*💫⚖️🖋️సోమవారం ఏపీ లా సెట్, పీజీ ఎల్. సెట్ 2024 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ,నమోదు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల*
17117 మంది అభ్యర్థులు జూన్09 న జరిగిన ఎ. పి.లా సెట్ పరీక్షలో ఉత్తీర్ణత
అక్టోబర్ 16 నుండి 20వ తేదీ వరకు ఎ.పి. లా సెట్ పరీక్షలో ఉతీర్ణత సాధించిన వారికి వెబ్ కౌన్సిలింగ్,రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ
నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ లా సెట్ అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య బి.సత్యనారాయణ
సోమవారం,నాగార్జున వర్సిటీ(అక్టోబర్ 14):
సోమవారం ఏపీ లా సెట్, పీజీ ఎల్. సెట్ 2024 అడ్మిషన్స్ కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తముగా న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ను జూన్ 09 న నిర్వహించిన విషయం తెలిసినదే.ఈ క్రమం లో భాగంగా ప్రవేశాల కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ కు సంబంధించిన నోటిఫికేషన్ ను సోమవారం ఆచార్య నాగార్జున ఈ విశ్వవిద్యాలయంలోని ఎ. పి. లాసెట్ కార్యాలయం నందు ఎ. పి.లా సెట్ ఆడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య బి. సత్యనారాయణ విడుదల చేశారు.
అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 20 వరకు వెబ్ కౌన్సెలింగ్,రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ద్వారా అక్టోబర్ 22 నుండి 25 వరకు కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చని,వెబ్ అప్షన్ లో మార్పుల కొరకు అక్టోబర్ 26 న అవకాశం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.స్పెషల్ కేటగిరీ కి చెందిన అభ్యర్థులు అక్టోబర్ 19 న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ని ప్రవేశాల విభాగం వద్ద ఎ. పి.లాసెట్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.అక్టోబర్ 28 న అడ్మిషన్ల అలార్ట్ మెంట్ జరుగుతుందని,ఆయా కళాశాలలో ప్రవేశం పొందిన అభ్యర్థులు అక్టోబరు 29,30 తేదీలలో వ్యక్తిగతము గా హాజరుకాగలరని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇన్ ఛార్జి ఉపకులపతి ఆచార్య కె.గంగాధర్ రావు,ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి తదితరులు ఆచార్య సత్యనారాయణను అభినందించారు.