఒక అపురూపమైన సంఘటన.

--- తంజావూరు సంతానరామన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

02 Dec, 00:42


“నువ్వు ఇక్కడకు వచ్చి మూడు గంటలు అయ్యింది. ఎవరోఒకరు వస్తున్నారు. సరే, నువ్వు సాధారణంగా పుదు పెరియవాను చూడడానికి వస్తావు కదా? వారు నీతో ఎలా ఉంటారు?”

ఒక్కక్షణం ఆలోచించి చెప్పాను “నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా స్వామివారు సురేశ్వరాచార్యుల సన్నిధిలోని ఒక గదిలో దర్శనం ఇస్తుంటారు. నన్ను చూడగానే వెనకవైపు ద్వారం గుండా లోపలకు రమ్మని సైగచేస్తారు. నేను అడిగినవాటికి సమాధానాలను వివరించి నేను వెళ్లడానికి అనుమతి ఇస్తారు. స్వామివారి అనుగ్రహ ప్రసాదం తీసుకున్న తరువాత నేను సెలవు తీసుకుని వెళ్తాను”.

“బయట జనం దర్శనం కోసం వేచివుంటారు కదా, అప్పుడు పెరియవా ఏం చేస్తారు?”

“నాకు సమాధానాలు చెబుతూనే, వారికి ప్రసాదం ఇచ్చి, వాళ్ళ సమస్యలకు కూడా వివరణలు ఇచ్చి పంపుతుంటారు”

“అది నాకు అంత సులభంగా రాదు. చూడు నిన్ను ఇక్కడ నాలుగ్గంటలపాటు కూర్చోబెట్టాను”

తరువాత నేను చదువుతుండగా, ‘ఉరకం’ అన్న పదం వచ్చింది. ఒక్కసారిగా ఆగమని చెప్పారు.

“మనం ఇప్పుడు ఎక్కడున్నాము?”

“కాంచీపురం”

“ఈ స్థలం?”

“శివకంచి, పెద్ద కాంచీపురం”

స్వామివారు నా సమాధానంతో సంతృప్తులు కాలేదు. నావెనుక కొందరు నిలబడున్నారు. ఒక ముసలి దంపతులు చేతులు జోడించి నిలబడ్డారు. “వారు ఎక్కడివారో అడుగు?”. నేను అడిగాను.

“పాలక్కాడ్”

స్వామివారి మొహం వెలిగిపోయింది. “పక్కన ఉన్నావిడ అతని ఇల్లాలేనా అడుగు”

నేను అడిగాను. అతను “అవును” అన్నాడు.

స్వామివారు వారిని అడిగారు, “మీకు దగ్గరలో కామాక్షి అమ్మవారి ఆలయం ఉందా?”

అతడు “నాకు తెలియదు” అన్నాడు.

“బహుశా స్వామివారు ఉరకం కామాక్షి గురించి అడుగుతున్నారేమో” అన్నదావిడ.

“ఆమెను ముందుకు రమ్మని చెప్పు”. ఆమె వచ్చింది.

“అక్కడికి వెళ్ళారా, ఆ దేవాలయానికి”

“వెళ్ళాను. అక్కడ ఒక వస్త్రంపై అమ్మవారి రూపం గీసివుంటుంది”

తరువాత స్వామివారు చెప్పనారంభించారు. “అప్పట్లో ఇక్కడ ఉన్న కామాక్షి చాలా ప్రసిద్ధం. తన సన్నిధిలో వైభవంగా ఉండేది. ఒకరోజు ఆమె దర్శనానికి ఒక మళయాళ నంబూద్రి వచ్చాడు. అమ్మవారిని చూస్తూ అలా నిలుచునివున్నాడు. అతడిని చూస్తే శాక్తేయుడులా ఉన్నాడు. నంబూద్రిలు దేవాలయానికి తాటి ఆకుల గొడుగుతో వస్తారు. నువ్వు తాటాకుల గొడుగు చూశావా? నేను అవునన్నాను. దాన్ని మడతపెట్టడానికి కుదరదు. అమ్మవారి సన్నిధిలో కూర్చుని, జపంతో అమ్మవారిలోని ఒక కళని ఆ గొడుగులోనికి ఆవాహన చేసి పాలక్కాడ్ కి వెళ్లిపోయాడు. ఇక్కడికి దగ్గరలోనే అతని గ్రామం. ఆ గొడుగునుండి మరలా ఒక వస్త్రంపై రచించిన అమ్మవారి పటంలోనికి అమ్మవారిని ఆవాహన చేశాడు. కామాక్షి కొలువున్న ఈ ఊరి పేరునే తమ ఊరి పేరుగా పెట్టుకునారు. కాంచీపురానికి ఉరకం అన్న పేరు కూడా ఉంది”

నేను నా ఊరికి వచ్చిన తరువాత ‘affair’ అన్న పదం ఉచ్చారణ గురించి అడిగాను. ఆంగ్ల నిఘంటువును చూసి, సరైన ఉచ్చారణ తెలిపారు. నాకు ఎక్కడో ఒకసారి చదివినట్లు గుర్తు, మహాస్వామి వారి ఆంగ్ల ఉచ్చారణ ఆంగ్లేయుల కంటే ఎంతో స్పష్టంగా ఉంటుంది.

--- తంజావూరు సంతానరామన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

02 Dec, 00:42


ఉరకం కామాక్షి

నేను చాలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే, తంజావూరు పశ్చిమ వీధిలో, కామకోటి శంకరాచార్య స్వామివారు మేనాలో ఉదయము, సాయంత్రమూ అటు, ఇటు వెళ్ళడం చూశాను. ముడివేయని నా తల వెంట్రుకలు కదులుతూ ఉండగా, నేను ఆ పల్లకి వెంట పరుగులు పెట్టేవాడిని. మేనా మోసేవారిని చూశాను; ఒకరు అందరికంటే ముందర పరిగెడుతూ, ‘రామ రామయ్య’, ‘రామే రామయ్య’, ‘కంచి కామాక్షి’, ‘మధురై మీనాక్షీ’ అని పాడుకుంటూ; ‘గౌరీ కాళై’ అన్న వాద్యాన్ని అప్పుడప్పుడూ ఊదుతూ; మిరుమిట్లు గొలిపే మనోహరమైన గులాబీ ఛాయతో మెరిసిపోతున్న స్వామివారు చక్కపాదుకలను వేసుకుని, ఇళ్ల ముందర దిగి, ఆ ఇంటి భక్తులు కుటుంబంతో సహా స్వామివారిని ఆహ్వానించేవారు. ఇదే నా తొలి దర్శనం.

1942లో తంజై విజయంలో స్వామివారు పట్టణ ప్రవేశానికి వెళ్లారు. మా మేనమామ శ్రీ సుందరేశ శర్మ ఏర్పాట్లలో పాల్గొన్నారు. మా వ్యాపార స్థలం ముందర స్వామివారికి పూర్ణకుంభం సమర్పించాను. స్వామివారు మామని, “చిమిళి గ్రామమా?” అని అడిగారు. అవునన్నారు మామ. స్వామివారు పూర్ణకుంభంపైన ఉన్న టెంకాయను తీసుకుని, జుట్టుపట్టుకుని పైకెత్తి, “దీనికి ఉంది కానీ ఇతనికి లేదు (శిఖ)” అని అన్నారు. చిన్న మందహాసంతో నన్ను అనుగ్రహించారు.
ఉత్తర భారతంలోని సతారాలో స్వామివారి మకాం. దర్శనానికి అక్కడికి వెళ్ళాను.

“నీకు రాజ రాజ చోళుని గురించి తెలుసా?” అని అడిగారు స్వామివారు.

“తంజావూరు పెద్ద ఆలయాన్ని(బృహదీశ్వరాలయం) నిర్మించాడు; ఒక గొప్ప చక్రవర్తి. ఇంతే నాకు తెలుసు”

“తనకు తానే బిరుదు ఇచ్చుకున్నాడు. అది నీకు తెలుసా?”

“లేదు”

“తన పేరుకు ముందు ‘శివపాదశేఖరుడు’ అన్న బిరుదు ఉంచుకున్నాడు. దానికి అర్థం తెలుసా? పరమేశ్వరునికి చంద్రశేఖరుడు అని పేరు. తలపై చంద్రుని ధరిస్తాడు. అది చంద్రుడిని కాపాడడానికి. అది సరే; మరి ఈ రాజుకు, శివపాదశేఖరుడు అన్న పేరెందుకు, తెలుసా? ఎందుకంటే అతడు ఎప్పుడూ పరమేశ్వరుని పాదాలను తలపై దల్చాడు అన్న భావనతో ఉంటాడు. సరే, నువ్వు మరలా వచ్చినప్పుడు అతని గురించి నీకు తెలిసిన విషయాలను రాసుకుని రా”

స్వామివారు కాంచీపురంలో ఉన్నప్పుడూ మరలా దర్శనానికి వెళ్ళాను. చేతిలో ఒక పుస్తకాన్ని పెట్టుకున్నాను. స్వామివారు నన్ను చూసి పక్కన ఉన్నతనితో, “చేతిలో తెచ్చినది ఏమిటో అతడిని అడుగు” అని చెప్పారు.

“ఇంతకుముందు స్వామివారిని దర్శించుకున్నప్పుడు, రాజ రాజ చోళుని గురించి నాకు తెలిసిన, ఇంకా పుస్తకాల్లో ఉన్న విషయాలను సేకరించుకుని రమ్మనారు. పుస్తకంలో వ్రాసి తెచ్చాను”

“ఇలా ఇవ్వు నాకు” అని స్వామివారు నా పుస్తకాన్ని తెరిచి అందులోని విషయాలను చూస్తున్నారు.

“ఇవన్నీ నువ్వే రాశావా?”

“లేదు. మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయునికి ఈ సమాచారం అంతా ఇచ్చి, రాసిమ్మని కోరాను. నా చేతివ్రాత అంతగా బాగోదు”

“ఈ విషయాలన్నీ ఎక్కడినుండి సేకరించావు?”

“స్వామివారి ఆజ్ఞ అయిన తరువాత, వివరాల కోసం పురాతత్వ శాఖకు వెళ్ళాను. వారి నుండి నాకు ఎటువంటి సమాచారమూ లభించలేదు. తరువాత నేను మద్రాసు విశ్వవిద్యాలయ గ్రంథాలయం లోని చోళ రాజుల పుస్తకాలను చదివాను. నీలకంఠ శాస్త్రిగారు రచించిన పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులోని కొన్ని విషయాలను నేను సేకరించి, వాటిని వ్రాయించాను”

“ఒక పట్టికను ఇచ్చావు కదా? చదువు” అన్నారు. నేను చదివాను.

చోళుల పాలనలో ఉన్న శాస్త్ర, వేదాంత, వేదభాష్య, రాజ్య నిర్వహణ, దేవాలయ నిర్వహణ పరిస్థితులను చదవమని అడిగారు స్వామివారు.

వీటన్నిటిని నేను ఆంగ్లంలో వ్రాసుకున్నాను. ఒకచోట, ‘The affairs of the Temple’ అన్న వాక్యం ఉంది. దాన్ని చదవగానే, “అగు. మరలా చదువు” అన్నారు స్వామివారు. ‘The affairs of the Temple’ అని చెదివాను. “అది తప్పు (ఉచ్చారణలో)” అన్నారు స్వామివారు. దర్శనం కోసం వచ్చిన ఇద్దరు ముగ్గురు భక్తులు నా వెనుక నిలబడి మా సంభాషణ అంతా గమనించారు. అందులో ఒకరు నాతో, “పెరియవాకు చెప్పు, ‘activities related to the temple’ అని” అన్నారు. అతడిని చూడడానికి వెనక్కు తిరిగాను. వెంటనే స్వామివారు “ఎవరది?” అని అడిగారు.

“మహాస్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను” అన్నాడు.

“అతణ్ణి పక్కకు వెళ్ళమని చెప్పు” అని నాతో అన్నారు స్వామివారు. నాలో నేనే నవ్వుకున్నాను.

“The affairs of the Temple… సరైనదే, తరువాత చదువు” అనడంతో నేను చదివాను.

ఆ సమయంలో సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీ రంగనాథ మిశ్రా కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. వారితో స్వామివారు కుటుంబ విషయాలు మాట్లాడి, క్షేమామాచారాలు కనుక్కున్న తరువాత నావైపు చూశారు. నేను అక్కడే కూర్చుని ఉన్నాను.

మరొక భక్తుడు, కరైకుడి శ్రీ అళగప్ప చెట్టియార్ అల్లుడు దర్శనానికి వచ్చాడు. స్వామివారు అతనితో మాట్లాడి నావైపు చూశారు. వీరు ఇరువురూ స్వామివారితో సెలవు పుచ్చుకుని వెళ్లిపోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది.
మరలా రాజ రాజ చోళుని విషయాలను చదవడం మొదలుపెట్టాను. హఠాత్తుగా చదవడం ఆపమని చెప్పారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

01 Dec, 01:01


కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) pinned «జయ జయ శంకర !! హర హర శంకర !! 2024 జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మనం ట్రస్ట్ తరుపున పూర్తిచేసిన కార్యక్రమాల వివరాలు * హైదరాబాదులో ఉన్న మన అభీష్టం గోశాలలోని గోవులకు గోగ్రాసం మరియు పౌష్టిక ఆహారం కొనుగోలు * కల్పతరు గోశాల, అద్వైత గోశాలల…»

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

01 Dec, 01:01


జయ జయ శంకర !! హర హర శంకర !!

2024 జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మనం ట్రస్ట్ తరుపున పూర్తిచేసిన కార్యక్రమాల వివరాలు

* హైదరాబాదులో ఉన్న మన అభీష్టం గోశాలలోని గోవులకు గోగ్రాసం మరియు పౌష్టిక ఆహారం కొనుగోలు

* కల్పతరు గోశాల, అద్వైత గోశాలల నిర్వహణ, పనివారి జీతాలు, ఎండు గడ్డి కొనుగోలు, మందుల కొనుగోలు, గోశాల మరమ్మతులు వగైరా

* వారణాసి క్షేత్రంలో సాధు సంతులకు నిత్య నారాయణ సేవ.

* పరమాచార్య స్వామివారి జన్మ నక్షత్రం నాడు అనుషం మాస వేద పారాయణ

* అన్నవరంలో ఉన్న విశ్వమాత గోకులానికి ఒక ఆవును కొనడమైనది.

* శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆశీస్సులతో వెలువడుతున్న "కామకోటి వాణి" మాసపత్రిక ముద్రణకు ఆర్ధిక సహాయం

* మన అద్వైత గోశాలలో లోకక్షేమార్ధం ఐదు రోజుల పాటు అత్యంత అద్భుతంగా యజుర్వేద తైత్తిరీయ సంహిత యాగం నిర్వహణ

* ఆమ్నాయ పీఠ సహిత వివిధ అద్వైత పీఠ యతివరేణ్యులకు మన ట్రస్ట్ తరుపున సమిష్టి భిక్షావందనం (దాదాపు 25 పీఠాలకు/మఠాలకు)

* వరదల దృష్ట్యా నష్టం వాటిల్లిన ఎండ్రాయి గోశాలకు ఎండు గడ్డి కొనుగోలు.

* శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశం మేరకు "విజయ మహా రత్న హారః" పుస్తకాల ముద్రణ

* శ్రీ కామకోటి చంద్రశేఖర వేద పాఠశాల వార్షిక విజయదశమి వేద సదస్సుకు ఆర్థిక సహాయం

* పొదిలి గ్రామంలో మహాస్వామి సేవా సమితి వారు నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలకు ఆర్థిక సహాయం.

* శృంగేరి శ్రీ శారదాంబ సన్నిధిలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు విరాళం

* కార్తీక మాసం సందర్భంగా ఆవిముక్త కాశీ క్షేత్రంలో వివిధ ఆలయాల సుందరీకరణ (పెయింట్లు, చిన్న చిన్న రిపేర్లు) కోసం విరాళం

* సప్తరుషి చారిటబుల్ ట్రస్ట్ వేదపాఠశాలకు విరాళం

* కార్తీక మాసంలో వారణాసి క్షేత్రంలో అస్సీ ఘాట్ దగ్గర ఉన్న ముముక్షు భవన్ లో కోటి పార్థివ లింగార్చన మరియు సహస్ర లింగేశ్వర ప్రతిష్ట మహోత్సవంలో మనవంతు సహాయ సహకారం.

* గత తొమ్మిది సంవత్సరాలుగా మనం ప్రతిరోజూ చదువుకుంటున్న కంచి పరమాచార్య వైభవం పుస్తకం ముద్రణ మరియు ఆవిష్కరణ.

విరాళాలు పంపదలచినవారు Google Pay / Phone Pay / BHIM / Paytm ద్వారా UPI ID : 7259859202@hdfcbank ఉపయగించి చెయ్యవచ్చు.

ట్రస్టు బ్యాంకు అకౌంటు వివరాలు

A/C Name: Kanchi Paramacharya Dharmika Seva Trust
A/C. Num: 50200059599164
IFSC Code: HDFC0001753
A/C Branch: Kanakapura Road, Bengaluru

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

30 Nov, 00:42


పన్నెండేళ్ళ తరువాత

నేను నాస్తికంలో మునుగిపోయిన ఒక తండ్రి కూతురిని. నాకు ఇరవై ఏళ్ళ ప్రాయం దాకా దేవాలయానికి వెళ్ళడం అన్న సామాన్య విషయం కూడా తెలియదు. తరువాత నా జీవితంలో అనుకోని ఉపద్రవం వల్ల నా భర్త నుండి విడిపోయి, తల్లితండ్రులకు కూడా దూరమయ్యి బ్రతకవలసిన పరిస్థితి కలిగింది. నా బిడ్డతో కలిసి మరొక ఊరిలో ఉన్న ఒక అనాధ శరణాలయంలో ఆశ్రయం పొందాను. అక్కడ జరుగుతున్నా అన్యాయాన్ని చూసి సహించలేక అక్కడి నుండి వచ్చేశాను. సెకెండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ పూర్తైనా, నేను పనిమనిషిగా, వంటమనిషిగా, బానిసగా బ్రతుకుతూ కష్టాల కొలిమిలో చిక్కుకుని బయటకురాలేక శోకసంద్రంలో కరిగిపోయాను.

చాలా పత్రికలలో వచ్చే వివిధ భంగిమలలో ఉండే పరమాచార్య స్వామివారి చిత్రపటాలను ఒక పెద్ద పుస్తకంలో అంటించేదాన్ని. ఒకరోజు స్వామివారు మా ఇంటిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, నేను వారి కాళ్ళను ఒత్తుతున్నట్టు కల వచ్చింది. అప్పటి నుండి నాకు మహాస్వామి వారిపై భక్తి కలిగింది.

ఒకసారి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా విద్యార్హత పత్రాన్ని, స్వామివారి చిత్రపటాలు ఉన్న పుస్తకాన్ని కూడా పాత కాగితాలు కొనేవాడికి వేశాను. నేను పొరపాటున పంపానేమో అని వాటిని తిరిగిచ్చాడు దుకాణదారు. ఇందుకు ఏదో కారణం ఉంటుందనిపించి వాటిని భద్రంగా దాచుకున్నాను.

కొన్ని నెలల తరువాత నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. చెడ్డవాడైన నా శత్రువు శిక్షించబడి అతని నుండి నాకు పూర్తి స్వేచ్చ లభించింది. చెన్నైలో ఉన్న నా సోదరుని సహాయం, ఆశ్రయం లభించింది.

పన్నెండు సంవత్సరాల తరువాత పాఠశాల ఉపాధ్యాయురాలిగా మరలా చేరాను. యాభైఏళ్ల వయస్సు తరువాత బి.లిట్ మరియు బి.ఎడ్ లో ఉత్తీర్ణురాలినయ్యాను. ఎన్నో పుస్తకాలను ప్రచురించాను. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాను. నేను స్వామివారిని దర్శించుకున్నది కేవలం ఒకటి రెండు సార్లే అయినా, ఈనాటి నా ఈ ఉన్నతమైన జీవితం నాకు దొరికింది కేవలం స్వామివారి అనుగ్రహం వలన మాత్రమే.

--- పులవర్ అను వెణ్ణిల. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

29 Nov, 00:32


స్వామివారిది అపారమైన జ్ఞాపకశక్తి

పరమాచార్య స్వామివారి జ్ఞాపకశక్తి మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. స్వామివారి శక్తి ఎటువంటిదో నాకు స్వానుభవం.

1952 మే నెలలో పరమాచార్య స్వామివారు కాంచీపురంలో వ్యాపూజ కోసం వందవాసి తాలూకా, తైయార్ గ్రామం మీదుగా ఏనుగులు, గుర్రాలు, ఎడ్లబళ్ళు, సేవకులు, భక్తులతో కలిసి పరివారంగా వెళ్తున్నారని తెలిసి తైయార్ ప్రజలు, వేదపండితులు పెద్దసంఖ్యలో ప్రధాన రహదారికి ఇరువైపులా నిలబడి, నేలపై పడి దండ ప్రణామాలు అర్పించి, “స్వామి పూజ తరువాత ఈ సాయంత్రానికి కాంచీపురం చేరుకోవచ్చు” అని ప్రార్థించారు.

పూజాకు కావాల్సిన ద్రవ్యాలను, పశువులకు కావాల్సిన ఆహారం, ఏనుగులకు కావాల్సిన మొలకెత్తిన విత్తనాలు సమకూర్చి స్వామివారి, స్వామివారి మొత్తం పరివారానికి ఎంతో గొప్పగా నడుచుకున్నారు. మహాస్వామి వారు కూడా ఎంతో సంతోషంతో స్వీకరించి, ఆ ఊరి ప్రజలందరినీ ఆశీర్వదించారు.

గ్రామస్థులందరూ స్వామివారి కరుణా రససాగరంలో మునిగిపోయారు. భక్తి శ్రద్ధలతో అత్యంత గౌరవంగా తమని ఆరాధించిన వారిని చూసి, “ఈ ఊరిలో వేద శాస్త్ర విద్వాంసులు ఎవరైనా ఉంటే, ఇక్కడకు పిలుచుకుని రండి” అని ఆదేశించారు.

మధురాంతకంలోని అహోబిల మఠం సంస్కృత కళాశాలలో న్యాయశాస్త్రాన్ని చదివి, చెన్నై విశ్వవిద్యాలయ శిరోమణి పరీక్ష కోసం సిద్ధమవుతున్న నేను ఆ గ్రామానికి వచ్చాను. అగ్రహారవాసులు నన్ను మహాస్వామి వారికి పరిచయం చేయడంతో, నేను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాను. స్వామివారు సంస్కృతంలో నా గురించిన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

స్వామివారు మౌనవ్రతంలో ఉండడం వల్ల ఒక పలకపై ప్రశ్నలను రాశి వివరాలు కనుక్కున్నారు. న్యాయశాస్త్ర కుసుమంజలిలో నన్ను పరీక్షించి, ఎంతో సంతోషంతో నాకు పంచలు, పళ్ళు, ఫల-మంత్రాక్షతలను ఇచ్చి ఆశీర్వదించారు. “కాంచీపురంలో జరిగే వ్యాసపూజ విద్వత్ సదస్సులో నీవు పాల్గొనాలి” అన్న ఆదేశాన్ని కూడా నాకు అనుగ్రహించారు.

1963-64 ప్రాంతంలో మహాస్వామివారు సంచారం చేస్తూ తిరువణ్ణామలై వచ్చారు. అప్పుడు స్వామివారితో పాటు శంకర మఠంలో ఉన్న నా మిత్రుడు, శ్రీమాన్ మణి శాస్త్రి కూడా వచ్చాడు. అనుకోకుండా నన్ను తిరువణ్ణామలై దేవాలయంలో చూసి, కుశల ప్రశ్నల తరువాత, మహాస్వామి వారి దర్శనానికి ఏర్పాటు చేసి, స్వామివారికి నన్ను పరిచయం చేశాడు.

అప్పుడు స్వామివారు నన్ను అడిగిన ప్రశ్న నన్ను కట్టిపడేసింది. ఒక్క క్షణం మాటలురాక మిన్నకుండిపోయాను. వారు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, “1952లో తైయార్ గ్రామంలో నిన్ను కాంచీపురంలో వ్యాసపూజ సందర్భంగా జరిగే విద్వత్ సదస్సులో పాల్గొనమని ఆహ్వానించాను. నువ్వు ఎందుకు రాలేదు?”. తైయార్ లో స్వామివారికి నమస్కరించిన విషయం నాకు అప్పుడే స్ఫురించింది. కానీ స్వామివారికి, నా విషయం దశాబ్ధం తరువాత కూడా జ్ఞాపకాలలో భద్రంగా ఉంది. అప్పుడు నేను అపరాధి కావడంతో మాటలులేక మిన్నకుండిపోయాను. ‘ఎంతటి ఆశ్చర్యం! ఏమి జ్ఞాపకశక్తి స్వామివారిది’ అని మనస్సులో అనుకుని, ఆశ్చర్యంతో, మాటలురాక, మొద్దుబారిపోయి, తప్పు చేశానన్న ప్రాయశ్చిత్తంతో స్వామివారికి సాష్టాంగ నంస్కారం చేసి తప్పును మన్నించాల్సిందిగా ప్రార్థించాను.

స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రుడినయ్యాను. తరువాతి మణి శాస్త్రితో, “ఆరోజు నాకు కలసపాక్కంకి సంచారానికి వెళ్ళాలి. రేపు ఉదయం పది గంటలకు ఇతడిని అక్కడికి రమ్మని చెప్పు. అక్కడకు రావడానికి బస్సు ఛార్జీ కూడా ఇవ్వు” అని ఆదేశించారు. నేను కాస్త సంశయించాను. నావైపు చూసి, “ఎందుకు సంశయం?” అని అడిగారు. “మీ దర్శనం చేసుకోవడానికి పాఠశాల వారు అనుమతి ఇస్తారో లేదా నిరాకరిస్తారో నాకు తెలియదు. ఇప్పుడు డబ్బు తీసుకుని ఒకవేళ రేపు రాకపోతే నేను మరలా అపచారం చేసివాడినవుతాను” అని చెప్పాను.

“నువ్వు ప్రధానోపాధ్యాయులని కలిసి పరిస్తితి వివరించు. నీకు అనుమతి లభిస్తుంది. బస్సు ఛార్జీ తీసుకుని ఇప్పుడు ఇక వెళ్ళు”

ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని మహాస్వామి వారి దర్శనం కోసం మరుసటిరోజు కలసపాక్కంకి వెళ్ళాను. స్వామివారు పూజలో ఉండడంతో, నేను శ్రీమఠం శ్రీకార్యం శ్రీ రామకృష్ణ శాస్త్రిగారిని కలిసి విషయం తెలిపాను. శ్రీభాష్యం వాక్యార్థాన్ని మఠంలోని ఆస్థానంలో ఉన్న స్వామివారి ఎదుట పఠించమని చెప్పారు. సంభావనగా ఇరవై రూపాయల విలువచేసే వెండి నాణేలు, కాశ్మీర శాలువా ఇచ్చి నన్ను సత్కరించారు.

ఈ జ్ఞాపకం జీవితకాలం నా మనస్సులో ఎప్పటికీ అలాగే ఉంటుంది.

--- యం. వి. లక్ష్మీనరసింహాచారి, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

28 Nov, 00:24


జ్వరం - జ్వరహరేశ్వరుడు

శంకరనారాయణన్ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు. అతను ఎప్పుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవాడు. అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు. పది పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది. ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు. కాని, వేటి వల్లా ఉపయోగం లేదు. ఆ వ్యాధి ఎంతకూ తగ్గడం లేదు. చివరి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది అని మహాస్వామి వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు.

మహాస్వామి వారిని దర్శించుకుని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా, స్వామి వారు ఇతని మాటలకు అడ్డు పడుతూ,

“ఇదేనా రావడం?” అని అడిగారు.
”అవును పెరియవా!”

“కంచిలో ఉన్న జ్వరహరేశ్వరుని దేవాలయం గురించి విన్నావా? ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా?” అని అడిగారు మహాస్వామి వారు.
”లేదు పెరియవ తెలియదు” అని అన్నాడు.

”సరే ఈరోజు కార్తీక మాసం ఆదివారం. పద మనం ఈరోజు జ్వరహరేశ్వరుని సూర్య భగవానుని దర్శించుకుందాము” అని ముందుకు నడిచారు. శంకరనారాయణన్ మారు మాట్లాడకుండా ఆవును అనుగమించే దూడ లాగా స్వామి వారి వెంట వెళ్ళారు.

వారు అక్కడికి చేరుకునేటప్పటికి దేవాలయం మూసివేసి పూజారి కూడా వెళ్ళిపోయాడు. అయినా స్వామివారు శంకరనారాయణన్ తో జ్వరహరేశ్వరుని దర్శింపజేసి, ఇలా అడిగారు, ”నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా?”

“లేదు పెరియవ. నా పర్సును మఠంలోనే ఉంచాను. ఇక్కడికి ఏమి తీసుకుని రాలేదు” అని అన్నాడు.

”సరే ఒక పని చెయ్యి. అక్కడున్న మండపానికి వెళ్ళి, అక్కుడన్న వారితో అడిగి కొద్ది పైకము తీసుకుని రా” అని ఆజ్ఞాపించారు.

శంకరనారాయణన్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపట్లో ఒక పది పదిహేను రూపాయలను తేగలిగాడు. మహాస్వామి వారు అతన్ని చూసి, ”స్వామి సన్నిధి ముంది ఒక పళ్ళెం ఉంది కదా అందులో కొంత వెయ్యి. మిగిలినది అక్కడున్న హుండిలో వెయ్యి” అని చెప్పారు. అతను స్వామి వారు చెప్పినట్టు చేసాడు.

”మంచిది. సరే పద ఇప్పుడు ఇక్కడినుండి కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్దాము. ఈరోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి”

“నీకు తెలుసా! ‘ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్’. ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వల్లననే సిద్ధిస్తుంది” అని తెలిపి అక్కడికి దారితీసారు.

మహాస్వామి వారు అక్కడ దర్శనం చేసుకొని, అక్కడున్న సూర్యభగవానుని ఆరాధించి అక్కడున్న మండపంలోనికి వచ్చారు. అక్కడున్న కొంతమంది వేదపండితులని పిలిచి సూర్య శతకం చెప్పమన్నారు. తరువాత దాని గురించి మహాస్వామి వారు చెప్పారు.

తరువాత శంకరనారాయణన్ తో, ”సరే సమయం అయిపోయింది. నివ్వు ఇక వెళ్ళి మఠంలో భోజనం చేసి నీ చోటికి బయలుదేరు” అని అన్నారు.

పరమాచార్య స్వామి వారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చెయ్యడం శంకరనారాయణన్ కు ఆనందంగా ఉన్నా, తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామి వారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డాడు. దిగులుతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.

కాని కొన్ని రోజుల తరువాత అతనికి తెలిసి వచ్చింది తనకు ఆ వ్యాధి పోయిందని మరలా ఎప్పుడు జ్వరం రాలేదని.

ఆ సర్వేశ్వరునకు మనం చెప్పాలా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

27 Nov, 00:20


ఇతను చిన్నపిల్లవాడు

1949వ సంవత్సరంలో శ్రీ పరమాచార్య స్వామివారు ఆనందతాండవపురం విజయం చేసి నలభై రోజులపాటు మకాం చేశారు. అప్పుడు నేను పదమూడు సంవత్సరాల పిల్లవాడిని. అక్కడున్న శివాలయ కొలను జీర్ణోద్ధరణ కోసం స్వామివారిని ప్రార్థించగా; స్వామివారు అంగీకరించి విజయం చెయ్యడానికి ఒప్పుకున్నారు.

ఊరెరిగింపులో భాగంగా స్వామివారు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు, సామవేదంలోని ‘అభి త్వా . . .’ అని మొదలయ్యే మంత్రం పఠిస్తూ స్వామివారికి పూర్ణకుంభం సమర్పించాము. శివస్తోత్ర రూపంలో వచ్చే మంత్రం ఇది. ఈ మంత్రాన్ని పఠిస్తూ పూర్ణకుంభం సమర్పించడం సామవేదీయుల సాంప్రదాయం.

వెంటనే స్వామివారు, “నీకు ‘న కర్మణా . . .’ అన్న మంత్రం తెలుసా?” అని అడిగారు. మా నాన్నగారు ఆ మంత్రాన్ని పూర్తిగా చెప్పారు, వారితో పాటుగా నేను కూడా చెప్పాను.

తరువాత పక్క ఇంటి వారి పూర్ణకుంభం. ‘అభి త్వా . . .’ అన్న మంత్రాన్ని పఠించమన్నారు. నా మంత్రపఠనం పూర్తైన తరువాత, “కొబ్బరికాయను తాకు. నువ్వు పఠించిన మంత్రశక్తి అందులోకి వెళ్ళాలి కదా” అన్నారు స్వామివారు. నేను తాకిన తరువాతనే స్వామివారు కొబ్బరికాయను తాకి ఆ ఇంటివారికి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఇలాగే జరిగింది.

ఒకరోజు భిక్షావందనం అయిపోయిన తరువాత అక్కడున్న పెద్ద ఇత్తడి పాత్రలో ఉన్న ఎండుద్రాక్షను పిడికెడు తీసుకుని గుంపులో ఉన్న వ్యక్తికొకరికి ఇచ్చారు స్వామివారు. అతను వాటిని భుజంపైన ఉన్న తువ్వాలులో గట్టిగా మూటకట్టి భద్రం చేశాడు. స్వామివారి ఎదురుగా వాటిని నోటిలో వేసుకుని నమలడం ఉచితం కాదని నాకు తెలియకపోవడంతో వాటిని అక్కడే ఉన్న కొందరు పాఠశాల విద్యార్థులకు ఇచ్చి, వారితోపాటుగా తిన్నాను. కొద్దిసేపు అక్కడంతా మౌనం.

తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడారు, “ఇతను చిన్నపిల్లాడు; ప్రపంచం పోకడ తెలియదు. కనుక తనకి లభించిన దానిని ఇతరులతో పంచుకుని తిన్నాడు. నేను మరొక్కరికి కూడా ఇచ్చాను కదా? అతనికి లోకవ్యవహారం తెలుసు. అందుకే తన కుటుంబం కోసమని భద్రంగా దాచుకున్నాడు”.

“లోకవ్యవహారం తెలియకపోవడం వల్ల స్వార్థం కూడా తెలియదు. కానీ మరొకతనికి లోకవ్యవహారం తెలుసు కాబట్టి, స్వార్థం కూడా తెలుసు. మూటకట్టి భద్రంగా దాచుకున్నాడు”.

తత్వం ఎంత సులభం అయిపోయింది కదా!

--- ఎన్. వేంకట్రామన్, మైలదుతురై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

26 Nov, 14:53


https://maps.app.goo.gl/hwXFKpd23Xkb3CSz8

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

26 Nov, 00:27


ఆర్తత్రాణపరాయణుడు

యాభై సంవత్సరాల క్రితం, నన్నిలమ్ తాలూకాలోని సెమ్మంగుడిలోని ఒక మీరాశీదారు ఇంట్లో పరమాచార్య స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశారు. కానీ చెప్పిన సమయానికంటే ముందే, స్వామివారు పక్క ఊరు నుండి కాలినడకన వచ్చి, అగ్నిహోత్రి శ్రీ నాగేశ్వర దీక్షితుల గారి ఇంటి అరుగుపై కూర్చున్నారు. అక్కడున్నవారితో, “అగ్నిహోత్రి నాగేశ్వర దీక్షితుల ఇల్లు ఇదే కదా? తను ఎక్కడున్నాడు? పిలవండి. ఈరోజు అతని ఇంటిలోనే భిక్ష” అని చెప్పారు.

దీక్షితులు పొలంలో పనులను పర్యవేక్షిస్తున్నాడు. వారు వచ్చి అతడితో చెప్పారు. “పరమాచార్య స్వామివారు మీ ఇంటి అరుగుపై కూర్చుని, ఈరోజు భిక్ష మీ ఇంట్లోనే, నిన్ను పిలుచుకుని రమ్మని మమ్మల్ని పంపారు”. విషయం విన్న వెంటనే దీక్షితుల పరిగెత్తుకుని వెళ్ళి, స్వామివారికి సాష్టాంగం చేసి, “అపచారం, మిమ్మల్ని అలక్ష్యం చేశాను” అని ప్రాధేయపడ్డాడు. “అగ్నిహోత్రం నిర్వహించే నీ ఇల్లు నన్ను ఇంత త్వరగా వచ్చేలాగా చేసింది” అన్నారు స్వామివారు చిన్నగా నవ్వుతూ. ఆ ఇంట్లో భిక్ష అద్భుతంగా జరిగింది. అగ్నిహోత్రం గొప్పదనం అది.

*********

యాభై సంవత్సరాల క్రితం మహాస్వామివారు శ్రీ యస్.యస్. నటేశ అయ్యర్ ఇంటి ముందర ఉపన్యాసం చేసేవారు. మేమందరమూ అక్కడకు వెళ్ళి వినేవారం. ఒకనాడు స్వామివారు చెప్పిన విషయం ఇది.

బీహారు రాష్ట్రంలోని రాంచీలో (ఇప్పటి ఝార్ఖాండ్ రాజధాని) రెండు నెలలున్నారు స్వామివారు. ఈ రెండు నెలల సమయంలో రాంచీ రామకోటి పీఠాధిపతిని ఒకసారి కూడా కలవలేకపోయారు. వారు యాత్ర నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. తరువాత ఆయన రాంచీలో ఉన్నా, కంచి కామకోటి పీఠాధిపతిని కాలవలేదు. చివరికి ఒకరోజు కలిసిన తరువాత, రాంచీ పీఠాధిపతి కంచి పీతాధిపతిని అడిగిన విషయం, “ఇన్ని రోజులైనా నేనెందుకు మిమ్మల్ని కలవలేకపోయాను”. అందుకు స్వామివారు చెప్పిన సమాధానం.

వో రామ్ కా కామ్ నహీ
ఔర్ కామ్ కా రామ్ నహీ

ఒక శ్లోకాన్ని ఉటంకించారు. అప్పటి పరిస్థితికి సరిపోయేటట్టుగా తన మాతృభాష అయిన హిందీలో స్వామివారు మాట్లాడడంతో రాంచీ రామకోటి పీఠాధిపతి చాలా సంతోషించారు. (అది రాముని పని కాదు. అలా అని రామకార్యమూ కాదు). మఠాధిపతులు ఒకరినొకరు కలవకపోవడానికి కారణాలు చిన్నవే, వాటిని దైవిక చర్యలలాగా అనుకోరాడు అని సూచనగా స్వామివారు ఈ విషయం తెలిపారు.

*********

తిరువారూర్ కమలాలయ కొలను ఉత్తర గట్టున ఉన్న తోళదూర్ భూస్వామి ఇంట్లో పరమాచార్య స్వామివారి భిక్ష ఏర్పాటు చేశారు. పక్క ఊరినుండి కాలినడకన వస్తున్న స్వామివారు దుర్గాలయం వీధిలో వెళ్తుండగా హఠాత్తుగా మాజీ జిల్లా వైద్యులు టి.వి. కృష్ణమూర్తి అయ్యర్ గారి ఇంటిలోకి వెళ్లారు. వెంటనే ఆయన, “అపచారం, మిమ్మల్ని ఆహ్వానించడానికి నేనుండగా, మీఅంతట మీరు ఇలా వచ్చారు” అన్నారు.

“అవన్నీ ఇతరులకు. నువ్వు, నేను పాఠశాల సహాధ్యాయిలము. మన మధ్యలో అటువంటి నియమనిబంధనలు అవసరం లేదు”. “నువ్వు కూడా తోళదూర్ వారి ఇంటికి రా” అని ఆహ్వానించారు స్వామివారు. “పేదవారికి ఉచితంగా వైద్యం చెయ్యడం ప్రారంభించు. అదే నీవు చేసే గొప్ప పూజ” అని అన్నారు. ఆరోజు నుండి ఆ డాక్టరుగారు ఉచితంగా పేదవారికి వైద్యం చేస్తూ, ఉచిత మందులు ఇస్తూ, తన వద్ద లేని మందులను కొనుక్కోవడానికి డబ్బులిస్తూ, వేరే ఊళ్ళ నుండి వచ్చే రోగులకు ఆహారానికి, ప్రయాణానికి డబ్బులు ఇస్తూ, చివరి జీవితం గడిపారు. ఇవన్నీ నేను, మా నాన్నగారు దగ్గరగా చూశాము. మహాస్వామి వారి స్నేహితుని కారుణ్యమే అలా ఉంటే, ఇక సాక్షాత్ ఈశ్వరరూపులైన స్వామివారి కరుణ ఎటువంటిది?

*********

కొన్ని సంవత్సరాల క్రితం మహాస్వామివారు పుదుక్కోట్టైలో ఉన్నప్పుడు, కుణ్ణియూర్ భూస్వామి కె. యస్. సాంబశివ అయ్యర్ కొన్ని రోజులు అక్కడే ఉండి స్వామివారి దర్శనం చేసుకునేవాడు. ఒకరోజు సాంబశివ అయ్యర్ ను పిలిచి, “నీవు ఇంటికి వెళ్ళు, పంటలు కోటకు వచ్చే సమయం; నువ్వు వెళ్ళి నీ కుటుంబ విషయాలు చూసుకో” అని చెప్పారు. అందుకు సాంబశివ అయ్యర్, “ఈరోజు ఒక్కరోజు ఇక్కడే ఉండి, పూజ చూసుకుని వెళ్లిపోతాను” అని సమాధానమిచ్చారు.

కానీ స్వామివారు కాస్త కఠినంగా, “నువ్వు ఈరోజే మన్నార్ గుడికి వెళ్లిపో. ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలులేదు. వెంటనే బయలుదేరు” అని ఆజ్ఞాపించారు. దాంతో మన్నార్ గుడికి వెళ్లిపోయాడు. సాంబశివ అయ్యర్ ఆరోజు రాత్రే శివలోక ప్రాప్తి పొందాడు.

మా తండ్రిగారు పరుమాళాగరం పి.కె. రాజగోపాల అయ్యర్ ఈ విషయం నాకు చెప్పారు. మహాస్వామి వారి దీర్ఘదృష్టి అటువంటిది.

--- ఆర్. సంతానరామన్, చెన్నై - 33. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

25 Nov, 00:18


పరమాచార్య - పుష్పగిరి పీఠం

పరమాచార్య స్వామివారు 1978లో తుంగభద్రా నదికి ఉపనది అయిన హగరి నది ఒడ్డున ఉన్న పాణ్యం సిమెంటు కర్మాగారం ఆవరణంలో మకాం చేస్తున్నారు.

అప్పుడు మా నాన్నగారు కడప రైల్వే స్టేషన్ స్టేషన్ మాష్టర్ గా పనిచేస్తుండేవారు. కడప దగ్గరలోని చెన్నూరులో పుష్పగిరి మఠం ఉండేది. అనుకోకుండా ఒకసారి మా నాన్నగారు పుష్పగిరి మఠం మేనేజరు మాయవరం కణ్ణావయ్యర్ ను కలవడంతో, తరువాత ఇద్దరికీ స్నేహం బలపడింది. దాంతో, ఒకసారి పుష్పగిరి పీఠాధిపతులు మా ఇంట్లో పదిహేను రోజులపాటు ఉండి, విస్తారమైన పూజ చేస్తూ, భక్తులకు దర్శనం ఇచ్చేవారు.

