NIFTY CHACHA / NIFTY MASTER (@niftymasterlive) Kanalının Son Gönderileri

NIFTY CHACHA / NIFTY MASTER Telegram Gönderileri

NIFTY CHACHA / NIFTY MASTER
Download NIFTY CHACHA MOBILE APP

Download Android app: https://play.google.com/store/apps/details?id=com.niftychacha

Download iOS App:
https://apps.apple.com/us/app/s
19,523 Abone
5,700 Fotoğraf
8 Video
Son Güncelleme 21.03.2025 06:48

NIFTY CHACHA / NIFTY MASTER tarafından Telegram'da paylaşılan en son içerikler

NIFTY CHACHA / NIFTY MASTER

20 Mar, 16:50

492

వరుసగా నాలుగో రోజూ సూచీల పరుగులు

దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో దుమ్మురేపాయి. గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో ఫ్లాటుగా మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు యూఎస్ ఫెడ్ సమావేశం వివరాలు రావడం, తైవాన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో లాభాల బాట పట్టాయి. డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ అయినప్పటికీ బుల్లిష్ మూమెంటమ్ కొనసాగడం, ఇన్వెస్టర్లు బయ్ ఆన్ డిప్స్ మెథడ్ కొనసాగించడంతో రోజువారీ గరిష్ఠాలకు చేరాయి. నిఫ్టీ 258, సెన్సెక్స్ 899 పాయింట్ల మేర లాభపడ్డాయి. నిఫ్టీ కీలకమైన రెసిస్టెన్సీ 23,000 స్థాయిని బ్రేక్ చేయడమే కాకుండా ఆ పైస్థాయిలోనే క్లోజవ్వడం మరింత సానుకూలతను పెంచింది.

క్రితం సెషన్లో 75,449 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 75,917 వద్ద మొదలైంది. 75,684 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 76,456 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 899 పాయింట్ల లాభంతో 76,348 వద్ద ముగిసింది. 23,036 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,973 వద్ద కనిష్ఠ, 23,216 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. మొత్తంగా 258 పాయింట్లు పెరిగి 23,165 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 291 పాయింట్లు ఎగిసి 49,993 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 44 కంపెనీలు లాభపడగా 4 నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా టాప్ గెయినర్స్. ఇండస్‌ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎక్కువ నష్టపోయాయి. నేడు ఆటో, చమురు, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, హెల్త్‌కేర్, మెటల్, ఐటీ, రియాల్టి, పీఎస్ఈ, ఫార్మా షేర్లు అదరగొట్టాయి. పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, కమోడిటీస్, ఎనర్జీ, తయారీ షేర్లు ఫర్వాలేదనిపించాయి.

ఎన్ఎస్‌ఈలో నేడు మార్కెట్ బ్రెడ్త్ బయ్యర్లకు అనుకూలంగా మారింది. 2978 స్టాక్స్ ట్రేడవ్వగా 1755 లాభపడ్డాయి. 1147 నష్టపోయాయి. 35 షేర్లు 52వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. 58 షేర్లు 52వారాల కనిష్ఠాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూటును 184, లోయర్ సర్క్యూటును 55 స్టాక్స్ చేరాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 86.36 వద్ద స్థిరపడింది. ప్రదీప్ ఫాస్పేట్స్ కంపెనీ అమ్మోనియా, యూరియా ప్లాంట్లలో ప్రొడక్షన్ ఆరంభించింది. రూ.1375 టార్గెట్ ధరతో వోల్టాస్‌కు సీఎల్ఎస్ఏ హోల్డ్ రేటింగ్ ఇచ్చింది. రూ.5700 టార్గెట్ ధరతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు జెఫ్రీస్ బయ్ రేటింగ్ కొనసాగించింది. టాటా స్టీల్‌లో 21 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇండియా విక్స్ 4% మేర తగ్గి 12.71కి చేరుకుంది. రూ.700 టార్గెట్ ధరతో డీఎల్ఎఫ్‌కు నొమురా న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. డైమండ్ పవర్ ఇన్ఫ్రాకు రూ.175 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌కు ఎయిర్ ఇండియా వందల కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిసింది. ఎన్టీపీసీలో 22 లక్షల షేర్లు చేతులు మారాయి. ఐటీసీలో 10 లక్షల షేర్లు చేతులు మారాయి. తైవాన్ వడ్డీరేట్లను 2% వద్ద యథాతథంగా ఉంచింది. రూ.150 కోట్ల సమీకరణకు ధనలక్ష్మీ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.1580 టార్గెట్ ధరతో మహానగర్‌ గ్యాస్‌కు యాక్సిస్ క్యాపిటల్‌ బయ్ రేటింగ్ ఇచ్చింది.

- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709
NIFTY CHACHA / NIFTY MASTER

20 Mar, 11:36

656

Some of our students todays profit...
NIFTY CHACHA / NIFTY MASTER

20 Mar, 11:02

665

Multiple trades (scalping with support of ZONE software ). Today closed with good profit.
NIFTY CHACHA / NIFTY MASTER

20 Mar, 08:20

766

ZONE SOFTWARE USEFUL FOR INTRADAY TRADERS...
NIFTY CHACHA / NIFTY MASTER

20 Mar, 08:19

759

NIFTY 22800 CE BOUGHT 300 TGT 380 REACHED...
NIFTY CHACHA / NIFTY MASTER

19 Mar, 15:58

1,059

వరుసగా మూడోరోజూ అదుర్స్

దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్, సెక్టోరల్ సూచీల్లో కన్సాలిడేషన్ కొనసాగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు ఆరంభంలో ఫ్లాటుగా మొదలై రేంజుబౌండ్లో కొనసాగాయి. ఇన్వెస్టర్లు ‘బయ్ ఆన్ డిప్స్’ పద్ధతి అనుసరించడంతో ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, రియాల్టి, మెటల్ షేర్లు అదరగొట్టాయి. గురువారం వెలువడే యూఎస్ ఫెడ్ మీటింగ్ ప్రకటన కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇది రేపటి మార్కెట్ల గమనంపై ప్రభావం చూపనుంది. మొత్తం నిఫ్టీ 73, సెన్సెక్స్ 147 పాయింట్ల మేర ఎగిశాయి. నిఫ్టీ 23000ను తాకేందుకు మరో 100 పాయింట్ల దూరంలో నిలిచింది.ల

క్రితం సెషన్లో 75,301 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 75,473 వద్ద మొదలైంది. 75,201 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 75,568 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 147 పాయింట్ల లాభంతో 75,449 వద్ద ముగిసింది. 22,874 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,807 వద్ద కనిష్ఠ, 22,940 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్లు పెరిగి 22,907 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 388 పాయింట్లు ఎగిసి 49,702 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 31 కంపెనీలు లాభపడగా 19 నష్టపోయాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్, ఇన్ఫీ, సన్ ఫార్మా ఎక్కువ నష్టపోయాయి. నేడు ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టి, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, చమురు షేర్లు దుమ్మురేపాయి.

నేడు ఎన్ఎస్ఈలో మార్కెట్ బ్రెడ్త్ బయ్యర్లకే అనుకూలంగా మారింది. 2990 స్టాక్స్ ట్రేడవ్వగా 2345 లాభపడ్డాయి. 568 నష్టపోయాయి. 42 షేర్లు 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 89 స్టాక్స్ 52వారాల కనిష్ఠాన్ని చేరాయి. అప్పర్ సర్క్యూటును 244, లోయర్ సర్క్యూటును 43 షేర్లు చేరాయి.

డెస్కో ఇన్ఫ్రాటెక్ ఐపీవో పబ్లిక్ ఇష్యూ మార్చి 24 నుంచి ఆరంభం కానుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి 86.44 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 19 లక్షల షేర్లు చేతులు మారాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఐటీసీలో 14 లక్షల షేర్లు చేతులు మారాయి. పవర్ గ్రిడ్ టార్గెట్ ధరను రూ.250కు తగ్గిస్తూ హెచ్‌ఎస్‌బీసీ రెడ్యూస్ కాల్ ఇచ్చింది. ఇండియా ఐపీవో కోసం ఫిజిక్స్ వాలా డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించింది. టాటా స్టీల్ కంపెనీలో 10 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎయిర్ న్యూజిలాండ్‌తో టీసీఎస్ ఐదు ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.3660 టార్గెట్ ధరతో పిడిలైడ్ ఇండస్ట్రీస్‌కు నువామా బయ్ రేటింగ్ కొనసాగించింది. వరుసగా ఐదో రోజూ బ్యాంకు నిఫ్టీ పెరగడంతో ఇండస్‌ఇండ్, ఎస్బీఐ సహా బ్యాంకింగ్ షేర్లలో మూమెంటమ్ పుంజుకుంది. ఎన్టీపీసీలో 48లక్షల షేర్లు చేతులు మారాయి. ఎన్‌సీడీల ద్వారా రూ.2000 కోట్లు సమీకరించేందుకు టాటా మోటార్స్ బోర్డు ఆమోదం తెలిపింది. 2025 ఆర్థిక ఏడాదికి గాను REC నాలుగోసారి రూ.3.60 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709
NIFTY CHACHA / NIFTY MASTER

19 Mar, 13:07

823

📢 Attention Webinar Participants! 📢

Your exclusive webinar will be LIVE on the Webinar Page of NiftyMaster.in 🔥

📌 Join using your registered email ID to access the session.

