127. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః
ప్రయత్నశీలుడైనపురుషశ్రేష్ఠుని(మానవుని) లక్ష్మి చేరుతుంది
ఈ మాటకు "ఉద్యోగం చేయడం మగవాడి లక్షణం" అని అర్థం చెబుతుంటారు.కానీ దీని అర్థం అది కాదు. ఒక శబ్దానికి లోకంలో అలవాటైన అర్థం వేరు. అసలైన
నిఘంటువు అర్థం వేరు. అందుకే భాషలో శబ్దానికి అర్థం చెప్పేటప్పుడు సంప్రదాయాన్ని పరిశీలించాలి.
ఉద్యోగం అనే మాటకు 'ఉపాధి', 'పని' అని అర్థాలు మనం వాడతాం. కానీ ఈ సంస్కృత శబ్దానికి ఈ అర్థాల వాడుక దేశమంతా లేదు. 'ఉద్యోగం' అనే శబ్దానికి అసలైన అర్థం - 'ప్రయత్నం'. 'పురుష' శబ్దానికి వైదిక పరిభాషలో 'మగవాడు' అనే
అర్థాన్ని చెప్పలేదు. 'పురుషుడు' అంటే 'జీవుడు' అని అర్థం.
ఈ శరీరాన్ని 'పురం' అని వర్ణించారు. నవద్వారాల పురం (పట్టణం) ఈ దేహం.
“నవ ద్వారే పురే దేహే..." అని పేర్కొన్నాయి శాస్త్రాలు. ఈ దేహ పట్టణంలో నివసించే జీవ చైతన్యమే 'పురుషుడు'. అంటే ప్రతి వ్యక్తీ (స్త్రీయైనా / మగవాడైనా)
పురుషుడే. ఇది సమూహంగా ప్రాణులందర్నీ తెలియజేస్తుంది.
ఇప్పుడీ వాక్యానికి అర్థాన్ని స్పష్టం చేస్తే - "ప్రయత్నించడం మానవ (జీవ) లక్షణం”.
పరస్పరం సహృదయంతో, ద్వేషరహితంగా మనసు విప్పి మాట్లాడుకోవడం సామరస్యానికి ప్రథమసూత్రం. సంభాషణ లేకపోవడం వల్ల అపార్థాలు,దురభిప్రాయాలు పెరగడమే కాక, అవి బలీయమై విద్వేషాలకు, వైమనస్యాలకు
హేతువౌతాయి.
-
రెండవ సూత్రం - లక్ష్యదృష్టి, వ్యక్తుల నడుమ ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడమే
ప్రయోజనం అనే భావన ఉండాలి. ఆ ప్రయోజనం కోసం వ్యక్తిగతమైన
అహంకారాలనీ, ద్వేషాలనీ, స్వార్థాలనీ పక్కన పెట్టగలగాలి.
సంకల్పాలు సమానం కావాలి. ఆలోచనా ధోరణులు కలవాలి. అయితే ఇటువంటివన్నీ సమకూరడం కేవలం మానవుల చేతుల్లోనే ఉన్నాయనుకోవడం పూర్తి
సత్యము కాదు. ఒకొక్కప్పుడు మనల్ని మించిన ఏ శక్తి పనిచేస్తున్నదని మన అనుభవంలోనే తెలుస్తుంటుంది. నిష్కారణంగా ద్వేషాలు, కలహాలు, అనైక్యతలు
కూడా కలుగుతుంటాయి. దానివలన కలిసి కట్టుగా సాధించవలసిన ఎన్నో మహా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి.
దానికి కొంతమేరకు దైవకార్యాలతో పరిష్కారం సాధించవచ్చు. ఈ సూక్తాల పారాయణ తగిన శాస్త్రవేత్తల ద్వారా చేయించవచ్చు. అదే విధంగా ప్రతివారు తమ
ఇంట నిత్యం భగవదారాధన, వీలైనప్పుడు 'నలచరిత్ర' పారాయణ వంటివి సౌమనస్య వాతావరణాన్ని ఏర్పరుస్తాయని పురాణ పరిష్కారాలు.
“కర్కోటకస్య నాగస్య
దమయంత్యాః నలస్యచ| ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్॥"
అనే శ్లోకాన్ని అనునిత్యం పఠించితే సామరస్య భావానికి అవకాశముంటుందని మహాభారతంలోని మాట.
ఈ సమాన భావనాసౌఖ్యం సామాజికంగానే కాక, వ్యక్తిగత కార్యసాధనలో,కుటుంబ జీవనంలో కూడా అవసరం.
"పుత్రులు తల్లిదండ్రులకు ఆనందం కలిగించేవారిగా ఎదగాలి. భార్య భర్తతో మధుమయంగా, శాంతిగా మాట్లాడాలి. భర్త భార్యను గౌరవంగా ఆదరించాలి.అన్నదమ్ములు ద్వేషించుకోరాదు. ఆడపడచు ఆనందంగా ఉండాలి. సమానంగా
మంచి పనులు చేస్తూ, కుటుంబ సభ్యులందరూ శుభాలను పలుకుతుండాలి.
దేవతలు ఏవిధంగా ఒకరినొకరు ద్వేషించకుండా, పరస్పర సమన్వయంతో,ఏకస్వభావంతో అనేక రూపాలతో ఉంటారో అదే విధంగా ఇంట్లో అందరూ కలిసి ఉండాలి. గొప్పతనాన్ని పొందడంలో కలిసి మెలసి ప్రయత్నించాలి. పరస్పరం మెత్తని మాటలతో, అనురక్తితో కలిసి జీవించాలి."
ఇటువంటి అద్భుత భావాలు మన వైదిక సూక్తాలు ఆవిష్కరించాయి. దీనిని బట్టి శాంతియుతమైన సంఘటిత కుటుంబాలను, సమాజాలనీ - మొత్తంగా ఒక
అద్భుత నాగరికతను దర్శించడంలో భారతీయ ఋషులు ఎంత అగ్రస్థానంలో ఉన్నారో అర్థమవుతున్నది.