ఒకరోజు పుష్పగిరి స్వామివారు మాతో, “నేను సన్యాసం స్వీకరించడానికి ముఖ్య కారణం పరమాచార్య స్వామివారే” అని తెలిపారు.

“నేను కళాశాల విద్యను పూర్తిచేసిన తరువాత స్వామివారు నన్ను, ‘పుష్పగిరి మఠం పరిపాలనను నువ్వు తీసుకుంటావా?’ అని అడిగారు. మొదట నేను ఈ ప్రతిపాదనని తిరస్కరించాను. కాని తరువాత మహాస్వామివారు పుష్పగిరి మఠం యొక్క ప్రత్యేకత గురించి నాకు తెలిపారు. అప్పటి పీఠాధిపతుల ఆరోగ్యం కూడా బాగోలేదు. మఠం కూడా అత్యంత క్షీణ దశలో ఉండేది. ‘కేవలం నువ్వు మాత్రమే ఆ మఠానికి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి, పరిపాలనను సుస్థిరం చెయ్యాలి’ అన్న పరమాచార్య స్వామివారి ఆజ్ఞతో కాదనలేక ఈ బాధ్యతను స్వీకరించాను”.

“పరమాచార్య స్వామివారు కామాక్షి స్వరూపం. స్వామివారికి తెలియని విశేషమూ, సమాచారమూ అంటూ ఈ ప్రపంచాన ఏదీ ఉండదు” అని తెలిపారు. ఈ విషయాలను విని మేము చాలా సంతోషించాము. మహాస్వామివారి గురించి పుష్పగిరి స్వామివారు ఇలా నిర్ధారించడం ఎంతో ఉన్నతం.

[తెలుగు ప్రాంతంలో ఉన్న ఏకైక శంకరాచార్య పీఠంగా పుష్పగిరి పీఠం ప్రసిద్ధి. ఇది కడప జిల్లాలో ఉంది. ఈ పీఠానికి నలభైఎనిమిదవ పీఠాదీశ్వరులైన శ్రీమదభినవోద్దండ విద్యనృసింహభారతీ మహాస్వామి వారు 2015లో శివైక్యం చెందడంతో నలభైతొమ్మిదవ పీఠాధిపతిగా శ్రీమదభినవోద్దండ విద్యాశంకరభారతీ మహాస్వామి వారు పీఠ బాధ్యతలను నిర్వహిస్తున్నారు]

--- టి.యన్. సుప్పిరమణి. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 3

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

24 Nov, 00:30


నువ్వు ఖచ్చితంగా ఉత్తీర్ణుడవు అవుతావు

ఇది మా నాన్నగారు శ్రీ వి. వెంకటరామన్ గారి జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన. వారికి 11 లేదా 12 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు జరిగినదని నాతో ఎప్పుడూ చెప్తుండేవారు. ఇది షుమారు 1954 లో జరిగినది అనుకుంటా.

మా నాన్నగారు మైలాపూర్ లోని పి.యస్. హైస్కూల్ లో 5 లేదా 6వ తరగతి చదివే సమయంలో వేసవి కాలంలో మా తాతగారు మా నాన్నగారికి ఉపనయనం చెయ్యాలని నిశ్చయించారు. కాని మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానొక్కరే ఉపనయనం చెయ్యలేక మా నాన్నగారిని కంచి మఠం తీసుకువెళ్ళి, అక్కడ జరిగే సామూహిక ఉపనయనాల్లో జరిపించాలని నిశ్చయించారు. ఆ సంవత్సరం వార్షిక పరీక్షల ముందే మా నాన్నగారిని కంచి శంకర మఠానికి తీసుకుని వెళ్ళారు.

వార్షిక పరీక్షలు ఉపనయనం ఒకే సమయంలో ఉండటంచేత, వారు ఉపనయనం కోసమై కాంచీపురంలో ఉండటం చేత మా నాన్నగారు కొన్ని పరీక్షలు రాయలేక పోయారు. వారి ఉపనయన సంరంభం అంతా అయిపోయిన తరువాత వారికి సంతోషము బాధ రెండూ కలిగాయి. నడిచే దైవంగా ప్రస్తుతించబడ్డ పరమాచార్య స్వామి వారి చేతులతో బ్రహ్మోపదేశం జరగడం సంతోషాన్ని కలిగించే విషయమైతే, కొన్ని పరీక్షలు రాయకపోవడం వల్ల మళ్ళా అదే తరగతిలో రెండవ సారి కూర్చోవలసి వచ్చినందుకు బాధ.

ఒకరోజు వారు అన్నీ ముగించుకొని మఠంనుండి తిరుగు ప్రయాణమై పరమాచార్య స్వామి వారి ఆశీస్సులకై వెళ్ళారు. విచార వదనంతో ఉన్న మా నాన్నగారిని చూసి శ్రీవారు “ఎందుకలా ఉన్నావు? ఏమి కావాలి?” అని అడిగారు.

మా నాన్నగారు కేవలం ఈ సంవత్సరం పరీక్ష పాసవ్వాలని అడిగారు.

మహాస్వామి వారు అశీర్వదిస్తూ, “దిగులు పడకు నువ్వు పాసవుతావు” అని అన్నారు.

మా నాన్నగారు అమాయకంగా “ఎలా పాసవుతాను? నేను ఇక్కడికి రావడం వల్ల కొన్ని పరీక్షలు అసలు రాయనేలేదు” అని అడిగారు.

పరమాచార్య స్వామి వారు చిరునవ్వు నవ్వి, అమాయకంగా నులుచున్న ఆ బాలునితో “వెళ్ళు పాసవుతావు” అని అన్నారు.

మద్రాసుకు తిరిగొచ్చిన కొన్నాళ్ళకు పరీక్ష ఫలితాలలో తాను ఫెయిలయినట్టు మళ్ళా అదే క్లాసులో చేరాలని కబురు వచ్చింది. మా నాన్నగారు చాలా బాధపడుతూ, బడి పునః ప్రారంభం రోజు అదే తరగతిలో కూర్చోవడానికి వెళ్ళారు.

ఏమి ఆశ్చర్యం!!! ఏమి మహాస్వామి వారి భవిష్యద్వీక్షణం!!! నమ్మలేని సంఘటన ఒకటి జరిగింది... సెలవుల సమయంలో, ఆ పాఠశాల వ్యవస్థాపకుల్లో ఒకరు మృతిచెందినందువల్ల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆశిస్తూ, ఆ సంవత్సరం ఎవరినీ ఫెయిల్ చెయ్యొద్దని అదేశాలు జరీ చేసారు. అలా మా నాన్నగారు తరువాతి క్లాస్ కు హాజరయ్యారు.

ఇది తెలుసుకున్న మా నాన్నగారి ఆనందానికి అవధులు లేవు.

--- సుధా శ్రీధరన్, చెన్నై

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

23 Nov, 00:24


పురాతన భాష ఏది?

నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు.

మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి ఫోటో తీయాలనుకున్నారు కాని సహాయకులు ఒప్పుకోలేదు. వారు ఉదయం నుండి ఒక చెట్టు నీడన నిలుచున్నారు. స్వామివారి పూజ ఎంతసేపటికి అవుతుంది అని సేవకులను అడిగారు కాని వారికి సరైన సమాధానం దొరకలేదు.

మహాస్వామి వారు పది నిముషాలలో బయటకు వచ్చారు. మేమందరమూ వెళ్ళి సాష్టాంగం చేసాము. మెడలో కెమరా తగిలించుకున్న వ్యక్తివైపు చూసి మహాస్వామి వారు ఫోటోలు తీసుకోండి అన్నట్టు సైగ చేసారు. మూడు చిత్రాలకు అనుమతి ఇచ్చి నాల్గవ చిత్రం తీస్తుండగా ఆపమన్నారు. వారి రాకకు కారణం అడిగారు.
వారు వచ్చిన ఉద్దేశమును వివరించారు.

మహాస్వామి వారు వారితో, ”ఏది అత్యంత ప్రాచీన భాష అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా?” అని అడిగారు.

”పాశ్చాత్య భాషలలో హీబ్రూ చాలా ప్రాచీనమైనది. కాని తూర్పు ఆసియాలో సంస్కృతము తమిళము రెండు ప్రాచీనమైనవి అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము” అని ఇజ్రాయిలీ చెప్పాడు.

అందుకు మహాస్వామి వారు “వీటన్నిటికంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది. అది వైదిక భాష. సంస్కృతము హీబ్రూ కూడా దాని నుండే వచ్చాయి” అని అన్నారు. ”హీబ్రూ లో పునర్జన్మ గురించి ఒక శ్లోకం ఉంది. దాన్ని మొత్తం చెప్పగలవా?” అని ఇజ్రాయలీని అడిగి మొదటి రెండు పదాలు ఎత్తిచ్చారు.

అతను మూడు నాలుగు నిముషాలపాటు దాన్ని చెప్పాడు. స్వామి వారు చుట్టూ చూసి, అక్కడున్న పిల్లలతో “మీరు ఋగ్వేదం చదువుకున్నారా? ఈ శ్లోకాన్ని చెప్పగలరా?” అని అడిగారు.

ఆ పిల్లలు ఐదు నిముషాలపాటు ఉచ్చరించారు. స్వామి వారు నాతో “ఈ పిల్లలు చెప్పినది వారికి అర్థమైందేమో అడుగు?” అన్నారు.

నలుగురు ఏమి మాట్లాడలేదు. స్వామి వారు ఆ పిల్లలవైపు తిరిగి “ఇతను హీబ్రూ లో చెప్పినది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు” అని అన్నారు.

మరలా నావైపు తిరిగి, “ఆ ఇజ్రాయిలీతో చెప్పు అతను చెప్పినది ఈ పిల్లలు చెప్పినది రెండూ ఒక్కటేనని” అని అన్నారు. నేను అతనితో, “నువ్వు చెప్పిన శ్లోకం ఆ పిల్లలు చెప్పిన శ్లోకం రెండూ ‘ఉచ్చారణలలో’ ఒక్కటే అని స్వామివారు చెప్తున్నారు” అని చెప్పాను.

”ఏమిటి? కేవలం ‘ఉచ్చారణలలో’ మాత్రమే కాదు ‘అక్షరాలలో’ కూడా రెండూ ఒక్కటే” అని నా మాటలను సరిచేసారు.

ఈ విషయాన్ని నిరూపిస్తానని ఒక కలం కాగితం ఇమ్మనారు. “వేదాలలో భూగోళం 32 భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది. ఈ 32 భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి ఎలా ఉచ్చరింపబడతాయి అని కూడా చెప్పబడింది”. వచ్చిన ఆ నలుగురిని వారి ఏ ప్రాంతం వారో కనుక్కుని ప్రతి వేదాక్షరం వారి ప్రాంతాలలో ఎలా మార్పు చెందింది అనే విషయం చెప్పారు. ఆ పిల్లల్ని ఋగ్వేదం నుండి మళ్ళా ఒక శ్లోకం చెప్పమని ఆ శ్లోకంలోని ప్రతి అక్షారం వారి వారి ప్రాంతలో ఎలా పలుకుతారో చెప్పారు.

ఆ పిల్లల వైపు తిరిగి “ఈ శ్లోకాన్ని నేను కొద్దిగా వేరే ఉచ్చారణలో హీబ్రూ భాషలో వీటిని ఎలా పలుకుతారో అలా చెప్తాను. అది తప్పు అనుకోకండి. వేదాలలో ఇది ఇలా కూడా ఉచ్ఛరించవచ్చు అన్న ఆదేశము ఉన్నది” అని అన్నారు.

పరమాచార్య స్వామివారు మెల్లిగా మొదలుపెట్టారు. అద్భుతం ఆ ఇజ్రాయిలీ కూడా స్వామివారితో చెప్పడం ప్రారంభించాడు.

మేమందరమూ నిర్ఘాంతపోయాము. “నేను అప్పుడే చెప్పాను. ఋగ్వేదములో ఉన్న శ్లోకమే హీబ్రూ లో కూడా ఉన్నదని. కాని అక్షరాలు కొద్దిగా మార్పుతో ఉంటాయి. (దక్షిణాన ‘యమున’ అంటే ఉత్తరాన ‘జమున’ అంటారు. దక్షిణాన ‘వ’ పశ్చిమ బెగాల్ లో ‘బ’. తమిళంలో ‘ప’ కన్నడంలో ‘హ’ అలా . . .) కాబట్టి ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష ‘వైదిక భాష’”

మహాస్వామి వారు ఆ నలుగురిని ఋగ్వేద అక్షరములు వారి వారి భాషలలో ఎలా ఉచ్చరింపబడతాయో ఒక పట్టిక వెయ్యమన్నారు. పదిహేను నిముషాలలో అంతా రాసారు. దాన్ని చూసి ఇజ్రాయిలీ ఆశ్చర్యముతో ఇది అసలు ఊహింపశక్యము కానిది అని అన్నాడు.

స్వామి వారు అతనితో “ఏమిటి అన్ని భాషలూ వేద భాషనుండే పుట్టాయని ఇప్పుడు ఒప్పుకుంటావా?” అని అడిగారు. కాని అతని మొహంలో అతను ఒప్పుకున్నట్టు కనబడడంలేదు. ”హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండోచ్చు. అని అతని సందేహము కదా?” అని అడిగారు. అందుకు అతను అవును “హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు కదా?” అన్నాడు.

స్వామి వారు నవ్వుతూ, “మీవద్ద తాళం మాత్రమే ఉంది. మా వద్ద తాళంచెవి కూడా ఉంది. వేదాలలో ఏ మహర్షి భారతదేశం నుండి వెళ్ళి ఇజ్రాయల్ లో వేదాన్ని వ్యాప్తి చేసారో అనే విషయం కూడా ఉంది” అని చెప్పారు.

అతను చివరికి ఒప్పుకున్నాడు.

--- తిరువణ్ణామలై గౌరీశంకర్ గారి తమిళ ఇంటర్వ్యూ వీడియో నుండి

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

23 Nov, 00:24


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

22 Nov, 00:35


ఆత్మవత్ సర్వభూతేషు

పరమాచార్య స్వామివారు ఒకసారి మధురై వచ్చారు. ఉత్తర మసి వీధిలోని ఒక పాఠశాలలో మకాం చేస్తున్నారు. అప్పుడు చాలా పెద్దగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు మూడురోజుల పాటు వర్షాలు తగ్గలేదు.

మధురై నివాసి తమిళవేల్ పి.టి. రాజన్ కు మహాస్వామి వారిని మీనాక్షి అమ్మవారి దేవస్థానానికి తీసుకెళ్ళలని చాలా కోరిక. అతను ఇటివలే కొన్న కొత్త కారును తెచ్చి, మహాస్వామి వారు విడిది చేస్తున్న భవంతి ముందు ఉంచారు. “బయట వర్షం చాలా పెద్దగా కురుస్తోంది. మీరు కారులో కూర్చుంటే నేను మిమ్మల్ని తిన్నగా అమ్మవారి దేవస్థానానికి తిసుకొని వెళ్తాను. అది నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను” అని చెప్పాడు.

“కొత్త కారా?” అని మాహాస్వామి వారు అడిగారు.

”అవును. ఇంతవరకు ఎవరూ కూర్చోలేదు. మొదట మీరే కూర్చోవాలి” అని అన్నాడు.

మహాస్వామి వారు చిన్నగా నవ్వారు. దగ్గర ఉన్న శిష్యుణ్ణి పిలిచి, “మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేదారిని ఒక సారి చూసి రా” అని చెప్పారు. ఆ శిష్యుడు జాగ్రత్తగా వెళ్ళి దేవస్థానానికి వెళ్ళే మార్గాన్ని గమనించి వచ్చాడు.

“త్రోవ ఎలా ఉంది?” అని మహాస్వామి వారు అడిగారు.

“అంతా మురికితో బురదమయంగా ఉంది. అటు ఇటు వెళ్ళిన వాహనాల చక్రాల గుర్తులు ఉన్నాయి” అని చెప్పి మహాస్వామి వారి ఆంతర్యాన్ని గమనించి, “ఆ బురదలో కొన్ని కొన్ని పురుగులు నత్తలు మొదలైనవి అటు ఇటు తిరుగుతున్నాయి”.

ఆ మాటలు విని మహాస్వామి వారు అతనితో “సన్యాసికి మూడు ప్రధాన ధర్మాలు ఉంటాయి. మొదటిది సన్యాసి తనకోసం స్వంతంగా ఏమి దాచుకోకూడదు; ఆస్తులు డబ్బులు మొదలైనవి. రెండవది బ్రహ్మచర్యం; అతని ఇంద్రియాలపై అతనికి పట్టు ఉండాలి. మూడవ ధర్మం అహింస; అతని వల్ల ఏ జీవరాశికి అపకారం జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో నేను పాదచారియై కాని కారులో కాని వెళ్తే, చాలా జీవరాశులు నా వల్ల చనిపోతాయి. కాబట్టి ఇప్పటికి దేవాలయానికి వెళ్ళే ప్రసక్తి లేదు. మళ్ళా వెళ్దాము” అని అన్నారు.

తరువాత, వర్షాలు వెలిసి దార్లు అన్నీ బాగైన పిదప మహాస్వామి వారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళారు తమిళవేల్ పి.టి. రాజన్ తో కలిసి.

--- రా. వెంకటస్వామి శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

21 Nov, 00:36


కచేరి - కాలక్షేపం

పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలోని మిరాజ్ లో మకాం చేస్తున్నప్పుడు వారి జయంతి సందర్భంగా కచేరి చెయ్యడానికి చెన్నై నుండి మా బృందం వెళ్ళింది. మరుసటిరోజు స్వామివారు పరివాట్టం ధరించి ధ్యానంలో ఉన్నప్పుడు “వెంకటేశన్ ను ప్రత్యేకించి దీక్షితర్ కృతులను పాడమని చెప్పు” అని ఆజ్ఞాపించారు. అలా ఒక గంటసేపు రాగాలను కృతులను పాడిన తరువాత స్వామివారు ధ్యానం ముగించుకుని బయటకు వచ్చి ఆ పరివాట్టాన్ని నా తలపై పెట్టమని ఆదేశించారు. అది ఇప్పటికి నా పూజమందిరంలో భద్రంగా ఉంది.

మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు దాకా కచేరి జరిగింది. రాత్రి ఎనిమిది గంటలకి మహాలక్ష్మి ఎక్సప్రెస్ లో చెన్నై వెళ్ళడానికి స్వామివారి అనుమతి తీసుకున్నాము. ఏడుగంటలప్పుడు నన్ను మళ్ళా మొదలుపెట్టమన్నారు. బుక్ చేసిన టికెట్లను రద్దుచేసుకోవడం ఎలాగో మాకు అర్థంకాక ఆతురత పడుతుంటే, అప్పుడే ఆవూర్ హెచ్.టి.సి బంధువులు స్నేహితులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. శ్రీకంఠన్, రామమూర్తి విషయం అతనితో చెప్పగానే, “అంతా నేను చూసుకుంటాను. రేపు ఉదయం మైలై ఎక్సప్రెస్ కు మీకు అన్ని ఏర్పాట్లు చేసి నేనుకూడా ఈ ముగ్గురితో పాటు వెళ్తాను” అని చెప్పాడు.

ఆరోజు ఆరు నుండి తొమ్మిది దాకా కచేరి జరిగింది. కచేరి వినడానికి చాలామంది వచ్చారు. అప్పుడే సాంగ్లి మహారాజు తన కుటుంబంతో, పరివారంతో వచ్చారు. తనతో పాటు బుట్టలలో పళ్ళు, ఒక ఎర్రనిది, తెల్లనిది, నీలిరంగుది కాశ్మీరు శాలువాలు కూడా తెచ్చారు. వాటినన్నిటిని స్వామివారి ముందుంచారు. స్వామివారి కుడివైపున నీలి శాలువా, ఎడమవైపున తెల్లనిది, ఎర్రది తలపైన ఉంచుకున్నారు. వారిని అలా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

ఒక అరగంట తరువాత స్వామివారి ఆజ్ఞ ప్రకారం మహారాజే స్వయంగా ఎర్ర శాలువాని పళ్ళ తట్టలో పెట్టి మా నాన్నగారు బ్రహ్మశ్రీ చిత్తూరు గోపాలకృష్ణ అయ్యర్ కు, నీలి శాలువా నాకు, తెల్లది మృదంగం రమేశ్ కు ఇచ్చారు. ఇది మాకు గొప సన్మానంగా వారి రక్షణగా భావించాము.

మరుసటి రోజు ఉదయం ఏడుగంటలకు మాతోపాటు చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ వచ్చి స్వామివారు ఇచ్చిన విభూతి, కుంకుమ, ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నాము.

మేము ప్రయాణంలో ఉండగా వార్తాపత్రికలో నిన్నమేము ప్రయాణించవల్సిన మహాలక్ష్మి ఎక్సప్రెస్ లో ఎనిమిది బోగీలు విడిపోయాయని తెలిసి ఖంగుతిన్నాము.

కేవలం మహాస్వామి వారి వల్లనే మా ప్రయాణం వాయిదా పడింది. స్వామివారి దివ్యదృష్టికి మేము దాసోహమయ్యాము.

--- ఫ్లూటిస్ట్ జి. వెంకటేసన్, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

20 Nov, 00:29


పది రూపాయలా? పదిహేను రూపాయలా?

పరమాచార్య స్వామివారు కలవైలో మకాం చేస్తున్నారు. ఒకరోజు ఉదయం తంజావూరు నుండి ఒక న్యాయవాది స్వామివారి దర్శనానికి కారులో వచ్చాడు. చాలా ఆడంబరంగా పటాటోపంతో వచ్చాడు. అతని భార్య సంప్రదాయ పద్ధతిలో మడిచీర కట్టుకుంది. వారి కుమారులు పంచ ఉత్తరీయములు వేసుకున్నారు. ఇక అతను వైదికంగా పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకొని, మేలిమి రత్నం పొదగబడిన ఒక బంగారు గొలుసును మెడలో వేసుకున్నాడు.

అతని చేతిలో ఒక పెద్ద పళ్ళెం ఉంది. అందులో చాలా పళ్ళు, పూలు, ద్రాక్షలు, జీడీపప్పు, కలకండ, తేనె వీటన్నిటితో పాటు ఒక కవరులో డబ్బులు పెట్టుకుని తీసుకువచ్చాడు. వీటన్నిటిని తీసుకొని వచ్చి మహాస్వామి వారి ముందుంచి స్వామివారికి సాష్టాంగం చేసాడు. మహాస్వామివారు కళ్ళతో ఆ పళ్ళాన్ని తీక్షణంగా చూసారు.

”ఆ కవరులో ఏముంది?” అని అడిగారు.
”కొద్దిగా ధనం. . . ఉంది”

“కొద్దిగా అంటే పది రూపాయలా? పదిహేను రూపాయలా?”

బహుశా ఆ న్యాయవాది అహం దెబ్బతిని ఉంటుంది. అతను ఆ జిల్లాలోనే పెద్ద పేరుమోసిన క్రిమినల్ న్యాయవాది. “ఎందుకు మహాస్వామి వారు అతని గురించి అంత తక్కువ అంచనా వేసారు."

అతను అతివినయం ప్రదర్శిస్తూ, నమ్రతతో కొద్దిగా వొంగి మృదుమధురంగా “పదుహేను వేల రూపాయలు” అని అన్నాడు.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. “ఇక్కడికి ఎలా వచ్చారు?” అని అడిగారు.
”మేము ఇక్కడికి కారులో వచ్చాము” అని చెప్పాడు.

”ఈ కవరును జాగ్రత్తగా నీ కారులో ఉంచుకో. పూలు పళ్ళు చాలు” అని చెప్పారు స్వామివారు.

ఆ న్యాయవాది ఆ మాటలకు గతుక్కుమన్నాడు. స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు అతనితో చాలాసేపు ప్రశాంతంగా మాట్లాడి, వారికి ప్రసాదం ఇచ్చి పంపించివేసారు. కారు వెళ్ళిపోయిన శబ్ధం వినిపించింది.

పదిహేను వేలు వద్దు అన్నందుకు పరిచారకులు బాధపడి ఉంటారని స్వామివారికి తెలియదా? తెలుసు. వారివైపు తిరిగి,

”అతను తప్పుడు కేసు వాదించి గెలిచాడు. అతను ఇవ్వదలచిన ఆ పదిహేను వేలు ఆ కేసు గెలవడం వల్ల అతనికి ముట్టిన దాంట్లోనిదే. అది పాపపు సొమ్ము. అందుకే తీసుకోలేదు” అని చెప్పారు. సేవకులకు విషయం అర్థమై సమాధాన పడ్డారు.

ఒకానొకప్పుడు శ్రీమఠం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మఠం మేనేజరు చాలా ఆరాటపడేవారు. అటువంటి సమయంలో కూడా పరమాచార్య స్వామివారు ఆత్రుతతో అక్రమ ధనం ముట్టేవారు కాదు.

“ఒక బిందెడు పాలు పాడుచేయడానికి ఒక చిటికెడు ఉప్పు చాలు. ఒక్కడికోసం, ఒక్కదానికోసం ఆచారాలను సంప్రదాయాలను ధర్మాన్ని వదిలేస్తే అదే అలవాటు అవుతుంది” అని చెప్పేవారు స్వామి వారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


అంబుజం నవ్వుతూ, “ఈ అరటి గొన మా అరటి తోటలోనిదే పెరియవా! అందుకే అంత పెద్దగా ఉంది” అని వినయంగా చెప్పింది.

స్వామివారు సంతోషంతో, “సరే! మీ అల్లుణ్ణి కూతురిని కలిపింది ఆ కామాక్షియే కాబట్టి ఈ అరటి గొనని ఆవిడకే సమర్పించి ఆ పళ్ళని ఆక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచు” అని ఆజ్ఞాపించారు.

”లేదు లేదు పెరియవా! ఇది ఇక్కడే ఉండనివ్వండి. అమ్మవారికి సమర్పించడానికి సరిగ్గా ఇలాంటిదే ఇంకొకటి తెచ్చాను. మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలను తెలుపుకొని వస్తాను” అని చెప్పి స్వామికి నమస్కరించింది.

”భేష్! అమ్మవారి దర్శనం తరువాత మఠంలో భోజనం చేసి మీ ఊరికి వెళ్ళాలి సరేనా గుర్తుంచుకో. మరచిపోకు” అని వెళ్ళడానికి అనుమతిచ్చారు.

ఆరోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తుల తాకిడి లేదు. ఉదయం పదకొండు గంటలు. కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల మీనాక్షి పాట్టి మనవరాలితో త్వరత్వరగా ఆలయంలోకి వెళ్ళింది. ఆరోజు చివరి రోజు కావడంతో పూజకు కావాల్సిన సామాన్లు తెమ్మని మనవరాలికి డబ్బులిచ్చి వెనక రమ్మని తను వెళ్ళిపోయింది.

ఆ అమ్మాయి, బామ్మ చెప్పినవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళింది. పాట్టి అమ్మవారికి అర్చన చేయించి కళ్ళ నీరు కారుతుండగా ప్రార్థించింది. “అమ్మా కామాక్షి తాయి, నేను నీ పైనే ఆధారపడి నిన్నే నమ్ముకున్నాను. నువ్వు, స్వామి వారు తప్ప నన్ను కాపాడగలవారు లేరు. ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసుతో నా మనవరాలి పెళ్ళి చేయవలసింది నువ్వే. నీ వల్లే నా మనవరాలి పెళ్ళి జరగగలదు. కాపాడు తల్లీ కాపాడు”. బామ్మ ఏడుస్తుండడంతో మనవారాలు కూడా ఏడ్చేసింది. తరువాత అమ్మవారి గర్భగృహానికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. నాలుగో ప్రదక్షిణం చేస్తున్నారు.

“పాట్టి. . . పాట్టీ. . . పాట్టీఈఈఈ” మనవరాలు ఇలా గట్టిగా అరుస్తున్నందుకు మీనాక్షి పాట్టి వెనక్కు తిరిగి కోపంతో “ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమి పోయిందని అలా మొత్తుకుంటున్నావు?” అని కోపంగా అంది.

“ఏమి పోలేదు పాట్టి కాని ఇది దొరికింది. ఇక్కడకు రా చూపిస్తాను” అని చిన్నగా చెప్పి, పాట్టిని ఒక మూలకు తీసుకుని వెళ్ళి, మూసి ఉన్న అరచేతిని తెరిచింది. అది తెగిపోయిన పథకమున్న రెండు వరసల బంగారు గొలుసు.

“ఎక్కడ దొరికింది నీకు?” పాట్టి ఆశ్చర్యంతో అడిగింది. “నేను నీ వెనక తలదించుకొని వస్తున్నాను, నా కళ్ళు కింద ఉన్న ఈ గొలుసుపై పడ్డాయి. నేను వెంటనే ఎవరూ చూడకుండా దీన్ని గభాలున తీసుకున్నాను. ముందు ఇది నిజమైనదా లేక నకిలీదా చూడు“ అని చెప్పింది ఆ అమ్మాయి.

పాట్టి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అటు ఇటు పరీక్షగా చూసి, “చూస్తే మంచి బంగారం లాగే ఉంది. ఒక ఎనిమిది ఎనిమిదిన్నర సవర్లు ఉండొచ్చు. ఇది మహాస్వామి వారి మహిమవల్ల కామాక్షి మనకు అనుగ్రహించింది. సరే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద” అని చీరకొంగున ఆ గొలుసును దాచి ముడివేసి ఆత్రంగా బయటకు వచ్చింది.

అప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట సమయం. స్వామి వారి సందర్శనార్థమై ఒక నలుగురైదుగురు వేచి ఉన్నారు. మీనాక్షి పాట్టి, ఆ అమ్మాయి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు. స్వామివారు వారిని చూసి నవ్వారు. స్వామి వారికి గొలుసు విషయం చెప్పాలా వద్దా అని పాట్టీ తటపటాయిస్తోంది.

స్వామివారే ముందుగా “ఈరోజుతో ఐదురోజుల మీ పంచసంఖ్యోపచార పూజ పూర్తికావలసింది. కాని ఒక వస్తువు నీ మనవరాలి చేతుల్లోకి రావడం వల్ల, మీకు కలిగిన ఆశ్చర్యానందం వల్ల ఐదవ ప్రదక్షిణ పూర్తికాలేదు. కామాక్షి దేవి పూర్ణ అనుగ్రహం లభించింది అని పరుగుపరుగున బయటకు వచ్చేసావు. అవునా?” అని గట్టిగా నవ్వారు.

పాట్టి నిచ్చేష్టురాలైంది. భయంతో మాటలను మింగుతూ గుటకలు వేస్తూ, “స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు. ఆ వస్తువు నా మనవరాలి చేతుల్లోకి రాగానే అమ్మవారే తను తీసుకోవాలని అక్కడ పడేసింది అని భావించి, సంతోషంతో మరొక్క ప్రదక్షిణ చెయ్యాలని మర్చిపోయాను” అని చెప్పింది.

స్వామివారు అసహనంగా, “అదొక్కటే మర్చిపోయావా! ఇక్కడికి వస్తూ దార్లో రంగు పథ్థర్ గారి దుకాణంలో ఆ వస్తువును తూచి, తెగిపోయినదాన్ని కొలిమిలో అతికించడం మరచిపోలేదా?” అని అడిగారు. “అది వదిలెయ్. తూచినప్పుడు అది సరిగ్గా ఎనిమిది సవర్లు ఉందా?” అని అడిగారు.

పాట్టి మరియు మనవరాలు నిర్ఘాంతపోయారు. “మీరు ఇప్పుడు చెప్పినదంతా నిజం పెరియవా!” అని పాట్టి అన్నది.

స్వామివారు నిదానించి, “చెప్పు. న్యాయంగా ఆ పదార్థం ఎవరికి చెందినది?” అని అడిగారు.

”కామాక్షి అమ్మకి”

“మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీరకొంగులో దాచుకోవడం సబబేనా? నువ్వే చెప్పు”

“అపరాధం . . . కేవలం నా అపరాధం అంతే. నన్ను మన్నించండి. అనుకోకుండా చేసాను” అని పాట్టి పశ్చాత్తాప్పడుతూ, చేతులు వణుకుతుండగా స్వామి వారి ముందు ఉన్న పళ్ళెంలో ఆ గొలుసును ఉంచింది. స్వామివారు నవ్వారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


మీనాక్షి పాట్టి సాష్టాంగం చేసి నిలబడి, “అదేమిటి పెరియవా మీరు అన్నీ అయిదుగా చెయ్యమంటారు!” అని పాట్టి ఆత్రుతతో “అలా చేస్తే కామాక్షి అమ్మ నా మనవరాలు కామాక్షి పెళ్ళి చేస్తుంది కదా?” అని అడిగింది. ”ఐదు సార్లు చెయ్యమని నాకోసం చెప్పడం లేదు. అమ్మవారి నామాలలో “పంచసంఖ్యోపచారిణి” అని ఉంది. ఐదు, ఐదు గుణిజాలుగా ఏమైనా చేస్తే ఆవిడ మన కోరికలు తీరుస్తుంది” అని చెప్పి, “నేను అదే చెప్పాను. మరింకేం లేదు” అని అన్నారు.

”ఎప్పుడు మొదలు పెట్టాలి పెరియవా?”

స్వామివారు నవ్వుతూ, “శుభశ్య శీఘ్రం” అని ఒక నానుడి. ఈరోజు శుక్రవారం. ఇంకేం ఈరోజునుండే మొదలుపెట్టండి” అని చెప్పి వారిని పంపించారు.

తన మనవరాలితో కలిసి బామ్మ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీసారు. ఆరోజు శుక్రవారం అవడం వల్ల చాలా రద్దీగా ఉంది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తోంది. స్వామి వారి ఆనతి ప్రకారం ఇద్దరూ కళ్ళుమూసుకుని ప్రార్థించారు. పాట్టి తన మనవరాలి పేరు నక్షత్రం చెప్పి అర్చన చేయించి ప్రసాదం తీసుకుంది.

తరువాత ఇద్దరూ ఆ ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసు గురించి ప్రార్థించి లోపలికెళ్ళి గర్భాలయం చుట్టూ ఐదుమార్లు ప్రదక్షిణ చేసారు. స్వామివారు చెప్పినట్టు ఐదుసార్లు నేలపై పడి నమస్కరించి అమ్మవారిపై విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు.

శనివారం ఉదయం మీనాక్షి పాట్టి మనవరాలితో కలిసి పారిజాత పూలు తీసుకుని శ్రీమఠానికి వెళ్ళింది. ఆరోజు చాలా రద్దీగా ఉంది. ఒక ఇరవై ముప్పై మంది భక్తుల వెనకాతల పాట్టి నిలబడింది. తన ముందున్న వ్యక్తి మరొక వ్యక్తితో చెప్పగా విన్నది. “ఈరోజు అనుశం(అనూరాధ) నక్షత్రం. పరమాచార్య స్వామి వారి జన్మనక్షత్రం. కాబట్టి స్వామివారు ఈరోజు కాష్టమౌనంలో ఉంటారు. ఎవరితోను మాట్లాడరు. కేవలం ముఖదర్శనం మాత్రమే”

మీనాక్షి పాట్టి ఆత్రుత నీరుగారిపోయింది. “ఈ రోజు మహాస్వామి వారికి ఆ ఎనిమిది సవర్ల బంగారు గొలుసు గురించి గుర్తు చేద్దామనుకున్నాను కాని కుదిరేలా లేదు” అని అనుకుంది. వారు మహాస్వామి వారి దగ్గరకు చేరగానే సాష్టాంగం చేసి నిలబడ్డారు. అసలు జీవం లేదు అన్నట్టుగా ఆ పరబ్రహ్మం కూర్చొని ఉంది. పాట్టి అక్కడే నిలబడింది ఎలాగైనా గుర్తు చేద్దామని. స్వామి వారి సేవకుడొకరు గట్టిగా “పాట్టి ముందుకు వెళ్ళు ఈరోజు స్వామి వారు మౌనంలో ఉన్నారు. వారు మాట్లాడరు. చూడు ఎంతమంది వేచియున్నారు నీ వెనకాతల” అని కసిరి పంపించాడు.

చేసేదేమి లేక మనవరాలితో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీసింది. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారికి పంచసంఖ్యోపచార పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తరువాతి రెండు రోజులు స్వామి వారు మౌనంలో ఉన్నారు. పాట్టి ఆమె మనవరాలు కేవలం మహాస్వామి వారిని మఠంలో దర్శించుకుంటున్నారు. ఆమెకు ఆందోళన ప్రారంభమయ్యింది. “ఐదు రోజులలో నాలుగు రోజులు గడిచిపోయాయి. కాని ఏమి జరగలేదు. తల్లి కామాక్షి కళ్ళు తెరిచి నన్ను కరుణిస్తుందో లేదో?” అని తనలో తనే బాధపడుతోంది. . .

మంగళవారం తెల్లవారింది . కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది. అరణి నుండి ఒక భజన బృందం వచ్చింది. వారి భజనామృతంతో మఠాన్ని భక్తిలో ముంచేస్తున్నారు. మహాస్వామి వారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు. వారి మొహంలో తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మౌనవ్రతం అయిపోయింది. స్వామి వారు దర్శనం కోసం చాలామంది వేచియున్నారు.

మధ్య వయస్కురాలైన ఒక మామి (పెద్దావిడ) తనవంతు రాగానే సంతోషంగా నేలపై పడి స్వామి వారికి నమస్కరించింది. తను తెచ్చిన వాటిని స్వామివారి ముందు పెట్టింది. ఒక పెద్ద రస్తళి అరటిపళ్ళ గొన, టెంకాయలు, చీనీ కాయలు, కమలాపళ్ళు, గుమ్మడికాయలు, లావుపాటి పచ్చి అరటిపళ్ళు మొదలైనవి పెట్టి మళ్ళా నమస్కరించింది.

స్వామివారు వాటిని చూసి తమలో తామే నవ్వుకున్నారు. వాటిని అక్కడ పెట్టిన ఆ పెద్దావిడ వైపు చూసారు. “నువ్వు నీదమంగళం భూస్వామి గణేశ అయ్యర్ భార్య అంబుజంవి కదూ? రెండు నెలల కింద ఇక్కడికి వచ్చావు. ఏదో విషయం గురించి బాధపడుతున్నానని చెప్పావు. ఇప్పుడు ఇలా పెద్ద అరటి పళ్ళతో వచ్చావంటే కామాక్షి అమ్మవారి దయ వల్ల నీ బాధలు తీరిపోయాయి కదా!” అని అన్నారు.

అంబుజం మామి మరలా నమస్కరించి, “అవును నిజం పెరియవా! నా ఒక్కగానొక్క కూతురు మైథిలి మూడేళ్ళుగా భర్తకు దూరంగా ఉంటోంది. రెండు నెలల క్రితం మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను. మీరు కంచి కామాక్షి అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు, ఐదు నమస్కారాలు ఐదు రోజుల పాటు పంచసంఖ్యోపచార పూజ చెయ్యమన్నారు. నేను అది చాలా శ్రద్ధతో పూర్తిచేసాను. ఏమి నా అదృష్టం పదిహేను రోజుల క్రితం, జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ లో పని చేసే నా అల్లుడు ఇక్కడకు వచ్చి తన భార్యను తీసుకుని వెళ్ళాడు. ఇదంతా కామాక్షి కరుణ మీ అనుగ్రహం పెరియవా!” అని ఆనందబాష్పాలు కారుస్తూ చెప్పింది.

అదంతా విని మహాస్వామి వారు “భేష్! భేష్! సంతోషం, చాలా మంచిది. ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవించు గాక! సరేకాని ఇంత పెద్ద అరటిపళ్ళ గొన ఎక్కడిది? చాలా ఫలవంతంగా ఉంది” స్వామివారి నవ్వు ఉరుము ఉరిమినట్టు ఉంది.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


అప్పటికి మద్యాహ్నం రెండు గంటలు అయ్యింది. మీనాక్షి పాట్టిని మనవరాలిని తన ముందు కూర్చోమన్నారు. పొద్దున్న స్వామివారి అనుమతితో కామాక్షి దర్శనానికి వెళ్ళిన అంబుజం విచార వదనంతో వచ్చి స్వామి వారికి నమస్కరించింది. ఆవిడ తీవ్రమైన బాధతో కళ్లల్లో నీరు కారుస్తోంది. స్వామివారు చూసి, వాత్సల్యంతో “అడడా! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడిగారు.

అంబుజం మామి కళ్ళుతుడుచుకుని ఇలా చెప్పింది, “అది ఇలా పెరియవా! రెండునెలల క్రితం కామాక్షికి ఐదురోజుల సేవ చేసినప్పుడు నా అల్లుడు కూతురు ఒక్కటైతే, నా ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసుని ఇస్తానని మొక్కుకున్నాను. అమ్మవారు వాళ్ళిద్దర్నీ ఒక్కటిచేసింది. ఈరోజు నా గొలుసు ఇద్దామని వెళ్ళాను. కాని అది నా గొంతులో నుండి జారిపడి ఎక్కడో పడిపోయింది. ఆత్రంగా అంతా వెతికాను కాని నాకు ఎక్కడా దొరకలేదు. అది అమ్మవారికి ఇస్తానన్న గొలుసు. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు పెరియవా?” అని మళ్ళా కన్నీరు పెట్టుకుంది.

స్వామివారు మీనాక్షి పాట్టి వైపు అర్థమైందా అన్నట్టు చూసారు. పాట్టి స్వామివారికి నమస్కరించి లేచి నిలబడింది. పళ్ళెంలో పెట్టిన ఆ బంగారు గొలుసును చేతుల్లోకి తీసుకుని అంబుజం వైపు తిరిగి దాన్ని చూపిస్తూ, “అమ్మా అంబుజం చూడు ఇది నువ్వు పోగిట్టుకున్న గొలుసేనేమో?” అని అన్నది.

అంబుజం దాన్ని చేతులలోకి తీసుకుని పరీక్షించి, “ఇదే ఇదే గొలుసు. పాట్టి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నది. పాట్టి అంబుజానికి జరిగిన విషయమంతా గుక్కతిప్పుకోకుండా చెప్పింది.

అంబుజం మామి మీనాక్షి పాట్టిని కౌగిలించుకుంది. సంతోషంతో “పాట్టి, నువ్వు ఏమి దిగులుపడకు. నేను స్వామివారి సమక్షంలో చెప్తున్నాను. నీ మనవరాలి పెళ్ళికి రెండు వరసల బంగారు గొలుసు ఎనిమిది సవర్లది కొత్తది నేను చేయిస్తాను. తన పెళ్ళి వైభవంగా జరుగుతుంది. ఈ గొలుసు నేను అమ్మవారికి సమర్పించాలనుకున్నది. ఈ సాయింత్రమే నిన్ను మీ అమ్మాయిని నాతో నగల షాపుకు తీసుకువెళ్ళి, ఎనిమి సవర్ల రెండు వరసల బంగారు గొలుసు ఇప్పిస్తాను. అంతేకాదు తన పెళ్ళి ఖర్చు నిమిత్తం ఐదువేల రూపాయలు ఇస్తాను” అని చెప్పింది.