Get ready for valuable insights! See you soon! 🚀

www.niftymaster.in
NIFTY CHACHA / NIFTY MASTER

19 Mar, 12:10

823

Get Ready for your Webinar last few seats available.
NIFTY CHACHA / NIFTY MASTER

19 Mar, 10:19

890

https://youtu.be/kTqhppbiH-4?si=8dw2ro15_Zn1QEli
NIFTY CHACHA / NIFTY MASTER

27 Feb, 14:40

1

ఇండియా విక్స్ డౌన్.. మార్కెట్లు ఫ్లాట్

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాటుగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, మార్కెట్లో నెగటివ్ సెంటిమెంటు ప్రభలడం, ఎఫ్ఐఐలు వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు. నెలవారీ డెరివేటివ్స్ ముగింపు ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. కొనుగోళ్లకు మొగ్గు చూపలేదు. అయితే ఇండియా విక్స్ కూల్ఆఫ్ అవ్వడం శుభపరిణామం. ఉదయం నుంచీ నిఫ్టీ రేంజుబౌండ్లోనే కదలాడింది. మెటల్, బ్యాంకు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. నిఫ్టీ 22,545, సెన్సెక్స్ 74,612 వద్ద స్థిరపడ్డాయి.

క్రితం సెషన్లో 74,602 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 74,706 వద్ద మొదలైంది. 74,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 74,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 10 పాయింట్ల లాభంతో 74,612 వద్ద ముగిసింది. 22,568 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,508 వద్ద కనిష్ఠ, 22,613 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. మొత్తంగా 2 పాయింట్లు తగ్గి 22,545 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 135 పాయింట్లు ఎగిసి 48,743 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 19 కంపెనీలు లాభపడగా 31 నష్టపోయాయి. బ్యాంకు నిఫ్టీ 135 Pts పెరిగి 48,743 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లు ఎగిశాయి. ఆటో, మీడియా, ప్రభుత్వ బ్యాంకు, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఎరుపెక్కాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందాల్కో, సన్‌ఫార్మా టాప్ గెయినర్స్. అల్ట్రాటెక్ సెమ్, ట్రెంట్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా అత్యధికంగా నష్టపోయాయి.

ఎన్ఎస్ఈలో మార్కెట్ బ్రెడ్త్ నేడు సెల్లర్లకే అనుకూలంగా ఉంది. 2936 షేర్లు ట్రేడవ్వగా 570 మాత్రమే లాభపడ్డాయి. 2292 నష్టపోయాయి. 17 కంపెనీల షేర్లు 52వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. 399 మాత్రం 52వారాల కనిష్ఠాన్ని చేరాయి. 41 షేర్లు అప్పర్ సర్క్యూటును తాకగా 201 మాత్రం లోయర్ సర్క్యూటును టచ్ చేశాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 87.19 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్‌టెల్‌కురూ.1650 టార్గెట్ ధరతో మోర్గాన్ స్టాన్లీ ఈక్వల్ వెయిట్ రేటింగ్ కొనసాగించింది. రూ.5430 టార్గెట్ ధరతో ఆల్కెమ్ లేబోరేటరీస్‌కు నొమురా బయ్ రేటింగ్ ఇచ్చింది. సీజీ పవర్‌లో 40 లక్షల షేర్లు చేతులు మారాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. డ్రోనాచార్య ఏరియల్ అగ్రివీర్ మల్టీపర్పర్ అడ్వాన్సుడు డ్రోన్‌కు డీజీసీఏ ఆథరైజుడు సర్టిఫికెట్ లభించింది. అస్సామ్‌లో రోప్‌వే ప్రాజెక్టు కోసం జీఆర్ ఇన్ఫ్రా అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా విక్స్ 4% తగ్గి 13.17కు చేరింది. రూ.1800 కోట్ల పెట్టుబడితో కేబుల్ అండ్ వైర్స్ సెక్టార్లోకి అల్ట్రాటెక్ సిమెంట్స్ ప్రవేశించడంతో ఆ రంగం షేర్లన్నీ కుదేలయ్యాయి. గోద్రేజ్ ఎస్టేట్స్ డెవలపర్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐటీసీలో జరిగిన రెండు బ్లాక్ ట్రేడ్స్‌లో 30 లక్షల షేర్లు చేతులు మారాయి. తెలంగాణ చార్‌కోల్ ప్రాజెక్టులో ఎలక్ట్రానిక్స్ మార్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆరంభించింది. రూ.13,265 టార్గెట్ ధరతో అల్ట్రాటెక్ సిమెంటుకు జెఫ్రీస్ బయ్ రేటింగ్ ఇచ్చింది. మాస్టెక్‌కు 85 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు లభించాయి.

- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709