స్వామివారు ప్రత్యక్ష కామాక్షిలా కూర్చుని అంతా చూస్తున్నారు సాక్షిగా. అందరూ మహాస్వామి వారికి నమస్కరించారు. స్వామి వారు మీనాక్షి పాట్టి వైపు చూస్తూ “ఈరోజు నీవు, నీ మనవరాలు ఐదు ప్రదక్షిణలు చెయ్యలేదు. సాయింత్రం వెళ్ళి అయిదు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి” అని చెప్పి పంపించారు.

ఆ సమయంలో మీనాక్షి పాట్టికి తన మనవరాలికి కలిగిన ఉద్వేగం, ఆ సంఘటన వలన కలిగిన భావనలు సామాన్య పదాలతో వర్ణించడం అసాధ్యం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


ఎనిమిది సవర్లు - రెండు వరసలు

(పంచసంఖ్యోపచారిణి)

చాలా ఏళ్ళ క్రితం ఒకరోజు తెల్లవారుఝామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా కంచి శంకర మఠంలో మహాస్వామి వారు ఏకాంతంగా కూర్చొని ఉన్నారు. భక్తులందరూ దర్శించుకుని వెళ్ళిపోయిన తరువాత మహాస్వామి వారు తమ గదిలోకి వెళ్ళడానికి లేవబోతుండగా, ఒక ముసలి మామ్మ, ఒక యువతి పరుగు పరుగున వచ్చి మహాస్వామి వారికి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్దారు. స్వామి వారు మరల కూర్చొని, వారిని తేరిపారా చూసారు.

సంతోషంతో మొహం వెలుగగా, “అరెరె ఎవరు? మీనాక్షి పాట్టి(బామ్మ) నా? ఏమిటి ఆశ్చర్యం ఇంత ఉదయాన్నే వచ్చావు? నీతో ఉన్నది ఎవరు? నీ మనుమరాలా? ఏమిటి పేరు?” అని అడిగారు.

మీనాక్షి పాట్టి స్వామివారితో, “పెరియవా! నేను చాలా ఏళ్లుగా మీ దర్శనానికై వస్తున్నాను. కాని ఏరోజు మీకు నాగురించి చెప్పుకోలెదు. ఆ అవకాశం ఎప్పుడు రాలేదు. కాని ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఈ అమ్మాయి నా మనుమరాలు, కూతురి కుమార్తె. ఇక్కడే పుట్టడం వల్ల కామాక్షి అని పేరు పెట్టాము. నాకు ఒక్కతె కూతురు. ఈ పిల్లను నా చేతుల్లో పెట్టి తను పోయి పన్నెండు ఏళ్ళు అవుతోంది. ఏదో జబ్బు తనకి. తన భర్త కూడా తనకంటే ముందే పోయాడు గుండేపోటు వల్ల.

ఈ పిల్లతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నాను. పాఠశాలకు పంపిస్తే చదువు తలకెక్కలేదు. ఫిఫ్త్ గ్రేడ్ తో ఆపేసాను. ఇప్పుడు తనకు పదిహేను సంవత్సరాలు. దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు తీరుతుంది”.

స్వామివారు అంతా ఓపికగా విన్నారు. “ఇంత పొద్దున్నే నువ్వు రావటంతోనే నేను అనుకున్నాను. మామూలుగా పదిగంటలప్పుడు చంద్రమౌళీశ్వర పూజకి పారిజాత పూలు తెచ్చేదానివి కదా. ఇప్పుడు వచ్చావంటే ఏదో అవసరం ఉంది అని. ఏమిటి విషయం?” అని అన్నారు.

మొదట కొద్దిగా సంకోచిస్తూ, “ఏమిలేదు పెరియవా! అమ్మయికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయిది కూడా ఈ ఊరే. పాఠశాలలో ఉపాధ్యాయుడు. అరవైరూపాయల జీతం. మంచి కుటుంబం. ఇచ్చి పుచ్చుకొనే బాధలు లేవు. జాతకాలు కూడా బాగా కలిసాయి. మీరే ఎలాగో ఈ వివాహం జరిపించాలి పెరివయా” అని స్వామివారికి నమస్కరించింది.

స్వామివారు స్వరం పెంచుతూ, మృదువుగా మందలిస్తున్నట్టుగా “ఏమిటి? నేను పెళ్ళి చేయాలా? ఏమి మాట్లాడుతున్నావు?” అన్నారు. వెంటనే చల్లబడి “సరే. నన్ను ఏమి చెయ్యమంటావు?” అని అడిగారు.

బామ్మ సంతోషంతో “అది ఇలా పెరియవా! నేను ఎలాగో కష్టపడి తన పెళ్ళికి ఒక ఐదువేలు రూపాయలు దాయగలిగాను. అ డబ్బుతో పెళ్ళి జరిపించగలను. కాని ఆ అబ్బయి తల్లి ఖండితంగా ‘పాట్టి ఏలా చేస్తావో, ఏమి చేస్తావో మాకు తలియదు నీ మనవరాలి మెళ్ళో ఎనిమిది సవర్ల బంగారు గొలుసు రెండు వరసలది వేసి పంపు’ అని చెప్పింది. నా ఆదాయంతో తనకి నగలు నట్రా నేను చేయించలేను. ఒక సవరం బంగారంతో రెండు గాజులు మాత్రం చేయించగలిగాను. నాకు అంతే సాధ్యపడింది. ఆ గొలుసు నేను ఎక్కడి నుండి తేగలను. మీరు మాత్రమే . . . ”

ఆవిడ ముగించక ముందే పరమాచార్య స్వామి వారు కోపంగా “చెప్పు, ఎనిమిది సవర్ల బంగారంతో రెండు వరసల గొలుసు నన్ను చేయించమంటావా?” అని అడిగారు.

మీనాక్షి పాట్టి సాష్టాంగం చేసి నిలబడి గట్టిగా లెంపలేసుకుంటూ “అపచారం అపచారం, పెరియవా నేను చెప్పదలచుకున్నదేమంటే రోజూ మీ దర్శనానికి ధనవంతులు, పెద్దవారు వస్తుంటారు. మీరు ఎవరికైనా ఈ గొలుసు కావాలని చెప్పొచ్చు కదా” అని దీర్ఘం తీస్తూ అడిగింది.

”ఏమిటీ? దర్శనానికి వచ్చిన వారిని గొలుసు ఇవ్వమని అడగనా? ఇక్కడ అటువంటి అలవాటు లేదు. నీకు కావాలంటే బంగారం అడగని ఏదైనా వేరే సంబంధం చూసుకో. అదే నీకు మంచిది” అని స్వామి వారు లేచారు.

మీనాక్షి పాట్టి ఆత్రుతగా “మహాస్వామి వారు ఇలాంటి సలహా ఇవ్వరాదని ప్రార్థిస్తున్నాను. ఇది మంచి సంబంధం, పెరియవా. పిల్లవాని స్వభావం మంచిది. వారి అమ్మాయికి పెళ్ళిచేసి ఎనిమిది సవర్ల బంగారం గొలుసు రెండు వరసలది పెట్టి పంపారట. కావున తమ ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలాగే రావాలని వారి కోరిక. మరింకేంలేదు పెరియవ! ఈ విషయంలో మీరే నాకు దారి చూపగలరు” అని ఏడుస్తూ అర్థించింది.

వెళ్ళడానికి లేచిన మహాస్వామి వారు మరలా కూర్చున్నారు. కొద్దిసేపు అలోచనలో మునిగిపోయారు. తరువాత కరుణా పూరితమైన మాటలతో “నేను ఇప్పుడు చెప్పేది మీరు చేస్తారా?” అని అడిగారు.

”ఖచ్చితంగా చేస్తాను పెరియవా. ఏమితో చెప్పండి” పాట్టి ఉత్సుకతతో అడిగింది.

”రేపు నీ మనవరాలితో కలిసి కామక్షి అమ్మవారి దేవస్థాననికి వెళ్ళు. ఇద్దరూ అమ్మవారిని ప్రార్థించండి, ‘అమ్మా! ఎనిమిది సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్ళి బాగా జరిగేట్టు దీవించమ్మ. నీవే దాన్ని కరుణించగలవు అమ్మా’ అని సన్నిధి చుట్టూ అయిదు సార్లు ప్రదక్షిణ చెయ్యండి. ఐదు సార్లు అమ్మవారికి నేలపై పడి నమస్కారం చెసి ఇంటికి వెళ్ళండి. ఇలా ఐదురోజుల పాటు చెయ్యండి. మీరు సంకల్పించినట్టుగా మీకు కావాల్సింది కామాక్షియే ఇస్తుంది” అని ఆశీర్వదించి పంపారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

18 Nov, 00:51


“శ్రీ కన్యకురిచి అమ్మ రక్షణ”

ఒక రోజు ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం పట్టుకోట్టై అనే పట్టణం నుండి వచ్చాడు. దర్శనం అనంతరం మహాస్వామి వారితో "నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలా మంది జ్యోతిష్కులను అడుగగా, వారు ఎన్నో పరిహారాలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేయించాను కాని ఏమి ఉపయోగం లేదు” అని అన్నాడు.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆ పెద్దమనిషిని "మీ ఊరి సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉన్నదా?" అని ప్రశ్నించారు.

ఆ మాటవిని ఆ పెద్దమనిషి చాలా ఆశ్చర్యపోయాడు.

మహాస్వామి వారు ఆ పెద్దమనిషితో "అక్కడ ఒక మహామాయా దేవి ఆలయం ఉన్నది. చాలా శక్తి వంతమైన దేవీ స్వరూపం. ఒక యాభై రూపాయలు పంపి అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకము చేయించు. నీ కారు ముందు “కన్యకురిచి అమ్మవారి ప్రసన్నః” అని అమ్మ రక్షణలో ఈ కారు ఉంది అని రాయించు” అని చెప్పారు.

ఆ పెద్దమనిషి నిశ్చేష్టుడయ్యి, నోట మాటరాక అలా నిలబడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తేరుకొని, స్వామివారితో "పెరియవ! శ్రీ కన్యకురిచి అమ్మవారు మా ఇంటిదేవత, వంశపారంపర్యంగా మా ఆరాధ్య దైవం. మా తల్లితండ్రులు ప్రతి సంవత్సరము అక్కడకి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేయించేవారు. మా కుటుంబం లోని చిన్నపిల్లలకు అక్కడే పుట్టువెంట్రుకలు తీయించేవారు. కాలక్రమములో మేము ఇవన్ని మరిచిపోయము. శ్రీ మహాపెరియవ దయ వలన మరియు మా అదృష్టం వల్ల మళ్ళీ మాకు గుర్తుచేసారు" అని స్వామివారికి సాష్టాంగం చేసి ఆనందంతో వెళ్ళిపోయాడు.

శ్రీ మహామాయ దేవి రక్షణ వల్ల ఆ కారుకి తరువాత ఎటువంటి ఆపదలు రాలేదు.

--- శ్రీ మఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

17 Nov, 00:47


నక్తాల్ విశేషం

నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో తుఫాను వచ్చి ఎంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగి దివిసీమ మొత్తం అతలాకుతలం అయిన రోజుల్లో జరిగిన సంఘటన ఇది.

మా మావయ్యగారు శ్రీ ఆలూరు వెంకట రమణా రావు గారు అప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టారు. అహర్నిశలు కష్టపడి వ్యాపారం చేసి, మంచి ఫలితం వచ్చే దశలో తుఫాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు వలే వ్యర్ధమైపోయింది. మళ్ళీ ధైర్యంగా వ్యాపారం కొనసాగిద్దామంటే వారు చేసే ఆ వ్యాపారానికి రోజుకు షుమారు రూ.120 అవసరమవుతాయి. కానీ ఆ సమయంలో వాటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు.

అప్పుడు మహాస్వామి వారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారని, వెళ్లి ఒకసారి దర్శనం చేసుకుందామని అనుకున్నారు. స్వామివారి దగ్గరకు అప్పటికే కొన్ని సార్లు వెళ్లి దర్శనం చేసుకున్నారు, కాని ఈ ఆపత్కర సమయంలో సహాయం కానీ సలహా కానీ అడిగే ధైర్యం చేయలేకపోయారు. అడిగితే మార్గం సూచిస్తారు అనే నమ్మకం ఉన్నా, వెళ్లి అడిగే ధైర్యం చెయ్యలేదు. నెమ్మదిగా వేరే ప్రయత్నాలు చేస్తుండగా, స్వామివారు దీక్షలో ఉన్న ప్రాంగణం దగ్గరలో ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని ఉండడం వల్ల మా మావయ్యగారు వెళ్ళవలసి వచ్చింది. ఆ పని ముగించుకుని అలాగే స్వామి వారి దర్శనం కోసం వెళ్లారు.

అప్పుడే పూజలు ముగించుకుని స్వామి వారు ఏకాంతంలో ఉండగా, దర్శనానికి వెళ్లిన వీరిని పిలిచారు. ఆశీర్వచనం కోసం వెళ్లగా, సమస్య చెప్పాలా వద్దా అని మదన పడుతుండగా, మహాస్వామి వారు "నక్తాల్ విశేషం" అని అన్నారు. అదేంటో వీరికి అర్ధం కాలేదు. మరలా కొద్దిసేపటి తరువాత, "నక్తాల్ విశేషం" అని అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న చంద్రమౌళి శాస్త్రి గారు మా మావయ్యగారితో, "స్వామి వారు మిమ్మల్ని ఉద్దేశించే చెప్పారు" అని చెప్పారు.

"నక్తాల్ అంటే ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు శాస్త్రి గారు.

"తెలీదు స్వామి" అని చెప్పారు.

"కార్తీక మాసంలో ఉపవాసం చేస్తారా?" అని అడిగారు.

"కార్తీక మాసంలో విశేషమైన రోజులలో ఉపవసిస్తాను స్వామి" అని చెప్పారు. అప్పుడు శాస్త్రి గారు "నక్తాల్"అంటే ఏమిటో వివరించారు.

ఈశ్వర ప్రీతికరమైన కార్తీక మాసంలో క్రమం తప్పకుండ శక్తికొలది ఈశ్వరారాధన చేసి, ఉదయం నుండి ఉపవాసం ఉండి, సూర్యాస్తమయంలో దీపారాధన చేసి, నక్షత్ర దర్శనం తరువాత ఈశ్వర ప్రసాదం(భోజనం) తీసుకోవాలి. కానీ ఆరోజే, కార్తీక మాసం చివరి రోజు కావడంతో, రానున్న కార్తీక మాసం నుండి తప్పక ఆచరిస్తానని స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు.

అప్పటి నుండి ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండ కార్తీక మాసంలో నక్తాల్ ఆచరిస్తూ, ఈశ్వరానుగ్రహం పొందుతూ వచ్చారు. మహాస్వామి వారి సూచన మేరకు, ఈశ్వరానుగ్రహం వలన చేపట్టిన వ్యాపారాలన్నీ దినదినాభివృద్ధి చెందుతూ లక్ష్మి కటాక్షం సిద్దించింది. స్వామివారి అనుగ్రహంతో "నీరజ గ్రూప్ అఫ్ కంపెనీస్" స్థాపించి వాటికి చైర్మన్ గా వ్యవహార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు పట్టణంలో "శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం" నిర్మించి, వ్యవస్థాపక ధర్మకర్తగా వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామి వారికి ఉపచారములు జరిపిస్తున్నారు. వేద విద్యాభ్యాసం ప్రాముఖ్యత, ఆవశ్యకత ఎరిగిన వారై వారి తల్లి తండ్రుల పేరు మీద వేదపాఠశాల స్థాపించి "వేద విద్య ప్రవర్తక" అని గౌరవం పొందారు. నాలుగు దశాబ్దాలుగా మహాస్వామి వారి సూచన మేరకు "నక్తాల్" ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం పొందుతూ స్వామి వారి సూచనానుసారం సేవ చేసుకుంటున్నారు.

--- ఆలూరు కమలా దేవి, ఒంగోలు

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Nov, 00:49


జయ జయ శంకర !! హర హర శంకర !!

కంచి పరమాచార్య వైభవం. తెలుగునాట ఈ పేరు తెలియని పరమాచార్య స్వామివారి భక్తులు ఉండరంటే అది అతిశయోక్తి కాదేమో!!

దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా రోజుకొక మహాస్వామి వారి అనుగ్రహ లీలను ప్రచురిస్తూ ఎందరికో తమ దినచర్యను మహాస్వామి వారి స్మరణతో ప్రారంభించడానికి సహకరించిన మన కంచి పరమాచార్య వైభవం పుస్తక రూపంలో రావాలని ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది తపించిన ఫలితం చివరకు నిజమైంది.

పుస్తకం ముద్రణ పూర్తయ్యి, జగద్గురువులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి అమృత హస్తములతో ఆశీస్సులు పొందిన తరువాత కరుణతో వారు శ్రీముఖాన్ని కూడా అనుగ్రహించారు.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురుదేవుల తొలిపలుకులతో, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ముందుమాటతో, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవాచాకులు నండూరి శ్రీనివాస్ గారి పరిచయ వాక్యాలతో ఈ పుస్తకం పరిపూర్ణమైంది. ఈ పుస్తకం అవిముక్త వారణాసి క్షేత్రంలో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారిచే ఆవిష్కరింపబడింది.

పుస్తకము, ప్రసాదము అనాయాచితంగా వస్తే దానికి విలువ ఉండదు కాబట్టి వెలకట్టలేని ఈ పుస్తకానికి 175/- ల వెలను నిర్ణయించడమైనది.

పుస్తకాలు కావాల్సిన వారు మాకు వాట్సాప్ (7259859202) చెయ్యగలరు

ట్రస్టు బ్యాంకు అకౌంటు వివరాలు

A/C Name: Kanchi Paramacharya Dharmika Seva Trust
A/C. Num: 50200059599164
IFSC Code: HDFC0001753
A/C Branch: Kanakapura Road, Bengaluru

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

15 Nov, 00:42


ధర్మ రక్షణ - దేశ రక్షణ

ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే, మొట్టమొదట స్వాతంత్ర్యోద్యమాలు స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉద్భవించినప్పుడు “సనాతన ధర్మంతో కూడిన అచ్చమైన భారత దేశాన్ని” రక్షించుకోవాలనే తపనే ఆనాడు ఉన్న మహాత్ములది. కాని తరువాత తరువాత స్వాతంత్ర్యోద్యమం ధర్మమయమైన దేశాన్ని సాధించడం అనేటువంటి మూర్తిని విడిచిపెట్టి మరొక రూపం తీసుకుంది.

అది కేవలం రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. “ఈ రాజకీయోద్యమం ఇలాగే కొనసాగి కాని మనకు స్వాతంత్ర్యం సిద్ధిస్తే, మన ధర్మం ఏమవుతుంది” అని ఆలోచించిన వాళ్ళు ఈ స్వాతంత్ర్యోద్యమ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. గట్టి సంఖ్యలో చెప్పుకోలేము. అందులో యతీశ్వరులు మహాత్ములు మా పీఠాలేమైపోతాయో అని బాధపడేవాళ్ళే చాలామందున్నారు కాని, స్వాతంత్ర్యం సిద్ధిస్తే ఈ సనాతన ధర్మం ఏమౌతుంది? ఎటువంటి రాజ్యాంగం తయారవుతుంది? ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి వాతావరణమే తప్ప ధార్మికమైన వాతావరణం లేదు. అలాంటి స్థితిలో ఈ దేశంలో ఈ సనాతాన హైందవ ధర్మం రక్షింపబడాలి అనే తపన పడ్డటువంటి ఏకైక ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు.

మహిమలు చూపే విషయములే కాకుండా ధర్మరక్షణకు వారు చేసినవే మనం తెలుసుకోవలసింది. ఇది చాలా స్ఫూర్తి. అసలు దేశభక్తి లేనివారికి దైవభక్తి లేనట్టే లెక్క. ఒకవేళ దైవభక్తి ఏదైనా ఉంటే, వాడిల్లు వాడి కుటుంబం క్షేమంగా ఉండడం కోసం చూసిన భక్తియే తప్ప ఇక ఏది లాభం లేదు దానివల్ల. అందుకు ప్రధానంగా ఈ దేశం క్షేమంగా ఉండాలి. ధర్మం క్షేమంగా ఉండాలని ముందు కోరుకోవాలి. ఎలాగైతే మన ఇంట్లో ఉన్న మనం నేను క్షేమంగా ఉండాలి అని ఎంత కోరుకుంటామో నా ఇల్లు క్షేమంగా ఉండాలని అంతే కోరుకోవాలి.

లేకపోతే మీ జపం మీరు చేస్తుంటే మీ ఇంటి పైకప్పు ఊడి నెత్తిమీద పడితే, ఎవడు రక్ష. అందుకు మన జపం మనకు సాగుతున్నా, మన ఇల్లంతా బాగుండాలని ఎలా అనుకుంటామో, ఈ దేశమంతా ధర్మమంతా బాగుండాలని కోరుకోవాలి. అందుకే వయుక్తిక మోక్షం కోసం సాధన చేయడం ఎంత అవసరమో, సామాజికమైన దేశ క్షేమం కోసం సాధన చెయ్యడం అంత అవసరం.

అందులో పీఠాధిపతి వ్యవస్థని ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ కారణం చేతనే ఏర్పాటు చేశారు. నాలుగు వైపుల్నుంచి కూడాను భారతదేశాన్ని రక్షించడం కోసమే ఆయన పీఠములను ప్రతిష్టాపన చేశారిక్కడ. అటువంటి శంకరుల హృదయం తెలిసినటువంటి శంకరులు మళ్ళి అవతరించిన శంకరులు. మాకనిపిస్తుంది కేవలం ముప్పైరెండేళ్ళు ఉండి చెయ్యాల్సిందంతా చేసి నేను వెళ్ళిపోయాను.

కాని కలి ముదిరిపోతోంది. ముప్పైరెండేళ్ళ ఉనికి చాలదు. ఒక సంపూర్ణమైన శతవర్ష ఆయుః పరిమితితో కూడిన ఉనికి కావాలి అని అనుకున్న శంకరులు మళ్ళి చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించారు. ఇందులో సందేహం లేదు.

--- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Nov, 00:25


మహాస్వామి వారు అతణ్ణి సమాధానపర్చి మృదువచనాలతో “అతణ్ణి అప్పుడప్పుడు మైలాపూర్ లో జరిగే ప్రవచనాలకు తీసుకువెళ్తుంటావా?” అని అడిగారు.
”వెళ్తుంటాడు స్వామీ. అప్పుడప్పుడు నేనే స్వయంగా తీసుకుని వెళ్తుంటాను. వీడి మాట పడిపోక ముందురోజు కూడా నేను వీణ్ణి రసిక రంజన సభలో జరిగే రామాయణ ప్రవచనానికి తీసుకుని వెళ్ళాను. ఆసాంతం చాలా శ్రద్ధగా విన్నాడు. తరువాతి రోజే ఇలా జరిగింది” అని చెప్పాడు.
స్వామివారు నవ్వుతూ “అంటే నీ ఉద్దేశ్యము రామాయణం వినడంవల్లనే ఇలా జరిగిందనా?”

ఆడిటర్ లెంపలేసుకుంటూ “రామ రామ! అలా కాదు స్వామీ. ఆ తరువాతి రోజే ఇలా జరిగింది అని చెప్పానంతే” అని అన్నాడు.
”సరే. ఉపన్యాసం ఎవరు చెప్పారు?”

“శ్రీవత్స జయరామ శర్మ, స్వామీ”

“భేష్ భేష్ సోమదేవ శర్మ కుమారుడు. గొప్ప పండిత వంశం. సరేకాని శంకరా ఇతణ్ణి వైద్యునికి చూపించావా?”

“చూపించాను స్వామీ”

“ఎవరా వైద్యుడు?”

“డాక్టర్ సంజీవి”

“ఏమన్నాడు?”

“అన్ని పరీక్షలు చేసి, ఇతని స్వరపేటిక నరములు రెండు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేస్తే సరిపోవచ్చు అని చెప్పాడు స్వామీ”

“ఆపరేషన్ తరువాత ఖచ్చితంగా బాగవుతుందని చెప్పలేదా?”

“అతను ఆ హామీ ఇవ్వలేదు స్వామీ. ఎలాగో మీరే వాడికి మాటలు వచ్చేలా చెయ్యలి. కేవలం మీరే చెయ్యగలరు”

పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పారు “శంకరా ఒక పనిచెయ్యి, పిల్లాణ్ణి తీసుకుని ఇక్కడి దేవాలయాలన్నీ దర్శించి ప్రార్థించు. ఇక్కడే మఠంలో భోజనం చేసి రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయం నీ స్నానము అనుష్టానము పూర్తి చేసుకొని పది గంటలకు నా వద్దకు రా”.

మాహాస్వామి వారి మాటలు వారిని స్వాంతన పరిచాయి. స్వామివారికి ఇద్దరూ సాష్టాంగం చేసి దేవాలయాల దర్శనానికి బయలుదేరారు.

మరుసటి రోజు ఉదయం పదిగంటలకు ఆడిటర్ పిల్లాణ్ణి తీసుకుని పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చారు. శంకర నారాయణన్ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు. స్వామివారు తీక్షాణంగా కొద్దిసేపు చూసి, “శంకరా, ఒక పని చెయ్యి. పిల్లాణ్ణి మైలాపూర్ కపాలీశ్వర స్వామి వారి దేవస్థానానికి తీసుకుని వెళ్ళి, స్వామి అమ్మవార్లకి పూర్ణాభిషేకం చేయించి పిల్లాడితో దర్శనం చేయించు. తరువాత ఏమి చేస్తావంటే శ్రీవత్స జయరామ శర్మ గారి సంపూర్ణ రామాయణ ప్రవచన వివరాలకోసం వేచియుండు. ఎక్కడైనా దేవాలయంలో కాని లేదా స్భామందిరంలో కాని వారి ఉపన్యాసం ఉంటే సుందరాకాండ నుండి సీతారామ పట్టాభిషేకం వరకు నీ కుమారునితో వినిపించు. సీతారామ పట్టాభిషేకతో ఉపన్యాసం ముగిసిన రోజు కొన్ని అరటి పళ్ళు కొని ఆ ఉపన్యాసకుడికి ఇచ్చి వారికి ఇద్దరూ మనసులో పట్టాభిరాముణ్ణి ఉపన్యాసకుడిని ప్రార్థిస్తూ సాష్టాంగం చెయ్యండి. ఆ సీతారాములు మిమ్మల్ని కాపాడుతారు. ఏమి దిగులు పడకండి అంతా మంచే జరుగుతుంది” అని ప్రసాదం ఇచ్చి పంపించారు.
ఆరోజునుండి ఆడిటర్ చెన్నైలో శ్రీవత్స జయరామ శర్మ గారి రామాయణ ప్రవచన వివరాల గురించి వెతుకుతున్నాడు. ఒకరోజు వారు మైలాపూర్ లోని ఒక ఆలయంలో మందిరంలో సంపూర్ణ రామాయణం నవాహం(తొమ్మిది రోజులు) చేస్తున్నట్టు తెలిసివచ్చింది.

ఆరోజే సుందరాకాండ ప్రారంభం. కుమారుణ్ణి వెంటబెట్టుకుని శంకర నారాయణ ఉపన్యాసానికి వెళ్ళాడు. చంద్రమౌళి తనకు కలిగిన బాధను మరికిపోయి మరీ విన్నాడు. కొన్నిసార్లు కన్నులవేంట నీరు కారుస్తుంటే శంకర నారయాణన్ వెన్ను నిమిరి సమాధాన పరిచేవారు.
ఆరోజు రామాయణ ఉపన్యాసం చివరి రోజు. వినడానికి చాలామంది వచ్చారు. దాదాపు పదిన్నర ప్రాంతంలో శ్రీవత్స జయరామ శర్మ గారు శ్రీ సీతారామ పట్టభిషేక ఘట్టంతో ఉపన్యాసాన్ని ముగించారు. ఒకరితరువాత ఒకరు అందరూ వారికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు. వీరిద్దరూ కూడా సాష్టాంగం చేసి, శంకర నారాయణన్ చంద్రమౌళికి అరటిపళ్ళు ఇచ్చి శ్రీవత్స జయరామ శర్మ గారికి ఇమ్మన్నారు. తండ్రి చెప్పినట్టు వాటిని ఇచ్చి పిల్లవాడు సాష్టాంగం చేశాడు. వారు ఆనందంతో ఆ పళ్ళు తీసుకుని వెనకున్న శ్రీరామ పట్టాభిషేకం పటానికి సమర్పించి అందులో రెండు పళ్ళను చంద్రమౌళికి ఇచ్చి “బాబు నువ్వు చిరకాలం సంతోషంగా ఉండు. ఈ రెండు పళ్ళు నువ్వు తిను” అని ఆశీర్వదించారు. ఆలయం వెలుపలికి వస్తూ చంద్రమౌళి ఆ రెండు పళ్లను తిన్నాడు.
మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. పళ్ళుతోముకొని హాల్లోకి వచ్చిన ఆ పిల్లవాడు గట్టిగా తన తల్లితో “అమ్మా కాఫీ రెడియా?” అని అరిచాడు. పేపరు చదువుతున్న వాళ్ల నాన్నగారు ఆశ్చర్యపోయారు. వంతగదిలో ఉన్న వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. చంద్రమౌళి అక్కడ నవ్వుతూ నిలబడ్దాడు.
”చంద్రమౌళి!!! కాఫీ తయారయ్యిందా అని అరిచినది నువ్వేనా?” అని పిల్లాణ్ణి గట్టిగా హత్తుకుని ఆనందంతో ముద్దుపెట్టుకుంది. శంకర నారాయణన్ ఆ పిల్లాణ్ణి భుజాలపైకెత్తుకుని ఆనందంతో గంతులేసాడు. చంద్రమౌళీ ఎప్పటిలాగే ధారాళంగా మాట్లాడసాగాడు. తెలిసినవారందరూ వచ్చి ఈ వార్త విని సంతోషపడ్దారు.

ఆరోజు సాయంత్రం అయిదున్నర ప్రాంతంలో మహాస్వామి వారు ఏకాంతంలో కూర్చున్నారు. ఎక్కువమంది భక్తులు లేరు. ఆడిటర్ శంకర నారాయణన్ వ్యానులో ఒక పది పదిహేనుమందితో కలిసి వచ్చాడు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Nov, 00:25


తండ్రికొడుకులిద్దరూ స్వామి వారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు. అచార్యుల మొదటి ప్రశ్న “చంద్రమౌళి బాగా మాట్లాడగలుగుతున్నావు కదా? భేష్ భేష్ అంతా సీతారాముల అనుగ్రహం”

చంద్రమౌళీ వెంటనే బిగ్గరగా “హర హర శంకర జయ జయ శంకర” అని చెప్పడం మొదలుపెట్టాడు. అందరూ నిలబడి అలా చూస్తుండిపోయారు.
కొద్దిసేపటి తరువాత స్వామి వారు మాట్లాడారు “శంకర ఇప్పుడు చెబుతాను విను. చంద్రమౌళికి ఇలా జరగడానికి వేరే ఏ కారణము లేదు. వీడికి సహజంగా సీతారాములపై ప్రేమ భక్తి ఏర్పడింది. వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేడు. మొదటి సారి ఉపన్యాసం విన్నప్పుడు శ్రీవత్స జయరామ శర్మ సీతాపహరణం గురించి చెబుతున్నారు కదా శంకరా?”

ఆడిటర్ ఆశ్చర్యముతో నోరెళ్ళబెట్టి నిలబడ్డాడు. “అవును స్వామీ అదే. అదే స్వామీ అదే. ఆరోజు వారు దాని గురించే చాలా ఆర్ద్రతతో ఉపన్యసించారు”

స్వామి వారు మరలా “తను ఎంతగానో భక్తితో ఆరాధించి ప్రేమించే సీతామాతని ఒక రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోతుటే తట్టుకోలేక చిన్న మానసిక ఒత్తిడికి గురయ్యి నిస్సహాయుడై మాటలు ఆగిపోయాయి. అంతే మరింకేమి కాదు. కాబట్టి దీనికి పారిష్కారమేమంటే అతని చెవులతో అదే ఉపన్యాసకుని మాటలలో సీతారాములు ఒక్కటయ్యారని వింటే అతని మనస్సు కుదుటపడి అతని మాటలు వస్తాయి. అందుకే నేను అలా చెయ్యమని చెప్పినది. సీతారాముల దయవలన ఇప్పుడు అంతా క్షేమంగా ఉంది. చంద్రమౌళి నువ్వు పరమ క్షేమంగా ఉంటావు” అని అన్నారు.
పరమాచార్య స్వామి వారి మాటలను విన్న అందరూ నిచ్చేష్టులయ్యారు.

--- శ్రీ రమణి అన్న, ‘శక్తి వికటన్’ ప్రచురణ. మార్చి 18, 2007.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Nov, 00:25


సీతాపహరణం – స్వరాపహరణం

చాలా సంవత్సరాల క్రితం ఒక సాయంత్రం మహాస్వామి వారి దర్శనార్థమై చలామంది భక్తులు వేచివున్నారు. పరమాచార్య స్వామివారు గదినుండి బయటకు వచ్చి భక్తుల వంక ఒకసారి చూసి, గోడకు ఆనుకుని కూర్చున్నారు. భక్తులందరూ వరుసలో ఒక్కొక్కరుగా వచ్చి, మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, వారి కష్టాలను చెప్పుకొని, స్వామి వారు చెప్పిన మాటలు విని ముందుకెళ్తున్నారు. ఒక మధ్యవయస్కుడైన పెద్దమనిషి ఒకరు ఒక పిల్లవాడి చెయ్యి గట్టిగా పట్టుకుని వరుసలో నిలబడి వున్నారు. అతని కళ్ళల్లో నుండి నీరు కారి ఏరులై పారుతోంది. ఆ పిల్లవాడు ఏ చలనము లేక నిలబడ్డాడు.
అతను పరమాచార్య స్వామివారి ముందుకు రాగానే సాష్టాంగం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. ఆ పిల్లవాడు కూడా సాష్టాంగం చేసి నుంచున్నాడు. స్వామి వారు అతణ్ణి పరిశీలనగా చూసి, “ఏమప్పా నువ్వు మైలాపూర్ ఆడిటర్ శంకర నారాయణన్ కదూ? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏమిటి నీ సమస్య?” అని అడిగారు.
పరమాచార్య స్వామివారు అలా అనగానే అతని దుఃఖం కట్టలు తెంచుకుంది. మరలా ఏడుస్తూ, “అవును స్వామీ! భరింపరాని కష్టం వచ్చిపడింది నాకు. ఏమిచేయాలో తెలియటం లేదు. మీరే నా దేవుడు. మీరే ఎలాగో నన్ను కాపాడాలి. నాకు వేరొక దిక్కు లేదు” అని మరలా సాష్టాంగం చేశాడు. పరిస్థితిని అర్థం చేసుకుని పరమాచార్య స్వామివారు వాత్సల్యంతో “అరే శంకరా బాధపడకు. కొద్దిసేపు అక్కడ కూర్చో. అందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత నిన్ను పిలుస్తాను” అని చెప్పి ఒక స్థలం చూపించారు.
“అలాగే చేస్తాను స్వామీ. మీ ఆజ్ఞ” అని ఆయన స్వామి ఎదురుగా కొద్దిదూరంలో కూర్చున్నారు. అరగంట తరువాత అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోయారు. స్వామి వారి ఇద్దరు సహాయకులు తప్ప ఎవరూ లేరు. ఆడిటర్ శంకర నారాయణన్ ను రమ్మన్నట్టు సైగ చేసారు. అతను వచ్చి మరలా సాష్టాంగం చేసి నిలబడ్డాడు. మహాస్వామి వారు అతని వంక ఆప్యాయంగా చూస్తూ, “శంకరా! నీ ప్రాక్టీసు బాగా జరుగుతోంది కదా? నువ్వు బాగా పేరుగాంచిన ఆడిటరువి. ప్రాక్టిసు గురించి అడగనవసరం లేదులే. సరే మీ తండ్రి గారు పంచపకేశ అయ్యర్ తంజావూరులో వున్నారు కదూ? బావున్నారు కదా?”

కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆడిటర్ స్వామి వారితో “ప్రాక్టిసు బాగా జరుగుతోంది స్వామీ. మా తల్లితండ్రులు బొంబాయిలో ఉన్న నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళారు. రెండు నెలలు అయ్యింది. నాకే ఇప్పుడు కష్టం వచ్చింది. దీన్ని భరించడం నా వల్ల కావట్లేదు. మహాస్వామి వారే నన్ను కాపాడాలి” అని దగ్గరున్న ఆ పిల్లవాడిని కౌగిలించుకుని ఏడ్చేసాడు.
ఆ పిల్లవాని విశయంలోనే ఏదో జరిగి ఉంటుందని మహాస్వామి వారు అర్థం చేసుకున్నారు. మహాస్వామి వారు అతనితో “శంకరా ఏదేమైనా సరే మగవారు ఇలా ఏడువరాదు. సరే ఎవరు ఈ పిల్లవాడు నీ కుమారుడా?” అని అడిగారు.
”అవును స్వామీ నా కుమారుడే. పేరు చంద్రమౌళి. వీడికోసమే స్వామీ నా బాధ. హఠాత్తుగా. . . ” దుఃఖం తన్నుకొస్తుండడంతో ఇంక ఏమి మాట్లాడలేక పోయాడు. మహస్వామి వారు కంగారుగా “శంకరా ఏమి జరిగింది హఠాత్తుగా? చంద్రమౌళి పాఠశాలకు వెళ్తున్నాడా?” అని అడిగి “ఖంగారు పడకుండా ఏమి జరిగిందో సరిగ్గా చెప్పు” అని అన్నారు.
కళ్ళ నీరు తుడుచుకొని, కొద్దిగా స్థిమితపడుతూ, “స్వామీ నా కుమారుడు చంద్రమౌళి మైలాపూర్ లోని పి.యస్.హైస్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. చదువులో చాలా చురుగ్గా ఉంటూ, తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఉన్నాడు. ఇరవై రోజుల క్రితం హఠాత్తుగా తన మాట పడిపోయింది స్వామీ. అడిగితే తను మాట్లాడలేక పోతున్నానని సైగల ద్వారా చెప్తున్నాడు. ఆరోజు నుండి పాఠశాలకు వెళ్ళలేదు. రెండుపూటలా భోజనం చేస్తాడు. చక్కగా నిద్రపోతాడు. అవన్ని బావున్నాయి కాని మాట్లాడలేకపోతున్నాడు. నేనేంచేయగలను? మీరే కరుణించి వీడికి మాటలు ప్రసాదించాలి” కళ్ళ నీరు కారుతుండగా స్వామివారిని ప్రార్థించాడు.
పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా వున్నారు. తరువాత ఆడిటరుతో “పిల్లలతో దేవాలయానికి వెళ్తంటారా? చంద్రమౌళికి దేవునిపై భక్తి నమ్మకం ఉన్నాయా?” అని అడిగారు. ”వీడికి చాలా భక్తి ఉంది స్వామీ. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత కందషష్టి కవచం, రాముడు ఆంజనేయుడి గురించి కొన్ని శ్లోకాలు చదువుకొని పాఠశాలకు వెళ్తాడు. మా ఇంట్లో కోదందరాముని పెద్ద చిత్రపటం ఉంది. అది మా తాతల కాలంనాటి తంజావూరు చిత్రపటం. రోజూ ఉదయం సాయింత్ర సాష్టాంగం చేసి, సీతారాముల పాదములకు నమస్కారం చేసి కళ్లకద్దుకుంటాడు. “నాకు సీతారాములంటే చలా ఇష్టం అని తరచూ చెప్తుంటాడు”. వారంలో రెండుమూడు రోజులు వాడి తల్లితో కలిసి కపాలీశ్వర, ముందక కన్ని అమ్మణ్, లుజ్ ఆంజనేయ దేవాలయాలకు వెళ్తుంటాడు. ఇంత మంచి పిల్లాడికి ఇలా జరిగింది” అని ఇక తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసాడు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Nov, 02:05


జయ జయ శంకర !! హర హర శంకర !!

అవిముక్త కాశీ మహాక్షేత్రంలోని ముమక్షు భవన్ లో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న క్రతువులో ఇవాళ సహస్ర లింగేశ్వర ప్రతిష్ఠ మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు బ్రాహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి అమృతహస్తములతో

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Nov, 00:47


https://www.youtube.com/live/x2QNn-Rjis0?si=J531mUZhErbmMDE1

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Nov, 00:32


సముద్రస్నానం - సహాయం

దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు మహామాఖం, కుంభమేళా వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తుంటారు. తిర్తస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది.

“కేవలం సముద్ర దర్శనమే మహా పుణ్యం“. సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు. అది కేవలం అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి. కాని రామేశ్వరం, తిరుప్పులని, వేదారణ్యం, ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్రస్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు.

ఒకసారి కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు. ఆడి (ఆషాడం) అమావాస్య దగ్గర పడుతుండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చెయ్యాలని ప్రణాళిక వేశారు. కారణం లేకుండా శ్రీరాముడు ఒక్కమాట కూడా మాట్లాడడు అని ప్రతీతి. అలాగే సన్యాసులు కూడా. అక్కరలేని విషయాలు మాట్లాడడం, నిష్పలమైన పనులు చెయ్యడం అన్నది వారి వద్ద ఉండదు.

మహాస్వామివారు వేదారణ్యం చేరేదారిలో కొన్ని ఊళ్ళల్లో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. అలా ఒక ఊరిలో, ఆకలిగొన్న వ్యక్తీ ఒకరు స్వామీ దర్శనానికి వచ్చాడు. స్వామివారు మఠం మేనేజరును పిలిచి “అతనికి మంచి ఆహారం పెట్టి, ఒక పంచ ఉత్తరీయం ఇమ్మ”ని ఆదేశించారు. మేనేజరు స్వామివారి ఆదేశాన్ని పాటించి “అతనికి మీరు మీరు చెప్పినవన్ని ఇచ్చాము. పంపెయ్యమంటారా?” అని అడిగారు.

స్వామివారు వెంటనే, “అతణ్ణి మఠ ప్రముఖునిగా చూసుకుంటూ, రాజభోగాలను కల్పించ”మని ఆదేశించారు. మేనేజరుకు ఏమీ అర్థం కాకపోయినా స్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతణ్ణి యాత్రలో తమతోపాటు ఉండమన్నారు.

“అతనికి భోజనం ఇచ్చారా? బాగా చూసుకున్తున్నారా?” అని మహాస్వామివారు మేనేజరుతో ప్రతిరోజూ అడిగి తెలుసుకునేవారు. రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా ఒకరోజు అతను మఠానికి తాగి వచ్చాడు. భగవంతుణ్ణి దూషించాడు. మఠ ఉద్యోగులను తిట్టాడు. ఆఖరికి కూడుగుడ్డ ఇచ్చిన పరమాచార్య స్వామిని కూడా తూలనాడాడు. మేనేజరుకు కోపం వచ్చి అతని ప్రవర్తనను మహాస్వామికి విన్నవించారు. “అతణ్ణి పంపెద్దాం పెరియవ” అని స్వామిని అర్థించారు.

స్వామివారు ఏమీ కోప్పడక గట్టిగా నవ్వారు. “స్వామీ! అతణ్ణి పంపెయానా?” అని మేనేజరు మరలా అడిగారు. కాని స్వామివారు అందుకు ఒప్పుకోలేదు.

ఆరోజు ఆడి ఆమావాస్య. స్వామివారు వేదారణ్యంలో సముద్రస్నానం చేయడానికి వస్తున్నారని తెలిసి వేలమంది భక్తులు వచ్చారు. ఆడి అమావాస్య రోజు సముద్ర స్నానం పుణ్యప్రదం. అందునా ‘నడమాడుం దైవం’ పరమాచార్య స్వామితో కలిసి చెయ్యడం అత్యంత పుణ్యప్రదం. దాంతో తీరం అంతా లక్షలాదిమంది భక్తులతో నిండిపోయింది. భక్తితో ఎంతోమంది వృద్ధు మహిళలు కూడా తీరం వెంబడి నిలుచున్నారు.

పరమాచార్య స్వామివారు సముద్రం దగ్గరకు వచ్చారు. అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోకి నడిచారు. స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ లోపలి నడిచారు.

అంతే ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకిడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రలోకి కొట్టుకునిపోయారు. అందరూ ఏం చెయ్యాలో పాలుపోక చేష్టలుడిగి నిలుచున్నారు. అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చెయ్యకుండా ఒక వ్యక్తీ వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారిని ఒడ్డుకు లాగి రక్షించాడు. ఆ వ్యక్తీ మరెవరో కాదు. మఠంలో అందరిని ఇబ్బందులు పెడుతున్న ఆ తాగుబోతు.

ఈ సంఘటనను చూడగానే మహాస్వామివారు మేనేజరు వంక తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వారు. మేనేజరు పరుగున వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు.

సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దిర్ఘదర్శులు. వారు చేసే ప్రతి క్రియలో కొన్ని వేల కారణాలు/నిజాలు ఉంటాయి. మనం వాటిని లోతుగా పరిశీలిస్తేనే వారి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలము.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

12 Nov, 00:33


--- డా. వారణాసి రామమూర్తి ‘రేణు’

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

12 Nov, 00:33


కరుణావరుణాలయులు

శ్రీ కంచికామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిపాదులు జంగమ తీర్థ చక్రవర్తి. శ్రీవారి చరణ స్పర్శ భూమిలోని అణువణువును పవిత్రతీర్థం కావిస్తుంది. వారు సర్వజ్ఞులు, సర్వసములు, సర్వసులభులు. ఈ మాటలు అతిశయోక్తులు కావు. స్వామివారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాటలంటున్నాను. వానిలో ఒకటిరెండు అనుభవాలు నివేదిస్తాను.

శ్రీచరణులు మఠంతో హైదరాబాదు దయచేసిన సందర్భంలో దాదాపు నాలుగైదు నెలలు వారి దర్శన సేవాభాగ్యాలు అనుభవించిన వాళ్ళల్లో నేనొకడను. ఆ సమయాన శ్రీవారు అందరినివలె నన్ను కూడా అనుగ్రహించారు. పర్యటనానంతరం కంచి తిరిగివెళ్ళిన తరువాత నేనప్పుడప్పుడు వారి దర్శన్ననికి కంచి వెళ్తుండేవాడిని. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం, ఎవరో ఒక భక్తుని గురించి గాని, క్షేత్రాన్ని గురించిగాని వ్రాసి తీసుకువెళ్ళేవాడిని. దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకొని పత్రికలకు పంపేవాడిని.

అలాగే ఓ పర్యాయం శ్రీ సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీస్వాముల జీవితవిశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను. మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను. దారిలో నా మనస్సులో ఒక అసంతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి. ఆరోజుల్లో శ్రీవారు శివస్థానమనే చోట కంచిలో ఉండేవారు. ఆలయం పక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మౌనవ్రతం పాటిస్తున్నారు. కుటీరానికి చుట్టూ తడకలు కట్టి ఉన్నాయి. దర్శనార్ధులకు కిటికీచువ్వల గుండా కాని, కుటీరానికి వెనుకభాగాన గల బావి వద్ద లోతట్టుగా నిలబడి కాని స్వామి దర్శనం ఇచ్చేవారు. అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయదర్శనమే తప్ప పాద దర్శనం లభించేది కాదు.

బస్సులో పోతూ నాలో నేనిలా అనుకుంటూ ప్రయాణం చేశాను. ‘శ్రీచరణుల పాద దర్శనం చేసి చాలా రోజులైంది. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణ దర్శనం కాలేదు. ఈ పర్యాయం కూడా అక్కడనిలబడే దర్శనమిస్తారో లేక బయటకి వచ్చి నఖశిఖ పర్యంతం దర్శించే భాగ్యం కలగజేస్తారో! ఏమో నా అదృష్టం ఎలా ఉందో! వారి చరణసౌభాగ్యం దర్శించే అనుగ్రహం చేయకూడదా? ఏమో వారి దయ! నా భాగ్యం’.

ఇలా మనసులో బాధపడుతూ కంచి చేరుకున్నాను. శ్రీవరదరాజస్వామి కోవెల వద్ద బస్సుదిగి శివస్థానానికి వెళ్ళాను. సాయింత్రం అయిదున్నర గంటలయింది. శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పైనుంచి బయటచేరిన భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముఖారవిందం మాత్రమే కనబడుతోంది. నేను ఊరు, పేరు చెప్పుకుని నేలమీద సాష్టాంగ పడ్దాను. ‘రేణు’ ’హైదరాబాదు’ అని విన్నంతనే ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు.

శ్రీ సదాశివబ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం వ్రాసి తెచ్చాననీ, ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుక్కోట తంజావూరు ప్రాంతాల్లొ పర్యటించాననీ, దానిని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలనీ అర్థించాను. నా కోర్కెకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులందరును ఆశీర్వదించి పంపి, ఆరుగంటలకు బావివద్ద లోతట్టున బల్లపై కూర్చొని నాకు కబురు పంపారు. నేను బావికి ఇవతల సాష్టాంగప్రణామం చేసి నిలిచాను. బావిపైన ఒక ఇనుపవల వేసి ఉంది. అప్పటికి సందె చీకటి ప్రారంభమైంది.

శ్రీచరణులు నన్ను చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ పక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చిలైటు వేయమని సంకేతం చేశారు. నేను చదవడం ప్రారంభించాను. ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులైన సాధుపుంగవులకూ, భక్త గాయకులకూ ఎందరికో పుట్టినిల్లని చెబుతూ, అలాంటి సాధుమహాత్ముల కొందరి పేర్లు చదివాను. ఆ వాక్యం పూర్తికాగానే హస్త సంజ్ఞతో నన్ను ఆగమని ‘ఎవరో ఫలనా భక్తుని వదిలేశావే!’ అన్నట్టుగా నా వంక చూసారు.

మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక, ఆ భక్తుడేవరో సెలవివ్వమని అర్థించాను. మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియబరచడానికి శ్రీఎవరెంతో ప్రయత్నించారు. అయితే వారి సంకేతాలేవీ నా బుర్రలోకి ఎక్కలేదు. అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ, తమ రెండు చేతుల బొటన వ్రేళ్ళూ మడిచి ఎనిమిదివేళ్ళూ చూపారు. “చిత్తం స్వామీ! ఎనిమిది!” అన్నాను. వెంతనే కూర్చున్న పళంగా తమ ఎడమపాదము పైకెత్తి నాకు చూపారు. అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడి “ఆ! స్వామి! ఎనిమిది, పాదం, ఎనిమిది పాదాలు, అష్టపాదాలు, అష్టపదులు! ఆ జయదేవులా?” అని పెద్దగా అన్నాను.

శ్రీవారు మందహాసంతో అవునన్నారు. నిజమే! నేనిచ్చిన పేర్లలో గీతగోవిందకర్త జయదేవుని పేరులేదు. అంతేకాదు ఇంకెందరి పేర్లో కూడా లేవు. ఇత్యాదులు అంటూ అందర్నీ కలిపాను. అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవులను నాకు గుర్తుచేయడంలోనే వారి అపారమైన కరుణ వాత్సల్యాలు పెనవేసుకొన్నాయి.

మద్రాసులో నుంచి బస్సులో వస్తూ, శ్రీవారి చరణదర్శనం ప్రాప్తించదేమో అని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి, జయదేవ కవి వ్యాజాన, అష్తపదుల నెపంతో తమ సంపూర్ణమైన, సర్వశుభలక్షణ లక్షితమైన శ్రీ చరణతల దర్శనం అనుగ్రహించి న న్నానందపరిచారు! శ్రీచరణులు సర్వజ్ఞతకూ, సర్వాంతర్యామిత్వానికి, భక్తవాత్సల్యానికి ఈ ఘట్టం చక్కని తార్కాణం.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

11 Nov, 00:34


పరమాచార్య ఇచ్చిన పదోన్నతి

ఒకసారి నేను రామనాథపురం జిల్లా మెజిస్ట్రేటుగా ఉన్నప్పుడు కారులో మద్రాసుకు ప్రయాణమయ్యాను. తిరుగు ప్రయాణంలో కాంచిపురానికి పదిహేను కిమీ దూరంలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్లాను. దర్శనానంతరం ఆ రాత్రికే చెన్నై వెళ్దామని నా ఆరాటం.

ఆ సమయంలో పురాత్వత్వ శాఖ డైరెక్టర్ డా. టి.యన్. రామచంద్రన్ గారు కొన్ని విషయాలను ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తున్నారు. చెట్టుపై కూర్చున్న రెండు పక్షుల చిత్రాన్ని చూపిస్తున్నారు. ఒక పక్షి పండులోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ, తరువాత అందులో ఉన్న వగరు రుచికి ముఖం చిట్లిస్తూ కూర్చుని ఉంది. మరొక పక్షి తనకేం సంబంధం లేదన్నట్టుగా కూర్చుని ఉంది.

బహుశా నా ముఖంలో త్వరగా మద్రాసుకు వెళ్లిపోవాలనే ఆత్రుతని గమనించి మహాస్వామివారు నాతొ ఇలా అన్నారు, “ఈ రాత్రికే నువ్వు మద్రాసుకు వెళ్ళిపోవాలని నాకు తెలుసు. కాని ఈ చిత్రాలను చూస్తోంటే నీకు ఒక ఉపనిషద్ మంత్రం గుర్తుకు రావట్లేదూ?” అని చెప్పి ఆ మంత్రాన్ని పఠించారు.

ద్వా సుపర్ణౌ సయుజౌ శాఖాయౌ సమానం వృక్షం పరిషస్వ జాతే
తయోరణ్యః పిప్పలం స్వాద్ధాతి అనష్ణాన్ అన్యోభచాక్షితిః

అది నాకు బాగా తెలుసు అని చెప్పాను స్వామివారికి. “ఇవి చూడటం వల్ల నీ ప్రవచనాలలో మరింత పారదర్శకత వస్తుంది. అందుకనే నిన్ను ఇక్కడే ఉంచాను. ఇదిగో ప్రసాదం తీసుకో!” అని చెప్పి, ఒక టెంకాయను తీసుకుని రమ్మని దానికి పసుపు పూసి ఆ పూర్ణ ఫల ప్రసాదాన్ని నాకు ఇచ్చారు. స్వామివారికి సాష్టాంగం చేసి దాన్ని అందుకున్నాను.

తరువాత స్వామితో, “ఇప్పటికే నేను జిల్లా జడ్జిగా పదోన్నతి పొందాల్సినది. కాని పదవీ విరమణ పొందిన జడ్జి పదవీకాలం డిసిప్లినరి ట్రిబ్యునల్ మరొక్క మూడునెలలు పొడిగించడంతో నా పదోన్నతి జరగలేదు” అని ఇంకా నా మాటలు ముగించకుండానే “నువ్వు దేవకొట్టై చేరేటప్పటికి, నీ పదోన్నతి ఉత్తర్వులు నీకోసం వేచి ఉంటాయి” అని చెప్పారు.

అలా స్వామివారు నాకు అభయహాస్తంతో ఆశీర్వదించి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. నేను దేవకొట్టై చేరుకోగానే జిల్లా సెషన్ జడ్జిగా పదోన్నతి ఉత్తర్వులు వచ్చాయి. ఇటువంటి స్వామివారి కరుణను ఎందరో భక్తులు అనుభవించి నాతో పంచుకున్నారు.

భవభూతి చెప్పిన శ్లోకం నాకు గుర్తుకువస్తోంది. దాని అర్థం ఏంటంటే, “మహాత్ములు మాటలాడితే, ఆ మాటల వెనుక అర్థం పరిగెడుతుంది. వారు ఏమి చెప్పినా అది జరిగి తీరుతుంది”

త్రిమూర్తులు ఆగ్రహిస్తే గురువు రక్షిస్తాడు, కాని గురువు ఆగ్రహిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు

--- శ్రీ ఆర్. లక్ష్మణ అయ్యర్, రిటైర్డ్ జిల్లా జడ్జి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

10 Nov, 00:42


సన్యాస ధర్మం - శరీర సౌఖ్యం

పరమాచార్య స్వామివారు మధ్యాహ్నం పూట విశ్రమించడం ఎవరూ చూడలేదు. కానీ స్వామివారి చివరి సంవత్సరాలలో తీవ్రమైన ఉపవాసాల వల్ల శక్తి సన్నగిల్లడంతో కొద్దిసేపు సేదతీరక తప్పని పరిస్థితి కలిగింది.

మహాస్వామి వారు నేలపై నారచాపపై పడుకుని భక్తులకు దర్శనం ఇచ్చేవారు. స్వామివారు అలా పడుకుని ఉండగా నేలపై పడి నంస్కారాలు చేయరాదని భక్తులకు తెలిపేవారు. స్వామివారి చర్మం చాలా సున్నితమైనది. పీచుతో నేసిన చాపపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పడుకోవడమ వల్ల వారి వెనుకభాగం అంతా గీరుకునిపోవడం భక్తుల దృష్టి దాటిపోలేదు.

ఒకసారి సుందరరామన్ అనే భక్తుడొకరు స్వామివారి వీపు భాగం అలా గీరుకుపోవడం చూసి చాలా బాధపడ్డాడు. ‘స్వామివారు ఇటువంటి చాపపై ఎందుకు పడుకోవాలి? పత్తి పట్టుతో చేసిన పరుపుపై ఎందుకు పడుకోరాదు?’ అని ఆలోచించాడు.

ఈ విషయం ఎవరితోనూ చర్చించలేదు. ప్రసాదం తీసుకుని చెన్నై వెళ్లిపోయాడు. చెన్నై వెళ్ళిన వెంటనే మొదటగా ఒక పరుపులు తయారు చేసే దుకాణానికి వెళ్ళాడు. రెండు రోజుల్లో వెల్వెట్ వస్త్రంతో కుట్టిన పట్టు పరుపును తయారుచేయించాడు. తానే దాన్ని తీసుకుని శ్రీమఠానికి వచ్చాడు. ఎంతో సంతోషంతో, ‘ఇప్పటికిప్పుడు స్వామివారు దీనైపై పడుకుని చాలా సౌకర్యంగా ఉంది’ అని అంటారని అనుకున్నాడు.

అ పరుపుని స్వామివారి ముందరుంచాడు. సేవకుడు, బాలు మామ స్వామివారితో, “సుందరరామన్ స్వామివారికోసం పరుపు తెచ్చాడు. నారచాపపై స్వామివారు పడుకోవడం చూసి చాలా బాధ పడ్డాడు” అని చెప్పారు.

స్వామివారు దాన్ని దగ్గరకు తీసుకునిరమ్మని చెప్పి దాన్ని తాకారు. సుందరరామన్ చాలా ఆనందించాడు. ఖచ్చితంగా స్వామివారు దానిపై విశ్రమిస్తారని, ఇక స్వామివారి వీపు గీరుకుపోవడం ఉండదు అని అనుకుంటున్నాడు.

“ఇది చాలా మెత్తగా ఉంది” అని అన్నారు స్వామివారు.

“అవును పెరియవా. పైన ఉన్నది వెల్వెట్ తో చేసినది”. రెండు నిముషాలపాటు నిశ్శబ్ధం. కానీ అది రెండు సంవత్సరాలలాగా గడిచింది.

“అర్జునుడు భీష్మునికి పరుపు ఏర్పాటు చేశాడు. అది ఎటువంటి పరుపో నీకు తెలుసా?” అని అడిగారు స్వామివారు.

“బాణాల పరుపు”

“అవును. అదే ఆయనకు సంతోషాన్ని ఇచ్చింది. దేవలోకం నుండి పరుపు కావాలను తలచుకునివుంటే, ఇంద్రుడు వెంటనే ఒక పరుపు పంపేవాడు”
మరలా నిశ్శబ్ధం.

“చూడు, అక్కడ ఒక ముసలివాడు ఉన్నాడు చూశావా? అతను ఎనభై సంవత్సరాల రైతు. అప్పులు తీర్చలేక సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు”
కొద్దిసేపు మౌనం.

“ఈ పరుపుని అతనికి ఇవ్వు. తలగడ, దుప్పటి కూడా కొనివ్వు. కనీసం కొద్దిరోజులైనా అతను హాయిగా నిద్రపోతాడు”

సుందరరామన్ స్వామివారి మాటలను విన్నాడు. స్వామివారి మాటంటే, అది సాక్షాత్తు పరమశివుని మాట. అవును కదా? వెంటనే సుందరరామన్ తలగడ, దుప్పటి కొని అన్నిటినీ ఆ రైతుకు ఇచ్చాడు.

స్వామివారు తరువాత ఇలా అన్నారు, “నార చాపతో నేను ఆనందంగా ఉన్నాను. ఆ మెత్తని పట్టు పరుపుపై నేను పడుకోలేను. అది నన్ను ఇబ్బంది పెడుతుంది. నాకు నార చాప అంటేనే ఇష్టం. వేరెవన్నీ పనికిరానివి”.

మహాస్వామి వారు నిరాడంబరత్వానికి మారురూపం.

--- శ్రీమఠం బాలు మామ. ‘కంచి మహాన్ దరిసనం’ నుండి.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

09 Nov, 00:01


ఆమెను భర్త దగ్గరకు వదిలి రా...

చాలా సందర్భాల్లో, ఇతరులపైన పరమాచార్య స్వామివారి ప్రేమ బహిర్గతం అవ్వదు. కాని ఒకసారి మహాస్వామివారు శ్రీమఠం బాలు మామని ఒక పని చెయ్యమని ఆదేశించారు. ఆ సంఘటన వివరాలు బాలు మామ మాటల్లో.

శ్రీమఠం మకాం షోలాపూర్ లో విడిది చేసి ఉన్నప్పుడు, ఒక సాయంత్రం మహాస్వామి వారు బాలు మామను పిలిచి, “. . . ఇతని ఇంటికి వెళ్లి, వారి అమ్మాయిని తీసుకుని తన భర్త ఇంటిలో వదిలిరా!” అని ఆజ్ఞాపించారు.

ఆ మాట విని బాలు మామ నిశ్చేష్టుడయ్యాడు.

పరమాచార్య స్వామివారు చెబుతున్న వ్యక్తీ స్వామివారికి పరమ భక్తుడు, వైశ్య కులానికి చెందినవాడు; పెద్ద సంసారం కలవాడు; ఏవో కారణాల వల్ల అతని కుమార్తె భర్త నుండి విడువడి, తల్లితండ్రుల వద్దే ఉంటోంది. కాని ఈ విషయం ఎవరూ మహాస్వామివారికి తెలుపలేదు. కాని స్వామివారి నుండి ఇటువంటి ఆదేశం వచ్చింది.

“ఏమిటి ఈ ఆదేశం? మరొకరి కుటుంబ విషయాల్లో నేను జోక్యం చేసుకోవడం ఎలా? ఆ అమ్మాయిని తీసుకునివెళ్ళి భర్త ఇంటిలో వదిలిరావాలా? ఇది సరైనదేనా?” అని పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు బాలు మామ. ఎటువంటి ఆజ్ఞనైనా స్వామివారి నుండి వెలువడితే, సహాయకులెవ్వరూ మరొక్క ఆలోచన లేక అమలుచేస్తారు. కాని ఈ విషయంలో బాలు మామ సంకోచిస్తున్నాడు.

బాలు మామ ఇబ్బందిని అర్థం చేసుకున్న స్వామివారు అతనికి ధైర్యంగా ఉంటుందని, “నీతోపాటు బ్రహ్మచారి రామకృష్ణన్ ని కూడా వెంట తీసుకునివెళ్ళు” అని చెప్పారు.

వారు ఆ ఇంటికి వెళ్లి, స్వామివారి ఆదేశాన్ని వారికీ తెలిపారు. స్వామివారి ఆదేశాన్ని వినగానే అందరూ ఏడవడం మొదలుపెట్టారు. అమ్మాయిని అక్కడకు పంపడం అంటే, ప్రేమతో పెంచుకున్న చిలకను పిల్లి వద్దకు పంపడమే అని వారికి తెలుసు.

కాని వారికి మహాస్వామి వారిపై ఉన్న నమ్మకం, భక్తి చేత ఎటువంటి అనుమానానికి తావివ్వకుండా మనస్సును స్థిమితపరచుకున్నారు. పరమాచార్య స్వామివారే ఇలా ఆదేశించారంటే అందులో ఎదో ఉంటుందని వారికి తెలుసు. అమ్మాయిని పంపడానికి నిర్ణయించుకున్నారు.

ఆ అమ్మాయి ఎంత ఆలోచిస్తున్నాడో తన భర్త ఇంటికి వెళ్ళడానికి, బాలు మామ కూడా అంతే తటపటాయిస్తున్నాడు. కాని అది స్వామివారి ఆజ్ఞ కావడంతో ఇక బయలుదేరింది. ఏమి జరుగుతుందో అని భయపడుతూ ముగ్గురూ బయలుదేరారు.

వీళ్ళు అక్కడకు వెళ్ళగానే అత్తింటి వారు ఎంతో సాదరంగా వాళ్ళను ఆహ్వానించారు. వీరు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆమె భర్త కూడా తనని ప్రేమతో ఆదరించి, ఇక్కడే ఉంచుకుంటాను అని ప్రమాణం చేశాడు.

--- శ్రీ రా. గణపతి, “శంకరర్ ఎండ్ర సంగీతం” నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Nov, 14:21


కాశీలో జరుగుతోన్న అన్ని కార్యక్రమాలను ఈ ఛానల్స్ లో చూడవచ్చు

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Nov, 14:20


https://youtube.com/@srisambhasadhashivamahadevasev

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Nov, 14:19


https://youtube.com/@sathsang

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Nov, 02:10


“ఈ సొమ్ము ఎవరు ఇచ్చినట్టు రాయమంటారు?” అడిగారు శ్రీ జియ్యర్ స్వామి. “నేను కంచి మఠం నుండి వస్తున్నాను కాబట్టి కంచిమఠం ఇచ్చినట్టు రాసుకోండి” అన్నాను. సతారాకు తిరిగివచ్చి, స్వామివారితో పరిస్థితి అంతా చెప్పాను. స్వామివారిలా అన్నారు “గోపుర నిర్మాణం పూర్తికాకుండా శ్రీ జియ్యర్ స్వామి దివంగతులయ్యే ప్రమాదం లేదు. ఆ పని పూర్తి అయ్యేవరకు వారు సజీవులై ఉంటారు”

నేను మరల శ్రీ జియ్యర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు శ్రీవారన్న మాటలను శ్రీ జియ్యర్ స్వామికి వినిపించగా, వారు ఇలా అన్నారు

”శ్రీ చంద్రశేఖర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతులు ఇరువురూ నాకు సుపరిచితులే. నా పూర్వాశ్రమంలో నేను వారుభయులనూ ఎరుగుదును. గోపుర నిర్మాణం పూర్తయ్యే వరకూ నేను జీవించియుంటానని పెద్దస్వామి వారు అన్నారంటే అది వారి ఆశీర్వాదం”.

నిరాడంబర దాత అయిన శ్రీరంగదాసు గారు కంచి మఠం తరుపున మొత్తం లక్ష రూపాయలు శ్రీ రంగం గోపుర నిర్మాణానికి ఇచ్చారు. కాని వారు ఎక్కడా అది చెప్పుకోలేదు. అది వారి నమ్రతనూ, నిరాడంబరతనూ సూచిస్తుంది. ఇలాగే కంచిస్వామి వారి భక్తులలో ఒకరు, సేలంలో ఆడిటరు, తన పేరు ప్రకటించుకోకుండా దాదాపు మూడున్నర లక్షలు రూపాయలు సేకరించి కంచిమఠం ద్వారా శ్రీరంగనాథుని గోపుర నిర్మాణానికి సమర్పించారు.

ఇందులో ముఖ్యంగా చెప్పదగిన విశేషమేమంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన వైష్ణవాలయ గోపుర నిర్మాణానికై అద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాలకు చెందిన ఇరువురు పీఠాధిపతులు ఏకమై 232 అడుగుల ఎత్తున ఉన్నతోన్నతమైన ఒక మహానిర్మాణాన్ని పూర్తిచేయడం చరిత్రలో అపూర్వం.

మరొక విశేషం : శ్రీరంగం రంగనాథుని గాలి గోపుర నిర్మాణాన్ని గురించి అహోబిలం మఠాధిపతి శ్రీ శఠకోపయతి గారినడిగితే “అంతటికీ కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రులవారే కారకులు” అంటారు. కంచిస్వామి వారు, “నాదేమున్నది? అంతా అహోబిలం వారికృషే” నంటారు. ఉదార చరితుల ఔదార్యానికి, స్వార్థరాహిత్యానికీ ఇంతకంటే నిదర్శనమేముంటుంది?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Nov, 02:09


శ్రీ రంగం రంగనాథ ఆలయ గోపురం

శ్రీ రాచూరి రంగదాసుగారి పూర్వీకులు మూడు దశాబ్ధాలకు పైగా హైదరాబాదులో స్థిరపడినవారు. రాచూరి వారు వైష్ణవ సంప్రదాయానికి చెందిన సూర్యవంశ క్షత్రియులు.

1968లో భద్రాచలంలో శ్రీ సీతారామాలయ కుంభాభిషేక మహోత్సవ సందర్భంలో శ్రీ రంగదాసు ప్రప్రథమంగా శ్రీ కంచి కామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించడం తటస్థించింది.

“అంతకుముందు నాలో లేశమాత్రంగా ఉన్న దైవభక్తి కంచి స్వామివారిని సందర్శించిన తదుపరి ఇనుమడించింది” అంటారు రంగదాసు గారు.

“అటు పిమ్మట శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారితో నాకు సన్నిహిత్యం పెరిగింది. ఇరువురు స్వాముల అనుగ్రహం ఫలితంగా పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు నన్ను వరించి వచ్చినవి. నా ఆదాయం వృద్ధి అయింది.”

శ్రీ రంగదాసు గారు తన స్వానుభవాన్ని ఇంకా ఇలా వివరించారు. పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కర్ణాటక రాష్ట్రంలోని గోకక్ అనే గ్రామంలో మకాం చేస్తూ ఉన్నప్పుడు “వెంటనే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసి వెళ్ళవలసిందంటూ” హైదరాబాదులో నాకు వర్తమానం అందింది. స్వామి ఆజ్ఞమేరకు నేను గోకాక్ వెళ్ళాను.

స్వామివారు నాతో ఇలా అన్నారు. “అహోబిలం మఠాధిపతి శ్రీ శఠగోప వేదాంత మహాదేశికులవారి వద్ద నుండి నాకొక జాబు వచ్చింది. శ్రీరంగ క్షేత్రం రంగనాథస్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి, అసంపూర్ణంగా నిలిచిపోయిన దేవాలయ గోపుర నిర్మాణం ప్రారంభించవలసిందని శ్రీ జియ్యర్ స్వామిని ఆజ్ఞాపించాడట. అందుకు ఆర్థిక సాయం కోరుతూ వారు నాకు జాబు వ్రాసారు.”

“నా అభిప్రాయంలో ఆ గోపుర నిర్మాణం అంతా రాతితోనే జరగాలి అని ఉన్నది. నీవు కాంట్రాక్టరువు కాబట్టి, శ్రీరంగం వెళ్ళి, అసంపూర్తిగా ఉన్న కట్టడాన్ని పరిశీలించి, రాతితో కట్టడం ఎంతవరకు సాధ్యమో, అందుకు పునాదులు తగినంత దృఢంగా ఉన్నవో లేవో చూచి నీ అభిప్రాయం నాకు చెప్పాలి.”

“ఈ గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ఆ మేరకు ప్రజలనుండి విరాళాలు కోరుతూ నేనూ శ్రీ శఠగోపయతీంద్రులవారూ ఇరువురం కలిసి ఒక విజ్ఞాపన చేస్తాము”

“ఇకపోతే గోపుర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఒక రిటైరైన ఐ.ఏ.యస్. అధికారిని అడ్మినిస్ట్రేటివ్ అధికారిగానూ, రిటైరైన అకౌంటెంట్ జనరల్ ను జమాఖర్చులు చూడడానికి, అలాగే ఉద్యోగం నుంచి విరమించుకున్న ఒక చీఫ్ ఇంజనీరును గోపుర నిర్మాణ పర్యవేక్షణకు నియమిస్తాము.

ఈ పనులన్నింటీకీ వృద్ధులైన అహ్రీ యతీంద్రులవారు శ్రమపడవలసిన పనిలేదు. ఈ విశయాలన్నీ అహోబిలం పీఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయమేమో తిరిగ్ వచ్చి నాకు చెప్పవలసింది” అని స్వామి ఆజ్ఞాపించారు.

శిల్పశాస్త్ర ప్రవీణుడు శ్రీ గణపతి స్థపతినీ, శ్రీ సౌందరరాజన్, హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ అఫీసులో ఉద్యోగి శ్రీ కె. కృష్ణమూర్తి గారినీ, పునాదులు పరీక్ష చేయడానికి సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ డి.రామమూర్తి గారినీ, మఠం కార్యకర్తలలో ఒకరైన శ్రీ కన్నన్ గారినీ వీరందరినీ వెంటబెట్టుకుని నేను శ్రీరంగం బయలుదేరాను. శ్రీరంగంలో నేను ఆచార్యులవారిని దర్శించడం అదే తొలిసారి. కంచిస్వామి వారు చెప్పినదంతా శ్రీ జియ్యరు స్వామి వారికి వివరంగా వినిపించాను. అంతావిని వారు అందుకు అంగీకరించక ఇలా చెప్పారు.

”శ్రీరంగనాథుడు నాకు స్వప్నంలో కనుపించి ఈ పని నీవు పూర్తి చెయ్యవలసిందని ఆజ్ఞాపించాడు. సాధ్యమైతే, నాకు ఈ నిర్మాణానికి డబ్బు సాయం చెయ్యవలసిందని శ్రీ శంకరాచార్యులవారితో చెప్పండి. అంతకు మించి నేను చెప్పవలసిందేమి లేదు” అన్నారు.

హైదరాబాద్ లో శ్రీ అహోబిలమఠానికి కార్యదర్శిగా ఉన్న శ్రీ సౌందరరాజన్ గారితో కలిసి తిరిగి మేమంతా గోకక్ లో శ్రీవారి వద్దకు వచ్చి, శ్రీరంగంలో జరిగిన విషయమంతా స్వామివారికి నివేదించాము.

స్వామి వారు మేము చెప్పినదంతా సావకాశంగా విని ”అలాగే, జీయర్ గారికి ఎలా ఉచితమని తోస్తే అలా చెయ్యమను” అని సెలవిచ్చారు. తరువాత శ్రీజయేంద్ర సరస్వతిని పిలిచి, “మఠంలో నిలవ ఎంత ఉన్నది?” అని శ్రీవారు అడిగారు. దాదాపు పదిలక్షలు ఉన్నదని శ్రీ జయేంద్రుల వారన్నారు.

“అయితే, ఒక లక్షరూపాయలు వెంటనే అహోబిలం మఠాధిపతులకు పంపే ఏర్పాటు చెయ్యి” అన్నారు పెద్దలు.

కొన్ని నెలలు గడిచాయి. శ్రీవారు మహారాష్ట్రలోని సతారాలో ఉండి, తిరిగి నాకు కబురు పెట్టారు. నేను సతారా వెళ్ళి స్వామిని కలుసుకున్నాను. “నీవు మళ్ళా శ్రీరంగం వెళ్ళి వస్తావా?” అని అడిగారు

శ్రీ జియ్యర్ గారు గోపుర నిర్మాణం ప్రారంభం చేసారని, గోపురంలో కనీసం ఒక అంతస్థు కట్టడానికి తమ సహాయం అడుగుతున్నారని, ఒక అంతస్థుతో గోపురం పూర్తి కాదు కదా, మిగిలిన అంతస్థులను వారు ఎలా ఏర్పాటు చేస్తారో, వారి ప్రణాలిక ఏమిటో అన్ని విషయాలు తెలుసుకుని రావలసిందిగా నన్ను స్వామివారు ఆదేశించారు.

శ్రీరంగం వెళ్ళి నేను జియ్యర్ స్వామిని కలిసికొన్నప్పుడు వారు చాలా అవేదన వ్యక్తం చేసారు. “అందరూ వస్తున్నారు. పోతున్నారు. ఎవరూ డబ్బు ఇవ్వడం లేదు” అన్నారు. జియ్యర్ గారి మాట విని నేనెంతో కష్టపడ్డాను. వెంటనే నేను స్వయంగా 25,000 రూపాయలకు చెక్కురాసి వారికి సమర్పించాను.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

07 Nov, 00:26


భూత భవిష్యత్ దార్శనికులు

నేను పరమాచార్య స్వామివారిపై పద్యాలు, పాటలు వ్రాసి స్వామివారికి సమర్పించేదాన్ని. ఒక మామూలు కాగితంపై రాసి స్వామివారి సన్నిధిలో ఉంచేదాన్ని. స్వామివారే స్వయంగా తీసుకుని చదివేవారు లేదా పక్కనే ఉన్న శ్రీ బాలుని తీసుకుని చదవమనేవారు. కొన్నిసార్లు నన్ను చదవమని ఆదేశించి వినేవారు.

ఒక సందర్భంలో మహాస్వామి వారు చేసే పూజను పాటగా ఒక రాగమాలికలాగా రాశాను. దాన్ని స్వామివారి ముందుంచాను. పక్కనే ఉన్న శ్రీ వేదపూరి శాస్త్రిని “దాన్ని తీసుకుని చదువు” అని ఆదేశించారు. కాగితాన్ని తీసుకుని చదివారు వేదపూరి శాస్త్రి. దాదాపు సగం చదివిన తరువాత, స్వామివారు ఆపమన్నారు. సరిగ్గా అప్పుడే మఠం గంట మోగగా ప్రతి గంట ధ్వనికి స్వామివారు గట్టిగా “ఓం! ఓం!” అని అన్నారు. అది పూర్తైన తరువాత “ఇప్పుడు చదువు” అని చెప్పారు.

వేదపూరి కొనసాగించాడు, నేను రాసిన తరువాతి వాక్యం, “గంటలు ఓం ఓం అని మ్రోగగా . . . ” అని చదవగానే మేమందరమూ ఆశ్చర్యానికి గురయ్యాము.
అప్పుడే గంటలు ఎందుకు మ్రోగాలి? ప్రతి గంటకి స్వామివారు ఎందుకు “ఓం.. ఓం..” అని పలకాలి? ఏ దేవుని సంకల్పం ఇది?

ఈ సంఘటన వల్ల నాకు అర్థమయ్యింది ఏమిటంటే “నాకు తెలియకుండా నీ అంతట నీవు ఏమి రాయడంలేదు. నువ్వు రాయడం కేవలం నా అనుగ్రహం మాత్రమే” అని స్వామివారు నాకు చెబుతున్నారు.

నా ఆడపడుచు భర్త బెంగళూరు నుండి పుదుక్కోట్టైలోని మా ఇంటికి వచ్చాడు. నిండా ‘శ్రీరామ జయం’ వ్రాసివున్న ఒక పుస్తకాన్ని, పది రూపాయల డబ్బులను ఇచ్చి, “బెంగళూరు కుప్పుస్వామి అయ్యర్ ఈ పుస్తకాన్ని డబ్బులను మీకు సమర్పించమని చెప్పాడు పెరియవా” అని చెప్పి స్వామివారికి సమర్పించమని చెప్పాడు.

నేను కాంచి శ్రీమఠంలోనికి వెళ్ళేటప్పటికే పెద్ద భక్తుల గుంపు ఉంది. స్వామివారి చుట్టూ పెద్ద పెద్ద పండితులు, ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. స్వామివారి సమీపంలో నేను ఎక్కువసేపు ఉండడానికి కుదరకపోవడంతో శ్రీరామజయం పుస్తకాన్ని, డబ్బులను అక్కడున్న పళ్ళబుట్టలో ఉంచి కొద్ది దూరంలో నిలబడ్డాను. చిన్నగా భక్తుల గుంపు తగ్గిపోయింది. స్వామివారు కూడా లేచి నిలబడ్డారు, చేతిలో పుస్తకంతో సహా.

“ఎవరు పెట్టారు ఇక్కడ?”

“నేనే”

“ఇది వ్రాసిన వ్యక్తి పేరు ఏమిటి? అతను బెంగళూరు వాడా? ఇంకా ఏమి ఇచ్చాడు?”

స్వామివారి మాటలకు నేను వణీకిపోయాను. “పెరియవా! కుప్పుస్వామి అయ్యర్ బెంగళూరు నుండి మా ఇంటికి వచ్చాడు. ఈ పుస్తకాన్ని, పది రూపాయలను ఇచ్చాడు. మీకు చెప్పకుండా మీ ముందుంచడం నా తప్పు; స్వామివారు నన్ను క్షమించాలి”

నేను చెప్పకుండా సంశయించిన విషయాన్ని నేనే చెప్పేలాగా చేశారు స్వామివారు. అలాగే స్వామివారు నవ్వుతూ నావైపు చూస్తున్నారు.

స్వామివారి నుండి మనం ఏదీ దాచలేమని నాకు అర్థం అయ్యింది. ఎవరైనా ఏదైనా చెప్పమని చెబితే అది మనం స్వామివారికి తప్పక చెప్పాలి.

--- రాధా రామమూర్తి, పుదుక్కోట్టై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

06 Nov, 00:19


మరొక సంఘటన: 1965 అనుకుంటా. ఇటీవలే పెళ్ళైన దంపతులోకరు. అతనికి ఇరవైమూడు సంవత్సరాలు, తపాలా శాఖలో పనిచేతున్నాడు. ఆమెకు పంతొమ్మిది సంవత్సరాలు. ఆ అబ్బాయి హఠాత్తుగా పిచ్చి పట్టినట్టు అయ్యి శ్రీమఠం మొత్తం పరిగెత్తేవాడు. ఒక మండలం రోజులు పరమాచార్య స్వామివారు అనుగ్రహించిన తీర్థప్రసాదాన్ని అతనికి ఇస్తే, నయమవుతుందని తెలుసుకుని, అతన్ని రోజూ పూజకు తీసుకునివచ్చేది.

పదిహేను రోజులు గడిచిపోయాయి. రోజూ నేరుగా చేతిలోకి తీర్థం ఇచ్చే స్వామివారు ఆరోజు అలా ఇవ్వకుండా తలపై ప్రోక్షించి, ఇక మిగిలిన భక్తులెవ్వరికీ తీర్థం ఇవ్వకుండా లోపలకు వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి హఠాత్తుగా భార్య చర నుండి విడిపించుకుని, పరిగెడుతూ రాజవీధిలోకి రాగా, ఆమె కూడా అతణ్ని వెంబడించింది. వారు నివశిస్తున్న ఇంటికి వెళ్ళి, బావిలోకి దూకేసాడు. అతణ్ని ఆపాదమ్ ఆమెకు సాధ్యం కాలేదు. బాధాకరమైన సంఘటన, ఆమె రోదనలు మిన్నుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది బావిలోకి వెళ్ళేడానికి మునుపే ఆ అబ్బాయి మరణించాడు.

ఆరోజు రాత్రి స్వామివారు చుట్టూ ఉన్నవారిని చూసి, “ఆ అబ్బాయి కార్యం అయిపోయిందా?” అని అడిగారు. అతని జీవనగమ్యం ముగిసిందని తెలియడం వల్లనే ఉదయం స్వామివారు తీర్థాన్ని ప్రోక్షించారు.

1964లో నేను యమ్. ఏ పరీక్షలు రాసి ఫలితాలు విడుదల చేసేరోజున స్వామివారి దర్శనానికి వెళ్ళాను. అనుకోకుండా స్వామివారు నాకు పటికబెల్లం ఇచ్చారు. నేను ఏ విషయమూ వారికి చెప్పలేదు. సాయంత్రం వచ్చే పత్రిక ‘ది మెయిల్’ లో ఫలితాలు వచ్చాయి. నేను ఉత్తీర్ణుడనయ్యాను. రాత్రి స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు “ఉత్తీర్ణుడవయ్యావా?” అని అడిగారు. ఒక్కక్షణం నిశ్చేష్టుడినయ్యాను. ఇన్ని శక్తులను తమలో ఉంచుకుని స్వామివారు ఎంత సాధారణంగా, సహజంగా ఉంటారు. కేవలం వారు కరుణా కటాక్ష వీక్షణం ఒక్కటి చాలు. మన సమస్యలన్నీ తొలగిపోతాయి.

శ్రీ బాలపెరియవా డెబ్బైయవ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులయ్యే కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం నాకు దొరికింది. ముగ్గురు ఆచార్యుల ప్రియ శిష్యుణ్ణి కావడం నా పూర్వజన్మ పుణ్య ఫలం. ఇప్పుడు, జయేంద్ర స్వామివారి ఆజ్ఞ మేరకు 1995 నుండి తిరువణ్ణామలై కాంచి మఠానికి ముద్రాధికారిగా ఉన్నాను. ఇక్కడ ఒక శంకర మఠం శాఖను ఏర్పాటు చెయ్యడానికి సహాయంగా ఉన్నాను.

శ్రీ పరమాచార్య స్వామివారికి నాలుగేళ్ల పాటు భక్తితో, అత్యంత సన్నిహితంగా ఉండి సేవచేసుకోవడం, నా జన్మలో ఎప్పటికీ మరచిపోలేని పుణ్యకాలం.

--- ఆర్. నటరాజన్, తిరువణ్ణామలై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

06 Nov, 00:19


నువ్వు ఇక్కడే వుండు

కాంచీపురం మునిసిపాలిటీ ఉన్నత పాఠశాలలో పనిచేయడానికి 1954లో కంచికి వచ్చాను. అది నాకు సాధారణమైన చోటు కాదు. మా నాన్నగారి మేనమామగారు చెంగల్పేట్ లోని శ్రీమఠం ముద్రాధికారి; వారి నుండి లేఖ తీసుకుని కాంచీపురం వచ్చాను. నేరుగా శ్రీమఠానికి వెళ్ళి, శ్రీకార్యం శ్రీ సి. యస్. విశ్వనాథ అయ్యర్ గారిని కలిశాను. నాకు అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు. నాలుగు మూరల పంచే కట్టుకున్న బక్కపలచని దేహం.

పరమాచార్య స్వామివారి ముందర నిలబడి సాష్టాంగం చేశాను. మేనేజరు నుండి విషయం అప్పటికే తెలిసిఉండడంతో, ఎంతో కరుణతో, “ఉద్యోగానికి ఎప్పటినుండి వెళ్తున్నావు? ఎక్కడ ఉండబోతున్నావు?” అని నన్ను అడిగారు.

“ఈరోజు నుండే ఉద్యోగానికి వెళ్తున్నాను” అని ఆగాను. అయిదు నిముషాల మౌనం తరువాత స్వామివారి నుండే ఆదేశం వచ్చింది; “నువ్వు శ్రీమఠంలోనే ఉండు. పాఠశాల సమయం తప్ప మిగిలిన సమయంలో నాతోపాటు ఉండు”. నా ఆనందానికి అవధులు లేవు. ఎంతటి అదృష్టం? నాకు ఆనందం, ఆశ్చర్యం.

నా పెట్టె, పరుపు గదిలో ఒక మూలనుంచి, పాఠశాలకు వెళ్లడానికి తయారయ్యి స్వామివారికి నమస్కారం చేశాను. స్వామివారు చెయ్యెత్తి, “నువ్వు సంతోషంగా ఉంటావు” అని ఆశీర్వదించారు.

రోజూ ఉదయం ఏడున్నరకు పాఠశాలకు వెళ్ళడం, సాయంత్రం అయిదింటికి తిరిగిరావడం. తరువాత అంతా మహాస్వామి వారి సేవ. రాత్రిళ్ళు ‘ది హిందూ’ వంటి వార్తాపత్రికలను చదవడం నా పని. మధ్యమధ్యలో స్వామివారు నన్ను ఏదైనా అడిగితే సమాధానం ఇవ్వడం. నేను తరగతి గదిలో చెప్పిన పాఠాల గురించి కూడా అడిగేవారు. నాకు రోజూ ఇదొక ‘పరీక్ష’.

నేను ఉద్యోగానికి చేరిన మూడవ రోజున, తమిళనాడు ప్రభుత్వం నుండి ఇంటర్వ్యూకు హాజరవ్వాలని లేఖ వచ్చింది. అది ‘ఖాదీ ఇన్స్పెక్టర్’ ఉద్యోగానికి. ఆ ఉద్యోగంపై నాకు కొంచం ఆశ కలిగింది. నేను కనక ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయి ఉంటే, ఇప్పుడు రమారమి డిప్యూటీ డైరెక్టరుగా పదవీ విరమణ పొంది ఉండేవాడిని. ఈ విషయం స్వామివారికి ఎలా చెప్పాలి? నేను ఈ విషయం మేనేజరుకు చెప్పాను కానీ, నేను దీన్ని అంగీకరించడం వారికి నచ్చలేదు. తటపటాయిస్తూ చివరకు ఈరోజు రాత్రి విషయం స్వామివారికి తెలిపాను. స్వామివారు నన్ను తీక్షణంగా చూస్తూ, హఠాత్తుగా కుడిచేయి పైకెత్తి, “నువ్వు ఇక్కడే ఉండు. నీవు బావుంటావు” అని అన్నారు. అంతే, తరువాత నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ ఒక్క ఆశీర్వాదం; పాఠశాల ఉపాధ్యాయినిగా ఎంతో ఉన్నతిని, కీర్తిని, పురస్కారాలను పొందడానికి నాకు మూల కారణం అయ్యింది.

1954 నుండి 1958 వరకు నాలుగు సంవత్సరాలపాటు దగ్గరే ఉండి మహాస్వామి వారిని సేవించుకునే భాగ్యం లభించింది. ఎంతటి ఆప్యాయత! ఎంతటి ప్రేమ! ఎంతటి కారుణ్యం! అవి మాటలలో చెప్పలేము. నను ‘నటరాజు’ అనే ఎంతో ప్రేమగా పిలిచేవారు. రాత్రి తొమ్మిదైతే, “వెళ్ళు! వెళ్ళి భోజనం చేసిరా” అని అనేవారు. నా భోజన వసతి కూడా శ్రీమఠంలోనే. ఒక్కోరోజు మూడవ కాల పూజ, రాత్రి తొమ్మిదిన్నరకు మొదలయ్యి, పదకొండు గంటలకు ముగిసేది. ఆ పూజకు చాలా తక్కువమంది ఉండేవారు; వారిలో నేనొకడిని.

1954 మార్చి 22. శంకర మఠం సువర్ణాధ్యాయానికి ఉషోదయం. అవును! ఆరోజు నా గురుదేవులు మఠాధిపతిగా బాధ్యతలను తీసుకున్న రోజు. ఆరోజు ఒక సామాన్య శ్రీ సుబ్రహ్మణ్యన్ అరవైతొమ్మిదవ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులై, ‘శ్రీ జయేంద్ర సరస్వతీ’ గా మారిన రోజు. సర్వతీర్థంలోని పండుగ వాతావరణం అయిపోయి, ఇద్దరు ఆచార్యులు కామాక్షి అమ్మవారి సన్నిధికి నడిచి వెళ్తుండగా, నాకు కలిగిన భాగ్యం; శ్రీ జయేంద్రులతో మాట్లాడటం. దాని తరువాత జరిగిందేమిటి? శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారికి అనుంగు శిష్యుణ్ణి అవ్వడం. నేను వారికి శిష్యుడినై యాభై సంవత్సరాలు అయ్యింది. నేనే వారికి ప్రథమ శిష్యుణ్ణి అని చెప్పడం అతిశయోక్తి కాదేమో!

పరమాచార్య స్వామివారు జయేంద్ర స్వామివారిని ప్రేమగా అలాగే నిష్టగా బాధ్యతలను నెరవేర్చే విధంగా తీర్చిదిద్దారు. నేను పరమాచార్య స్వామివారి దగ్గర లేకపోతే, జయేంద్ర సరస్వతీ స్వామివారి వద్ద ఉండేవాణ్ణి. రాత్రి పన్నెండు లేదా ఒంటిగంట అయినా సరే మేమిరువురు ఎన్నో విషయాలను చర్చించుకునేవాళ్లం. ఇరవై ఒక్క సంవత్సరాలపాటు ఆ భాగ్యాన్ని పొందాను. నా జీవితంలో నేను పొందిన గొప్ప అదృష్టంగా భావిస్తాను.

నేను మహాస్వామివారితో ఉన్నప్పుడు ఎన్నెన్ని సంఘటనలు.

బహుశా 1963లో అనుకుంటా. శ్రీమఠం మకాం మైలాపూర్ లో ఉంది. దర్శనానికి దాదాపు పదివేల మంది వచ్చారు. పూజ అయిపోయిన తరువాత భక్తులకు తామే స్వయంగా తీర్థమిస్తున్నారు స్వామివారు. ఒక మధ్యవయస్కురాలు తీర్థం కోసం చేయి చాచగా, ఆమెతో స్వామివారు, “ఆ బిడ్డ ఏడుస్తోంది. గొలుసు తిరిగిచ్చి రా” అని నాతో, “నువ్వు ఈమెతోపాటు వెళ్ళు, ఈమెతో గొలుసు తీసుకుని, ఇచ్చి తిరిగిరా” అని ఆదేశించారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కొద్దిదూరంలో ఒకావిడ ఒడిలో బిడ్డనుంచుకుని ఏడుస్తోంది. ఈమెను అక్కడకు తీసుకునివెళ్ళి, గొలుసు తీయించి, ఆ తల్లికి ఇచ్చాను. ఆమె మొహంలో అనంతమైన ఆనందం. ఈమెను పట్టించింది స్వామివారే అని చెప్పగా, అక్కడున్నవారందరూ ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

05 Nov, 00:41


“సరే, ఏమి చదువుకున్నావు? ఎక్కడ పనిచేస్తున్నావు, ఏ సమయానికి తిరిగొస్తావు?”
ఎలక్ట్రానిక్స్ చదివానని, సాయంత్రం ఐదు దాకా కళాశాలలో పనిచేసి, తొమ్మిది దాకా మరొక ఉద్యోగానికి వెళ్ళి, పదకొండు గంటలకు ఇంటికి తిరిగొచ్చి, మరుసటి రోజు ఊయదయం 6:20 నిముషాలకు లేస్తానని చెప్పాడు. ఆదివారం మాత్రమే తనకు సెలవు కనుక ఆరోజు ఉదయం పది గంటలకు లేచి మిగిలిన సమయం వినోదంగా గడుపుతాడు.

తను వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు లేవని స్వామివారు అడుగుతారేమో అని లక్ష్మీనారాయణన్ ఆలోచన. కానీ స్వామివారు ఆ విషయాన్ని అడగకుండా, ఉద్యోగం గురించి వివరంగా, ఆదాయం, ఇతర వ్యాపకాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు స్వామివారు. అన్నీ ప్రశనలకు సమాధానం చెబుతూ, తన ప్రస్తుత ప్రవర్తన గురించిన ప్రశనలకు జవాబు చెప్పకుండా మౌనం వహించాడు.
ఎందుకు మేము బీదరికంలో మగ్గుతున్నామని స్వామివారిని అడిగాడు లక్ష్మీనారాయణన్. అది కర్మ వల్ల అని స్వామివారు సమాధానం ఇచ్చారు. వెంటనే “కర్మ అంటే ఏమిటి?” అని స్వామివారితో వాదనకు దిగాడు. “నేను ఇప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు” అన్నారు స్వామివారు.

ఆదిశంకరాచార్యులకి సంబంధించిన ప్రముఖ కథను చెప్పారు స్వామివారు. శంకరులు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుల ఇంటి ముందర నిలబడ్డాడు. వారు విపరీతమైన దారిద్ర్యంలో ఉన్నందువల్ల ఆ గృహిణి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాల శంకరులకి ఇవ్వడానికి ఆ ఇల్లు ఏమీ లేకపోవడంతో ఇల్లంతా శోధించి ఒక ఎండు ఉసిరికని కనిపెట్టి శంకరుల చేతిలో వేసింది. తరువాత బాల శంకరులు “కనకధార స్తోత్రం” చేసి, ఇంతటి దారిద్ర్యంలో కూడా దాచుకున్న ఉసిరికాయను తనకు దానం చేసినందువల్ల ఆమెను అనుగ్రహించమని మహాలాక్ష్మి అమ్మని ప్రార్థించారు. అమ్మవారు బంగారు ఉసిరికల వర్షం కురిపించి, ఆ ఇంటిని ఐశ్వర్యంతో నింపి ఒక్క దెబ్బతో వారి దారిద్ర్యాన్ని తొలగించింది అమ్మవారు.

తరువాత స్వామివారు లక్ష్మీనారాయణన్ తో, “మీ ఇంటిలో అమ్మవారిని స్థాపించాను. నీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకుని, ఆవిడ పాదాలను గట్టిగా పట్టుకో. నిన్ను తల్లిలాగా రక్షిస్తుంది” అని చెప్పారు. దాదాపు గంటన్నర పాటు వారితో మాట్లాడి, వారిరువురికీ తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీర్వదించారు స్వామివారు.

ఇంత జరిగినా లక్ష్మీనారాయణన్ మనస్సులో నమ్మకం కలగలేదు. కానీ అతని భార్యకు, స్వామివారు తన భర్తని కనకధార పారాయణ చెయ్యమని చెప్పినా, కుటుంబ ఆర్థిక పరిస్తితి గురించి మనసులో ఎంతో ఆందోళనగా ఉండడం తను వల్ల నమ్మడం లేదని అర్థం అయ్యింది.

అయితే, తనలో ఏదో జరుగుతోందని గమనించిన లక్ష్మీనారాయణన్, మూడు వారాల తరువాత ఇంటికి వచ్చి, కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా, చొక్కా విప్పి కనకధార స్తోత్రం చదవనారంభించాడు. శుక్రవాలు చదవడం మొదలుపెట్టడంతో వెంటనే దాని ప్రభావం అతనిపై చూపసాగింది. ఎందుకంటే చదవమని చెప్పింది సాక్షాత్ ఆ ఆదిశంకర అవతారమైన పరమాచార్య స్వామివారే కదా!

మరుసటిరోజు అతని పై అధికారి విదేశాలకు వెళ్తూ, డైరెక్టరు గారికి ఇవ్వమని ఒక ఉత్తరం ఇచ్చాడు. లక్ష్మీనారాయణన్ ఆ విషయం మరచిపోయి, మూడు రోజుల తరువాత ఆ ఉత్తరాన్ని డైరెక్టరుకు ఇచ్చాడు.

లక్ష్మీనారాయణన్ అక్కడ నిలుచుని ఉండగానే డైరెక్టరు ఆ ఉత్తరాన్ని చదివాడు. చదవడం మొదలుపెట్టగానే లక్ష్మీనారాయణన్ ని కూర్చోమని చెప్పాడు. ఆ ఉత్తరంలో అతని గురించి గొప్పగా చెబుతూ, అతడి జీతాన్ని ఏడువందల రూపాయలకు పెంచమని ఉంది.

ఆరోజు నుండి మహాస్వామి వారి అనుగ్రహం పొంగిపొర్లసాగింది. లక్ష్మీనారాయణన్ తాకిన ప్రతీది బంగారం అయ్యింది. తయారీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలను ప్రారంభించాడు. ప్రతి వ్యాపారమూ విజయవంతమై కోటీశ్వరుడు అయిపోయాడు. చెన్నై టి. నగర్ లోని మంగయార్ వీధిలోని ఇళ్లన్నీ కొనగలిగిన సంపదను పొందాడు.

ఇదంతా మహాస్వామి వారి అనుగ్రహం, ఆశీస్సులు అని వినయంగా చెబుతాడు లక్ష్మీనారాయణన్. పరమాచార్య స్వామివారు సాక్షాత్ శివావతారులు, ఆది శంకర అవతారులు. చివరికి వారు ‘కనకధార’ లక్ష్మీనారాయణన్ గా ప్రసిద్ధి పొందారు.

శ్రీ ‘కనకధార’ లక్ష్మీనారాయణన్ గారి తమిళ ఇంటర్యూ నుండి

www.youtube.com/watch?v=IRjHJriT_3M&feature=youtu.be

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

05 Nov, 00:41


పరమాచార్య కురిపించిన కనకధార

పరమాచార్య స్వామివారే సాక్షాత్ ఆది శంకరుల మరొక అవతారమని, స్వామివారికి గొప్ప భక్తుడైన శ్రీ లక్ష్మీనారాయణన్ తన జీవితానుభవం ద్వారా తెలుసుకున్నారు.

చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణన్ గారి తాతగారు మరియు తండ్రిగారు చాలా పెద్ద స్థితిలో ఉండేవారు. ఆ కాలంలో వారి తాతగారు తంజావూరు దగ్గర్లోని తెప్పకుళం అన్న గ్రామం మొత్తం ఆయనదే. కానీ వీధి వైపరీత్యాల వల్ల మొత్తం కోల్పోయి, ఆ కుటుంబం కడు పేదరికంలోకి వెళ్లిపోయింది. కుటుంబ పరిస్థితి వల్ల లక్ష్మీనారాయణన్ రోజూ మాన్సిక వేదనను అనుభవిస్తున్నాడు.

తండ్రి దురదృష్టవశాత్తు ఇటువంటి స్థితిలో ఉండి, కోర్టు కేసులో చిక్కుకోవడం వల్ల, ఎనిమిదేళ్ళ లక్ష్మీనారాయణన్ తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉండేవాడు. తాతగారి ఊరైన మరయూర్ లో అప్పుడు పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. తను ప్రతిరోజూ స్వామివారి దర్శనం చేసుకునేవాడు. లక్ష్మీనారాయణన్ ఎంతో అప్యాయతతో స్వామివారితో మాట్లాడేవాడు. స్వామివారు కూడా ఎంతో ప్రేమతో అతడిని “మండు” అని పిలిచేవారు.

లక్ష్మీనారాయణన్ క్రోంపేటలోని యం.ఐ.టి కళాశాలలో ల్యాబ్ ఇంజనీయరుగా పనిచేస్తూ నెలకు కేవలం రూ. 180 సంపాదిస్తున్నాడు. తల్లితండ్రులు, పిల్లలు ఇతర బంధువులతో కలిపి పదిహేడు మంది ఉన్న కుటుంబాన్ని పోషించడానికి ఇది సరిపోదు. తండ్రి గారు అప్పుడు మంచి ఉన్నతమైన ఉద్యోగం కూడా చేయడం లేదు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రీమఠంలో పరమాచార్య స్వామివారికి అంకితభావంతో పనిచేసే సహాయకుడిగా పనిచేశారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న శివపూజను మాత్రం ఆయన వదలలేదు. లక్ష్మీనారాయణన్ తన సంపాదనతో కేవలం గంజితో కుటుంబసభ్యుల సగం కడుపు మాత్రమే నింపగలుగుతున్నాడు. ఎన్నోమార్లు కేవలం నీరు తాగి వారి ఆకలిని తీర్చుకుంటున్నారు. లక్ష్మీనారాయణన్ ఉద్యోగంతో పాటుగా సాయంత్రాలు మరొక్క చోట పనిచేస్తున్నా, ఇల్లు గడవడానికి సరిపోవడం లేదు. దాంతో తనకి దైవంపై నమ్మకం పోయి, జీవితంపై వ్యతిరేక భావనలు ఏర్పరుచుకున్నాడు.

రుద్ర నమక చమకాలు పఠిస్తూ తన తండ్రి చేసే శివపూజను చూసి, కోపంతో తన తండ్రితో, “మన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి కూడా చేలించని భగవంతుడిని ఎందుకు పూజ చేస్తున్నారు?” అని అడిగేవాడు.

మహాస్వామి వారు 1955లో పశ్చిమ మాంబళంలోని రామేశ్వరం వీధిలో మకాం చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణన్ జీవితం మలుపు తిరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి తనకు సమయం లేకపోవడంతోపాటు, “పెరియవా మన కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవడంలేదు?” అని తన తండ్రితో వాదించేవాడు.

లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళి తమ కుటుంబ పరిస్తితి, కుమారుని ప్రవర్తన గురించి స్వామివారికి తెలిపారు. మరుసటిరోజు శుక్రవారం, తమ ఇంటికి వస్తానని మాటిచ్చారు స్వామివారు.

వారి తండ్రిగారి ఆనందం చెప్పలనది కాదు. కుమారుడు ఇంటికి వచ్చేదాకా వేచియుండి, శుక్రవారం రోజున మహాస్వామి వారు తమ ఇంటికి వస్తున్నారని, కనుక కళాశాల నుండి నేరుగా ఇంటికే రావాలని తెలిపారు.

“మన ఇంటికి ఎందుకు రావడం?” అని నిర్లక్ష్యంగా అడిగాడు లక్ష్మీనారాయణన్. కళాశాల నుండి నేరుగా ఇంటికి రాకుండా పనికి వెళ్లిపోయాడు. మాటిచ్చినట్టుగానే మరుసటిరోజు మహాస్వామి వారు ఇంటికి వచ్చి, పూజగదిలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించి ఆ కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించారు. ఆరోజు ఆ కుటుంబం మొత్తం అంతులేని ఆనందాన్ని పొందింది.

కానీ లక్ష్మీనారాయణన్ తండ్రి మాత్రం కుమారుడు రాకపోవడం గురించి చాలా కోపంగా ఉన్నారు. కుమారుని రాక కోసం వేచియున్నారు. ఎప్పటిలాగే రాత్రి పదకొండు గంటలకు పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం ముగించగానే, “నేను ఎప్పుడు నిన్ను ఏమి అడగలేదు. కేవలం ఒక్కపూత భోజనం, ఒక్క జత పంచలతో బ్రతుకుతున్నాను. ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండాలని మాత్రమే కోరాను. నా విన్నపాన్ని నువ్వు తిరస్కరించావు. నువ్వు ఒక పాపివి, మహాపాపివి” అని కన్నీళ్లపర్యంతమయ్యారు. తండ్రి నోట అంతటి మాటలు విన్న లక్ష్మీనారాయణన్ కళ్ల నీరు పెట్టుకున్నాడు.
మరుసటిరోజు లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామి వారితో తన బాధను చెప్పుకోగా, తన కుమారుడిని ఆదివారం తీసుకునిరమ్మని చెప్పారు స్వామివారు. ఆదివారం సెలవుదీనం కావడంతో లక్ష్మీనారాయణన్ ఈసారి తప్పించుకోలేకపోయాడు. పూజ అయిపోయిన తరువాత స్వామివారు అందరికీ తీర్థ ప్రసాదం ఇస్తున్నారు. లక్ష్మీనారాయణన్ తండ్రితో బాటు వరుసలో నిలబడున్నాడు. వారి వంతు రాగానే స్వామివారు తీర్థం ఇవ్వకుండా పక్కన నిలబడమని చేతితో సైగ చేశారు. ఇతర భక్తులకి తీర్థం ఇస్తూ, వారితో సంభాషణ మొదలుపెట్టారు స్వామివారు.

“నేను గుర్తున్నానా, మండు?” అని మహాస్వామి వారు లక్ష్మీనారాయణన్ తో సంభాషణ మొదలుపెట్టారు. తనకు ఎనిమిదేళ్ళప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

“సరే. నీ తండ్రి నీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు?”

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Nov, 15:27


ఈ పది రోజులపాటు జరగబోయే కార్యక్రమాల వివరాలు

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Nov, 06:14


ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమృత వాక్కులతో అమ్మవారిని అర్చించడానికి విచ్చేసిన ప్రముఖ దేవీ ఉపాసకులు శ్రీమతి నిట్టల కిరణ్మయి అమ్మగారు

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Nov, 06:04


ఈ అద్భుత కార్యక్రమంలో భాగంగా 13వ తేదీన ముమక్షు భవన్ లో సహస్రలింగేశ్వర మహాదేవుని ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చెయ్యడమైనది

ఆ సహస్ర లింగం క్రింది భాగంలో నిక్షిప్తం చెయ్యడానికి సిద్ధం చేసిన 108 స్వర్ణ శివలింగాలు, 108 స్వర్ణ పుష్పాలు

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Nov, 04:53


https://youtube.com/live/Fi2yppIFW-w?feature=share

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Nov, 03:21


https://youtu.be/clp1uy6ORl4?si=4cHYBlAoS6dVCX0e

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Nov, 03:12


జయ జయ శంకర !! హర హర శంకర !!

అవిముక్త వారణాసి క్షేత్రంలో పరమ పవిత్రమైన కార్తీక దామోదర మాసంలో అస్సీ ఘాట్ దగ్గర్లోని ముమక్షు భవన్ లో లోకకళ్యాణార్థం శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి ఆధ్వర్యంలో 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగబోయే కోటి పార్థివ లింగార్చన కార్యక్రమంలో మన ట్రస్ట్ సభ్యుల ఆయురారోగ్యఐశ్వర్య సిద్ధి కొరకు దేశ ధర్మ రక్షణ సంకల్పంతో జరగబోయే ఈ కార్యక్రమంలో మన ట్రస్ట్ కూడా పాలుపంచుకునే అవకాశం లభించింది

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

04 Nov, 00:32


కాలిన పాదాలు - కరక్కాయ లేపనం

పరమాచార్య స్వామివద్దకు మౌళి మామ పరిగెత్తుకుంటూ వచ్చారు. మామ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎలా భరించడం? అసలు ఎలా భరించడం?

దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ఇప్పుడు తలచుకున్నా మామ కళ్ళల్లో కన్నీటి ధార. అసలు ఎందుకు అలా జరిగింది? అలా జరుగుతుందని ఎలా అనుకోగలం?

అందుకోసం, 1900 దశాబ్దం మొదట్లో తిండివనంలో జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ స్వామినాథన్ అనే చిన్న పిల్లవాని జాతకం పరిశీలించి, ప్రపంచాన్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకు వచ్చిన అవతారం అని అర్థం చేసుకున్నారు. ఆ పిల్లవాని పాదములను తాకి, నీళ్ళతో కడిగి, శుభ్రంగా తుడిచి, బాగా పరిశీలించి “అతి త్వరలోనే రాజులు, రారాజులు కూడా ఈ పాదాలను తాకలేరు” అని చెప్పారు. ఆ పిల్లవాని పాదాలలో ఎన్నో చక్రాల గుర్తులను చూశారు. ఈ బాలుడు జగద్గురువు అవుతాడు అని చెప్పారు.

పరమాచార్య స్వామీ వారు ఉదయార్ పాల్యంలో మకాం చేస్తున్న సమయం. మహాస్వామి అప్పుడు వారు బాల సన్యాసి. వారు అనుష్టానం చేసుకుంటూ ఉండగా ఉదయార్ పాల్యం రాజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మంచి పండితుడు. స్వామివారు చేస్తున్నది నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆశ్చర్యంతో “మీరు సాక్షాత్ దైవ స్వరూపులు. మీ పాదాలలో చక్రాలు ఉన్నాయి” అన్నారు.

అప్పటినుండి పరమాచార్య స్వామివారి పల్లకిని మోసే బోయీలు ఉదయార్ పాల్యం జమిందారి వాళ్ళే. వారిని పోషిస్తున్నది ఆ జమిందారిలే. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ గారు చెప్పినట్లు ఆ రాజు గారు కూడా పాదాలలోని చక్రాలను దర్శించుకొన్నారు కాని తాకలేకపోయారు.

అది 1978 ఏప్రియల్ 14 లేదా 15. పరమాచార్య స్వామివారు తేనంబాక్కం నుండి యాత్ర మొదలుపెట్టారు. కాని ఆ యాత్ర ఎక్కడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవ్వరికి తెలియదు. అది యాత్ర అని కూడా ఎవరికీ తెలియదు. ఎనభై ఏళ్ల ప్రాయంలో కేవలం శ్రీ చంద్రమౌళి మామ (కుళ్ళ), శ్రీ వేదపురి మామ, శ్రీ శ్రీకంఠన్ మామ ముగ్గురు సేవకులతో నడుతున్న యాత్ర అది.

తెల్లవారుఝామున 3:45 అప్పుడు చిత్తూరు శివార్లలో గల థియోసాఫికల్ సొసైటి ప్రాంగణంలోకి వచ్చారు. మహాస్వామీ వారు పూజకోసం ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్నారు.

సేవకుల భిక్షకై మౌళి మామ శ్రీకంఠన్ మామ మూడు కిమీ దూరంలో గల ఆగ్రహారానికి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత అంటే సుమారు పదకొండు గంటల సమయంలో వారి తిరిగి రాగా అసలు ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి కూడా కుదరలేదు. చాలా మంది గుమిగూడి ఉన్నారు. అందరూ పరమాచార్య స్వామివారి చుట్టూ చేరి వారి పాదాలు తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎవరో ఎవరికీ తెలిసినట్టు లేదు. కాని వారికి పట్టదు కదా!

అక్కడే ఉన్న ఇద్దరు సేవకులకి వారిని నిలువరించడం చాలా కష్టంగా ఉంది. పరమాచార్య స్వామివారు కనీసం పాదుకలు కూడా వేసుకోకుండా, అంతటి ఎండలో ఆ ప్రాంగణాన్ని వదిలి హైవే మీదకు పయనమయ్యారు. అంతే! ఇద్దరు సేవకులు మహాస్వామి వారితో బయలుదేరిపోయారు. చివరి క్షణంలో అక్కడకు వచ్చిన మౌళి మామ, శ్రీకంఠన్ మామ భిక్షగా తెచ్చినదంతా అక్కడ వేసి, రిక్షా తీసుకుని మొత్తం సామాను అంతా పెట్టుకుని స్వామి దగ్గరకు పరిగెత్తారు.

అది చైత్రమాసం అందులా చిత్తూరు జిల్లా కావడంతో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతటి ఎండలో మిట్టమధ్యాహ్నం పాదుకలు కూడా లేకుండా నడుస్తున్నారు స్వామివారు. న్యాయవాది జ్యోతిష్కులు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ ఏ పాదాలనైతే ఎవ్వరూ తాకలేరు అన్నారో, రాజులు - రాణులు కూడా కేవలం దర్శనం మాత్రమే చేసుకోగలరో, యోగులు సిద్ధులు కూడా తాకే అర్హత లేకపోవడంతో కేవలం ధ్యానం మాత్రమే చేయగల ఆ పాదాలు ఆ తారు రోడ్డుపై నడవడంతో కాలిపోయి బొబ్బలు లేచాయి.

మకాం చిత్తూరు చేరుకుంది. మహాస్వామివారు ఒక కర్మాగారంలోకి నడిచారు. అక్కడ కొద్దిరోజులు బస చేశారు. రాత్రికి స్వామివారు “వేదపురి, కుళ్ళా మౌళిని పిలువు” అన్నారు. మౌళి మామ కరక్కాయని చక్కగా చూర్ణం చేసి లేపనంగా తయారుచేశాడు. పరుగు పరుగున వచ్చి ఎవరికి దొరకని ఆ పాదాల దగ్గర కూర్చున్నాడు. పరమాచార్య స్వామివారు కాళ్ళను బాగా చాపి “ఆ కరక్కాయ ముద్దని కాళ్ళకు రాయి” అని ఆదేశించారు. ఈ విషయం చెబుతూ ఇప్పుడు కూడా మామ మాటలు రాక గొంతు పూడుకుపోయి కళ్ళ నీరు పెట్టుకుంటాడు.

ఏమి ఈ సేవకుల భాగ్యం. ఒక్క పుష్పం స్వామివారికి సమర్పించి చాంతాడంత కోరికలు కోరుకుంటాము. కాని వీళ్ళు కేవలం స్వామివారి సేవ చేసుకోవడమే మహాద్భాగ్యంగా తలుస్తున్నారు.

ఆ పరమాచార్య సేవకులకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు.

ఆ పరమాచార్య సేవకులకు అంగప్రదక్షిణ నమస్కారాలు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

03 Nov, 16:16


కాశీలోని మానససరోవర్ ఘాట్ లో మన ట్రస్ట్ భాగస్వామ్యంతో జరుగుతున్న నిత్య నారాయణ సేవ ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

03 Nov, 00:36


కుంబాభిషేకం - ఒక జ్ఞాపకం

పరమాచార్యస్వామి వారి జ్ఞాపకశక్తి అమోఘం. ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని సరైన సమయంలో వాటిని తెలియజేస్తుంటారు. అటువంటి ఒక సంఘటన మీకోసం.

మహాస్వామి వారు ప్రకృతి ప్రేమికులు. యాత్రా సమయాలలో వారు ఎప్పుడూ పాకలలోనూ, చత్రాలలోనూ, చెట్లకింద, బయలు ప్రదేశాలలో ఎక్కువగా నివసించేవారు. ఒకసారి వారు మన ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. రోడ్డుపక్కన ఒక పాకలో ఉన్నారు.

ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికై కార్లో వచ్చాడు. ఆ వచ్చిన అతను మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, “నా పేరు కళ్యాణం పెరియవ. నేను తంజావూరు జిల్లా నుండి వచ్చాను. మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎవ్వరికీ మనఃశాంతి లేదు. నన్ను మహాస్వామి వారే కాపాడగలరని మీ దర్శనానికి వచ్చాను” అని అన్నాడు.

మహాస్వామి వారు అతన్ని కూర్చోమని చెప్పి, అతని గురించి వాకబు చేసి వారి సమస్యలన్నీ విన్నారు. వారి రెండు చేతులను పైకెత్తి అశీర్వదించి ఒక ఫలము ఇచ్చి పంపారు. ఒక రెండు సంవత్సరములు గడిచిపోయాయి.

కళ్యాణం జీవితంలో వసంతం వచ్చింది. అతని బాధలన్నీ తొలగి సంతోషం వచ్చింది. అతను మహాస్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాడు. అప్పుడు కూడా మహాస్వామి వారి యాత్రలోనే ఉన్నారు. అతను మహాస్వామి వారి దర్శనం చేసుకుని తన కష్టాలు తొలగిపోయినందుకు, మహాస్వామి వారికి నమస్కరించి నిలుచున్నాడు.

“పరమాచార్య స్వామి వారి అవ్యాజ కరుణాకటాక్షాల వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. కావున నా మనః సంతోషము కోసం శ్రీమఠానికి ఏమైనా సమర్పించాలని అనుకుంటున్నాను” అని అన్నాడు.

పరమాచార్య స్వామి వారు నవ్వి, ”నువ్వు ఇప్పుడేమి సమర్పించక్కర లేదు” అని అన్నారు. కళ్యాణం అన్యమనస్కంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చిదంబరంలోని థిల్లై నటరాజ స్వామి వారి ఆలయ కుంబాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం నన్ను స్వామి వారు పిలిచారని శ్రీమఠం నుండి కబురు వచ్చింది. శ్రీమఠం శ్రీకార్యం తిరు టి.ఎన్.కృష్ణమూర్తి, నేను వెళ్ళి మహాస్వామి వారి వద్ద నిలబడ్డాము.

మహాస్వామి వారు మేనాలో కూర్చుని కుంబాభిషేకానికి జరగవలసిన తిరుమురై సంగీతం, తిరుమురై సదస్సు, తిరువాచక పారాయణం, దీక్షితర్ల (చిదంబరం ఆలయ వంశపారంపర్య అర్చకులు) పిల్లల చేత శంభునాథ స్తోత్ర పారాయణ వంటి ఏర్పాట్ల గురించి ఆదేశాలు ఇస్తున్నారు.

అంతలో ఒకరు మహాస్వామి దర్శనానికి వచ్చారు. మహాస్వామి వారు అతన్ని మాతోపాటు కూర్చోమన్నారు. ఆ వచ్చిన అతను కళ్యాణం.

“నువ్వు నన్ను ఫలానా రోజు ఫలానా చోట కలిసావు? గుర్తు ఉన్నాదా?” అని మహాస్వామి వారు అతన్ని అడిగారు.

అతను ఆశ్చర్యపోయాడు. అతను రెండవ సారి దర్శనం చేసుకున్న విషయం చెప్పగా అతను కొద్దిగా గుర్తు తెచ్చుకుని, అవునన్నట్టు తల పంకించాడు.

”ఇప్పుడు బావున్నావు కదా? నువ్వు మఠానికి డబ్బు ఇవ్వాలనుకున్నావు కదా ఇప్పుడు ఇవ్వగలవా?” అని అడిగారు.

”ఇప్పుడే సంతోషంగా ఇవ్వగలను పెరియవ” అని అన్నాడు.

”ఆ డబ్బు శ్రీమఠం కోసం కాదు. చిదంబరం థిల్లై నటరాజ స్వామి వారి కుంబాభిషేక సమయం. అక్కడ జరగవలసిన పనుల గురించి నేను వీళ్లకు చెప్పాను. ఆ పనుల కోసం నువ్వు ఇచ్చిన డబ్బు ఉపయోగిస్తాము. ఆ ధనం నటరాజ స్వామికి చేరనీ!! నీవు వారితో చర్చించి రా” అని అన్నారు.

మేము ముగ్గురమూ బయటకు వచ్చి అన్ని విషయాలు చర్చించి లోపలికి వెళ్ళాము. పరమాచార్య స్వామి వారు కూడా సంతోషించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు.

ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన చిన్న సంఘటనను గుర్తుపెట్టుకుని సరైన సమయంలో గుర్తుతెచ్చుకుని, ఆనాడు అతను కోరిన కోర్కెను నెరవేర్చి నటరాజ స్వామి వారి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసారు. ఇంతటి అదృష్టాన్ని పొందిన మన జన్మ ధన్యమైనది.

--- పి.యమ్. జయసెంథిల్ నాథన్, కాంచీపురం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

#KanchiParamacharyaVaibhavam #Paramacharya

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

02 Nov, 16:05


https://maps.app.goo.gl/RN7iHowNtCGReWRt7

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

02 Nov, 00:48


ఫోటోలు మాయం

రామన్ ఒక ఫోటోగ్రాఫర్. పరమాచార్య స్వామివారి చిత్రాలను తీసుకోవడానికి తన శక్తివంతమైన కెమరాతో కాంచీపురానికి వచ్చాడు.

మహాస్వామి వారు ధ్యానంలో ఉన్నప్పుడూ ఫోటో తీస్తే, అందులోనుండి వచ్చే వెలుగు వల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతుందని కాచుకుని ఉన్నాడు.

మహాస్వామి వారు ధ్యానం నుండి లేవగానే, ఫోటో తియ్యడానికి రామన్ కెమారాను తెరిచి సిద్ధంగా ఉంచుకున్నాడు. మహాస్వామివారు చెయ్యెత్తి పైకిలేచారు, అది ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించి రామన్ కొన్ని చిత్రాలు తీశాడు.

ఈ శక్తివంతమైన కెమరా ఉపయోగించి తీసిన చిత్రాలన్నీ చాలా అద్భుతంగా రావడంతో ఈసారి కూడా చాలా అద్భుతంగా వస్తాయి అని ఆనందపడ్డాడు.

ఒక సేవకుడు పరుగుపరుగున వచ్చి, “మహాస్వామివారు నీకు వద్దు అని సైగచేసినా ఎందుకు నీవు స్వామివారి చిత్రాలను తీశావు” అని రామన్ ను అడిగాడు.

రామన్ కంగారుపడిపోయాడు. “మహాస్వామి వారే అనుగ్రహించారుగా?”
“వద్దు అన్న సంజ్ఞ నీకు సరే అని అనుమతిచ్చినట్టుగా అనిపించిందా. సరే నీవు టేసిన స్వామివారి చిత్రాలు నీ కెమరాలో నిక్షిప్తం అయ్యుండవు”.

ఈ మాటతో రామన్ కు కోపం వచ్చింది. ‘ఈ కెమరా విశిష్టత గురించి నీకు ఏం తెలుసు? నేను తీసిన చిత్రాలు ఎందుకు ఇందులో ఉండవు చూస్తాను?’ అన్న ఆలోచనతో తన స్టూడియోకు వెళ్ళి వెంటనే చిత్రాలను తయారుచేయడం మొదలుపెట్టాడు. మహస్వామి వారివి తీసిన ఒక్క చిత్రం కూడా అందులో లేదు.

పరమాచార్య స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుడు అని అర్థం చేసుకున్నాడు రామన్. తరువాత ఒకసారి సావకాశంగా కాంచీపురం వచ్చి, భయ భక్తులతో మహాస్వామి వారిని ప్రార్థించి, స్వామివారి అనుమతి తీసుకుని చిత్రాలను తీసి, తన కోరికను తీర్చుకున్నాడు.

--- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ ఆగస్ట్ 15, 2004 ప్రచురణ

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

01 Nov, 01:20


నాంది శ్రాద్ధ భోజనం

ఒకసారి పరమాచార్య స్వామివారు చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరలోని చిన్న తిప్ప సముద్రం అనే ఊళ్ళో మకాం చేస్తున్నారు. అక్కడి ప్రజలు దాన్ని ఊరిపేరుతో కాకుండా సి.టి.యస్ అని పిలిచేవారు. దగ్గరలోనే శంకర జయంతి కూడా ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మహాస్వామి వారి పరమభక్తులైన శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, నేను చెన్నై నుండి బస్సులో సి.టి.యస్ కు బయలుదేరాము.

శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు ఆయన సహోదరుడు ఇద్దరూ సంస్కృత పండితులు. వారు ఆంధ్రదేశానికి చెందినవారు. వారి విద్వత్తు మహాస్వామి వారికి బాగా తెలుసు. ఆయన తరుచుగా మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవారు.

మేము అక్కడకు వెళ్ళిన రెండు రోజులకు శంకర జయంతి రాబోతోంది. అప్పుడు అక్కడ మహాస్వామి వారి కైంకర్యం చెయ్యడానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రతిరోజూ దర్శనానికి దాదాపు నలభై మంది దాకా వచ్చేవారు.

ఆ ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనది చాలా పెద్ద కుటుంబం. శ్రీవారికి పరమ భక్తుడు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అతని ఇంటనే బస చేసి, భోజనాదులు చెయ్యడానికి ఏర్పాటు చేశాడు. శంకర జయంతిని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారిని వాక్యార్థం గురించిన ప్రవచనం చెప్పవలసిందిగా ఆదేశించారు స్వామివారు.

భగవత్పాదులకు శంకర అను నామము కటపయాది సంఖ్యాన్ని అనుసరించి పెట్టారని పరమాచార్య స్వామివారే స్వయంగా చెప్పారు. విరై దానంగా వడ్ల ధాన్యాన్ని పంచిపెట్టారు. తరువాత అందరమూ ఆ ధనికుని ఇంటికి వెళ్లి భోజనాదులు ముగించాము.

మరుసటిరోజు ఆ ధనికుని ఇంట్లో ఆయన మనవడి ఉపనయన కార్యక్రమం ఉంది. ఉపనయనం రోజు ఉదయం మహాస్వామివారు వ్యక్తిగత సహాయకులైన రామకృష్ణన్, శ్రీకంఠన్ లను పిలిచి, “వాళ్ళ ఇంటిలో ఈరోజు ఉపనయనం. ఇక్కడకు దర్శనానికి వచ్చిన భక్తులను ఉపనయనం అయిన ఇంటిలో భోజనం చెయ్యకండి అని చెప్పండి. మీరు ఇద్దరూ వండి, అందరికి ఆహారం పెట్టండి” అని ఆజ్ఞాపించారు. ఈ విషయాన్ని ఆ ధనికునికి కూడా తెలపమని ఆదేశించారు.

విషయం విన్న ఆ ధనికుడు హతాశుడయ్యాడు. “మావల్ల ఏ తప్పిదము జరిగింది?” అని అతని వేదన. శంకర భక్తులను ఆకలి తీర్చే పుణ్యాన్ని కోల్పోయాము అని అతని బాధ.

బాధతో దాదాపుగా ఏడ్చే పరిస్థితిలో ఉన్నాడు. అతని బాధని పరమాచార్య స్వామివారికి తెలిపారు. అందుకు స్వామివారు, “ఉపనయనం జరిగే ఇంటిలో నాంది శ్రాద్ధం చేస్తారు. నాంది జరిగిన ఇంటిలో ఇతరులు భోజనం చెయ్యరాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భోజన ఏర్పాట్లు ఇక్కడ చెయ్యమని మీకు చెప్పాను” అని విశదపరచారు స్వామివారు.

ఈ శాస్త్ర సంబంధిత విషయాన్ని అందరికి స్వామివారు ఇలా తెలియజేశారు. శాస్త్ర సంబంధ విషయాల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ఎంతోమందికి ఈ విషయం తెలియదని మనకు స్పష్టమవుతుంది.

“తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ”

--- చంద్రమౌళి మామ, కాంచీపురం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

31 Oct, 00:29


నరక చతుర్దశి - దీపావళి

దీపావళి నరక చతుర్దశి రెండు సమానమే. ఇది భారతదేశం అంతటా జరుపుకునే జాతీయ పండగ. ఉత్తర భారత దేశంలో దీనిని ఎక్కువగా దీపాల పండుగ లాగా ఇళ్ళను దీపాల వెలుగులో నింపి చేసుకుంటారు. దక్షిణాపథంలో వేకువనే నువ్వుల నూనెతో తలంటు పోసుకుని కొత్త బట్టలను కట్టుకుంటారు. దీనివల్ల శ్రేయస్సు కలిగి జీవితంలో పడుతున్న కడగండ్ల నుండి విముక్తి కలుగుతుంది.

అమావాస్యకు ముందురోజైన చతుర్దశి నాడు సూర్యుడు తులా రాశిలో ఉండగా శ్రీమహాలక్ష్మి సాన్నిధ్యం వల్ల నువ్వుల నూనె పవిత్రమవుతుంది. నీటిలో గంగా సాన్నిధ్యం వల్ల మొత్తం నీరంతా గంగాజలంతో సమానం అవుతుంది. పసివాడి నుండి సన్యాసి వరకు, ధనికుడి నుండి బిదవాని వరకు ప్రతి ఒక్కరూ తైలాభ్యంగన స్నానము చెయ్యాలి. పరమ సంతోషంతో భగవంతుణ్ణి ఆరాధించి ప్రతి చోట పార్టి మూలలోనూ దీపములను వెలిగించాలి ఈ దీపావళి (దీపముల యొక్క వరుస) నాడు.

భూదేవి తన కుమారుడైన నరకాసుర సహారం జరిగినప్పుడు శ్రీకృష్ణున్ని అడిగిన వరం ఇదే. “నా కుమారుని మరణం వల్ల నాకు కలిగిన ఈ దుఃఖం, ఈనాడు ప్రపంచంలోని అందరి సుఖ సంతోషాల వల్ల తిరిపోవాలి” అని కోరింది ఆ వీరమాత. అన్ని పండుగలు ఉత్సవాలకెల్ల దీపావళి చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే, వ్యక్తిగతంగా రెండు హృదయాలకు (భూదేవి, నరకాసురుడు) కలిగిన బాధ వల్ల ప్రపంచానికి కలిగిన హర్షాతిరేకమే ఈ దీపావళి. చేసిన తప్పులకు ప్రాణాలు వదిలిన ఆ రాక్షసుడు, కన్న కొడుకును కోల్పోయి పుత్రశోకంతో ఉన్న ఆ తల్లి ఇద్దరి కోరిక ఎంతో ఉన్నతమైనది.

[భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎన్నో మార్గములు. అందులో వైరభక్తి కూడా ఒక్కటి. శ్రీ కృష్ణావతారంలో కంస, శిశుపాల, పౌండ్రక, నరకాసుర ఇలా ఎందరినో పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్నారు. ఎలా వెళ్ళినా ఆయన పాదలచెంతకే, కాని వైరభక్తి వల్ల బ్రతికినంతకాలం ప్రశాంతత లేక భయంకరమైన మరణ వేదనను అనుభవించి చనిపోతారు. దుర్మార్గులు రాక్షసులుగా మిగిలిపోతారు. వారు నడిచిన మార్గం అధర్మంతో కూడుకున్నది కాబట్టి అడి ఆచరణ యోగ్యము కాదు]

--- kamakoti.org నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

30 Oct, 00:25


ఆశ - ఆశీస్సులు

ఘటం మ్యాస్ట్రో విక్కు వినాయకరం చిన్న తమ్ముడు, ఘటం విద్వాన్ సుభాష్ చంద్రన్ మరియు అతని భార్యకు దీపావళి రోజున పరమాచార్య స్వామీ వారికి ఏదైనా సమర్పించాలని కోరిక. సాంప్రదాయ పీఠాధిపతులు పరమ నిష్టతో మడితో చెయ్యని వంటకాలను తీసుకోరు.

కాని వారు పాల కోవాను మహాస్వామి వారికి సమర్పించాలని నిశ్చయించుకున్నారు. పాలకోవాను తయారుచేసి, ఒక స్టీలు డబ్బాలో వేసుకుని కాంచిపురానికి బయలుదేరారు. తిన్నగా ప్రదోషం వేంకటరామ అయ్యర్ మామ ఇంటికి వెళ్ళారు.

మామ వారు వచ్చిన విషయం వినగానే చంద్రన్ తో ఇలా అన్నారు. “కేవలం నీ భక్తి ప్రపత్తులకినా పరమాచార్య స్వామివారు ఈ పాలకోవాను స్వీకరిస్తారు వారు స్వికరించకపోయినా ఈ పదార్థం వారిని చేరుకుంటుంది”

ఈ మాటలకు చాలా సంతోషించి, సుభాష్ చంద్రన్ భార్యతో కూడి శ్రీమఠానికి చేరుకున్నారు. తమ ఎదురుగానే ఈ పాలకోవాను మహాస్వామివారు స్వికరించాలని మనస్సులో అనుకున్నారు. మఠానికి చేరుకోగానే మహాస్వామివారు ఏదో పుస్తకం చదువుతూ ఉన్నారు. వారు అక్కడ ఉన్న కైంకర్యం వ్యక్తిని తాము వచ్చిన విషయం తెలుపగా అతను మహాస్వామివారు అటువంటివాటిని అంగీకరించరని, ఈరోజు దీపావళి కావడంతో శ్రీమఠములో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి స్వామివారిని ప్రత్యేకంగా కలవడం కుదరదని చెప్పి తను వెళ్ళిపోయాడు.

చంద్రన్ కొద్దిగా ఆలోచన చేసి కొద్దిసేపు అక్కడే స్వామివారికి దగ్గరగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు. కాని ఆ కైంకర్యం అతను మరలా అటువైపుగా వచ్చినప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నారా అంటూ అరుస్తాడేమో అని కాస్త కంగారు పడుతున్నాడు. అరగంట గడిచింది, స్వామివారు ఇంకా పుస్తకం చదువుతూనే ఉన్నారు. అతను భయపడినంతా జరిగింది. ఆ కైంకర్యం వ్యక్తీ అటుగా వచ్చాడు.

ఆశ్చర్యకరంగా అదేసమయానికి అతణ్ణి మహాస్వామివారు రమ్మనడంతో చంద్రన్ ఊపిరి పీల్చుకున్నాడు. స్వామివారు పాలకోవా డబ్బాను చంద్రన్ నుండి తీసుకుని రావాల్సిందిగా అతణ్ణి ఆదేశించారు. దాన్ని స్వామివారి ముందు ఉంచారు.

ఆ కారుణ్యమూర్తి డబ్బాలో చెయ్యిపెట్టి వేలితో చిన్న కోవా ముక్క తీసుకుని నోటిలో వేసుకున్నారు. చెయ్యెత్తి దంపతులిద్దరిని ఆశీర్వదించారు. అన్నీ మనం స్వామివారి పాదాలకు సమర్పించి ఆయన ఆశీస్సులు పొందుదాం.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

29 Oct, 00:31


మైలాపూర్ కర్పగాంబళ్

శ్రీమతి త్రిపురసుందరి, ప్రక్యాత తమిళ కవి, పండితుడు శ్రీ కి.వ. జగన్నాథన్ గారి కోడలు, పరమాచార్య స్వామివారి భక్తురాలు.

మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఒకసారి స్వామివారు చెన్నైలో తాను ఎక్కడ నివసిస్తున్నది అని ఆ ప్రదేశం గురించి అడిగారు.

“నేను మైలాపూర్ లో నివసిస్తున్నాను పెరియావ” అని బదులిచ్చారు ఆమె.
“దేవాలయానికి వెళ్తుంటావా?” అని అడిగారు స్వామివారు.

“అవును. నేను ఎప్పుడూ కర్పగాంబళ్ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాను”

“ఆమెని ఏమని వేడుకున్తావు?”

“అందరి సంక్షేమాన్ని కోరుకుంటాను” అని చెప్పింది.

అప్పుడు స్వామివారు ఇలా అన్నారు. “నీకు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను”

“వెనుకటి జన్మలో నీవు చేసుకున్న పుణ్యఫలం వల్ల నీవు మైలాపూర్లో నివసిస్తున్నావు. ఆమె కర్పగాంబళ్ అమ్మవారు. ఆమె కల్పతరువు. ఆమె భిక్ష ఇస్తుంది. మనకు ఎన్నో జన్మలు ఉండవచ్చు. ప్రతి జన్మలోనూ నేను మైలాపూర్ లోనే జన్మించాలని, నీ పాద పద్మముల దర్శనం చేసుకునే భాగ్యం కలగాలని ఆమెను ప్రార్థించు”

“ఆమె సన్నిధానంలో ఏ యాచకుడు లేదా చివరికి ఒక కుక్క కూడా ఆకలితో ఉండరు” అని చెప్పారు స్వామివారు.

--- శ్రీమతి త్రిపురసుందరి

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

28 Oct, 00:26


మకిలి అంటిన డబ్బు

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగి ఒకరు కాంచీపురంలో నివసించేవారు. ఎక్సైజ్ కార్యాలయంలో ట్యాక్స్ కలెక్టరు అధికారిగా పనిచేసేవారు. అతను ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని అనుకునేవాడు కాదు. కాని అతని పై అధికారులు ప్రతి నెలా ఇంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలనే నిబంధన ఉంచారు. అలా అతను సంపాదించిన ధనాన్ని స్వంతం కోసం, ఇంటి అవసరాల కోసం ఎన్నడూ వాడుకోలేదు. దాన్ని అతడు ఆవుల మేతకు, దేవాలయాల్లో దీపారాధనకు వంటికి వాడేవాడు.

ప్రతిరోజూ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చేవాడు. ఒకరోజు బంగారు మారేడు దళాలతో చేసిన ఒక హారాన్ని తీసుకునివచ్చాడు.

పరమాచార్య స్వామివారు మృదువుగా దాన్ని తిరస్కరించారు. “దీన్ని చంద్రమౌళీశ్వరునికి సమర్పించరాదు” అని చెప్పారు.

ఇదంతా గమనిస్తున్న సేవకులు నిరాశపడ్డారు. అతను గొప్ప భక్తుడు, మంచి కానుక సమర్పిస్తున్నాడు. కాని పరమాచార్య స్వామివారు దాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. కాని దాని గురించి వారికి ఏమీ తెలియదు కదా!

“ఇది అతను న్యాయబద్ధమైన సంపాదనతో తయారుచేయించిన హారం కాదు. డానికి వాడిన ధనం ఇతర మార్గముల ద్వారా సమకూర్చుకున్నది. మరి అటువంటి కళంకిత వస్తువును చంద్రమౌళీశ్వరునికి సమర్పించాలా?”
పరమాచార్య స్వామివారు చెప్పింది నిజమే అని, ఆ ధనం న్యాయార్జితం కాదని అంగీకరించాడు ఆ భక్తుడు. కాని భగవంతుని కోసమే అని తయారుచేయించిన ఆ హారాన్ని ఏమి చెయ్యాలి. “ఏదైనా దేవాలయంలో ఈశ్వరునికి సమర్పించమని అతనికి చెప్పండి” అని శిష్యులను ఆదేశించారు స్వామివారు.

ఏది ఏ శివలింగాన్ని అలంకరించిందో మనకి తెలియదు. కేవలం ఆ భగవంతునికే తెలియాలి.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

27 Oct, 00:22


మహాస్వామి వారి మేధస్సు

ఈ విషయం నా దగ్గరకు చికిత్సకు వచ్చే కోయంబత్తూరు వ్యక్తి ఒకరు చెప్పారు. 1960లలో మహాస్వామివారు కోయంబత్తూరు విచ్చేసినప్పుడు దారిలో వస్తున్నా మహాస్వామివారికి ఈ వ్యక్తి పూర్ణకుంభం సమర్పించాడు. తరువాత స్వామివారితో, “పరమాచార్య స్వామివారికి బహుశా గుర్తులేదేమో, ముప్పై ఏళ్ల క్రితం ఇదే రోడ్డులో మీరు వచ్చినప్పుడు మా నాన్నగారు మీకు పూర్ణకుంభం సమర్పించారు” అని చెప్పాడు. అందుకు స్వామివారు, “అవును. కాని అప్పుడు మీరు ఎదురుగా ఉన్న ఇంటిలో ఉండేవారు. ఇప్పుడు ఉన్న ఇంటిలో కాదు కదా!” అని అన్నారు. అంతటి జ్ఞాపకశక్తికి సూపర్ హ్యూమన్ అన్న విశేషణం కూడా సరిపోదేమో!

ఒకసారి మేము కర్నూలులో అనుకోకుండా చరిత్ర, భూగోళం గురించిన పాఠం విన్నాము. మేము శ్రీమఠం మకాంచేసిన ప్రాంతంలోని ఒక కుటీరంనుండి ఒక ఉపాధ్యాయుడు కంబోడియా మరియు థాయ్ ల్యాండ్ దేశాల ప్రజలు, చరిత్ర, మతాలు, ఆచారాలు, వారి జీవన విధానం గురించిన పాఠం చెప్పడం లీలగా విన్నాము. మేమనుకున్నాము బహుశా ఎవరో వేదపండితుడు పాఠశాలలో చదువుతున్న తన కుమారునికి బోధిస్తున్నాడు అని. కొద్దిసేపటి తరువాత ఆ కుటీరం నుండి మహాస్వామివారు బయటకువచ్చారు. అప్పుడు మాకు అర్థం అయ్యింది. ఇప్పటిదాకా మహాస్వామివారు అంతకు కొద్దిరోజుల ముందే సన్యాసం స్వీకరించిన బాల పెరియవతో సంభాషిస్తున్నారని. అన్ని విషయాలపై మహాస్వామివారికున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాము.

పరమాచార్య స్వామికున్న మేధస్సు, వివిధ విషయాలపై ఉన్న అవగాహన అసాధారణం. ఒకసారి కాంచీపురం దగ్గర ఉన్న శివాస్థానంలో మహాస్వామివారు మకాం చేస్తున్నారు. దర్శనానికి మేమి అక్కడకు వెళ్ళాము. ఒక భక్తుడు అక్కడకు వచ్చి భౌతికశాస్త్రానికి సంబంధించిన ఒక సిద్ధాంతం గురించిన వ్యాసం అచ్చువేయబడిన కాగితాలను స్వామి ముందు పెట్టాడు. మద్రాసు విశ్వవిద్యాలయానికి పి హెచ్ డి కోసం దీన్ని సమర్పిస్తున్నాని, స్వామివారి ఆశీస్సులు కావాలని తెలిపాడు. అది చాలా సాంకేతికమైన క్లిష్ట విషయం. స్వామి కొన్ని క్షణాలు ఇరవై పేజీలున్న ఆ పొత్తాన్ని చూసి దాన్ని పక్కన పెట్టి ప్రసాదం ఇచ్చి పంపారు. కొద్దిసేపటికి ఆ భక్తుడు వెల్లిపోయిన తరువాత న ఆవైపు తిరిగి,
స్వామివారు : “దీన్ని తీసుకుని, ఆ చెట్టు నీడలో కూర్చుని, దీన్ని జాగ్రత్తగా చదివి, దాని సారాశం నాకు చెప్పు”

నేను దాన్ని తీసుకుని ఒక అరగంట పాటు దాన్ని చెదివి స్వామివద్దకు తిరిగొచ్చాను.

స్వామివారు : దాన్ని చదివావా? అర్థం అయ్యిందా?

నేను దాని గురించి చెప్పడం మొదలుపెట్టాను. రెండు మూడు నిముషాల తరువాత స్వామివారు మధ్యలో ఆపారు.

స్వామివారు : నువ్వు చెబుతున్నది నేను అంగీకరించను. మొదటి పేజిలో ఉన్న రెండవ పేరా, నాల్గవ పేజిలో ఉన్న మొదటి పేరా ఒకదానికొకటి విరుద్ధంగా లేవూ? వెళ్ళు మరలా చదువు.

నేను ఆశ్చర్యపోయాను. నేను మరలా చెట్టు నీడకు వెళ్లి శ్రద్ధగా చదివాను. పరమాచార్య స్వామివారు చెప్పింది నిజం. అరగంట పాటు చదివినా నాకు కనపడని ఆ విషయం, కేవలం క్షణాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఒకసారి అలా తిరిగేసిన స్వామివారికి కనపడింది.

నన్ను వారు పరీక్షిస్తున్నారు అని అర్థం అయ్యింది. బహుశా అహంకారమనే బుడగని సుతిమెత్తగా బద్దలుకొడుతున్నారు.

--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

26 Oct, 00:34


మహాస్వామి వారి జ్ఞానదృష్టి

పరమాచార్య స్వామివారు ఒకసారి కాంచీపురంలోని ఆనైకట్టి వీధిలో ఉన్న మఠంలో మకాం చేస్తున్నారు. అప్పుడు ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు అయిన శ్రీమతి యం. యస్. సుబ్బులక్ష్మి గారు పరమాచార్య స్వామివారి దర్శనార్థమై రెడ్డి వీధిలోని ఒక ఇంట్లో ఉండేవారు. ఒకరోజు పరమాచార్య స్వామివారు వింటారని శ్రీమతి యం. యస్. ఆనైకట్టి వీధి మఠంలో అద్భుతంగా కచేరి చేస్తున్నారు. హఠాత్తుగా స్వామివారు బయటకు వచ్చి, పాడడం ఆపమని అడిగారు. తరువాత అక్కడ కచేరీ వింటున్నవారందరినీ వెళ్లిపొమ్మని చెప్పారు. ఆవు పేడ కలిపిన నీటితో ఆ స్థలాన్నంతా శుభ్రపరచమని ఆదేశించారు. ఇటువంటి ఆజ్ఞ ఇవ్వడానికి కారణమేంటో అక్కడున్నవారికెవ్వరికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత స్వామివారే తెలిపారు, శ్రీమతి యం. యస్. గారు పాడుతున్నప్పుడు అక్కడ కూర్చుని వింటున్న శ్రోతల్లో ఉన్న ఒకడు తన తల్లికి మరణాంతర కర్మలు కూడా చెయ్యని కర్మభ్రష్టుడు, "అతడు కూర్చున్న స్థలం అపవిత్రమైనది కావున ఆ స్థలాన్ని పేడనీటితో శుద్ధి చెయ్యమని, కచేరి ఆపమని చెప్పాను" అని అన్నారు. తరువాత ఆ కర్మభ్రష్టుడు ఎవరో అని కనుక్కుంటే, అతను ఒక సినిమా డైరెక్టరు అని తెలిసింది. మహాస్వామి వారి జ్ఞానదృష్టికి అందరూ ఆశ్చర్యపోయారు.

**************

పరమాచార్య స్వామివారు ఒకసారి చిన్న కాంచీపురంలో ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం చెన్నై నుండి ఒక కుటుంబం వచ్చింది. వారి ఇంటిలో జరగబోయే ఒక వివాహం కోసం కొన్న బంగారు ఆభరణాలను కారులోనే వదిలి, స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్లారు. వారిని చూసినవెంటనే స్వామివారు, "మీరు నన్ను ఎక్కువగానే దర్శించుకున్నారు, వెంటనే మీచోటుకు వెళ్ళండి" అని ఆజ్ఞాపించారు. కారు వద్దకు వెళ్లి చూడగా అందులో ఉంచిన ఆభరణాలు కనబడలేదు. వెంటనే వారు స్వామివద్దకు వచ్చి విషయం తెలిపారు. వెంటనే మహాస్వామి వారు, "ఆ ఆభరణాలను దొంగిలించిన దొంగ ఇక్కడికి దగ్గరలో ఉన్న బస్టాండులో ఉంటాడు. అతడిని పట్టుకుని మీ ఆభరణాలను తీసుకోండి" అని చెప్పారు. అలాగే వారు బస్టాండుకు వెళ్లి ఆ దొంగను పట్టుకుని ఆభరణాలు తీసుకున్నారు. వారు మరలా స్వామివారి వద్దకు వచ్చి, విషయం తెలిపి నమస్కారములు చేసివెళ్లారు.

**************

మహాస్వామి వారు చిన్నకాంచీపురంలో ఉన్నప్పుడు దర్శనానికి వచ్చిన భక్తులను అడిగారు, “ఇక్కడ అమ్మంగార్ వీధి అనబడే ఒక వీధి ఉంది. దానికి ఆ పేరు ఎలా వచ్చింది?”. అక్కడ ఉన్న వైష్ణవులకు ఆ విశయం తెలియదు. తరువాత స్వామివారే తెలిపారు, “కొన్ని శతాబ్ధాల క్రితం ఆ వీధిలోనే అయ్యంగార్ల మరియు వారి భార్యల ఇళ్ళు ఉండేవి. దాంతో ఆ వీధిని అయ్యంగార్ - అమ్మంగార్ వీధి అని పిలిచేవాళ్ళు. కాలక్రమంలో అది అమ్మంగార్ వీధిగా స్థిరపడిపోయింది”. ఈ విషయం విని అక్కడున్న వైష్ణవులు సంతోషపడ్డారు.

**************

ఒకసారి పరమాచార్య స్వామివారు చిన్న కాంచీపురం దగ్గర్లోని తేనంబాక్కం గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు సీమా భట్టార్ స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అప్పుడు పరమాచార్య స్వామివారు, దేశికర్ ప్రబంధంలోని శ్లోకాన్ని చెప్పారు.

పొన్నహిల్ సేరంథు అలైక్కుం పునల్ వేహై వదకరయిల్
టెన్నన్ ఉహంథు థొళుం తేన వెధియర్ దైవం ఒన్రే

అని మరలా, “మీ పూర్వీకులు(బ్రహ్మ దేవుడు) పెట్టుబడిగా పెట్టిన అసలు హస్తగిరిలో ఉంది. మీరు (బ్రహ్మ వంశ సంజాతులు) ఆ అసలుపై వస్తున్న వడ్డీని పొందుతున్నారు” అని అన్నారు.

--- సీమా భట్టార్, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

25 Oct, 00:28


మఠం - మందుల షాపు

చాలా ఏళ్ల క్రితం కంచిలో శ్రీమఠం ఎదురుగా పూల కొట్టు, పచారి కొట్టు, మందుల షాపు ఇలా చాలా దుకాణాలు ఉండి వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇండియన్ బ్యాంకు వారికి శ్రీమఠం ఎదురుగా ఒక శాఖను ప్రారంభించి మఠం లావాదేవీలను చూసుకోవాలని వారి కోరిక. వారు తమ అలోచనని మఠం అధికారులకు తెలిపి వారి అనుమతి తీసుకున్నారు.

మఠం ఉన్నప్పటి పరిస్థితుల ప్రకారం బ్యాంకు వారు మఠం ఎదురుగా స్వయంగా ఒక సొంత భవనాన్ని కట్టుకుని శాఖను ప్రారంభించవలిసి ఉంది. ఇందుకోసం అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి వేరొకచోట వాటిని ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని ఆ దుకాణదారులకు ఇవ్వాలి. అంతా సవ్యంగా జరిగి ఇండియన్ బ్యాంకు వారు మఠం ఎదురుగా తమ శాఖను ప్రారంభించారు.

రెండు సంవత్సరాల తరువాత దంపతులొకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి, స్వామి వారితో “ఈరోజు మా పెళ్ళిరోజు. పరమాచార్య స్వామి వారు మమ్మల్ని దీవించాలి” అని ప్రార్థించారు.

మహస్వామి వారు వారిని గుర్తుపట్టి, “నువ్వు మందుల షాపు ముదలియార్ కదూ?” అని అడిగారు.
”అవును పెరియవ”

“మీ తండ్రి అంతిమ సమయంలో చాలా క్లేశపడ్డాడు”
”అవును పెరియవ”

వారి బాగోగుల గురించి కనుక్కున్న తరువాత మహాస్వామి వారు ఇలా అడిగారు. “ఇప్పుడు షాపు ఎక్కడ పెట్టుకున్నావు?”

“షాపు ఇంకా ఎక్కడా పెట్టుకోలేదు పెరియవ. సరైన స్థలం కోసం చూస్తున్నాము” అని చెప్పారు.

మహాస్వామి వారు కనుబొమ్మలు ముడిచి ”ఎందుకు? శ్రీమఠం ఎదురుగా ఉన్న స్థలం ఖాలీ చేసిన తరువాత వారు నీకు వేరొక స్థలం ఇవ్వలఏదా?” అని అడిగారు.

ముదలియార్ సణుగుతూ ”అది పెరియవ . . ”

ఏదో తప్పు జరిగిందని మహాస్వామి వారుకి అర్థం అయ్యింది. మఠం మేనేజరు గణేశ అయ్యర్ ని పిలిపించారు. మహాస్వామి వారు నెమ్మదిగా విషయం విచారిస్తున్నారు. ”మనకు వీలున్నంతలో దదాపు అందరికి మరోచోట స్థలాలు ఇచ్చాము” అని చెప్పాడు

“కాని మెడికల్ షాపు ముదలియార్ ఎక్కడ ఇచ్చినట్టు లేదు. అతను ఇంకా షాపు పెట్టుకోలేదు అని చెప్తున్నాడు” అని అడిగారు స్వామి వారు.

గణేశ అయ్యర్ తడబడుతూ ”లేదు పెరియవ అతనితో అన్ని మాట్లాడి నిర్ణయించాము. . . .”

ఆ తరువాత రోజంతా మహాస్వామి వారు ఎవ్వరితోను మాట్లాడలేదు. తీవ్రమైన చింతలో ఉన్నట్టు కనిపించారు. మందుల షాపు ముదలియారుకు వేరోకచోట స్థలం ఇవ్వలేదు అనే విషయం వారిని చాలా సంకటంలో పడేసింది. ఇలా చేయ్యడం ఇచ్చిన మాటను అతిక్రమించడమే. అది అసత్య దోషం. వారు చివరగా తీసుకున్న నిర్ణయం అందరికి చెప్పారు. వారి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చెసింది.

ముదలియార్ ఇంటి చిరునామా తీసుకుని అతణ్ణి అప్పుడే పంపించివేసారు. తరువాత వారు మేనేజరుని పిలిచి విచారించారు. శ్రీమఠం వెనకాతల రోడ్డు పక్కగా చాలా ఖాళీ స్థలం ఉంది. మఠం కాంపౌండు గోడని కూల్చితే ముదలియార్ పాత షాపు కంటే మూడింతలు పెద్ద స్థలం లభిస్తుంది. సాయిత్రం లోపల ఆ స్థలాన్ని అతనికి కేటాయించారు. ఆ రోజు దర్శనానికి వచ్చిన శ్రీమఠం భక్తుడైన ఒక ఇంజనీయరుకు అక్కడ దుకాణం కట్టవలసిందని అనుజ్ఞ ఇచ్చారు.

మూడునెలలో చక్కగా దుకాణాన్ని నిర్మించారు. ముదలియార్ అక్కడ తన మందుల షాపుని పెట్టుకుని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు.

పరమాచార్య స్వామి వారు చేసిన ప్రమాణాలు నెరవేర్చడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎంతటి స్థితిలోనైనా వాటిని నెరవేర్చవలసిందే. ఈ సంఘటన తరువాత మహాస్వామి వారి అనుగ్రహాన్ని తనకు కలిగిన అదృష్టాన్ని తలచుకొని ముదలియార్ చాలా సంతోషపడ్డాడు.

--- రా. వెంకటస్వామి, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

24 Oct, 00:28


చేసిన పుణ్యం – గుర్తొచ్చిన పాపం

నాలుగు దశాబ్ధాల క్రితం నేను కళ్ళారా చూసిన సంఘటన. పరమాచార్య స్వామి వారి జయంతి మహోత్సవాల కోసం నేను కలవై వెళ్ళాను. ఊహించినట్టుగానే చాలా రద్దీగా ఉంది. నేను నా భార్య వారి దర్శనంకోసం వేచియున్నాము. పరమాచార్య స్వామి వారు మమరొక వైపు నుండి రావడం చూసి గుంపు మొత్తం వారి వద్దకు పోసాగింది. అక్కడ ఒక యాభై సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయన ఉన్నాడు. గొంతు నిండా బంగారు సరాలు వేసుకుని డాంబికంగా ఉన్నాడు. అతను అతని భార్య మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు చేసి నమస్కరించి నిలబడ్డారు. స్వామి వారు అప్పుడు మౌన వ్రతంలో ఉన్నారు. వారు ఆ స్థితిమంతుడైన వ్యాపాస్తుణ్ణి చూసారు.

"ఎలా ఉన్నవు?” అని మౌనంగా అడిగారు. అతను తన భార్య కలిసి మహాస్వామి వారి చేస్తికి ఒక కరపత్రాన్ని ఇచ్చారు. అది అతను చేయించిన “సమిష్టి ఉపనయనాల” గురించి తెలిపే పత్రము. కె కె నగర్ లో పేద బ్రాహ్మణ పిల్లలకోసం నాలుగు రోజుల పాటు మొత్తం తన ఖర్చుతో చేసిన ఉపనయనాల గురించిన కరపత్రము స్వామి వారికి ఇచ్చారు. కొద్దిసేపు నిశబ్దం అంతా.

మహాస్వామి వారు “ఎంత ఖర్చు చేసావు దీనికోసం” అని మౌనంగా అడిగారు. ”కొన్ని లక్షలు.” అని సమాధానమిచ్చాడు అతను. మరికొద్దిసేపు నిశ్శబ్ధం అక్కడంతా. మహాస్వామి వారు మౌనంగా “తిరునల్వేలి లోని దక్షిణామూర్తి” అనే అబ్బాయి గురించి అడిగారు. అక్కడున్న ఎవరికి అర్థం కాలేదు కాని అతను మాత్రం స్థాణువు లా నిలబడిపోయాడు. మొహంలో నెత్తుటి చుక్క లేదు. పరమాచార్య స్వామి వారు ముందుకు సాగి పోయారు. అతను తట్టుకోలేనంతగా ఏడ్చేసాడు. గట్టిగా రోదిస్తున్నాడు.

అతని భార్య అతణ్ణి సముదాయించాలని ప్రయత్నిస్తోంది కాని అతడు చిన్నపిల్లడిలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న విలేఖరులు అడిగారు “సార్ ఏమి జరిగింది ? ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని?”

అతను పిచ్చి పట్టినవాడిలాగా పదే పదే “నేను దుర్మార్గుణ్ణి నేను నేరస్తుణ్ణి” అని ఇంకా గట్టిగా రోదిస్తున్నాడు. కొద్దిసేపటి తరువాత ఇలా చెప్పాడు. ”కొద్ది సంవత్సరాల క్రితం విధవరాలైన నా చెల్లెలు నా దగ్గరే ఉండేది. తనకు ఒక అబ్బాయి కూడా ఉండేవాడు. నా మేనల్లుడి పేరే దక్షిణామూర్తి. నేనే వారి మంచి చెడ్దలు చూసుకునేవాణ్ణి. కొద్ది కాలం తరువాత నా చెల్లెలు కూడా పరమపదించింది. వాళ్ల అబ్బాయిని ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. అతణ్ణి ఇంటి నుండి వెళ్ళగొట్టాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు.

పెరియవ ఈరోజు పరోక్షంగా “లక్షలు ఖర్చు పెట్టి ఎవరెవరికో సమిష్టి ఉపనయనం చేసావు. పుత్ర సమానుడైన నీ చెల్లెలి కొడుకుని మరచిపోయావు” అని అడిగినట్టు అనిపించింది. ఏమైనాసరే నేను వెంటనే నా అల్లుణ్ణి వెతికి పట్టుకోవాలి. వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలి.” అని వెళ్ళిపోయాడు.

--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

23 Oct, 00:15


మహామాఖం – అనారోగ్యం

దక్షిణాదిన కుంభకోణంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ‘మహామాఖం’ మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం ఫిబ్రవరి 25వ తేదీన తటస్థించింది. ఆనాడు కుంభకోణంలోని మహామాఖ తటాకంలో స్నానాలు చెయ్యడం పాపనోదకమని, మహా పుణ్యప్రదమనీ హిందువులంతా విశ్వసిస్తారు.

కంచి నుండి కాలినడకన కుంభకోణం వెళ్ళి, ఆనాడా పవిత్రోదకంలో మునిగి, కంచికి తిరిగి రావాలని స్వామి వారు అభిలషించారు. కాని, అప్పటికే కొన్ని నెలల కిందటి నుంచి స్వామివారి ఆరోగ్యం అంత బాగుండటం లేదు. ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి షుమారు 165 మైళ్ళు కాలినడకన ప్రయాణం చెయ్యడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు.

ఏమి చేద్దామా అని యోచించి, తుదకొక పథకం నిర్ణయించారు. మద్రాసు నుండి ఒక ఘన వైద్యుణ్ణి కంచికి పిలిపించాలని, ఆయన చేత స్వామి వారి దేహస్థితి పరీక్ష చేయించాలనీ నిశ్చయించారు.

1956 జనవరిలో ఒక ఆదివారం నాడు ఆ భిషగ్వరుడు ఆధునిక పరికరాలన్నింటితో కంచికి బయలుదేరి వచ్చాడు. మద్రాసు నుండి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయనవెంట వచ్చారు. అత్యంత అధునాతన పరికరాలతో దాదాపు అరగంటసేపు స్వామి వారి దేహస్థితిని అమూలాగ్రంగా డాక్టరు పరీక్ష చేశాడు.

పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాల గురించి, ఆరోగ్యం బాగయ్యేందుకు గాను ఇకమీదట స్వామి అనుసరించవలసిన స్వామి కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టరు సంసిద్ధుడైనాడు.

ఇంతలో డాక్టరు చెప్పబోయే మాటలకు స్వామి అడ్డువచ్చి నిదానంగా మంద స్వరంతో చిన్నపిల్లవాడిలా ఇలా అన్నారు;

“నా దేహస్థితి గురించి ఇప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో, దానిని మీకు నేను వినిపిస్తాను, వింటారా?”

స్వామి మాటలు విని చుట్టూ మూగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏమి చెప్పబోతున్నారో అని చెవులు నిక్కబొడుచుకొని వినడానికి సిద్ధమయ్యారు.

పరమాచార్య స్వామి వారు చెప్పడం మొదలుపెట్టారు; “స్వామికి వయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది. అందుకుగాను కొన్ని దంతాలను పీకించవలసి ఉంటుంది.” ఇది మీరివ్వదలచిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కాని, అలా ఆ దంతాలను లాగివేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను.

పోతే, ఇక నా ఊపిరితిత్తులు రెంటిలో ఒకటి సరిగా పని చెయ్యడం లేదని మీరు చెప్పదలచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే అది ఆ స్థితిలో ఉన్నది.

దానికో కథ ఉంది. ఒక రోజున నేను చాలా వేగంగా నడిచాను. ఆనాడు నేనొక నదీ తోరాన నడుస్తూ ఉండగా వానా, సుడిగాలి వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవటమే గాక, కాస్త దూరం పరుగెత్తాను కూడా. ఇది 1930 సంవత్సరం మాట.

తరువాత నా పొత్తికడుపు పేగు విషయానికి వస్తే, తరచుగా నేను చేసే ఉపవాసాల వల్లా వేళాపాళా లేకుండా అకాల భోజనాదుల వల్లా నా పొత్తికడుపులో ఒక పేగు సరిగా పనిచెయ్యడంలేదు అని మీరు కనిపేట్టారు.

ఇంతేగాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకు పోయింది.

మీరు చెప్పదలచినదంతా మీకు నేను సరిగ్గా వినిపించానా? ఏమైనా పొరబడినానా?“ అని అడిగారు స్వామి.

మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్య ప్రవీణుడూ, ఆయనను వెంటబెట్టుకుని వచ్చిన పెద్దలూ, అక్కడే ఉండి స్వామి మాటలు వింటున్న తదితరులూ, అంతా దిగ్భ్రమ చెందారు. ఒక్కరికీ నోటమాట రాలేదు. ఏమి చెప్పాలో ఎవ్వరికీ తెలియలేదు.

డాక్టరు మహాశయుడు మాత్రం మఠం ఉద్యోగులనుద్దేశించి “స్వామికి మంచి ఆహారం, వేళకు భోజనం, పూర్తి విశ్రాంతి ఈ మూడూ చాలా అవసరం” అంటూ సలహా ఇచ్చి, స్వామికి నమస్కరించి, తన సామానంతా సర్దుకుని, తిరిగి మద్రాసుకు బయలుదేరాడు.

ఏమైతేనేం, ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చెయ్యడానికి వీలు లేదని శిష్యులంతా పట్టుబట్టారు. వారి మాటలను కాదనలేక, ఆ ఏడు స్వామి కుంభకోణం ప్రయాణం రద్దుచేసుకుని కంచిలోనే ఉండిపోయారు. మహామాఖంనాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు.

కొన్ని వారాలు గడిచిన పిమ్మట, ఏ వైద్య సహాయమూ లేకుండా, స్వామికి ఎప్పటీవలె మామూలు ఆరోగ్యం చేకూరింది.

బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమునందు రమించే జ్ఞానులకు కొత్తగా పుణ్యము పాపము అంటదు. కేవలం మిగిలిపోయిన ప్రారబ్ధకర్మను అనుభవించడానికే వారు శరీరులై ఉంటారు. అయినా వారు కేవలం సాక్షీభూతులై ఉంటారు తప్ప శరీరానికి వచ్చిన బాధ వారి ఆత్మానందానికి అడ్డుకాదు.

--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

22 Oct, 00:23


ఔషధం - పరమ ఔషధం

ఒక రోజు పరమాచార్య స్వామి వారు వేకువజామున నదిలో స్నానం ఆచరించి మఠంకు తిరిగి వచ్చారు. అయన శరీరం అధిక ఉష్ణోగ్రతతో మండుతున్నట్టు అనిపించింది. ఆయనకి జ్వరం చాల అధికముగా ఉంది.

వైద్యులు వచ్చి పరిశీలించి, "కొన్ని పాలు తీసుకొని మాత్ర వేసుకోమని” చెప్పి వెళ్లారు.

ఆరోజు ఏకాదశి అందువలన స్వామి వారు సంపూర్ణ ఉపవాసంలో ఉంటారు. నిర్జలోపవాసం కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోరు. ఇంకా పాలు గురించి ఎం చెప్పాలి?

“పాలు కాని మాత్ర కాని నాకు అవసరం లేదు” అని మహాస్వామి వారు ఖచ్చితంగా చెప్పారు.

శ్రీమఠం మేనేజర్ వచ్చి మహాస్వామి వారిని వేడుకున్నారు. చాలా ప్రాధేయపడ్డారు. "జ్వరంతో ఉన్నప్పుడు ఈ ఉపవాస దీక్ష ఉండవలసిన అవసరం లేదు. ఇది ఆహారం కాదు కేవలం ఔషదం మాత్రమే కనుక స్వీకరించవలసింది" అని వాదించారు.

వారి వాదనలో చివరి మాట సరైనది అనిపించింది అందరికి.

పరమాచార్య స్వామి వారు తన దగ్గరలో ఉన్న శిష్యునితో చిన్నగా, బొంగురు గొంతుతో ఇలా చెప్పారు "వైద్యులు ఇచినది ఔషదమ. కాని నాకు నేనే పరమ ఔషదం ఇచ్చుకున్నాను".

మేనేజరు గారికి ఏమి అర్ధం కాలేదు. వారి అయోమయ పరిస్థితి చూసి స్వామివారే మళ్ళా అర్థమయ్యేట్టు "వేదం ‘లంఖణం పరమఔషదం’ అని చెప్పింది కాబట్టి ఈ ఉపవాసమే అత్యంత పరమ ఔషధం" అని వివరించారు.

మరుసటి రోజు ఉదయం మహాస్వామి వారు రోజువారీ పద్దతిలోనే వేకువఝామునే లేచి, చల్లటి నీటితో స్నానమాచరించి, వారి పద్ధతి ప్రకారం అనుష్టానము మరియు పూజ ముగించారు. వచ్చినంత త్వరగా జ్వరం తగ్గుముఖం పట్టి మాయమైపోయింది.

పరమాచార్య స్వామి వారి శరీరం వారి ఆధీనంలో ఉండి వారి ఆజ్ఞకు కట్టుబడి ఉండేది. దీని నిరూపణకు వేల కొలది దృష్టాంతములు కలవు.

--- అనువాదం: ఈశ్వర్ రెడ్డి, శ్రీకాళహస్తి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

21 Oct, 00:21


మూకశంకరులు - మూకపంచశతి

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భాగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురం లో సర్వజ్ఞ పీఠం స్థాపించారు, అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఈ పీఠమును అధిష్టించిన వారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. వారి తరువాత ఉత్తరాధికారం శ్రీ సర్వజ్ఞాత్మన్ సరస్వతి స్వామి వారు నిర్వహించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది.

ఆ గురుపరంపర లో మనకు తెలిసిన ప్రఖ్యాతి గాంచిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ కృపా శంకరులు, శ్రీ శ్రీ శ్రీ మూక శంకరులు, శ్రీ శ్రీ శ్రీ అభినవ శంకరులు, శ్రీ శ్రీ శ్రీ పరమశివేంద్ర సరస్వతి, శ్రీ శ్రీ శ్రీ భోధేంద్ర సరస్వతి మరియు ఈ తరములో ఉన్న మనందరికీ తెలిసిన అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు, పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. శ్రీ పరమాచార్య తరువాత ప్రస్తుత తరములో ఉన్న జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు.

ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం మూక శంకరులు అని అంటాము. వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి, వారు ఒక ఖగోళ జ్యోతిష్యుడు. మూక శంకరులు పుట్టుకతోనే మూగ-చెవుడు ఉన్నవారు. అందుచేతనే వీరిని మూక కవి అనేవారు. కానీ అమ్మ వారి కటాక్షం ఉంటే, పుట్టుకతో మాటలు రాని వాడు మాట్లాడతాడు అనడానికి మూక శంకరుల జీవితమే నిదర్శనం.

ఒక రోజు మూక శంకరులు కామాక్షీ అమ్మ వారి ఆలయంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షీ అమ్మ వీరిని అనుగ్రహించదలిచి, కర చరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది. అలా వచ్చిన అమ్మ వారు తాంబూల చర్వణం చేస్తూ, అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద (పిడచ) కొంచెం తీసి మూక శంకరుల ప్రక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక, మామూలు ఒక స్త్రీ అనుకుని, ఎంగిలి అనే భావముతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించ లేదు.

కామాక్షీ అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూక శంకరుల చేతికి ఇచ్చింది. మహా ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మూక శంకరులు. అంతే తక్షణమే కామాక్షీ అమ్మ వారి అనుగ్రహముతో మూక శంకరులకి మాట వచ్చింది. మాట రాగానే, ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది, వెంటనే కామాక్షీ అమ్మ వారిని చూస్తూ ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు మూక శంకరులు. ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు. ఇందులో అమ్మ వారి యొక్క గొప్ప తనం వివరిస్తూ నూరు శ్లోకములు (దీనిని ఆర్యా శతకము అంటారు), అమ్మ వారిని స్తుతి చేస్తూ నూరు శ్లోకములు స్తుతి శతకము), అమ్మ వారి కన్నులు చూస్తూ నూరు శ్లోకములు (కటాక్ష శతకము), అమ్మ వారి నవ్వును స్తుతిస్తూ నూరు శ్లోకములు (మందస్మిత శతకము) & అమ్మ వారి యొక్క పాదములు స్తుతి చేస్తూ నూరు శ్లోకములు (పాదారవింద శతకము), ఇలా మొత్తం కలిపి ఐదు వందల శ్లోకములు చేశారు.

కామాక్షీ అమ్మ అనుగ్రహముతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పారవశ్యంతో చేసిన స్తోత్ర రత్న మాలయే "మూక పంచ శతి". ఇవి ఐదు శతకాలుగా ఉంటాయి.

1. ఆర్యా శతకం
2. స్తుతి శతకం
3. కటాక్ష శతకం
4. మందస్మిత శతకం
5. పాదారవింద శతకం

ఈ పంచశతి సాక్షాత్తు కామాక్షీ అమ్మవారే చెప్పారు అంటారు పెద్దలు. అమ్మయే మూక శంకరులలో ప్రవేశించి, భావి తరాల వారు ఉద్ధరింపబడాలని ఇంత అద్భుతమైన శ్లోకములను కటాక్షించింది జగన్మాత కామాక్షీ అమ్మ.

అమ్మ అనుగ్రహముతో మాటలు వచ్చి, ఐదు శతకములతో అమ్మని స్తోత్రం చేసిన తరువాత కామాక్షీ అమ్మ ఏమి వరం కావాలి అని అడిగింది. అప్పుడు మూక శంకరులు "అమ్మా, నోరు లేనివాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు, ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగానో, ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా, కాబట్టి నన్ను మళ్ళీ మూగ వాడిని చెయ్యి" అని వేడుకుంటారు. అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూక శంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది.

ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు వీరి తల్లి తండ్రులకు కబురు పంపారు. ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది, మీరు అనుమితిస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని అడిగారు. తల్లి తండ్రులు సంతోషంతో అంగీకరించడంతో, వారు తరువాత పీఠాధిపతి అయ్యారు. ఉజ్జయినీ సామ్రాజ్యం పాలించిన విక్రమాదిత్యుడు, కాశ్మీర్ రాజు ప్రవరసేనుడు, మాత్రుగుప్తుడు మొదలగు వారు మూక శంకరాచార్యుల వారిని అనన్య భక్తితో సేవించారు.

ఈ విధంగా కామాక్షీ అమ్మ వారి సేవలో తరించిన మూక శంకరులు శ్రీ ధాతు నామ సంవత్సరములో శ్రావణ పౌర్ణమి నాడు, మన గోదావరీ నదీ తీరంలోనే ముక్తిని పొంది, కామాక్షి-ఏకాంబరేశ్వరులలో ఐక్యం అయ్యారు.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

20 Oct, 00:27


ప్రసాదం - పరమార్థం

అది 1993లో నంగనల్లూర్ లో ఆంజనేయ స్వామీ దేవస్థానం ప్రారంభం చేస్తున్న సందర్భం. దేవాలయం నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. ఒకరోజు నేను పరమాచార్య స్వామివారి ఆశిస్సుల కొరకు వెళ్లాను. స్వామికి సాష్టాంగం చేసి నమస్కరించాను. మహాస్వామివారు ఆశీర్వదించి నాతొ ఇలా అన్నారు, “ఇక్కడకు వచ్చే చాలా మంది భక్తుల ద్వారా విన్నాను దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు అని. చాలా పెద్ద విగ్రహం కదా స్వామివారి ఆకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది”.

నన్ను ఆశీర్వదించి ఎంతో వాత్సల్యంతో, “ఆయన చాలా పెద్ద స్వామీ కదా! మరి ఎక్కువ ప్రసాదం నివేదన చెయ్యాల్సి పడుతుంది కదా?” అని అడిగారు. నేను వెంటనే, “ఒక పెద్ద సంచి బియ్యాన్ని వండి నివేదన చేస్తున్నాము పెరియవ” అని బదులిచ్చాను.

“ఉత్తి అన్నం మాత్రమేనా?”

“లేదు పెరియవ చిత్రాన్నాలు వంటివి చేసి నివేదిస్తాము”

“నివేదనకు ఏమేమి తయారు చేస్తుంటారు?”

“ఉదయం నుండి చాలా రకాలు తయారు చేస్తుంటాము. వెణ్ పొంగల్, బెల్లం పొంగల్, పులిహోర, మిరియాల అన్నం, పెరుగన్నం అలా వరుసగా చేస్తుంటాము పెరియవ”

“మరి వీటికోసం చాలా మంది భక్తులు వస్తుంటారు కదా!”

కొంచం గర్వంతో, “ప్రతిరోజూ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ప్రసాదాలు ఏవీ మిగలవు” అన్నాను.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. “ప్రసాదాలు కొద్ది కొద్దిగా ఇస్తారా, ఎక్కువ మొత్తంలో ఇస్తారా?” అని అడిగారు స్వామీ.

అతిశయించిన గర్వంతో, “ఒక పెద్ద ఆకులో ఎక్కువ ప్రసాదం ఇస్తాము పెరియవ” అని అన్నాను.

“ఇక్కడకు వచ్చే వారి వద్ద నేను ఈ విషయం విన్నాను. నిన్ను ఒక విషయం అడగదలచుకున్నాను. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగా ఇవ్వాలా? లేక భిజనం లాగా ఎక్కువ ఇవ్వాలా?” అని ఆత్రుతతో అడిగారు.

ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిలబడ్డాను.

మహాస్వామివారు నవ్వుతూ, “ఎందుకు అలా స్థాణువులా నిలబడిపోయావు? కేవలం నేను తెలుసుకోవడానికే నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను” అని అన్నారు.

కొద్దిగా సంశయిస్తూ వినయంగా, “లేదు పెరియవ. భక్తులు ఎంతో దూరం నుండి ఇక్కడకు వస్తారు. బహుశా వారికి ఆకలిగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని . . . ” అని ఇంకా నేను ముగించకుండానే, స్వామివారు “నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు అర్థం అవుతుంది. కాని నా ఉద్దేశ్యం ప్రసాదాన్ని ప్రసాదం లాగా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఆకలిగొన్న వారిని కూర్చుండబెట్టి వేరేగా భోజనం పెట్టాలి” అని “మన వేదాలు, శాస్త్రాల్లో ఎన్నో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి నిర్దేశించబడి ఉన్నాయి. కొన్ని కేవలం మన స్వియానుభావం వల్ల మాత్రమే అర్థం అవుతాయి” అని ఇతమిత్తంగా ఏమి చెప్పకపోవడంతో, అర్థం కాక, “నాకు ఈ విషయం అర్థం కాలేదు పెరియవ. ఏది సరైనది? ప్రసాదం కొంచం ఇవ్వాలా? ఎక్కువ ఇవ్వాలా? ఈ విషయంలో నాకు సహాయపడవలసింది” అని అడిగాను.

“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు” అని నన్ను ఆశీర్వదించి పంపారు.

ఇప్పుడు నేను పాండిచెర్రి నుండి దిండివనం వెళ్ళే దారిలో ఉన్న పంచవటిలో ఒక దేవాలయం నిర్మిస్తున్నాను. అది ముప్పైఆరు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామీ ఆలయం. నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ కూడా పెద్ద ఆకుల్లో ఎక్కువ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ. కొన్నిసార్లు నేనే యా ప్రసాద వితరణ చేస్తుంటాను. ఇటివల ఒకరోజు ఎప్పటిలాగే ఒక ఆకులో కదంబం (సాబారు అన్నం) మరొక ఆకులో పెరుగన్నం పెద్దమొత్తంలో ఇస్తున్నాము. అక్కడే కూర్చుని తింటున్న కొద్దిమంది నా వద్దకు వచ్చారు.

అందులో ఒకరు చాలా నిష్టూరంగా నాతో, “మీరు సాంబార్ అన్నం, పెరుగన్నం ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు బావుంది. రుచిగా కూడా ఉంది. కాని మీకు ఒక సలహా ఇవ్వాలి అని ఉంది. సాంబార్ అన్నానికి నంచుకోవడానికి పోరియల్, పెరుగన్నానికి తోడుగా కారం ఊరగాయ(ఆవకాయ) ఇస్తే బావుంటుంది”

ఆ మాటలు విని నేను నిశ్చేష్టుణ్ణి అయ్యాను. 1993లొ పరమాచార్య స్వామివారి మాటలు ఒక్కసారిగా గుర్తువచ్చాయి.

“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు”

స్వానుభవంతో ఇప్పుడు నాకు నిజం అవగతమైంది. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగానే ఇవ్వాలి అని

--- శ్రీ రమణి అన్న, “మహా పెరియవర్” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Oct, 00:50


వ్యాధి - వారి దృష్టి

1964లో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో, గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము. వారు ఎక్స్రే ఫోటోలు తీసి, పరీక్ష చేసారు. శస్త్రచికిత్స అవసరం అన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపినాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడనీ, ఆయనచేత ఆపరేషన్ చేయించ వలసిందని కూడా సలహా ఇచ్చారు.

మురళిని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్ళి ఆకాడ డాక్టరుతో సంప్రదించాను. వారుకోడా ఆపరేషన్ అవసరమేనన్నారు. అదైనా, అరునెలలు దాటకుండా, ఆ గడువులోపల చేయవలసిందని సలహా చెప్పారు. నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ‘ఈ అపరేషన్ అంత ప్రమాదరహితం కాదనీ, ఇతరవిధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేట్టయితే దాని అనుసరించడం మంచిద’ని సూచించారు.

సందిగ్ధంలో పడ్డాను.

ఇన్నిచోట్ల, ఇంతమంది డాక్టరులు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత, వారి సలహా త్రోసివెయ్యడం సాధ్యమా? శ్రేయస్కరమా? అయితే గత్యంతరం?

భగవంతుడి మీద భారంవేసి, రాయవెల్లూరు వెళ్ళాము. డాక్టరు గోపీనాథ్ ను సంప్రదించాము. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి, ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతర6 లేదని తేల్చిచెప్పారు.

కొద్దిరోజులలో డాక్టరు గోపీనాథ్ రాయవెల్లూరు ఆస్పత్రి వదిలిపెట్టి, ఢిల్లీ వెళుతున్నాడు. వెంటనే కాకపోతే, ఆరునెలలు మించకుండా ఢిల్లీకి రావలసిందని కూడా సలహా ఇచ్చాడు.

తుదకు, ఆపరేషన్ వయిదా వెయ్యకుండా రాయవెల్లూరులోనే, గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాము. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము.

అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించి, వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను. వెంటనే కారులో నేనూ, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాము. కంచి చేరేసరికి సాయింకాలమైంది.

స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట ఇద్దరు శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరిగించాను.

ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్నవారల్లా ఆగి, మావైపు తిరిగి, “ఏమిటి విశేషం” అన్నారు.

నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని, శస్త్ర చికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్ కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామనీ విన్నవించాను.

”ఏమిటి జబ్బు” అని అడిగారు.

”ఊపిరి తిత్తులకు సంబధించిన వ్యాధి. ‘బ్రాంక్రియాక్టాసిస్’ అంటారు. ఊపిరితిత్తులలో ఎడమ వైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే” అని అన్నాను.

నకనకలాడే లాంతరు వెలుగులో, ఆ దూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి.

“జబ్బు ప్రమాదకరమైనదే అయినా, భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు. మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని, ఇంటికి వెళ్ళండి” అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్ధాయం పొడిగించాడు! ఇద్దరం స్వామికి సాగిలపడి, సెలవు పుచ్చుకుని, మఠంలో ప్రసాదం స్వీకరించి, రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్ తో, ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి, మద్రాసు మీదుగా విజయవాడ చేరాము.

ఇది జరిగి నేటికి(1990) 26 ఏండ్లు గడిచాయి. ప్రధాన ఆంగ్లపత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరుగడించాడు. అతని వయస్సు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్ఠిక బ్రహ్మచారి. ఇంతవరకూ మళ్ళా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు.

--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

18 Oct, 01:33


అద్వైతం - అణుశాస్త్రం

మనకంటే వేఋఒకటి భావించనపుడే అద్వైతజ్ఞానం పట్టుబడుతుంది. ఒక తేలు, ఒక పాము మనలను కుట్టో కరిచో బాధపెడతాయి. మనమేవాటిగా మారినపుడు తమను తాము కుట్టిచంపుతాయా? అందరిలో నేన్నున్నాననే తీవ్ర భావన లేదా ఎరుక కలిగినపుడు అంతా ఆనంద స్వరూపంగానే కనిపిస్తుంది. అదే మోక్షం దేహం నశించిన తరువాతనో, ఏదో లోకంలోనో అనుభవించడం కాదు. ఈ జన్మలోనే, ఇప్పుడే అనుభవించదగిందని అద్వైతం చెబుతుంది.

అంతా ఒకటని ఎట్లా చెబుతారు? భిన్నభిన్నవస్తువులను చూస్తున్నాము కదా! మనం చూసేదైనా సత్యంకావాలి, లేదా వేదాంతులు చెప్పేదైనా సత్యంకావాలి కదా! ఏది సత్యం?

ఏది సత్యమైందో, అది అఖండానందాన్ని శాంతిని, తృప్తిని ప్రసాదిస్తుంది. మన మామూలు జీవితంలో ఇవి కనపడతాయా? మనం కలలో చాలా వాటిని చూస్తాం. మెలకువ వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? మేల్కొన్నవాడొక్కడే ఉన్నాడు. అట్లాగే ఈ ప్రపంచాన్ని ఒక కలగా భావిస్తాడు జ్ఞాని.

ఆధునిక శాస్త్రం కూడా భిన్నభిన్నంగా ప్రపంచం కనపడినా ఒకటేఅట్లా కన్పిస్తోందని అంటోంది. కొన్ని భిన్నమూల పదార్థాలవల్ల ప్రపంచం ఏర్పడిందని, చాలా కాలం వెనుక నిర్ధారించారు. కాని నేడు అన్ని మూలపదార్థాలతోను ఒకే ఒక శక్తి ఉందని నిర్ధారిస్తున్నారు. పదార్థము, శక్తి ఒక్కటే అని నిర్ధారించారు. కనుక ఏది వేదాంతం చెప్పిందో దానినే నేటి సైన్సు ఋజువుచేస్తోంది. ఐన్ స్టైన్, సర్ జేమ్సు జీన్సు వంటి మేధావులు అద్వైతానికి చేరువగా వస్తున్నారు.

పదార్థం మిథ్య అని అద్వైతులంటే ఏ అర్థంతో వాడారు? అది వ్యవహారిక సత్యమనే అభిప్రాయంలోనే, బ్రహ్మమే విశ్వోత్తీర్ణమైనదని అనగా విశ్వాతీతమని కనబడే ఈ ప్రపంచం ఈ క్షణంలో ఉండి మార్పు చెందదనే అర్థంలోనే వాడారు అద్వైతులు. దానినే శాస్త్రజ్ఞలు ప్రపంచం సాపేక్షికమైనదని నిత్యసత్యము కాదని వ్యాఖ్యానించారు.

అట్లా చెప్పినవారే అణుబాంబులు తయారుచేయడం చాలా దురదృష్టకరం. బౌద్ధికమైన స్థాయిలోనే అద్వైతానికి సైన్సుకి పోలిక ఉంది. ఇట్లా బుద్ధితో భౌతిక ప్రపంచంతోనే ఆగిపోకుండా ప్రజల మనస్తత్వంలో మార్పును, ఎరుకను తీసుకొనిరాలేకపోయింది. కాని అద్వైతమట్లా కాదు. సాధకులలో అఖండ శాంతిని, జ్ఞానాన్ని కలిగిస్తుంది

--- దేవరకొండ శేషగిరిరావు గారి "అద్వైతం" పరమాచార్య ఉపన్యాసాల సంగ్రహం

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

17 Oct, 00:36


కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ దబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్తబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు.

అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.”

మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.

మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

17 Oct, 00:36


ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు

అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు.

”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”

వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”

“సరే. నీ పేరు ఏంటి?”

“హరిహర సుబ్రమణియన్”

“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”

అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.

”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు.

”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”

అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”

“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”

“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”

“నీకు వివాహం అయ్యిందా?”

“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”

“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”

అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”

“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”

అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. కాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”

“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది”
పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”

“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”

మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు.

ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Oct, 11:30


జయ జయ శంకర !! హర హర శంకర !!

సభ్యులకు నమస్కారం

ట్రస్ట్ తరుపున జరిగే వివిధ పూజలలో మీ గోత్రనామాలు సులువుగా తీసుకోవడానికి అలాగే ప్రసాద వితరణకు అనుకూలంగా ఉండడానికి ఈ క్రింది గూగుల్ ఫారంను నింపగలరు

forms.gle/5o3nSRCgYX4hkYi46

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Oct, 00:36


దేవుడు చేసిన పెళ్ళి

“ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, మీ ఆశీస్సులు అర్థిస్తున్నాము”

1967 మే మాసంలో శ్రీవెంకటేశ్వర ఆలయం వద్ద చాతుర్మాస్యం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సర్స్వతి స్వామివారిని ప్రార్థించాము నేనూ, నా భార్యా, కుమార్తె లక్ష్మిని వెంతబెట్టుకు వెళ్ళి.

మా అమ్మాయి లక్ష్మి విజయవాడ మేరిస్టెల్లా కాలేజీలో ఆ సంవత్సరం బీఏ పూర్తిచేస్తున్నది. కాలేజికి సెలవులు కావడం వల్ల రోజూ స్నేహితురాళ్ళతో కలిసి వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి చేసే చంద్రమౌళీశ్వరుని పూజలు చూస్తుండేది. సాయింత్రం స్వామివారి ప్రవచనాలు వింటూ ఉండేది.

ఉయ్యూరు నివాసులు ఒకరు మా అమ్మాయిని చూసి, నా వద్దకు వచ్చి మాట్లాడారు. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న వారి అబ్బాయి సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లండుకు వెళదామనుకుంటున్నాడు.

నేను వారితో ఇలా అన్నాను. “మీతో వియ్యమందడానికి మాకు ఇష్టమేగాని, వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నవి. వీటిని మీరు అంగికరించవలసి ఉంటుంది. వధూవరుల జాతకాలు సరిపోవాలి. నేనివ్వదలచిన కట్నం మీరు పుచ్చుకోవాలి. అన్నిటినీ మించి, మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామివారి అనుమతి లభించాలి”

కాస్త రాయబాఅరం జరిగిన తరువాత ఉభయులకూ అన్నిటిపై సమాధానం కుదిరింది.

స్వామివారప్పుడు ఏలూరులో మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి, జరిగినదంతా సంగ్రహంగా విన్నవించాను. మౌనదీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి, వరదాభయహస్తంతో అనుమతించారు.

ముఖ్యబంధువులందరూ ముందుగానె వచ్చారు. మిత్రులన్నిటా సహకరించారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్ళి ముచ్చటగా జరిగింది. వేదవిధులూ, పండితులూ వధూవరులను ఆశీర్వదించారు.

తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరు వేసుకుంటే ఇది గురు కటాక్షమే తప్ప, మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢి అయ్యింది.

ఇది ఒక లీలగా కనిపిస్తే అంతకంటే అద్భుతావహం ఆ తరువాత జరిగిన ఘట్టం.

వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి, శ్రీవారి ఆశీస్సులు అందజెయ్యాలి అనుకున్నాను. స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది.

తక్షణం కారులో వధూవరులను వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాను. ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. డ్రైవరు కారు వేగం హెచ్చించాడు. స్వామి పల్లకిలో కూర్చున్నారు. బోయిలు పల్లకిని భుజాలకెత్తుకుని బయలుదేరబోతున్నారు. గబగబా నేను పల్లకి వద్దకు నడిచాను.

నమస్కారం చేసి, “అల్లుణ్ణీ, అమ్మాయినీ వెంటబెట్టుకు వచ్చాను” అన్నాను. మందహాసం చేశారు స్వామి. పల్లకి ఆపారు బోయిలు.

అల్లుడూ, కూతురూ స్వామికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షతలు తీసి వరుడి ఉత్తరీయంలో పోశారు. పల్లకి బయలుదేరింది గోదావరి నదికేసి.

మంచిరోజు చూసి వధూవరులిరువురూ ఇంగ్లండుకు పయనమైనారు. ఇంగ్లండుకు చేరినట్టు కేబుల్ కూడా వచ్చింది.

ఆ తరువాత అల్లుడిగారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయనమప్పుడు పురోహితులవద్ద నేర్చుకుని, ఎన్ని రోజులు సంధ్యవార్చారో ఏమోగాని, ఇంగ్లీషు చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారులు అనేకుల ధోరణిలో, ఈయనగారు కూడా అటుతరువాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది.

అలాంటి యువకుడు వివాహానంతరం, స్వామిని సందర్శించిన తరువాత విదేశంలో రెండువేళలా సంధ్యవార్చడం ప్రారంభించాడు!

కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబైలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీవారు, ఇంగ్లండులో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి ఇండీయాకు పిలిపించుకున్నారు. ఈ విధంగా సెలక్టు అయినవారిలో మా అల్లుడు ఒకరు.

స్వదేశానికి తిరిగివచ్చినది మొదలుకుని, ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ, ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు ఆరుగంటలు అనుష్ఠానంలో ఉంటారు.

పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి, వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవ్వరో ప్రత్యేకించి నేను చెప్పక్కరలేదు.

స్వామి ప్రకృతి శక్తులను వశపరచుకుంటారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు. విశేషించి, మానవ ప్రకృతినే మార్చివేస్తారు. దానవుడు మానవుడవుతాడు. నరుడు నారాయణుడౌతాడు!

--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

15 Oct, 00:49


ఆశ్వీయుజ మాసం – ఆమ్ర ఫలం

పరమాచార్య స్వామివారు కంచి శ్రీమఠంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముందు నేలపైన బుట్టలలో నానారకములైన పళ్ళు ఆన్నీ ఉన్నాయి. నాకు గుర్తున్నంతవరకూ అది పురట్టాసి (ఆశ్వీయుజ) మాసం.

ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్న గుంపు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. మహాస్వామి వారు ఆ పిల్లని పిలిచి “ఇక్కడున్న పళ్ళల్లో నుండి నీకు నచ్చిన ఒక పండు తీసుకో” అని అన్నారు. అక్కడున్న బుట్టల్లో పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష, జామ, కమలాలు ఉన్నాయి. కాని ఆ పిల్ల “నాకు మామిడీ పండు కావాలి” అని అడిగింది. అది మామిడి పళ్ళ కాలం కాదు. మామిడి చెట్లకు పిందెలు కూడా కాచే కాలం కాదు.

మహాస్వామి వారు ఆలోచనలో పడ్డారు. “వేదపురీ! మామిడి తాండ్ర ఏమైనా ఉన్నదేమో మెట్టూర్ స్వామి దగ్గర కనుక్కో” అని అన్నారు. తరువాత వారు ధ్యానంలోకి వెళ్ళారు.

రెండు నిముషాల తరువాత ఆంధ్రదేశం నుండి పండ్ల బుట్టి చేత పట్టుకొని ఇద్దరు భక్తులు వచ్చారు. ఆ పళ్ళెంలో రెండు పెద్ద మామిడి పళ్ళు ఉన్నాయి.

మహాస్వామి వారు కళ్ళు తెరిచారు. వారు ఆ చిన్నపిల్లని పిలిచి “వాటిని తీసుకో” అని చెప్పారు. ఆ పిల్ల ఆ పళ్ళనుండి ఒక మామిడి పండుని తీసుకొనింది. వేదపురి తిరిగి వచ్చి “మామిడి తాండ్ర కూడా లేదు” అని చెప్పి, ఆ పిల్ల చేతుల్లో ఉన్న మామిడి పండుని చూసి ఆశ్చర్యపోయారు.

“అరెరె! ఈకాలంలో మామిడి పండు ఎలా వచ్చింది?” అని మహాస్వామి అడిగారు. పొంగుకొస్తున్న భావోద్వేగంతో కళ్ళ నీరు కారుతుండగా వేదపురి మహాస్వామి వారితో “పెరియవ మామిడి పళ్ళ గురించి తలచుకున్నారు. అవి వచ్చాయి” అని అన్నారు.

పరమాచార్య స్వామి వారి శక్తి ఎంతటిదో మా కళ్ళారా చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది. కాని తరువాత చూస్తే ఆ పళ్ళను ఆ తెలుగు వారు మాకు ఎక్కడా కనపడలేదు. బహుశా మా మాంస నేత్రాలకు కనపడని చోటికి వెళ్ళీపోయారెమో!!!

--- రాధా రామమూర్తి, పుదుకొట్టై - మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Oct, 00:47


లోపల – వెలుపల

నరనారాయణులు తపస్సు చేసికొంటూ ఉన్నారు. నారాయణుడు సాక్షాత్ భగవానుడు. నరు డీశ్వరాంశ. మనుష్యులలో గొప్పస్థితిని పొందినవాడు కాబట్టి నరుడని అతనికి పేరు. ఈ నారాయణునీ నరునీ సాక్షాత్కృష్ణార్జునుల అంశం అని చెప్పడంకూడా కద్దు. వారిద్దరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు.

ఇంద్రుడు దేవలోకానికి అధిపతి. అన్ని పదవుల కంటె ఇంద్ర పదవి దొడ్డది. ఎవరయినాసరే తపస్సు చేసి సిద్దిపొందితే వారికి ఇంద్రపదవి దొరుకుతుంది. ఇంద్రునికి తన పదవి ఎక్కడ పోతుందో అనే భీతి ఉంటుందని అన్ని పురాణాలూ చెపుతై. దానిచేత ఎవరెచట తపస్సు చేసినా సరే అతడు ఎన్ని ఎన్ని అడ్డంకులు కలిగించవచ్చునో అన్నన్నీ కలిగిస్తాడు. వీని నన్నిటినీ తట్టుకుని ఎవరయినా తపస్సు పూర్తిచేసి సిద్ధి పొందితే అతనికి ఇంద్రపదవి దొరుకుతుంది. అతడు ముల్లోకాలక్కూడా అధిపతి కావచ్చు.

ఇపుడున్నూ ఇంతే. ఎవరయినా 'శాక్రిఫైస్' చేసి ఉంటే అతనికి పేరూ ప్రతిష్ఠా ఉంటుంది. అతని అండచూచుకొని ఒక 'పార్టీ' బయలుదేరుతుంది. దానికి అతడు ('ప్రెసిడెంట్') అగ్రాసనాధిపతి అవుతాడు. అటు తరువాత పరిపాలనాధికారం వస్తుంది. అందరూ అతడు చెప్పినటులు నడచుకోవాలి. మరొకడు మరింత 'శాక్రిఫైస్' చేస్తే లోగడ ఉన్నవానిని తొలగించి ఈ రెండోవాడు అగ్రాసనంలో ఉంటాడు. ఇది భూలోకస్థితి. ఇట్లే తపస్సుచేసి 'శాక్రిఫైస్' చేసినవానికి ఇంద్రపదవి వస్తుందని పురాణాలు చెపుతవి. వారి ఆశ ఈ లోకంలో ఆగలేదు. ఇంద్రపదవి వరకూ పరుగుతీసింది.

నరనారాయణులు తపస్సు చేసేటప్పుడు తన ఆధిపత్యం ఎక్కడ ఊడిపోతుందో అని ఇంద్రుడికి శంక కలిగింది. అందుచేత వారి తపస్సు భగ్నం చేయడానికి ఎన్నో మార్గాలు వెదకాడు. భయపెట్టడం, బెదిరించడం, అందెకత్తెలను పంపి కామం కలిగేటటులు చేయడం ఇలాటి జిత్తు లెన్నో పన్నడం ఆతనికి వాడుక. తపోవిఘ్నానికి ఇవి సాధనాలు.

నరనారాయణులు తపస్సు భంగించడానికి ఇంద్రుడు తన దగ్గర ఉన్న అచ్చరల నందరినీ ఆశ్రమ వాటికకు పంపాడు. వారు మొదట నరుని దగ్గరకు వచ్చారు. నరుడీశ్వరాంశ. జీవుడంటే ఏదో ఒక కొరత ఉండాలిగదా. వీరిని చూచీచూడంగానే అత డొక హుంకారం చేశాడు. ఈయనగారి కోపానికి మన మెక్కడ మాడిపోతామో అని భీతితో ఒకరినొకరు తోసికొంటూ ఈ అచ్చరలు కిందా మీదా పడి ఈవంక కన్నెత్తి అయినా చూడరాదని అనుకొంటూ పరుగెత్తుకుంటూ పోయారు.

'నారాయణుడు కొంత సాధువుగా కనిపిస్తున్నాడని ఆ అచ్చరలు ఆయనదగ్గరకు ఉపసర్పించారు. నారాయణుడు వీరిని చూడంగానే తన తొడను ఊరువును - చరచాడు. ఆయన ఊరువునుండి ఊర్వసి ఉద్భవించింది. ఊర్వసిరూపు తాల్చిన అందం. ఆ అందాలరాణిని చూచి ఆ అచ్చని లందరూ ''ఈమెముందు మనమెందుకు?'' అని తలవంచుకొన్నారు.

లోకంలో ఉన్న ఏ ఆనందమయినా అందమయినా కామమయినా ఇట్టివన్నీ మన ఆత్మలోనే ఉన్నయ్. లోపల వెలసి వెలిగే అఖండాకార పరిపూర్ణ ఆనందచ్ఛాయలే బయటగోచరించే అందం. బయట ఒక్కటీలేదు, ఉన్నదంతా లోపలే. బయటఉన్న వస్తువులన్నీ లోపలికివచ్చి చేరవలసినదే అనే పరమతత్త్వం నారాయణుడు చూపంగానే అచ్చరలు 'ఇక మేము ఇంద్రుని సభను క్రీగంటనయినా చూచేది లేదు. కడుపుకూటికి ఇట్టి చేతలు చేయవలసి వస్తున్నది' అని అన్నారట. ఈరీతిగా నారాయణుడు వారికి జ్ఞానోపదేశం చేశాడని ఒకకథ. నేను చెప్పినదానిలో కొంత కొంత తేడా పాడా లుండవచ్చు. గీతలో ఈ తత్త్వము ననుసరించే ఒక శ్లోకం ఉన్నది.

అపూర్యమాణ మచల ప్రతిష్ఠం
సముద్ర మావః ప్రవిశన్తి యద్వత్,
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాంతి మాప్నోతి న కామకామీ.

కామ మనేది వెలుపలి ఆశ. మనకు వెలుపలి వస్తువుల చేతనే సంతోషంగాని ఆనందంగాని కలుగుతుంది. వెలుపలి కామము కావాలని అనుకొనే వాడెన్నటికిని శాంతి పొందడు. ఎపుడూ వెలుపలి వస్తు సంచయం కోరుకొనే వానికి శాంతి ఎక్కడ? వెలుపల ఎన్నో వస్తువులు ఉన్నవి. అవివస్తే రానీ పోతే పోనీ, అని అన్నీ లోపలి వస్తువుతో కలియ వలసినవే. ప్రతి నిమిషమూ వేలాది నదులు వచ్చి పడుతున్నవి సముద్రంలో. ఒకపు డెపుడో అవన్నీ సముద్రంలోనుంచి బయటికి వెళ్ళినవేకదా! చూడబడే వస్తువులన్నీ లోపల ఉన్న ఆనందపు శాఖలే కదా! 'అది కావాలి ఇది కావాలి' అని సబ్బండు కోరికలతో మనము వస్తువులను తరుము కొంటూపోతే ఏమి ఫలం? అన్నీ లోపలనే ఉన్నవి. అని తలస్తే- 'స శాంతి మాప్నోతి' అతడు శాంతిని పొందుతాడు. ఏదో పెద్ద పదవో ఒక స్త్రీయో ఒక సంపదో ఒక గౌరవమో ఒక స్తోత్రమో ఇవి ఇట్టివి, సంప్రాప్తమైతేనే మన కానందం, సంతోషం, లేకపోతే దుఃఖం, లేక కొరత అని తలపోయడం శుద్ధ తెలివితక్కువ. వెలుపలి వస్తువుల వల్ల కలిగే ఆనందం లోన వుబికే ఆనందం యొక్క బిందువే.

'యత్సౌఖ్యాంబుధి లేశలేశత ఇమే శక్రాదయోనిర్వృతాః'

లోపల వెలసిన ఆనందపరమాత్మస్వరూపంయొక్క సౌఖ్య లేశమే ఇంద్రాదుల ఆనందమూ సంతోషమూ. వెలుపలి విషయములవల్ల కలిగే ఆనందం లోపలికి వెళ్ళి లయం కావలసినదే.

అంతర్ముఖానందంతో ఓలలాడేవానికి-ఈశ్వరుని సాక్షాత్కారం కలవానికి వెలుపలి వస్తువులవల్ల కోరదగిన ఆనందంగాని సంతోషంగాని ఉండదు. అవి లేకపోతే అతనికి దుఃఖం ఏర్పడదు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Oct, 00:47


అలాకాక బహిర్ముఖంగా ఆనందం వెతకికొనేవాడు ఆనందం కలిగించే వస్తువులను పొంది సంతోషిస్తాడు. వియోగంచే దుఃఖిస్తాడు. అవిలేకపోతే ఏదో కొంత కలిగి నటులు క్షోభిస్తాడు. ఆయా వస్తువుల వెనువెంట అంటుకొని ఉంటాడు. అయ్యో చేతికందకపోయెనే అని చింతిల్లుతాడు. 'ఈ దుఃఖం ఎవరివల్ల కలిగింది?' అని తెలిసికొని అతనిపై దండెత్తుతాడు. కోపపడతాడు. గోలగోల చేసిపెడతాడు. ఇవీ వానిచర్యలు. వానికి శాంతి అనే మాట ఉండదు- 'స శాంతి మాప్నోతి న కామకామీ'. ఆతని కేనాటికీ శాంతి ఉండదు. వెలుపలి విషయాలు వస్తయ్, పోతయ్, వీనిని ఎవడయినా తన సుఖానికి ఆధారం గనుక చేసికొంటే అలవానికి ఏనాటికీ ఎడతెగని కొరతే. వానికి శాంతి సున్న. అని గీతలో భగవంతుడు ఒక అధ్యాయం చివర శ్లోకంలో చెప్పి ముగిస్తాడు.

వెలుపలి కామ్యాలు లెక్కలేనన్ని. వస్తే రానీ? నదులు సముద్రంలో ఎపుడూ వచ్చి పడుతున్నయ్. అపారమయిన సముద్రజలాలలో చేరిపోతున్నయ్. నదులు వచ్చి కలియకపోతే సముద్రాని కేమయినా దుఃఖమా కొరతా? దాని స్థితి ఎట్టిది?

అపూర్యమాణ మచల ప్రతిష్ఠం,
సముద్ర మాపః ప్రవిశన్తి యద్వద్.

ఆపూర్వమాణ మంటే అంతటా నిండినది. అచల ప్రతిష్ఠర్సకదలక మెదలక ఉండేది. అది రాలేదే, ఇది రాలేదే, ఇంకా నీరు చాలదే అని సముద్రం దుఃఖించదు. కొంచెమయినా చలనం లేనిది సముద్రం.

'అచలప్రతిష్ఠమ్'

రామేశ్వరం దగ్గర ఉండే సముద్రం 'రత్నాకరం, మహోదధి' అని రెండు భాగములుగా చెపుతారు. రత్నాకరంలో ఆరునెలలు అలలు లేస్తూవుంటయ్. మహోదధిలో దేవీపట్నం వంకకు వెళ్లిచూస్తే ఒక పెద్దకొలను మాదిరిగా అలలేమీ లేకుండా ఉంటుంది. అట్లే మనంకూడా వెలుపలి నుండి వచ్చే విషయాలవల్ల పుట్టే ఆనందనదులను ఆత్మానంద మహోదధి లోనికి ఇముడ్చికొని 'ఆ పూర్యమాణ మచల ప్రతిష్ఠము'గా కూచోవాలి. 'అట్లా ఉంటేనే శాంతి' అని గీతాశ్లోకం చెబుతూంది.

కాశీలో ఆదిశంకరుల యెదుట ఈ పరీక్షార్థం ఈశ్వరుడు ఒక చండాలవేషంతో వచ్చాడు. శంకరులు చూచి, దూరం దూరం దూరంగా తొలగిపో' అని అన్నారట. వెంటనే ఆ చండాలవేషంలో ఉన్నాయన ఈ కింది శ్లోకం చదివాడుట.

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజా
నందావ బోధాంబుధౌ
విప్రోయం శ్వపచోయ మిత్యపి మహాన్
కోయం విభేదగ్రహః
కిం గంగాంబుని బింబితేంబరమణౌ
చండాల వీథీ పయః
పూరే వాంతర మస్తి కాంచన ఘటీ
మృత్కుంభయోర్వాంబరే?

గీతా శ్లోకంలో సముద్రం అని ఉంది. పై శ్లోకంలో అంబుధి అంబుధి అని, అచలప్రతిష్ఠమ్ అని గీతలో, దీనిలో నిస్తరంగానందం' అని. నిస్తరంగమహోదధిసైతం ఆచల ప్రతిష్ఠమే.

సర్వవ్యాపకమయిన ఒక ఆనందస్వరూపమే లోపల కూడా నిండి నిబిడమై ఉంది. వెలుపలి వస్తువులన్నీ లోపలి వస్తువులో ఐక్యం కావలసినవే 'అదిలేదు ఇది లేదు'. అన్న కొరతలతో మనం బాధపడవలసిన అవసరంలేదు. 'నాకు ఈ వస్తువు కావాలి' అంటే అది ఒక కొరతకు గుర్తు. నిండిన వస్తువు లోపలఉన్నప్పుడు వెలుపలివస్తువలకెక్కడి ఆవశ్యకత? 'వచ్చేది రానీ పోయేది పోనీ,' అని ఆ అఖండాకార పరమానంద వస్తు సాక్షాత్కారం కావలసిందే. లోపల వస్తులేశమే వెలుపలి విషయవిస్తారం అన్న జ్ఞానం ఉండాలి.

సముద్రంలాగా అచలంగా ఉండాలి. అట్టివాడే - 'స శాంతి మాప్నోతి' శాంతి పొందుతాడు. అని అర్జునునికి భగవంతు డుపదేశించి-'అర్జునా! నీకు ఏకొరతా అక్కరలేదు. నీవు క్షత్రియుడవు' యుద్ధం చేయుట నీ ధర్మం 'నాధర్మం నేను చేస్తున్నాను' అనే మెలకువతో యుద్ధంచెయ్, కొరతలనే వానిని దాపులకు రానీయకు! 'వానికి కష్టం కలుగుతుందే, వీనికి కష్టం కలుగుతుందే' అనే ఉబుసు నీకు వద్దు, నీధర్మమేదో నీవు చేసి ముగించు' అని ఉపదేశపూర్తి చేశాడు.

--- “జగద్గురు బోధలు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Oct, 01:31


మహత్వం - మాయ

కంచి మఠంలో త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరుల నైవేద్యముకు చేయవలసిన అన్నము అధరవుల విషయంలో ప్రమాణమున్నది. ఎన్నిసార్లు పూజ జరిగినా అడ్డడో కుంచడో ఆ ప్రమాణం ప్రకారం అన్నం వండి వార్చాల్సిందే! ఒకసారి మూడు కాలముల పూజ ఒకేసారి జరుగుతోంది. మూడో కాలంలో ఆ ప్రమాణంలో అన్నం వండడానికి బద్ధకించాడు పాచకుడు. అందువల్ల గుండిగలో ఒక గిన్నె బోర్లించి పైన అన్నం సర్ది గుండిగ చక్కగా శుద్ధిపరచి ముగ్గు వేసిఉన్న ప్రదేశంలో పెట్టాడు.

ధూపం దీపం ఇంకా అవకముందే సహస్రనామార్చన ముగిసే సమయానికి స్వామివారు ఆ గుండిగను ఉద్ధరిణ పట్టుకొని మోగించి చూశారు. సాష్టాంగ పడినాడు పాచకుడు. మళ్ళీ అన్నం క్రొత్త అధరువులతో సహా వండి తెచ్చేదాకా స్వామివారు సహస్రనామార్చన చేస్తూనే ఉన్నారు.

మరి ఈ పారిషదులు, పరిచారకులు స్వామివారి మహత్వం తెలియనివారా? నిశ్చయంగా మనకంటే వారికే స్వామివారి గురించి తెలిసి ఉండాలి. వారు ఆ మహత్వాలను కథలు కథలుగా చెబుతారు. మరి అంతలోనే స్వామివారిని కికురించగలమనుకోవడం ఏమిటో? మనమూ సరిగ్గా భగవంతుని ఇలాగే మోసగించుదామని ఆయన మహత్త్వం తెలిసిన్నీ ప్రయత్నిస్తాము. అదే వింత. పూజలో కూర్చున్న మహాస్వామివారికి అనేక సంధర్భాలలో బయట జరుగుతున్న విషయాలపై స్పృహ ఉండేది కాదు. వారు ఈ లోకంలో లేరన్న అందరికి అవగతమవుతూ ఉండేది.

ఒకసారి విశేషపూజలో త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులకు అనేక హారతులు ఇచ్చారు స్వామి. హారతులలో ముఖ్యంగా నక్షత్రహారతి వంటివాటిలో నెయ్యిలో నానపెట్టిన వత్తులు వెలిగించ వెలిగించబడతాయి. పూజంతా అయి ప్రసాదాలిచ్చి లోపల కూర్చున్న స్వామి ఏదో మంటగా ఉన్నదే అని శాఠీ తొలగించి తొడపై చూసుకొన్నారట. హారతులలో కరిగిన వేడినెయ్యి పడి తొడపై చర్మం కమిలిపోయి ఉన్నదట. ‘అయ్యో స్వామీ! నెయ్యి పడింది, చూసుకోలేదా’ అన్నాడట ‘ఏకదేశవైతా’. “ఏమోరా? అప్పుడు తెలియలేద”న్నారట స్వామి.

పీఠాధిపత్యం అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన మహాస్వామి వారికి దాని వెన్నంటి ఒక ప్రగాఢ వైరాగ్యం అంటూ ఉండింది.

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

12 Oct, 00:21


చెక్క పాదుకలు - బంగారు తొడుగులు

కర్నూలులో ఆచార్యులు మువ్వురూ చాలా వారాలపాటు మకాం చేశారు. మేము మొదటిసారి అక్కడకు వెళ్ళినప్పుడు ఆదిశంకర పాదుకలకు పూజ చేశాము. అప్పుడు ఆ పాదుకలకు వెండి కవచం తోడగబడి ఉంది. కొన్ని రోజుల తరువాత మేము మరలా వెళ్ళినప్పుడు ఆ కవచం లేదు. పాదపూజ వ్యవహారం చూసుకునే శ్రీ చంద్రమౌళీశ్వర శాస్త్రి గారిని నా భార్య పట్టమ్మాళ్ అడిగింది వెండి కవచానికి ఏమైందని. పాదుకలు పాడైపోతున్నందున తాత్కాలికంగా వెండి కవచం పెట్టారు పుదు పెరియవ అని శాస్త్రిగారు చెప్పారు. కాని మహాస్వామివారు వాటికి బంగారు కవచమే తొడగాలని వారే వెండి కవచాన్ని తొలగించారు. తరువాత ఏ అచ్చాదనా లేని ఆ పాదుకలను బాల పెరియవకు చూపించి వాటిపై ఉన్న ఆదిశంకరుల మడిమ, వేళ్ళ గుర్తులు చూపించారు. ఆదిశంకరులు ఈ పాదుకలతో మొత్తం భారతదేశం అంతా ఎంత తిరిగారో తెలియజేయడానికే వాటిని బాల పెరియవకు చూపించారు.

ఆ రోజు ఉదయం మా నాన్నగారు పూజకు రాలేదు. సాయింత్రం మేము బసచేస్తున్న హోటలులో వారికి బంగారు కవచం గురించిన ఆలోచనను తెలిపాను. కాని దాని వల్ల దొంగలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, మఠం ఎక్కడికి వెళ్ళినా వాటిని తీసుకునివెడుతూ ఉంటారు కాబట్టి చిన్నగా ఉన్న వాటిని దొంగిలించడం తేలికని వారు నా ఆలోచనని ఇష్టపడలేదు.

మరుసటిరోజు నేను పుదు పెరియవతో మా నాన్న గారి ఆలోచన గురించి చెప్పాను. బంగారు కవచం వల్ల ప్రామాడం జరగవచ్చు అని. దీని విషయమై పరమాచార్య స్వామివారు నిర్ణయం తీసుకున్నారని, ఇక చర్చకు ఆస్కారం లేదని తెలిపారు. దానికి బహుశా 2.25 లక్షలు అవుతుందని తెలిపారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. ఆరోజు రాత్రి నాకు హఠాత్తుగా ఈ మొత్తం వ్యవహారం నేనే చెయ్యాలనే ఆలోచన వచ్చింది. స్వామివారిని అడుగుదామని మా నాన్నగారికి విషయం తెలిపాను. అంత త్వరగా అంత మొత్తంలో డబ్బులు సమకూర్చడానికి అవుతుందా అని అడిగారు మా నాన్నగారు. ఎలాగో సర్దుబాటు చేస్తానని చెప్పాను.

మరుసటిరోజు పుదు పెరియవను కలిసి మొత్తం ఖర్చు నేను భరిస్తానని, మీరు అంగీకరిస్తే అది మా కుటుంబానికి దక్కిన భాగ్యంగా భావిస్తామని తెలిపాను. వారు ఖచ్చితమైన అంగీకారం తెలుపలేదు. చాలామంది భక్తులు డబ్బు, బంగారం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు, కాని నా కోరిక మేరకు పరమాచార్య స్వామివారికి ఒకసారి చెబుతాను అన్నారు. మహాస్వామివారు ఏమి చెబుతారో అని రోజంతా వేచిచూసాము. మరుసటి రోజు ఉదయం పరమాచార్య స్వామివారు ఒప్పుకున్నారని పుదు పెరియవ మాకు తెలిపారు. డబ్బు పంపమని తెలిపారు. అంతటి అదృష్టం కలిగినందుకు మాకు చాలా సంతోషం వేసింది.

కాని అత్యంత ఆసక్తికరమైన సంఘటన నెలరోజుల తరువాత జరిగింది.

నా దగ్గర చికిత్స తీసుకునే పెద్దవయస్సు ఆవిడ ఒకరోజు నా క్లినిక్ కు వచ్చారు. తను కేవలం నన్ను చూడటానికే వచ్చానని, చికిత్సకు రాలేదని, ఒక విషయం చెప్పడానికి వచ్చానని తెలిపారు. ఆవిడ నాతో ఇలా చెప్పారు, “మూడు నెలల క్రితం నేను కర్నూలుకు వెళ్లాను. ఆదిశంకరుల పాదుకలకు బంగారు తొడుగు చేయిస్తున్నారని విన్నాము. వెంటనే నేనూ ఇతర మహిళలు కొందరు గాజులు, గొలుసులు తీసి మహాస్వామివారికి సమర్పించాము. కాని మహాస్వామివారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్క వ్యక్తికే అప్పగించబోతున్నానని, ఆ వ్యక్తీ ఎవరో ఇప్పుడు చెప్పనని మాతో చెప్పారు”.

కొన్నిరోజుల తరువాత నేనూ, మా తల్లితండ్రులు కలిసి కర్నూలు వెళ్ళాము. అప్పటిదాకా మొత్తం నేనే చూసుకోవాలన్న ఆలోచన నాదే అనే అజ్ఞానంలో ఉన్నాను. కాని ఇప్పుడు అర్థం అయ్యింది, మాహాస్వామివారే ఈ పనికి వ్యతిరేకించిన మమ్మల్ని మొత్తం కార్యం మోసుకునేలాగా చేశారు.

మా తల్లితండ్రులు, తాతముత్తాతల పుణ్యం వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఇంతటి పుణ్యకార్యం చెయ్యగలిగే అదృష్టం కలిగింది. ఇది పరమాచార్య స్వామివారి అవ్యాజ కరుణ.

--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

11 Oct, 01:19


నందనార్ పరంపర

పరమాచార్య స్వామివారు మకాంచేసిన ఒక ఊర్లోని గ్రామదేవత ఆలయం దర్శించుకొని తాముంటున్న బ్రాహ్మణ వీధిలోకి నడుచుకుంటూ వస్తున్నారు. వారితో పాటు ఏడెనిమిదిమంది పరిచారకులు శిష్యులు ఉన్నారు. దార్లో ఇరువైపులా రెండడుగుల గోడతో ఒక చిన్న కల్వర్టు ఉంది. ఒక గోడపై గుమ్మడికాయలు, శెనక్కాయలు, అనపకాయ మొదలైన చాలా కూరగాయలు, కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు పెట్టి ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనపడని ఆ సంభారాలను ఇప్పుదు చూసి వారందరూ ఆశ్చర్యపొయారు. కాని జరగబోయే మరో పెద్ద ఆశ్చర్యం వారికి తెలియదు.

ఆ గోడ దగ్గరకు రాగానే మహాస్వామివారు ఆగారు. స్వామివారికి పదిహేను అడుగుల దూరంలో ఒక తక్కువ కులస్థుడు నిలబడి ఉన్నాడు. అతను అత్యంత భక్తితో చేతులు కట్టుకుని, స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కళ్ళతో జుర్రుకుంటూ వినయవిధేయతలతో నిలబడ్డాడు. బాలు మామ అతణ్ణి “తిరుక్కుళత్ తిరుత్తొండన్” అని పిలిచేవారు.

అతని కళ్ళనీరు పెల్లుబికి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామివారు ఉన్న చోట నిలబడకుండా, ఆత్మప్రదక్షిణ చేస్తున్నట్టుగా చాలా సార్లు అటువైపు ఇటువైపు తిరుగుతూ అక్కడున్నవారితో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. అవును చిన్నపిల్లాడిలా ఏమి సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారు.

అలా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి? ఎవరికి అర్థం కావడంలేదు. అతను వాటిని అక్కడ ఎందుకు ఉంచాడో అడగమని వారిని అడిగారు.

“నేను వాటిని ‘సామి’ కోసమే అక్కడ పెట్టాను. ఇవన్నీ మా తోటలో పండించినవి. ‘సామి’ గుడికి వెళ్ళడం నేను చూశాను. మళ్ళా ఇటే తిరిగొస్తారని తెలిసి, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తెచ్చాను. పాలో, పెరుగో అయితే ‘సామి’ తీసుకోరు కదా! ఇవైతే తీసుకుంటారని. తీసుకుంటారు కదా?” అని అన్నాడు.

వాటిని తీసుకోవాల్సిందిగా పరిచారకుణ్ణి ఆదేశించారు స్వామివారు. ఆటవికుడైన గుహుడు భక్తితో ఇచ్చినదాన్ని శ్రీరామచంద్రుడు ఆనందంతో స్వీకరించినట్టు. ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపినవాడు శ్రీరాముడు. ఇవన్నీ రేపు చంద్రమౌళీశ్వరునికి సమర్పించడానికి.

ఒక పదడుగులు ముందుకు వెళ్ళి స్వామివారు వెనక్కు తిరిగి చూశారు. అతను కళ్ళనీరు తుడుచుకుంటున్నాడు.

“నాకు సాష్టాంగం చేసినవారు నా వెనక్కు చూడగలరా?” అని అడిగారు.

”లేదు, చూడలేరు”

“మరి నా వెనుకకు చూడాలంటే ఏం చెయ్యాలి?”

“వారు పరమాచార్యకు ‘ప్రదక్షిణం’ చెయ్యాలి”

ఒక్క నిముషం అంతా నిశ్శబ్ధం.

”లేదా నేనే అతనిముందు ఆత్మప్రదక్షిణం చెయ్యాలి. అప్పుడు అతను నన్ను అన్నివైపులనుండి చూడగలడు. అవును కదా?” అని అన్నారు.

అందరూ నిశ్చేష్టులయిపోయారు. “ఓహ్! అదా సంగతి. కల్వర్టు దగ్గర చెసిన పనంతా ఇందుకోసమేనా? ఆత్మ-ప్రదక్షిణం. అవును కదా”

ఎవరి కోసం? ఏ శివభక్తుని కోసం ఈ దర్శనమంతా? అవును అతనికోసమే; ఆ నిజమైన భక్తునికోసమే. భక్తులకు ఆ కూరగాయలన్నీ శబరి రామునకిచ్చిన పళ్ళు. తెల్ల గుమ్మడికాయ ‘శివలింగము’. దానిపైనున్న బూడిద ‘విభూతి’.

అందరూ విడిదికి చేరుకున్నారు.

”అతను నందనార్ పరంపరకు చెందినవాడు” అని స్వామివారు లోపలికెళ్ళారు.

అక్కడున్నవారందరూ ఈ సంఘటనకు చాలా ఉద్వేగం చెందారు.

దేశాధినేతలకు కూడా లభించని ఇంతటి విశ్వరూప దర్శనం అతనికి లభించింది. మహాస్వామి వారి దృష్టిలో అతనే నిజమైన పరమేశ్వర భక్తుడు. మరి ఇక అంతకంటే అర్హత ఇంకేంకావాలి?

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 6

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

10 Oct, 00:26


నిత్యప్రలయం మహాప్రలయం ఆత్యంతికప్రలయం అని ప్రలయం మూడువిధాలు. పగలంతా విసిగి వేసారి కష్టాలూ సుఖాలూ అనుభవించి నానాబాధలూపడిన జీవి నిద్రలో ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అది నిత్యప్రలయం. దానినిచ్చేదాత ఈశ్వరుడు. నిద్ర దుఃఖాలనన్నిటినీ పోగొట్టుతుంది. ఏదో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. 'హాయిగా నిద్ర పోయాను' అని పొద్దున్నే లేచి ఎంతో ఉత్సాహంగా అంటాం. ఆ నిద్రాసౌఖ్యం కలిగించే దాత ఈశ్వరుడే. మహాప్రలయంలో జగత్తు నిశ్శేషమౌతున్నది. మళ్ళా బ్రహ్మ సృష్టించాలి. ఈ పునస్ సృష్టిలో జీవులు పూర్వకర్మాను గుణంగా పుటతారు.

రెండు మూడు అని వేరువేరుగా తోచే భేదజ్ఞానాన్ని పొగొట్టి అద్వైతానుభవాన్ని మోక్షానందాన్ని ఇచ్చేదే ఆత్యంతికప్రలయం. నిద్రలో ప్రతిరోజూ సుఖం అనుభవించడూ, ఈశ్వరస్వరూపంలో లయమై విశ్రాంతి పొందటమూ అభేదదర్శనంచేస్తూ మోక్షానందం అనుభవించడమూ ఆ యీశ్వరుని కరుణే. ఈ కార్యాలు తామసాలవలె కనిపించినా తండ్రిచేయవలసినపని చేస్తేనే కదా ఆయన మూడుకనుల తండ్రి కాగలగడం?

విష్ణువుది యోగనిద్ర. 'నిద్రాముద్రాం నిఖిలజగనీ రక్షణే జాగరూకామ్'. నిద్రపోతూనే వుంటాడు, లోకరక్షణం చేస్తూనే వుంటాడు. పాలించడమూ సంహరించడమూ ఈ రెండున్నూ కారుణ్యాన్ని చూపే కార్యాలే. వీనిలో ఎక్కువ తక్కువలెంతమాత్రమూ లేవు. ఆలాగే ఈ మూర్తులలో ఆధిక్యానధిక్యా లేమాత్రమూలేవు. పసిపిల్లలు సమేతూ అరవంలో, 'హరియుం శివనుం ఒండ్రు, అరి యాదవన్ వాయిలే మణ్ణు' ్స 'హరిహరు లిద్దరూ ఒకటే, అది తెలియనివాని నోట్లో మన్ను' అని అంటారు. ఇది సామెత.

ఒకే ఒక తత్త్వం మాయచేత అనేకరూపాలతో మనకు గోచరిస్తుంది. భేదజ్ఞానం మనం అజ్ఞానంచేత పసిబిడ్డకు చెక్కతో చేసిన మామిడిపండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది. మనకు నవ్వు వస్తుంది. ఈలాగే ఎన్నో వికారాలకులోనయిన ఈ ప్రపంచాన్నీ సృష్టించి, కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ భగవంతుడు మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. చీకట్లలో చూపుసరిగా అందక తాటిని చూచి పామని అనుకొంటాం. పిదప పాము భ్రాంతి అని తేలుతుంది. అట్లే వేదాంతశాస్త్రపఠనం వల్ల ఇదంతా మిథ్య అనే ఎరుక కలుగుతుంది. వట్టి ఎరుకయే కలిగినంత మాత్రాన సరిపోదు. ఈశ్వరుని అనుగ్రహంచే అది అనుభవంలోకి రావాలి.

కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఊరివారిని అడిగి తెలిసికొన్నా అపుడపుడు ఏదిక్కున పోయేదీ తెలియక భ్రమపడుతూ వుంటాం. అదే దిగ్ భ్రాంతి. అనుభవ పూర్వకమయిన ఎరుక సంపాదించు కొన్నవానికి శివ మాధవుల తేడా కనిపించదు. దానిచేత ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమంగా కొలిచేదైవతాలను పరదేవతగా ఎంచవలె. తక్కిన దేవతలున్నూ ఆపరదేవతయొక్క వేరువేరు అంశాలని అభేదానుభవంతో అచంచలమయిన శాంతితో మనం ఉండాలి.

--- “జగద్గురు బోధలు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

10 Oct, 00:26


శివుడవో మాధవుడవో

''శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః'' అని శివ విష్ణువుల ఐక్యం ప్రతిదినమూ సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు. శివ విష్ణువుల అభేదాన్ని ఈమంత్రం తెలుపుతున్నట్లే హరిహరుడూ రామలింగడూ రామేశ్వరుడూ శంకరనారాయణుడూ అనే పేరులుకూడా ఈ అభేదాన్ని చాటుతున్నవి.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది? అని సందేహం కలిగిందిట. వ్యాకరణంలో గల సమాసాలలో 'కర్మధారయము' తత్పురుషము బహువ్రీహి' అనేవి ఉన్నవి. రాజసేవకుడు అనేది తత్పురుష సమాసము. రాజుయొక్క సేవకుడు అని అర్థం. షష్ఠీవిభక్త్యర్థం దీనిలో ఇమిడిఉంది కాబట్టి ఇది షష్ఠీతత్పురుష. నీలో తల్పము. అనగా నల్లనికలువ. దీనిని కర్మధారయము అని అంటారు. దండపాణి అంటే పాణిలో - చేతిలో-కఱ్ఱగలవాడు. ఇది బహువ్రీహిసమాసము? దీనికి అర్థము సుబ్రహ్మణ్యుడు మొ|| దండ, పాణి, పదాలలో లేని అర్థాన్ని చెప్పేది కాబట్టి ఇది బహువ్రీహి. ''బహువ్రీహి'' పదానికే బాగా పండేపొలం అని అర్థం. నూరుకలాల ధాన్యం పండించేవాడు బహువ్రీహి.

రామేశ్వరం ఏ సమాసం? తత్ పురుషమా? 'రామస్య్శఈర్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు- అని అర్థం ఏర్పడుతుంది. అపుడు అది శివాధిక్యం చెపుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివునికంటె ఏ విధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు. అతనికి పైన ఇంకో ఈశ్వరుడా? ఈసందేహాలన్నీ తీర్చెవా రెవరు? వారు విష్ణుమూర్తినే అడిగి చూడామని అనుకొని వైకుంఠ వెళ్ళారు. 'ఇంత చిన్న విషయానికి ఎంతదూరం ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెసుస్తున్నదే తత్పురుష అని. రామస్య్శఈర్వరః అని. విష్ణుమూర్తి దేవతలతో అన్నాడట. కాని దేవతలకు మాత్రం సందేహనివృత్తి కాలేదు.

విష్ణువు కల్యాణ గుణ పరిపూర్ణుడు? వినయంకూడా ఆ కల్యాణగుణాలలో ఒకటిగదా. ఏదో వినయంచేతనైతే కావచ్చు, అహంభావం ఉండరాదనికూడా కావచ్చు, మొగమాటమిచేగాని కావచ్చు. విష్ణుమూర్తి ఇలా చెప్పి ఉంటాడు, విష్ణువు నడిగాం సరిగదా, ఇక ఆ శివుణ్ణ అడుగుదాం, ఆయన ఏంచెప్తాడో చూదాం' అని అనుకొని 'విష్ణు స్తత్పురుషం బ్రూతే'్స'విష్ణువు రామేశ్వర పదం తత్పురుష సమాసం అని అనుకొంటూ కైలాసానికి కాళ్ళను మళ్ళించారట.

నాగలోకవాసుల సందేహాన్ని నాగాభరణుడు విన్నాడు. 'ఇందులో సందేహానికి అవకాశం ఏముందయ్యా? రామేశ్వర పదం బహువ్రీహిసమాసం రాముడై ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు' అని ఆయన బదులు చెప్పాడట.

దేవతలకు ఏమీ తోచింది కాదు. వ్యాకరణ విషయంలో శివకేశవులకు ఈలాటి భేదాభిప్రాయాలు కలుగుతవని దేవతలకు కలలోనయినా తోచలేదు. 'వీరిద్దరికి పేరుతో ప్రసక్తి ఉన్నందున వేరే మధ్యవర్తిని అడిగి సందేహం తొలగించుకొందామని 'బహువ్రీహిం మహేశ్వరః'్స'శివుడుబహువ్రీహీ సమాసం' అని చెప్పుకొంటూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట. బ్రహ్మదేవతలకు కలిగిన సందేహాన్ని జరిగినసమచారాన్నీ శాంతంగావిని 'ఇది తత్పురుషసమాసము కాదు, బహువ్రీహిన్నీ కాదు, మరి కర్మధారయసమాసం, వీరరాఘవు డంటే వీరుడు ఒకడూ రాఘవుడు మరొకడూనా? కాదుగదా? ఆలాగే రామేశ్వరు డంటే రాము డొకడూనూ ఈశ్వరుడింకోడూనా? రాముడే యీశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అర్థం. కాగా 'రామశ్చాసా వీశ్వరశ్చ' రామేశ్వరః అని కర్మధారయమే యిది అని తీర్పు చేశారుట బ్రహ్మగారు.

విష్ణు స్తత్ఫురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః.
ఉభయో రప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్.

ఆత్మభూః అంటే బ్రహ్మ. దేవతలకు శివకేశవులొకే పరతత్త్వమని బ్రహ్మ బోధించాడట. ఈ సత్యాన్ని ఈ ఐక్యాన్ని మనంకూడా ఎన్నో విధాల తెలిసికొంటున్నాం.

శివకేశవులకు పోరు పొసగినటులు పురాణాలలో కొన్నిచోట్ల చదువుతూ వుంటాం. ఒకచోట విష్ణువు జయించాడని ఇంకొక చోట శివుడు జయించాడని చూస్తాం. ఇంతేకాదు కొన్ని చోట్ల పరస్పరము సహాయం చేసికొన్నారనీ ఒకరి నొకరు పూజించుకొన్నారనిన్నీ చదువుతాం. విష్ణుపురానికి సమీపాన 'తిరువీళిమిళలై' అనే క్షేత్రం ఉంది. ఇచ్చటి స్వామికి 'నేత్రార్పణేశ్వరుడు' అని పేరు. ఈచోట అను దినమూ విష్ణువు ఈశ్వరుని వేయి కమలాలతో పూజించేవాడనీ, ఒకనాడు వేయింటికి ఒక పూవు తగ్గగా తన నేత్ర కమలమునే పెరకి ఇచ్చినాడనీ ఐతిహ్యం.

భగవత్పాదులున్నూ 'సాంబే పరబహ్మణి' అనే మకుటంతో ఒక స్తవం చేశారు. దానిలో ఒకటి.

విష్ణుర్యస్య సహస్రనామనియమా
దంభోరు హైరర్చయన్
ఏకేనాపచితేషు నేత్రకమలం
నైజంపదాబ్జద్వయమ్,
సంపూజ్యాసురసంహతిం విదళయం
స్త్రైలోక్యసాలో భవత్.
తస్మిన్మే హృదయం సుఖేన
రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఇట్లే తిరుక్కుండియూర్ అనే క్షేత్రం ఒకటి ఉన్నది. ఇచ్చట మూర్తికి బ్రహ్మశిరః ఖండీశ్వరుడని పేరు. పూర్వం బ్రహ్మగారుకూడా శివునివలెనే పంచముఖుడుగా ఉండేవాడట. దానిచేత ఆయనకు కొంచెం అహంభావం హెచ్చయింది. ఈశ్వరుడికి కోపం వచ్చింది. వెంటనే ఆయనగారి ఒకతలను గిల్లి వేశాడట. ఆ బ్రహ్మకపాలం ఒకానొక శాపంవల్ల ఈశ్వరుని చేతికే అంటుకోపోయిందిట. పైగా బ్రహ్మహత్యాపాతకం ఒకటి చుట్టుకొన్నదిట. శివునికి శాపనివృత్తి చేసింది. తిరుకుండియూరులోని పెరుమాళ్ళే అని ఈ స్థలపురాణం చెపుతూంది, ఇందలి మూర్తికి హరశాపవిమోచకుడని పేరు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

10 Oct, 00:26


రామాయణంలోగూడా శివవిష్ణువులకు వివాదం ఒకటి ఏర్పడినటులున్నూ విష్ణువు 'హుమ్' అని అన్నంతనే శివుని వింటి అల్లెతాడు పుటుక్కున తుగిపోయినటులున్నూ వర్ణింపబడ్డది, 'అధికం మేసిరే విష్ణుమ్'్సవిష్ణువు గొప్పవాడని అనుకొన్నారట. ఇట్లే నాయనార్ల గీతాలు శివాధిక్యం చాటుతవి. ఆళ్వార్ల గీతాలు విష్ణువరాలు. అవి విష్ణ్వాధిక్యం చాటుతై.

పరతత్త్వం ఒకటంటే ఒకటికదా. శివుడు పరతత్త్వమా విష్ణువు పరతత్త్వమా? శైవులకుగాని వైష్ణువులకుగాని ఈలాటి సందేహమే ఉండదు. శైవులు శివుని వైష్ణవులు విష్ణువునూ గొప్పవానిగా తలపోస్తారు. అద్వైతులకే చిక్కు. సామరస్యపు ఆవశ్యకత వారికే.

ఉన్నది ఒకే ఒకవస్తువు. ఒకవస్తువు రెండెట్లా అవుతుంది? శివ విష్ణువుల భేదాలను అటుంచుదాం. రాముల వారున్నూ పరశురాములవారున్నూ విష్ణ్వంశలయిన రెండు అవతారాలు. వీరిమాటయేమిటి? వీరిలో ఎవరధికులు శివుని విల్లు విరిచాడని రాములవారిమీద పరశురాముల వారికి కోపంకలిగింది. క్షాత్రలోకాన్ని భస్మంచేసిన పరశురాముడు రామునిముందు నిర్వీర్యుడయిపోయాడుగదా ఈ సంగనతి యేమిటి?

'ఇవన్నీ భగవల్లీలలు. ఇద్దరూ ఒకేఒక పరమాత్మ యొక్క అంశంలుకదా!' అని ఒకరన్నారట. వాస్తవానికి అంతేగాక మఱేమిటి?

కయ్యమాడినంతమాత్రాన వీరు వేరుకాదు. ఒకే పరమాత్మ తన మాయాశక్తి చేత ఆయా యీ సమయాలలో ఒకొక్క రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తున్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చేమూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒకటే అన్న అభేదజ్ఞానం ఎప్పటికిన్నీ మరవరాదు, ఈ భేదాలన్నీ కార్యార్థం. సత్త్వముర జస్సు తమస్సు అనే త్రిగుణాలూ, మెలకువ కలనిద్ర అనే మూడవస్థలూ బ్రహ్మ విష్ణు శివులని త్రిమూర్తులూ ఇలా అన్నీ మూడు మూడుగా ఉన్నవి. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. సత్త్వం తెల్లరంగు, రజస్సు పసపు ఎఱుపుల కలపోత. తమస్సు నలుపు, చీకటి రంగు ఒకటి చీకటి ఒకటి, శాంతము మరొకటి వేగము అని చెప్పవచ్చు. తెలుపు నలుపుల నడుమనున్న స్థితిరజస్సు.

బ్రహ్మది రజోగుణం. ఇతనిది ఎరుపు పసపుల కలగలుపుగా ఉండే బంగారు రంగు, విష్ణువుది సత్త్వగుణం. ఆయన లోకపాలకుడు. శివుడు సంహారకుడు. తామస గుణం కలవాడు. 'శ్రేయాంసి త త్ర ఖలుసత్త్వతనో ర్నృణాంస్యు?' అని భాగవతం చెపుతూంది.

జగత్తును కాపాడటమూ అనుగ్రహించడమూ సత్త్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్త్వగుణాన్నే మనం ఆరాధించాలి. ఒకే పరమాత్మ మూడు విధాలయిన గుణాలు కల మూడు మూర్తులుగా ఉన్నా అనుగ్రహంకోసం సత్త్వగుణం కలమూర్తినే ఆరాధించాలి మనం ఏ యే గుణాలు కలవారితో సంపర్కం పెట్టుకొంటామో ఆయా గుణాలు మనకు తెలియకుండానే మనలో ప్రతిఫలిస్తూ ఉంటవి. కోపిష్ఠిని చూస్తే మనకున్నూ కోపమో లేక నిరుత్సాహమో కలుగుతున్నది. కార్యజయాన్ని ఉద్దేశించినప్పుడు మన కెవరి వల్ల కార్యం కావాలో వారుశాంతంగానూ సంతోషంగానూ ఉన్న సమయం చూచిమరీ వెళతాం. పరమ శాంతుడున్నూ కోపం లేనివాడున్నూ ఐన మాధవుడే విష్ణువే కొలవదగిన దైవం అని విష్ణుసంబంధాలయిన పురాణాలు చెపుతున్నవి.

స్కాందము శైవపురాణము, 'మాయ తొలగిపోవాలనే కోరిక గలవారు ఈశ్వరోపాసన చేస్తారు. చేయాలి పశుపతి పాశమోచకుడు. ఆయన సాత్త్వికుడు. సాత్త్వికుని కొలిస్తేకదా సత్త్వగుణం ఏర్పడుతుంది.' అని స్కాందమూ సూతసంహిత చెపుతున్నవి. కొన్ని పురాణాలు శివునకు తమోగుణమును బ్రహ్మకు రజోగుణమును మాధవునకు సత్త్వగుణమును కలదని చెపుతున్నవి.

శివునిరంగు తెలుపు. ఆయన భస్తోద్ధూళితగాత్రుడు. ఉండేచోటో కైలాసం. అదీ పరమ తెలుపే. వాహనం తెలుపు. శుద్ధమయిన స్ఫటికంవలే ఉన్న శివునిచూడగానే ఆతడు సాత్త్వికమూర్తి అని తేటతెల్లంగా తెలుస్తుంది. విష్ణువు నలుపు. ఆయనస్థితి సతతనిద్ర. ఆయన వర్ణం తమోవర్ణం. గుణం తమోగుణం. అందుచేత విష్ణువుతామసి, శివుడు సాత్త్వికుడు అని కొన్ని పురాణాలు.

కొంచెం ఆలోచిస్తే శివునిస్వరూపమూ స్థితీ సత్త్వగుణ సూచకాలు. చేసే పనిమాత్రం జగత్ సంహారం. ఇది తమోగుణక్రియ. విష్ణువుయొక్క రూపమూ స్థితీ తమోగుణ సూచకం. కాని ఆయన చేసే లోకపరిపాలన అనే క్రియ సాత్త్వికక్రియ. ఇట్లా మాధవ-ఉమాధవులలో సత్త్వగుణ మిశ్రమం ఉన్నది.

బ్రహ్మనుగూర్చి వాదంలేదు. అందరున్నూ ఆయన గారిని రజోగుణవిశిష్టుడనే చెప్పారు. ఆయనకు గుళ్లుగాని గోపురాలుగాని ఆరాధనగాని లేదు. అందరూ ఆయనను మధ్యస్తంగా వదలివేశారు. వివాదాలన్నీ కామారినీ కంసారినీ గురించే.

ఆళువార్లలో ఒకరు పెరుమాళ్ళను వర్ణిస్తూ - 'నీవే మునివి, నీవే బ్రహ్మవు, మూడుకన్నుల తండ్రివిన్నీ నీవే' అని సరసమాడారు.

పాప పుణ్యాలనుబట్టి ఫలం ఇచ్చేవాడు విష్ణువు. బ్రహ్మ సృష్టిచేసేవాడు. శివుడు ప్రయలం చేస్తాడు. ఆప్రలయ సమయంలో చరాచరాలను తనలో లీనం చేసికొంటాడు. ఈ సంహారక్రియ క్రౌర్యమా? భ్రమణచక్రంలో చిక్కుకొని సదా భ్రమణం చేస్తున్న జీవుడికి ఆడి ఆడి అలసిపోయిన బిడ్డను చూచి-'బిడ్డా! అలసిపోయావు. నేటికి ఈ యాటచాలు, కొంచెం నిద్రపో' అని ప్రేమతో బుజ్జగించే తండ్రిలాగా తల్లిలాగా విరామం ఇచ్చే ఆ మహానటుని ప్రీతినీ అనుగ్రహాన్నీ చూపే ప్రలయక్రియ తామసికమా?

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

09 Oct, 00:29


స్వామివారి దివ్యదృష్టి

పరమాచార్య స్వామివారు ఒకసారి చిన్న కాంచీపురంలో మకాం చేస్తున్నారు. మహాస్వామివారి దర్శనానికి చెన్నై నుండి ఒక కుటుంబం వచ్చింది. ఇంట్లో జరగబోయే వివాహానికి కొన్న బంగారాన్ని కారులోనే ఉంచి మహాస్వామివారి దర్శనానికి అందరూ లోపలికి వెళ్ళారు.

వారిని చూసిన వేంటనే స్వామివారు “నన్ను బాగా దర్శించుకున్నారు. బయలుదేరండి, వెంటనే వెళ్ళండి” అని ఆజ్ఞాపించారు. వారికేమి అర్థం కాక ఆయోమయంతో వారి కారు వద్దకు వెళ్లారు. కాస్త పరికించి చూడగా కార్లో వారు వదిలి వెళ్ళిన ఆభరణాలను ఎవరో దొంగిలించారని వారికి అర్థం అయ్యింది.

వారు వెంటనే మహాస్వామి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారు. “ఆ ఆభరణాలను దొంగిలించిన దొంగ ఇక్కడే దగ్గ్గర్లోని బస్టాండులో ఉంటాడు. వెళ్ళి వెతికి పట్టుకొని మీ వస్తువును తెచ్చుకోండి” అని స్వామివారు ఆదేశించారు. అలాగే వారు బస్టాండుకు వెళ్ళి ఆ దొంగను పట్టుకుని ఆభరణాలను తీసుకున్నారు. మహాస్వామి వద్దకు వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీస్సులు అందుకుని వెళ్ళిపోయారు.

అలాగే ఒకసారి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి చెన్నై నుండి చిన్న కాంచీపురం మఠానికి వచ్చాడు. అతణ్ణి చూడగానే స్వామివారు వెంటనే చెన్నైకి వెళ్ళవలసిందని ఆదేశించారు. తరువాత మాకు తెలిసిందేంటంటే అతను చెన్నైకి చేరువగా ఉన్నప్పుడు హృదయాఘాతం వల్ల మరణించాడు అని. పరమాచార్య స్వామివారి దివ్యదృష్టి సామాన్యమైనది కాదు.

--- సీమ భట్టార్, కాంచి. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

08 Oct, 00:33


అత్యవసర చికిత్స

కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.

ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.

ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.
“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”

మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.

“సరే సామి”

“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”

“ఉంది సామి” అని తలూపాడు.

“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”

ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.

పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

07 Oct, 16:00


కాశీలోని మానససరోవర్ ఘాట్ లో మన ట్రస్ట్ సహాయ సహకారాలతో జరిగే నిత్య నారాయణ సేవ ఈ నవరాత్రుల్లో

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

07 Oct, 00:32


కోర్టు వ్యాజ్యం - కల

చాలా సంవత్సరాల క్రితం అణి మాసం పౌర్ణమి రోజు కంచి శంకర మఠంకి వచ్చి పరమాచార్య స్వామివారి ఆశీస్సులు అందుకున్నాను. నేను వ్యవసాయ కుటుంబంలో జన్మించి పి.యు.సి దాకా చదువుకున్నాను. నాకు ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ అవడంతో చాలా పుస్తకాలు చదివేవాడిని. ఆధ్యాత్మిక ప్రవచనాలకు కూడా వెళ్తుండేవాణ్ణి.

1985లో నేను ఒక వ్యాజ్యంలో ఇరుక్కున్నాను. నా శత్రువులు నాపై ఒక సంక్లిష్ట దావా వేశారు. అది నన్ను ఇరికించడానికి కావాలని సృష్టించినది. నేను ఆ వ్యాజ్యంలో ఓడిపోతానని భయపడి, బాధపడి ఒకరోజు ఉదయం ఐదు గంటలప్పుడు శ్రీమఠంలో మహాస్వామివారి పాదాలపై సాష్టాంగపడి ప్రార్థించాను. అతిసామాన్యుడిగా కనబడే ఆ నడిచే దైవం అనుగ్రహం నాపై పడగానే, జీవితంలో పైకి రావాలని మాత్రమే ప్రార్థించాను. ఆ సమయంలో కోర్టు కేసు కూడా గుర్తుకు రాలేదు. అక్కడున్న బుట్టలో నుండి ఒక మల్లెపూల హారం తీసుకుని, వారి తల చుట్టూ తిప్పి అక్కడున్న వెదురు పళ్ళెంలో వేశారు. కుడి చెయ్యి పైకెత్తి ఆశీర్వదించారు. మహాస్వామివారి పక్కన ఉన్న వ్యక్తి నన్ను, “వారిని నువ్వు ఏమైనా అడగాలా?” అని అడిగారు. అందుకు నేను “కోర్టు వ్యాజ్యం నాకు అనుకూలంగా రావాలి” అని అన్నాను. ఈలోగా నా వెనుకనున్న భక్తులు స్వామివారికి సాష్టాంగం చెయ్యడంతో నేను పక్కకు తప్పుకున్నాను.

కొద్దిసేపటి తరువాత మహాస్వామివారు మేము కూర్చున్న చోటికి నడుచుకుంటూ వచ్చారు. మరలా నేను వారి పాదములపై పడ్డాను. వారు వెంటనే దండంతో సహా చేతిని పైకెత్తారు. వారి శిష్యులు “ఉత్తుక్కుళి వారికి కోర్టులో ఉన్న వ్యాజ్యంలో నీకే గెలుపు” అని చెప్పారు.

మహాస్వామివారి అనుగ్రహంతో కోర్టు వ్యాజ్యం నాకు అనుకూలంగా వచ్చింది. దాదాపు ఐదు లక్షల రూపాయలు, రెండెకరాల భూమి నా స్వాధీనానికి వచ్చాయి. దాంతో నాకు మనఃశ్శాంతి, ఉన్నతి కలిగింది.

మరొక ముఖ్యమైన సంఘటన, మహాస్వామి వారు మార్గళి మాసం (ధనుర్మాసం) లో విదేహముక్తులయ్యారు. ఆ ముప్పై రోజులూ నేను తెల్లవారు నాలుగు గంటలకే లేచి పూజ చేసేవాడిని. ఒకనాటి ఉషోదయ సమయాన నాకు లీలగా ఒక దృశ్యం కనబడింది. N.H 47 చెన్నై - కళ్ళికొట్టై మైయిన్ రోడ్డులో, పెరుందురై దగ్గర్లో విజయమంగళం అని ఒక గ్రామం ఉంది. 24 చక్రాల ఒక పెద్ద ట్రక్కులో మహాస్వామివారు ఉత్తరం వైపు కూర్చుని ఉండగా అది తూర్పు వైపుగా వస్తోంది. ఆ ట్రక్కు మొత్తం మల్లెపూలు, రోజాపూలు, బొడ్డు మల్లెలు, జరీ పట్టు వస్త్రాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. చూడడానికి అది దేవలోకం నుండి వచ్చిన దివ్య విమానంలా ఉంది.

అక్కడున్నవారంతా “పెరియవ వస్తున్నారు” అని అనడంతో నేను, ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకొని రెండు చేతులు తలపైకెత్తి నమస్కరించాను. అదేసమయంలో స్వామివారు శ్రీమఠంలో నన్ను అశీర్వదించిన విధంగా ఆశీర్వదించారు. ఎవరో, “మహాస్వామివారు సంతోషంతో వెళ్ళిపోతున్నారు” అని అటుండగా నాకు మెలకువ వచ్చింది.

దాంతో నాకు మహాస్వామి వారిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని కోరిక కలిగింది. ఇది నాకు బుధవారం తెల్లవాఝామున వచ్చిన కల. సూర్యోదయంతో గురువారం అయ్యింది. శనివారం మధ్యాహ్నం ఆ ఆధ్యాత్మిక సూర్యులు బ్రహ్మీభూతులయ్యారు. ఆదివారం వారి పాంచభౌతిక శరీరాన్ని శ్రీమఠంలో బృందావనంలో ఉంచారు.

అనూరాధ నక్షత్రంలో జన్మించిన ఆ నడిచే దైవం నా ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గనిర్దేశకులయ్యారు. నా భాగ్య వశమున బుధవారం రాత్రే స్వామివారు జరగబోయేదాన్ని నాకు విశదపరిచారు.

--- ఇ.ఆర్. పరమశివం, మెట్టుక్కడై (ఉత్తుక్కుళి). మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

06 Oct, 00:49


యమ్.జి.ఆర్ - ఉత్తర చిదంబరం

యమ్. జి రామచంద్రన్ తమిళ ప్రఖ్యాత నటుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. వారు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. అనారోగ్యంతో అమెరికాలో వైద్యం చేయించుకొని చెన్నై తిరిగొచ్చిన రామచంద్రన్ మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళారు. అత్యంత భక్తిప్రపత్తులతో స్వామివారిని దర్శించుకొని, స్వామికి ఇలా విన్నవించారు. ”మఠానికి మీరు ఏమి చెబితే అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆజ్ఞాపించండి”. ఆయనతో స్వామివారు, “కంచిలో వార తీర్థములు ఉన్నాయి. వాటిని శుభ్రపరచి చక్కగా చూసుకునే ఏర్పాట్లు చెయ్యి. సోమవారం - ఏకామ్రేశ్వర కుళం; మంగళవారం - మఠం ఎదురుగా ఉన్న మంగళా తీర్థం; బుధవారం - చిన్న కాంచీపురం కాలిగమేడు దగ్గర్లోని సత్యవ్రత తీర్థం; గురువారం - కాయరోగన తీర్థం; శుక్రవారం - కామాక్షి దేవాలయంలోని శుక్రవార తీర్థం; శనివారం - సర్వతీర్థం; ఇప్పుడు వీటిలో స్నాఅనం చెయ్యాలని మాత్రం సంకల్పించకు” అని చెప్పారు.

మహాస్వామివారి వయస్సు, ఆరోగ్య రీత్యా ఆ తీర్థాల్లో స్నానం చెయ్యడానికి చాలా ప్రయాస పడుతున్నారు. ఒక పెద్ద భక్తుడు స్వామివారికి సాష్టాంగం చేసి వేడుకొన్నారు. “తన గురించి తాను పట్టించుకోవడం పెరియవకు ఇష్టం లేకపోవచ్చు. కాని మీరు మాకు ముఖ్యులు. కనీసం మాకోసం మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిందిగా ప్రార్థన. ఇది కేవలం మాలాంటి వారి కోసం కాని సాక్షాత్ పరమేశ్వరుడైన పెరియవ కోసం కాదు”

మహాస్వామివారు శిష్యునితో ఇలా అన్నారు. ”నాకు ఆకలి, బాధ, ఎవరైనా తిడితే బాధపడటం వంటివి ఇక కలగనప్పుడు నేను నీ మాటను వింటాను. నాకు ఇంకా ఆ స్థాయి కలగలేదని అతనితో చెప్పు”

అలాగే స్వామివారు మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర చిదంబర దేవాలయం (తమిళనాడులోని చిదంబరం నటరాజ దేవాలయ మాదిరి) నిర్మించాలని సంకల్పించినప్పుడు, దక్షిణ భారతంలోని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు; యమ్.జి.ఆర్, యన్.టి.ఆర్, రామకృష్ణ హెగ్గడె (కర్ణాటక) మరియు వసంత్ దాదా పాటిల్ (మహారాష్ట్ర) ముఖ్యమంత్రులకు ఆదేశం పంపారు. మీరు వరుసగా దక్షిణ, తూర్పు, పడమర, ఉత్తర దేవాలయ గోపురముల నిర్మాణ బాధ్యత తీసుకోవాల్సిందిగా. అప్పుడు మొట్టమొదటగా ముందుకు వచ్చినది దక్షిణ గోపుర నిర్మాణానికి పూర్తి ఖర్చును భరిస్తూ యమ్.జి.ఆర్ గారే.

దేవాలయ ముఖ్యద్వార గోపురమైన పడమర గోపురం నిర్మాణ బాధ్యత మహారాష్ట్ర వారు తీసుకున్నందున దాన్ని “మహారాష్ట్ర గోపురం” అని; ఉత్తర గోపుర నిర్మాణాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నందున “ఆంధ్ర గోపురం” అని; తూర్పు గోపుర నిర్మాణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నందున “కర్ణాటక గోపురం” అని; దక్షిణ గోపురాన్ని “తమిళనాడు గోపురం” అని వ్యవహరిస్తున్నారు. మొత్తం దేవాలయ నిర్మాణానికి కావాల్సిన మేలు జాతి కలపను, ధ్వజస్థంబాన్ని కేరళ ప్రభుత్వం సమర్పించింది.

ఒకసారి మహాస్వామివారు యమ్.జి.ఆర్ తో, “నువ్వు ప్రజలలో చాలా ప్రముఖుడివి కాబట్టి, ఆ ప్రజాదరణతోనే వారికి సేవ చెయ్యి” అని చెప్పారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

19,093

subscribers

665

photos

99

videos